Senior CCMB scientist Kumarasamy Thangarajan said there was no truth to the Aryan-Dravidian theory as they came hundreds or thousands of years after the ancestral north and south Indians had settled in India.
The study analysed 500,000 genetic markers across the genomes of 132 individuals from 25 diverse groups from 13 states. All the individuals were from six-language families and traditionally “upper” and “lower” castes and tribal groups. “The genetics proves that castes grew directly out of tribe-like organizations during the formation of the Indian society,” the study said. Thangarajan noted that it was impossible to distinguish between castes and tribes since their genetics proved they were not systematically different.
The study was conducted by CCMB scientists in collaboration with researchers at Harvard Medical School,
ఉత్తర(UP,Bihar)-దక్షిణ(Tamilandu,Kerala)-తూర్పు (West Bengal,Orissa)-పశ్చిమ(Pujab,Haryana)-ఇంకా north east వైపుకు కువెళితే భారతీయుల మధ్య, శరీరనిర్మాణం, సాంస్కృతిక విధానాల్లో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.కాబట్టి మనది mixed race అనేది కాదనలేని సత్యం.
1947 కు మునుపు భారతదేశం అనేది ఒక దేశంకూడా కాదు. It was a "great idea" and it still is. రాజకీయంగా,భౌగోళికంగా ఒకటైనంత మాత్రానా, ‘అందరూ ఒకటే’ అనే సిద్ధాంతం కూడా చెల్లదు.కాబట్టి ఆర్య-ద్రవిడులే కాదు, నానా జాతుల సమాహారం భారతదేశం. అదే భిన్నత్వంలో ఏకత్వం.
ఈ భావనని అర్థం చేసుకోకుండా, ఎవడో కుట్ర చేసాడనికి మనం కుట్రలు అల్లుకుంటూ వామపక్ష చరిత్రకారులమీదా, మ్యాక్స్ ముల్లర్ మీదా పడి ఏడిస్తే ఏంలాభం?
"బయట" "లోపల" అనేవి చారిత్రాత్మకంగా సమస్యాత్మకమైన నిర్వచనాలు.ఆప్ఘనిస్తాన్ అవతలినుంచీ బర్మాలోని చిట్టగాంగ్ వరకూ, వీలైతే ధాయిలాండ్ వరకూ, హిమాలయాలనుంచీ శ్రీలంకవరకూ "అఖంఢ భారతం"గా కొన్ని సిద్ధాంతాల ఆధారంగా వాదించొచ్చు, కొంత వరకూ నిరూపించొచ్చుకూడా.
ఇక శరీరాల్లో తేడాలంటారా,ఒక సారి మణిపూర్ వెళ్ళి తరువాత బీహార్ రండి. లేకపోతే పంజాబ్ నుంచీ తమిళనాడుకి ప్రయాణం కట్టండి. తేడాలు మీకు కొట్టొచ్చినట్టు కనబడతాయి.
మనకంటూ హిస్టరీ ఉన్నట్టా లేనట్టా అనే బాధ అసంబద్ధం."మనదంటూ" ఒకప్పుడు ఏమీలేదు. ఎందుకంటే ఒక definitive దేశంగా మనం మారిందే 1947 లో, అంతవరకూ ఒదొక notionally unified culture అంతే!
Recorded history కన్నా ముందు, ఎవరు ఎక్కడికి ఖండాంతరాల వలస వచ్చారు అన్నదానికి ఒకదానుకొకటి పొంతనలేకుండా వంద సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు. కాని దానివల్ల మన వర్తమానానికొచ్చే నష్టంగానీ, విరగ్గాసే లాభంగానీ లేదనే నా ఉద్దేశం.
తమిళనాడు neo-political-cultural nationalism ఒక ప్రత్యేకమైన case దాని గురించి చర్చించాలంటే అదొక పెద్ద కథ అవుతుంది.
1857-1947 వరకూ జరిగిన స్వాతంత్రోద్యమ కాలంలో ఏకీకృతమైన "భారతీయ భావన" కల్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్మడి శతృవు బ్రిటిష్ వాళ్ళు గనక, ఆ దమనపాలనకు వ్యతిరేకంగా ఒకటిగా పోరాడే ప్రయత్నం జరిగిందేతప్ప స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికీ ఇప్పటికీ లేదు. అంతేకాకుండా,విస్తీర్ణంలో మిక్కిలైనవీ, జనాభా రీత్యాకూడా బాహుళ్యమైనవీ అయిన లెక్కకు మించి రాజ్యాలూ, సంస్థానాలూ వారి పనుల్లో వారున్నారేతప్ప స్వాంతంత్ర్యోద్యమ స్పూర్తికూడా వీరిని అంటలేదు.
మైసూర్, ట్రావెంకూర్, హైదరాబాద్, కాశ్మీర్, జునాగడ్, జైపూర్,బార్మేర్,ఉదైపూర్,బికానేర్,జోధ్పుర్,north-east రాజ్యాలూ, భోపాల్ మరియు ఇతర మధ్యభారతంలోని పలు విశాలమైన సంస్థానాలు ప్రత్యేకరాజ్యాలుగా స్వాతంత్ర్యానంతరం వరకూ మిగిలాయి.
బ్రిటిష్ పాలనలో, మిగతా భారతదేశంకూడా ప్రెసిడేంసీల మయమేతప్ప ఒక సంఘటిత పాలనా యూనిట్ కూడా కాదు.గోవా,యానాం,పాండిచ్చేరి వంటి భాగాల్లో ఫ్రెంచ్ వారు, పోర్చుగీసువారుకూడా పరిపాలించే వారు.ఈ భాగాల్నన్నింటినీ ఒక రాజకీయపటంగా మార్చడానికి దాదాపు 1975(సిక్కిం భారతదేశంలో కలిసే)వరకూ పరిశ్రమించాల్సివచ్చింది.
నిజానికి 1947 లో స్వతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుందనే ఆశ ప్రపంచదేశాల్లో ఎవరికీ లేదు. ఎందుకంటే ,భారతదేశం అనేది అప్పటికి కేవలం ఒక గొప్ప ఆలోచన మాత్రమే. ఇప్పటికీ అది మన ఆలోచనల్లో స్థిరపడిందేతప్ప, నిజమై ఆవిష్కరింపబడలేదు. కాకపోతే, ఈ దేశం ఇంకా రాజకీయంగా, భౌతికంగా ఒకటిగా ఉందంతే.మానసికంగా we are a fragmented country still.
ప్రస్తుతం ద్రవిడ-ఆర్య సిద్ధాంతాలను కుట్రలంటున్నవాళ్ళ discourses లో "అనుకుంటున్న" భారతీయత సాంస్కృతికపరమైన భారతీయత(cultural nationalism)కానీ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో వచ్చిన చైతన్యం రాజకీయ భారతీయత(political nationalism)కు చెందిన సృహ. కేవలం rhetoric కోసం ఈ రెంటినీ కలగాపులగం చేసి వాడుకుని, ఒక emotional issue చేస్తున్నారుగానీ అవి రెండూ వేరు.
భారతీయరాజకీయ భావనకూడా భారతదేశం మొత్తం ఏకస్థాయిలో లేదు. ఉదాహరణకు కాశ్మీర్ లో ఉండే భారతీయ భావన యొక్క తీవ్రత,definition వేరుగా ఉంటే, గోవా లో దాని స్వరూపం విభిన్నంగా ఉంటుంది.సిక్కింలో దాని రూపం వేరుగా ఉంటే పంజాబ్ లో పరిస్థితి మారుతుంది.
అందుకే మనలో భిన్నత్వంలో ఏకత్వం ఎంతో ఏకత్వంలో భిన్నత్వమూ ఇప్పటికీ అంతేకాబట్టి India as one nation with ONE PEOPLE అనే అపోహనుంచీ దూరమవ్వాలని నా అభిప్రాయం.
కాలానుగుణంగా లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి, తుంగలోతొక్కివేయబడతాయి.అంగీకరించబడతాయి, వ్యతిరేకించబడతాయి.
అదే విధంగా అనుకూల సిద్ధాంతాలను నెత్తికెక్కించుకోవడం,ప్రతికూలంగా అనిపించినదాన్ని పట్టించుకోకపోవడం సమాజాలూ,interest groups చేసే పని. వాటిని context of time లో చూసి అర్థం చేసుకోవాలేతప్ప వాటి ఆధారంగా వర్తమానాన్ని నిర్ణయిస్తామంటే కొంచెం ఆలోచించాల్సిందే!
ఉదాహరణకు ఆర్య-ద్రవిడ అనుకూల సిద్దాంతాన్ని సాంస్కృతిక-రాజకీయ లబ్ధికోసం తమిళులు ఎలా ఉపయోగించుకున్నారో, దాని ప్రతికూల సిద్ధాంతాల్ని బీజేపీ తన హిందుత్వ అజెండాకోసం ఉపయోగించుకుంటోంది. కానీ ఈ సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మి మనం మనవర్తమానాన్ని సమస్యాత్మకం చేసుకోవడం అర్థరహితం. మన బాధ్యత వాటి నేపధ్యం ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి "రాజకీయాలకు" దూరంగా ఉండటానికి ప్రయత్నించడం ఒక్కటే. ఇతరుల లాభానికి మనం తెలిసీతెలియకుండా పావులవకుండా ఉండటం మరియూ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని, విజ్ఞత ఉపయోగించి విచక్షణతో వ్యవహరించడాన్ని ఫలాయనమని నేను అనుకోను.
ఆ discretion మనకొచ్చే చర్చలు లాభదాయకమేతప్ప, playing in to those politics to jeopardizes our present is always useless. అందుకే, dispassionate గా విషయం తెలుసుకోవడానికి చర్చలు కావాలిగానీ, ఏదో ఒక తరఫున emotional rhetoric లో భాగమవ్వడానికి కాదు.
****