http://kovela.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
----The Ultimate happyness----
Updated: 29 min 31 sec ago

గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే...

Mon, 07/26/2010 - 11:14
ఒక నీలి నీడ మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతోంది... స్థిమితంగా ఉండనివ్వకుండా కేకలు పెడుతోంది... ఏదో చేసేస్తానంటూ అరుస్తోంది.. నిలుచున్నా, నడుస్తున్నా, కూచున్నా, లేచినా, నిద్రపోతున్నా, కళ్లు తెరిచి ఉన్నా.. వేధిస్తూనే ఉంది.. దాన్ని చూస్తేనే ఉలికిపాటు.. తలుచుకుంటే గగుర్పాటు.. ఆలోచనల్లో అదురుపాటు.. శరీరం చెమటలు కక్కుతోంది.. ఒళ్లు వణికిపోతోంది.. గుండె తన వేగాన్ని పెంచేసింది.. ఊపిరి భారంగా మారిపోయింది.. ఆర్చేవారు లేరు.. తీర్చేవారు లేరు.. ఆ నీడను తరిమేసే వారు లేరు.. అది నీడ కాదు.. దాని పేరు భయం..

మానవాళి నెత్తిపై ఇప్పుడు భయం మరో శత్రువుగా రాజ్యమేలుతోంది... ఇది మానసిక శత్రువు.. ఈ తరాన్ని అదే పనిగా వేధిస్తున్న శత్రువు.. ధైర్యం, సాహసం, నమ్మకం లాంటి పదాలకు చోటు లేని లోకంలో మనుషుల్ని ఆమాంతంగా మింగేస్తోంది.. చిన్నతనంలోనే చిదిమేస్తోంది.. అర్థం లేని కారణాలతో జీవితాల్ని అనర్థంగా నాశనం చేసేస్తోంది...
--------------1----------------
అమ్మ కడుపులో ఆటలాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం...
ఆందోళన అంటే ఏమిటో తెలియని ఒక అద్భుతమైన లోకం అమ్మ కడుపు..
ఆ కడుపులోంచి బయట పడినప్పుడు
సడన్‌గా ఏదో శత్రులోకంలోకి వచ్చిన ఫీలింగ్‌
అప్పుడు శిశువు మొదలు పెట్టే ఏడుపు పేరు భయం..

అన్నం తిననంటూ మారాం చేస్తుంటే..
అమ్మ చూపించే బూచీ పేరు భయం..

స్కూలుకు ఎగ్గొట్టినప్పుడు
నాన్న కోపంగా చూసే చూపు పేరు భయం..

హోం వర్క్‌ చేయకపోతే..
మాస్టారు చూపే బెత్తం పేరు భయం..

ఇంటర్‌లో మార్కులు సరిగా రాకపోతే..
అంతా ఏమంటారో అన్న ఆందోళన పేరు భయం...

పెండింగ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేయకపోతే
ఆఫీస్‌లో బాస్‌ ఇచ్చే వార్నింగ్‌ పేరు భయం..

అజ్ఞానం, అమాయకత్వం జతకడితే
వెంటాడే అతీంద్రియ శక్తుల పేరు భయం..

వెంటాడే జ్ఞాపకాల నీడ భయం..
చెట్టు భయం..
పుట్ట భయం..
పురుగు భయం..
నీడను చూసినా భయం..
మనిషి మనిషిని చూస్తే భయం...
-----------2-----------
భయం అన్న పదాన్ని కొంత పాలిష్డ్‌గా వాడితే దానిపేరు ఫోబియా... ప్రతి మనిషి మనసు లోపలి పొరల్లో ఈ ఫోబియా ఏదోరకంగా మనిషిని వెంటాడుతూనే ఉంది.. కారణాలు ఉండవు.. అర్థం ఉండదు.. ఏదో ఆలోచన.. ఏదో సంఘటన... ఒక ఓటమి.. ఈ ఫోబియాను సృష్టిస్తుంది.. పెను భూతంగా మార్చేస్తోంది.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది రకరకాల ఫోబియాలతో బాధపడుతున్నారట.
ఊహ తెలియని రోజుల్లో ఏదో చిన్న ఘటన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.. పెరిగిన కొద్దీ ఆ ఘటన మర్చిపోతాం.. ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు.. కానీ దాని ఛాయలు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రూపాల్లో వేటాడుతుంది..

కొందరికి కొన్ని రూపాలను చూస్తే భయం.. కొందరికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయం.. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా భయం కలుగుతుంది.. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? మెదడులో జరిగే రసాయనిక ప్రక్రియలో సంతులనం తప్పితే వచ్చే అనర్థాలివి...

ప్రతి వాళ్లలోనూ భయం ఛాయలు ఉంటాయి.. ఎవరూ బయటపడరు.. ఎప్పుడూ అవి కనిపించవు.. ఇవి ఉన్నట్లు కూడా వారికి తెలియదు.. చిన్న విషయం పెద్దదై... చూస్తుండగానే భయంకరమైందిగా మారిపోతుంది..

పాలుగారే పిల్లవాడు పరుగులు పెట్టి డాలర్లు సంపాదించాలనే ట్రెండ్‌ ఉన్న సొసైటీ మనది.. ఈ ఒత్తిడి పిల్లలపై పడి.. నూటికి నూరుశాతం మార్కులు రాకపోతే ఏమవుతుందోనన్న టెన్షన్‌ భయంగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఎన్నెన్నో.. సరదాగా చదువుకోవాల్సిన పిల్లలు భయంతో చదువుతున్నారు.. ఈ భయం వాళ్లను బలవన్మరణానికి పురికొల్పుతోంది..

నిజానికి ఈ భయం అనవసరమైంది.. కానీ, దీన్ని సృష్టించింది మన సొసైటీయే.. పసివాళ్ల లేత నరాలను చదువు పేరుతో పట్టి పిండేస్తున్నదీ సొసైటీ..

ఆడపిల్లల్లో ఈ ఫోబియా మరీ దారుణం.. చిన్నప్పుడు కుటుంబంలో.. పెద్దయిన కొద్దీ స్కూల్‌లో, ఉద్యోగంలో.. లైంగిక వేధింపులు వాళ్ల మానసిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది.. ఇది పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి మారుతుంది.. అర్థంతరంగా జీవితాన్ని ముగించాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిని కలిపిస్తుంది...
భయం చిన్నగానే మొదలవుతుంది.. అది పెద్దగా మారుతున్నప్పుడే మెదడులో టెన్షన్‌ పెరుగుతుంది.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు.
----------------3----------------------
ఏ రకమైన భయం ఎందుకు కలుగుతుందో తెలియని పరిస్థితి... ఈ భయాలు ఎలా ఉంటాయంటే వినటానికి సిల్లీగా.. మనకే నవ్వు వచ్చేలా ఉంటాయి.. కానీ, భయపడుతున్న వ్యక్తికి మాత్రం అది ఒక పెను ముప్పుగా కనిపిస్తుంది.. ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు జనాలను వేధిస్తున్నాయో మీకు తెలుసా.. పదివేల వరకూ ఉన్నాయిట..
ఫోబియా అనేది విచిత్రం.. దానికి ఎలాంటి కారణాలు ఉండవు.. ఎందుకు కలుగుతుందో తెలియదు.. దానికి చిన్నాపెద్దా తేడా ఉండదు.. ఊహ తెలియని రోజుల్లో ఎప్పుడో ఏదో రకంగా పుట్టిన భయం.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది..
మాడొన్నా.. ఆ వంపులు వయ్యారంగా సయ్యాటలాడుతుంటే, కళ్లల్లో కసి రేపుతుంటే, కనుగుడ్డు కదిలించకుండా చూడని వాడు ఈ తరంలో ఎవరుంటారు చెప్పండి...
ఇంతటి మడొన్నాకు ఓ ఫోబియా ఉంది.. పది కిలోమీటర్ల దూరంలో పిడుగు పడిన శబ్దం వినిపించినా ఇంతే సంగతులు.. బెడ్‌పై ఎగిరి గంతేసి భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది..
నికొల్‌ కిడ్‌మాన్‌..... నాలుగేళ్ల క్రితం ఆస్కార్‌లో హల్‌చల్‌ సృష్టించిన లేడీ బాస్‌.. హాలీవుడ్‌ను ఒక ఊపేసిన బ్యూటీస్టార్‌...
ఈ హాలీవుడ్‌ బ్యూటీకి నేచర్‌లో ఈమెతో పోటీ పడుతున్న బ్యూటీ బటర్‌ఫ్లైస్‌ అంటే చాలా భయం..షూటింగ్‌ స్పాట్‌లో ఒక బటర్‌ఫ్లై కనిపించినా ప్యాకప్పే...
స్కార్లెట్‌ జాన్సన్‌... అమెరికన్‌ బ్యూటీ.. నటి.. సింగర్‌.. ఈ న్యూయార్క్‌ బేబీ అమెరికన్లనే కాదు.. ప్రపంచ ఇంగ్లీష్‌ మూవీ వ్యూయర్స్‌ మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేసింది..
ఇంతటి పుత్తడి బొమ్మ దేన్ని చూస్తే భయపడుతుందో తెలుసా.. కాక్రోచెస్‌.. సింపుల్‌గా బొద్దింక.. అది ఏమీ చేయదని తెలుసు.. కానీ, అదంటే మాత్రం ఏదో తెలియని భయం..
బాలీవుడ్‌ సెక్సీగాళ్‌.. కంగనా రనౌత్‌ ... కళ్లతోనే కైపెక్కించే ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే....
ఇంత గొప్ప స్టార్‌కు కార్‌ లేకుండా ఎలా ఉంటుంది? కానీ, ఆమెకు కారు నడపాలంటే భయం.. కనీసం ముంబైలోని తన ఫ్లాట్‌ ఆవరణలో నడపాలన్నా గువ్వలా వణికిపోతుంది..
బిపాషా బసు.. బాలీవుడ్‌లో సెక్సీలెగ్‌ సుందరి.. ఈ అమ్మడితో నటించేందుకు బాలీవుడ్‌ హీరోలు క్యూ కట్టేస్తారు..
ఈమెకు ఉన్న ఫోబియా ఏంటో తెలుసా... సెల్‌ఫోన్‌లో మాట్లాడటం.. సెల్‌ఫోన్‌ను ముట్టుకోవటం.. ఎవరైనా ఫోన్‌ చేస్తే.. ఎస్‌ఎంఎస్‌ ఇవ్వండి అంటుందిట.. ఆ ఎస్‌ఎంఎస్‌ను సెక్రటరీ చదివి చెప్తే.. అవసరమైతే, ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్‌ చేసి జవాబిస్తుందిట..
----------------------4---------
అసలు ఇవన్నీ భయాలేనా? బొద్దింకల్ని, సీతాకోక చిలుకల్ని చూస్తే భయపడటం ఏమిటి? అదే విచిత్రం.. వీటినే ఫోబియాలంటారు... ఎవరికి, దేన్ని చూస్తే, ఎందుకు భయమో అర్థం కాదు.. వారికే తెలియదు.. కారణాలు ఉండవు.. మనసులో ఏదో మూలన నక్కి ఉన్న గుబులు.. ఒక్కసారిగా బయటపడుతుంది.. శరీరంలోని అన్ని నరాలను కుదిపేస్తుంది. బ్రెయిన్‌ను ఇన్‌బ్యాలెన్స్‌ చేస్తుంది.
ఇరవై ఏళ్ల పాటు ఏ అలజడీ తెలియని ఓ అమ్మాయికి ఒక్కసారిగా ఉలికిపాటు మొదలవుతుంది.. టెలివిజన్‌లో మూవీ మసాలా వస్తోంది. అంతలోనే ఆందోళన.. తన వెనుక ఎవరో ఉన్నారన్న భ్రమ.. వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.
ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్తుంటే ఏదో దయ్యం తననే చూస్తున్నదన్న ఆలోచన ప్రియురాలికి చెమటలు పట్టిస్తుంది..
ఒకటి కాదు.. రెండు కాదు.. వేల రకాల భయాలు.. ఫోబియాలు ప్రజల్ని చిత్తడి చేస్తున్నాయి. తన భయానికి పరిష్కారమే లేదన్న ఆందోళన, జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తమలో కలుగుతున్న ఆందోళన ఏమిటని విశ్లేషించుకోలేరు.. తాము ఊహించుకున్నదే కరెక్టని అనుకుంటారు.. ఎవరితోనూ తమ భయాన్ని పంచుకోరు.. ఒకవేళ ఎవరికైనా చెప్పినా.. వారు చెప్పే మంచి మాటలకు అంత తేలిగ్గా కన్విన్స్‌ కారు. ఆ క్షణం వరకు కాస్త కన్విన్స్‌ అయినట్లు కనిపించినా.. లోలోపల గుబులు వెంటాడుతూనే ఉంటుంది.రకరకాల ఫోబియాలతో బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే దాదాపు ఆరు కోట్ల మంది దాకా ఉందంట.. అన్నీ ఉన్న అమెరికాలాంటి అగ్రదేశంలోనే ౫౦ లక్షల మంది ఈ ఫోబియాలతో అల్లాడిపోతుంటే ఇక మన దేశం సంగతి చెప్పేదేముంది?
ఆడపిల్లల్లో చిన్ననాట లైంగిక వేధింపులకు గురైతే.. దాని భయం.. పెద్దయ్యాక పడకగదిలో కూడా వెంటాడుతుంది..వింత వింతగా ప్రవర్తిస్తారు.. కారణాలు తెలియక, సరైన కౌన్సిలింగ్‌ చేయలేకపోవటం మహిళల పట్ల సమస్యాత్మకంగా మారుతోంది..
ఫోబియా.. భయం.. ఇదేమీ చిన్న విషయం కాదు.. అలా అని నిజంగా భయపడి పారిపోయేంత పెద్ద విషయమూ కాదు.. మనిషి లోపలి పొరల్లో దాక్కున్న దౌర్బల్యం అతణ్ణి ఫోబియా ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తోంది.. అందుకే గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే............అదే భయం..
Categories: Middle

నాగా-వారు ఎవరికీ అర్థం కారు..

Mon, 07/19/2010 - 10:59
వారు ఎవరికీ అర్థం కారు..
ఎవరి అపార్థాలతో వారికి పని లేదు..
అలంకారాలు అక్కర లేదు..
జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు.
ఆహార్యం ప్రధానం కాదు..
నగ్నత్వమే వారి వేషం..
ఆహారం ముఖ్యం కాదు..
దొరికిందే తింటే చాలు..
రుచితో పనిలేదు..
శరీరంపై మోహం లేదు..
మృత్యువంటే భయం లేదు..
హిమాలయ సానువుల్లో నివాసం...
పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం..
అడుక్కునే వాళ్లంటూ తిట్టేవాళ్లున్నారు..
అవధూతలని అర్చించేవారూ ఉన్నారు..
ఎవరితోనూ వారికి అవసరం లేదు..
వారు ఎవరికీ అర్థం కారు..
ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు.

ఏమైనా అనుకోండి.. పిచ్చివాళ్లని నిందించుకోండి... వెర్రిబాగుల వాళ్లని వెక్కిరించండి... వంటిమీద నూలుపోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి... శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకొండి.. హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి... వారికి మీ ఊసులు అక్కర లేదు.. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు.. వారికి లోకంతో పని లేదు.. లోకం తమ గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేదు.. ఎవరు వారు..? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు?
ఇంటి నుంచి బయటకు కాలు మోపితే, అంతా మనల్నే చూడాలని ఎంత తాపత్రయ పడతాం? ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసిందే.. ఒంటి అలంకారం కోసం వాడే కాస్మోటిక్స్‌ అన్నీ ఇన్నీ కావు.. పర్‌ఫ్యూమ్స్‌ గురించయితే చెప్పనే అక్కర్లేదు.. వంద గ్రాముల పర్‌ఫ్యూమ్‌ను వంద పదులైనా సరే కొనటానికి వెనుకాడం... కానీ, ఇవన్నీ అక్కరలేని జాతి ఒకటి ఉంది.. మన దేశంలోనే ఉంది..మన మధ్యలోనే ఉంది.. ఆ జాతికి వీటితో పనే లేదు.. ఎవరితోనూ ఆ జాతికి సంబంధమూ లేదు..
2
ఎందుకిలా ఉంటారు? మామూలుగా ప్రపంచం అంతా తమను చూస్తున్నదన్న జిజ్ఞాస వీరికెందుకు ఉండదు? ఎందుకు పట్టదు..? మనకు తెలిసిన సిగ్గు, అభిమానం, మానావమానాలు వీరికి ఉండవా? కనీసం కౌపీనం కూడా లేకుండా వీళ్లిలా ఉండటానికి కారణం ఏమిటి?
సాధారణంగా మనం నిత్యం చూసే సాధు సంతులకు కాషాయం, కమండలం, దండం అస్తిత్వాలు.. మిగతా రెంటి మాటెలా ఉన్నా, కాషాయం సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్‌ లాంటిది.. ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం.. సన్యాసులూ అన్నింటినీ త్యాగం చేసి వెళ్తారు కాబట్టి, సాధారణంగా వారు కాషాయాన్నే ధరిస్తారు..
ఇది కామన్‌ ఎలిమెంట్‌.. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు..కానీ ఎవరికీ అంతుపట్టని సాధువుల సమాజం ఒకటుంది.. అది అత్యంత రహస్య సమాజం.. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని అఖారాల్లో ఉండే సాధు జాతి.. దాని పేరు నాగా.. ఆ సన్యాసులే నాగా సాధువులు.
మిగతా సొసైటీతో వీరికి ఎలాంటి సంబంధం లేదు.. తమ లోకంలోనే వారు జీవిస్తుంటారు.. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు.. చివరకు శరీరంపై బట్టల్నీ విడిచిపెట్టిన వాళ్లు.. నాగా సాధువులు
వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు.. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తికాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు..
అంతే కాదు.. జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి.. విడ్డూరంగా కనిపిస్తాయి..
త్రిశూలాలు ధరిస్తారు.. కత్తులు పట్టుకుంటారు.. వాటితో వీరంగం వేస్తారు.. వీరనాట్యాలు చేస్తారు.. కర్రసాము చేస్తారు..
హుక్కా, చిలుమ్‌ వంటి వాటి ద్వారా పొగాకు, నార్కొటిక్స్‌ వంటివి పీలుస్తారు..
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏమిటి? అదే మిస్టరీ... అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ట..
3
సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో...అవన్నీ వారు చేస్తారు.. బట్టలు ధరించకపోవటమే ఒక సమస్య అనుకుంటే, హుక్కా, చిలుమ్‌ పీల్చటం, ఏది పడితే అది తినేయటం.. ఒంటిని కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవటం.. ఇవన్నీ నిజంగా సాధు లక్షణాలేనా? అన్నీ నెగెటివ్‌ షేడ్సే.. ఏమిటీ రహస్యం? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ నాగాస్‌..
పవిత్ర గంగానదీ తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు, మహా కుంభమేళా జరుగుతుంది.. ఆ కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగా సాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నినదిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం..
నాగా సాధువులు పుష్కరాల సమయంలోనే జనంలోకి వస్తారు.. జనానికి కనిపిస్తారు.. పుష్కరాలకు ముందు కానీ, తరువాత కానీ, వారు బయటి ప్రపంచానికి కనిపించరు..
వారి చర్యలు విచిత్రం.. వారి చేష్టలు విచిత్రం. అందుకే వారిది అత్యంత అరుదైన సమాజం.. హిమాలయాలు.. దేవతల ఆవాసాలంటారు.. నాగా సాధువులు ఉండేది కూడా ఈ హిమాలయాల పర్వత శ్రేణుల్లోనే.. కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరి కోరి ఎంచుకుని మరీ తమ మెడిటేషన్‌ను కొనసాగిస్తారు.
వారికి ఎండ లేదు.. వాన లేదు.. చలి లేదు.. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచీ కాపాడుతుంది. చిలుమ్‌, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి.. మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి..
వారు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు.. మిగతా దేవుళ్లందరినీ పూజిస్తే వాళ్లు స్పందించే సరికి చాలా సమయం పడుతుందిట.. అగ్నిని ఆరాధిస్తే.. ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట.. ఆ విభూతే నాగా సాధువులకు సర్వస్వం అవుతోంది..
4
విభూతి అంటే ఐశ్వర్యం.. నాగా సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం.. సర్వ సంపదలూ ఈ విభూతే.. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతే వారికి సర్వాలంకారం. చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, వారికి అది అవసరం లేదు.. అత్యంత కఠినమైన యోగసాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివసైనికులు వీరు.
ఉజ్జయిని.. మహా కాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడ ఒకటి.. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది.. ప్రతి రోజూ రాత్రి పూట ఉజ్జయిని స్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు.. భస్మరాశి విభూతిగా మారిపోతుంది... మన శరీరమే విభూతి అని చెప్పటానికి ప్రతీక ఈ అభిషేకం..
నాగా సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందనటాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయటమే దీని ఉద్దేశం.
సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు. ఎప్పుడు, ఎలా సృష్టించిందీ ఎవరికీ తెలియదు.. సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని రక్షించేందుకు అదిశంకరాచార్య నాగా సాధువులందరినీ ఒకటి చేశారని అంటారు..
మనం ఉంటున్న ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌ను వీరు కేర్‌ చేయరు. . ఆర్మీలో ఓ రెజిమెంట్‌లాగా నాగా సాధువులు ఉంటారు. వీళ్లు శివుడికి సైనికుల్లా వ్యవహరిస్తారు..ఎవరినీ దగ్గరకు రానివ్వరు.. అఘోరాల్లా అతి తీవ్రంగా లేకపోయినా, వీరి దారి వేరు.. చాలా ఆవేశపరులు.. వారి ఆగ్రహం ప్రదర్శించటానికి బెస్ట్‌ ఆప్షన్‌గా పరిగెడ్తారు.. ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు..
అఖారాలని పిలిచే వారి ఆశ్రమాల్లోకి కూడా ఎవరినీ రానివ్వరు.. ఎవరైనా చొచ్చుకుని పోతే అక్కడ మరింత విచిత్రమైన చర్యలు కనిపిస్తాయి. సామాన్యులకు అసాధారాణమైన యోగాసనాల్లో నాగా సాధువులు కనిపిస్తారు.. ఆశ్రమంలోకి వచ్చిన వారిపై ముందు ఆగ్రహించినా తరువాత అనుగ్రహిస్తారు.. సామాన్యంగా కనిపించే సన్యాసులకు, వీరికి అదే తేడా... అందుకే వీరిని నాగాలన్నారు..
-5-
సాధువులుగా మారటం తేలికే.. సన్యాసం తీసుకోవటమే కష్టం. అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపటం ఇంకా కష్టం. కానీ ఈ ఆశ్రమ జీవితాన్నీ వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర, ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తిగా నాగాలుగా మారటం ఊహించినంత తేలిక కాదు.. చాలా, చాలా కష్టపడ్డ తరువాత కానీ, నాగాలుగా మారటం కుదరనే కుదరదు..
నాగా సాధువులు అంటే ప్రధానంగా దిగంబరులు.. ఇదెలా సాధ్యం? జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది? అదీ మంచు కొండల్లో.. గడ్డకట్టే చలిలో నూలుపోగైనా లేని ఒంటిని కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది.. కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏమూలకు పనికి వస్తాయి? మరి వీళ్లెలా ఉండగలుగుతున్నారు?
నిజం.. ఇలా ఉండటం సామాన్యుడికైతే క్షణమైనా సాధ్యం కాదు.. నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా హార్డ్‌వర్క్‌ చేయాల్సి ఉంటుంది.
సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లూ వాకిలీ వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి.
ఆరు సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి.
అన్ని రుచులను వదిలేయాలి.
అన్ని వాసనలకూ దూరంగా ఉండాలి.
అన్ని సుఖాలను త్యాగం చేయాలి.
అన్ని మోహాలను వదిలిపెట్టాలి.
చివరకు వస్త్రాల్నీ వదిలేయాలి.
ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.. ప్రతి విషయంపైనా ఏకాగ్రత సాధించటానికి చాలానే కష్టపడతారు.. ఆ తరువాత అయిదుగురు గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవలసి ఉంటుంది. ఆరు సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటీ ధరించి ఉంటారు.. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు.. అంటే ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌లోని సంసారం నుంచి తనను తాను నాగా సాధువు వేరు చేసుకున్నట్లని అర్థం.
నేను అనే ఈగోను విడిచేయడమే నాగా సాధువుల్లోని ప్రత్యేకత. బయటి శరీరం కంటే, లోపల ఆత్మ అన్నది ఒకటుందని వీరు గాఢంగా నమ్ముతారు.. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు.. మిగతా శరీరంతో వారికి పని లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకోరు.. మిగతా ప్రపంచం కంటే చాలా పరిశుభ్రమైన జీవనం తమదని నాగాలంటారు.
నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు.. ఎక్కడికీ వెళ్లరు.. కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే ఆ నదీతీరానికి వాళ్లు వస్తారు.. పవిత్ర స్నానాలు చేసి వెళ్లిపోతారు.. ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగాలు..
Categories: Middle

దేవుడు శరీరాన్ని త్యాగం చేస్తాడా?

Wed, 07/14/2010 - 14:42
దేవుడికి మరణమా? అసలు ఉన్నాడో, లేడో అన్న వాదోపవాదాలు జరిగే దేవుడికి చావు ఉండటం ఏమిటి? మన వేదాల ప్రకారం పుట్టుకే లేని భగవంతునికి మృత్యువు ఎక్కడిది..? చావు పుట్టుకలకు అతీతమైన దేవుడు శరీరాన్ని త్యాగం చేస్తాడా? ఆ శరీరానికి అంత్యక్రియలు జరుగుతాయా? అదీ మనుషులు అంతిమ సంస్కారం చేస్తారా? ఇది వింతా? విచిత్రమా? విడ్డూరమా? లేక వాస్తవమా?

అవును.. ఇది నిజం... ఈ భూమ్మీదే జరుగుతోంది. మన దేశంలోనే జరుగుతోంది.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేవుడికి జరుగుతున్న కార్యక్రమం ఇది.. మనుషులే చేస్తున్న అద్భుతమైన సంస్కారం ఇది. ఎందుకిలా చేస్తారు? దేవుడికి పార్థివ శరీరం ఉండటం ఎలా సాధ్యపడుతుంది? అంటే దేవుడు ఉన్నాడన్నది వాస్తవమేనా? కేవలం విశ్వాసం కాదా?

మన పురాణాల ప్రకారం దేవుడు నిరాకారుడు.. అంటే ఆకారం అంటూ లేని వాడు.. అందుకే మన వాళు్ల భూమిని కొలుస్తారు.. ఆకాశాన్ని కొలుస్తారు.. రాయి, రప్పను కొలుస్తారు.. పామును కొలుస్తారు.. గోవును కొలుస్తారు.. ఒక ఇటుకకు పసుపు కుంకుమ పెట్టి దాన్ని దేవతగా కొలుస్తారు.. దేనికీ ఆకారమే ఉండదు.. తమకు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలో దేవుళ్లను కొలుస్తారు..

మరి ఓ స్పెసిఫిక్‌ ఆకారమే లేని దేవుడికి శరీరం మాత్రం ఎలా ఉంటుంది? అదే దేవ రహస్యం.. దేవుడికి రూపం అనేది ఓ పదార్థం. అంటే మెటీరియల్‌.. ఈ మెటీరియల్‌ లోపల ఉండే చైతన్యమే దైవత్వం అని మనవారి గాఢ విశ్వాసం..

సైన్‌‌స ఎప్పుడూ మెటీరియలిస్టిక్‌గా ఆలోచిస్తుంది.. ఇదిగో ఈ దేవుడు ఆ మెటీరియల్‌ ఏమిటో మనకు చూపిస్తున్నాడు.. దాని రహస్యాన్ని వివరిస్తున్నాడు. మెటీరియల్‌లో చైతన్యం ఎలా ఉంటుందో.. ఆ చైతన్యం లేనప్పుడు ఎలా నిర్జీవంగా మారుతుందో రుజువు చేస్తున్నాడు..

మనం బట్టల్ని మార్చినట్లు ఈ దేవుడు తరచూ తన శరీరాన్ని మార్చేస్తున్నాడు..ఇది మన కళ్ల ముందు జరుగుతున్న ప్రక్రియ.. ప్రజలు ఒక పండుగలాగా చేసుకునే అద్భుతమైన కార్యక్రమం ఇది.. ఇదెలా జరుగుతోంది?

2

పూరీ జగన్నాథుడు.. అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రథయాత్ర... ప్రపంచంలో మరెక్కడా లేని అతి పెద్ద రథయాత్ర... లక్షలాది ప్రజలు అతి పెద్ద రథాలను లాగే అపురూప ఉత్సవం.. ప్రతి ఏడాది ప్రపంచంలోని లక్షలాది ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూసే వేడుక... కానీ, రథయాత్రను మించిన ఎన్నో ప్రత్యేకతలు మనకు ఇక్కడ కనిపిస్తాయి... అందులో ఒకటి జగన్నాథుడు తన శరీరాన్ని విడిచిపెట్టడం..

పూరీలో జగన్నాథ రథచక్రాలు మరోసారి కదిలాయి..

జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు మూడు రథాలపై పూరీలో తిరుగుతున్నారు..

ఈ రథయాత్రను చూసేందుకే లక్షలాది ప్రజలు తరలి వస్తారు.

రోజుల తరబడి వేచి చూస్తారు..

రథాన్ని లాగడానికి ఉత్సాహపడతారు..

మూడు కిలోమీటర్ల పొడవైన తాడును ఎన్ని వేల మంది లాగుతారో మీరే ఊహించుకోండి...

మామూలుగా దేవుళ్లకు రథోత్సవం జరుగుతుంది. కానీ, రథంలో ఊరేగే దేవుడు ఉత్సవ మూర్తే...

కానీ, పూరీలో సాక్షాత్తూ మూల విరాట్టే వీధిలోకి వచ్చి రథంపై కూర్చొని ఊరేగుతాడు..

ఇది విచిత్రం ఏం కాదు.. ఇక్కడి ప్రత్యేకతే అది..

గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు మూర్తులను కదిలించి బయటకు తీసుకువచ్చి రథంపై కూర్చోబెట్టి పది రోజుల పాటు రథయాత్ర నిర్వహించటం ఇక్కడ మాత్రమే కనిపించే సంప్రదాయం..

జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఊరేగే రథాలు ఏ యేటికాయేడు కొత్తగా తయారు చేసేవే. ఒకసారి ఉపయోగించిన రథాన్ని మళ్లీ ఉపయోగించరు.. పోనీ ఆ రథం మామూలుగా ఉంటుందా అంటీ అదీ లేదు.. ఒక్క జగన్నాథుడి రథమే 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏకంగా పదహారు రథచక్రాలు ఉంటాయి. ఇది నందఘోష రథం. ఇక బలభద్రుడి రథం ఒక అడుగు తక్కువ ఉంటుంది. ఇదీ 14 రథచక్రాలతో నడుస్తుంది. మూడోరథం ఇంకో అడుగు తక్కువతో తయారు చేస్తారు.. ఇవన్నీ పూర్తిగా కలపతో చేసినవే.. ప్రత్యేకంగా పెంచిన చెట్ల కలపను వాడి తయారు చేసినవే.

ప్రతి ఏడూ కొత్త రథాన్ని తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు.. అంత ఈజీ కూడా కాదు.. కానీ, పూరీలో మాత్రం ఇది సాధ్యమవుతోంది. వందల సంవత్సరాలుగా ఈ రథయాత్ర ఆగకుండా సాగుతోంది..

3

రథయాత్ర ఓకే.. చాలా గొప్పగా జరుగుతుంది.. యాత్ర పూర్తి కాగానే రథాల్ని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగం విడగొడతారు.. మళ్లీ ఏడాది కాగానే కొత్త రథాలు తయారవుతాయి. పూరీలో ఇదొక్కటే విచిత్రం కాదు.. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.. ఇక్కడి జగన్నాథుడు మనలో ఒకరుగానే ఉన్నట్లుగా ఇక్కడి ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగమేనా అంతిమ సంస్కారం.. ? ఇదేం విడ్డూరం?

ప్రపంచంలో పూరీలోని ఆలయమే ఒక విచిత్రమైన ఆలయం.. సాధారణంగా ఆలయాల్లో లక్ష్మీ నారాయణులో, సీతారాములో, శ్రీనివాస పద్మావతులో, శివ పార్వతులో ఇలా జంటలుగానే దేవతా మూర్తులు కనిపిస్తారు.. కానీ, పూరీలోని ఆలయంలో అన్నా చెల్లెళు్ల ఉంటారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, వాళ్ల చెల్లెలు సుభద్రలు ఇక్కడ ప్రధాన దేవతలు. ఈ మూల విగ్రహాలను సైతం కలపతోనే తయారు చేస్తారు..

ఇక్కడ ఇంకో విచిత్రమూ ఉంది..ఇక్కడ కనిపించే జగన్నాథ స్వామి మొండి చేతుల వాడు.. ఈ మూర్తికి చేతులు పూర్తిగా ఉండవు. ఈ విగ్రహాన్ని తొలిసారి విశ్వకర్మ రూపొందిస్తున్నప్పుడు ఒరిస్సా రాజు ఇంద్రద్యుము్నడు ఆటంకం కలిగించటం వల్ల విగ్రహం పూర్తి కాకుండానే విశ్వకర్మ వెళ్లిపోయాడట.. అప్పటి నుంచీ జగన్నాథ స్వామి మొండి చేతుల వాడిగానే భక్తులకు దర్శనమిస్తున్నాడు.

స్వామి వారి విగ్రహమైనా సాధారణంగా ఉంటుందా అంటే అదీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుంది.. పెద్ద పెద్ద గుండ్రని కళు్ల జగన్నాథుడికి ఉంటే, బలభద్రుడికేమో ఓవెల్‌షేప్‌లో కళు్ల ఉంటాయి. వీటికి కింది నుంచే కాస్తంత ఉన్న మొండి చేతులు ఉంటాయి. విగ్రహాన్ని చూడగానే ప్రత్యేక ఆసక్తి కలుగుతుంది.

వీటన్నింటినీ ఓ ప్రత్యేకమైన కలపతోనే తయారు చేస్తారు.. వీటికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.. మరి అలాంటి విగ్రహాలకు కాలనుగుణంగా కొన్ని నియమిత సంవత్సరాలకు అంతిమ సంస్కారం జరగటం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉంది.. అదే పూరీలోని పరమ అద్భుతమైన విశేషం...

4

ఇంతటి విశిష్ఠత కలిగిన జగద్గురువుకు అంతిమ సంస్కారం చేయటం ఏమిటి? ఇలాంటి విశేషమైన ఉత్సవం అన్నది ప్రపంచంలో పూరీలో తప్ప మరెక్కడా జరగదు.. ఇది అంతిమ సంస్కారం కాదు.. కొత్త శరీరంలోకి భగవంతుడు మారటం.. అవును.. జగన్నాథుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు.. అదే పూరీలో జరిగే నవ కళేవర ఉత్సవం...

మనం మాసిన బట్టలను వదిలేసి ఉతికిన బట్టలను రోజూ మార్చుకుంటాం.. పూరీలో జగన్నాథుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి, సరికొత్త శరీరాన్ని ధరిస్తాడు.. దీన్ని నవ కళేవర ఉత్సవంగా పిలుస్తారు.. ఇది దాదాపు రెండు మాసాల పాటు సాగే అతి పెద్ద కార్యక్రమం..

ఖగోళ శాస్త్రం పద్ధతులను అనుసరించి ప్రతి 8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి పూరీ జగన్నాథుడికి నవ కళేవర ఉత్సవాన్ని నిర్వహిస్తారు.. ఇది అంత ఈజీగా జరిగే తంతు కాదు.. మూల విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించటం.. ఇందుకోసం చాలా పెద్ద కసరత్తే చేస్తారు...విగ్రహాల తయారీ అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు..

నవ కళేవర ఉత్సవాలు ప్రారంభం కాగానే ఆలయ ప్రధానార్చక కుటుంబీకులు పూరీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కకట్‌పూర్‌కు వెళ్తారు.. అక్కడ ప్రాచీ నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న మంగళాదేవి ఆలయంలోకి వెళ్లి అక్కడే నిద్రిస్తారు.. అమ్మవారు వారి కలలో కనిపించి జగన్నాథ స్వామి వారి విగ్రహానికి కావలసిన చెట్టు ఎక్కడుందో చెప్తుంది..

పూజారులు అక్కడి నుంచి అమ్మవారు చెప్పిన దిశలో కాలినడకన బయలు దేరి వెళ్తారు.. కొన్ని ప్రత్యేకతలు కలిగిన వేప వృక్షాలను కనుగొంటారు..

ఈ చెట్లకు ఖచ్చితమైన గుర్తులు కనిపించి తీరాలి..

జగన్నాథుడి విగ్రహం తయారు కావలసిన చెట్టు కాండంపై సుదర్శన చక్రం గుర్తు...


బలభద్రుడి విగ్రహ తయారీకి వాడే చెట్టుపై గద గుర్తు


సుభద్ర విగ్రహం కోసం వినియోగించే చెట్టుపై కమలం గుర్తు


ఆ చెట్ల నీడలో విషపాములు కనిపించాలి


దగ్గరలో తప్పనిసరిగా ఓ చింత చెట్టు ఉండాలి...




విగ్రహాల తయారీకి ఉపయోగించే చెట్టు కాండం నిటారుగా పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగి ఉండాలి..
కాండం నాలుగు నుంచి ఏడు భాగాలుగా విస్తరించి ఉండాలి

చెట్లకు సమీపంలో ఒక స్మశానం, నీటి వనరు, శివాలయం ఉండి తీరాలి.

ఇన్ని రకాలుగా అన్నీ కుదిరిన తరువాత ఎంపిక చేసుకున్న చెట్లకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు.. ఆ తరువాత ఆ చెట్లను కొట్టేస్తారు.. వాటిని చెక్కతో తయారు చేసిన బండ్లపై ఎక్కించి పూరీ ఆలయానికి తీసుకువస్తారు.. ఉత్తర ద్వారం గుండా వాటిని ఆలయంలోకి తీసుకెళ్లి కోయిల్‌ వైకుంఠం ప్రాంగణంలో ఉంచుతారు.. అక్కడే విగ్రహాల తయారీ జరుగుతుంది. ఇది అత్యంత రహస్యంగా జరుగుతుంది.. సదరు శిల్పికి తప్ప ఎవరికీ అనుమతి ఉండదు.. చైత్ర మాసంలో మొదలయి, సరిగ్గా ఆషాఢ శుద్ధ చతుర్థి నాటికి విగ్రహాల తయారీ పూర్తవుతుంది.

అదే రోజు రాత్రి బ్రహ్మ ముహూర్తంలో పాత విగ్రహాలలోపల ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ప్రధాన పూజారి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు.. దీంతో కొత్త విగ్రహాలకు చైతన్యం వస్తుంది. ఈ పదార్థాన్ని ఆ ముగ్గురు దేవతల అస్థికలని కొందరంటారు..మరికొందరు సాలగ్రామాలని పిలుస్తారు.. బౌద్ధులు బుద్ధుడి పన్ను అంటారు..శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం ఆయన అస్థికను ఈ విగ్రహాల్లో ఉంచారట.. అదే విధంగా సముద్రంలో శరీర త్యాగం చేసిన బలరాముడు, సుభద్రల అస్థికలనూ ఇందులో ఉంచారట.. వీటిని మారుస్తున్నప్పుడు పూజారి సైతం కళ్లకు గంతలు కట్టుకుంటారు..

కొత్త విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పాత విగ్రహాలను అత్యంత శాసో్తక్త్రంగా గుడిలోనే కోయిల్‌ వైకుంఠం అన్న ప్రాంగణంలో ఖననం చేస్తారు.. ఇక్కడ స్వామి తన పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశించాడు..ఇది దేవుడికి మరణం కాదు.. జీవుడు తన దేహాన్ని మార్చుకోవటమే ఈ నవకళేవరలోని ప్రధాన అంశం.. ఇప్పటి వరకు 17సార్లు పూరీలో నవ కళేవర కార్యక్రమం జరిగింది. చివరి సారి 1996లో జరిగింది. రథయాత్ర కంటే ఈ కార్యక్రమానికి లెక్కించలేనంత మంది భక్తులు హాజరవుతారు.. శరీరంలో జీవుడు ప్రవేశించి, ఆ తరువాత బయటకు వచ్చి మరో శరీరంలో ఎలా ప్రవేశిస్తాడో.. జగద్గురువు ఇక్కడ బోధిస్తున్నాడు.. పునరపి జననం.. పునరపి మరణం లోని రహస్యార్థం ఇదే. ఆయన రథంపై స్థిరంగా కూర్చుని తిరగడం కూడా ఇలాంటిదే.. జీవుడిలోపల గూడు కట్టుకుని ఉండిపోయి, అతనికి మార్గదర్శనం చేస్తున్నాడు.. రాముడు తానుగా చేసి చూపించాడు.. కృష్ణుడు చెప్పి చేయించాడు.. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు.. పూరీలో ఆయన చూపించిందీ, చూపిస్తున్నదీ అంతా జీవ రహస్యమే.. కృష్ణం వందే జగద్గురుమ్‌.
Categories: Middle

కైలాసం నుంచి అమర్‌నాథ్‌ దాకా....

Wed, 07/14/2010 - 14:26
ప్రకృతిలో పరమశివుడు..
అమర్‌నాథ్‌లో మంచు లింగం ఎలా ఏర్పడుతోంది?
కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్నదా? సహజంగా ఏర్పడుతోందా?
కొండ గుహలో ఒక్క చోటనే హిమ లింగం ఎలా వస్తోంది?
ప్రతి ఏడాది..
ఒకే సమయం..
ఒకే ఎత్తు..
ఒకే ఆకారంలో
శివలింగం ఏర్పడటంలో మర్మం ఏమిటి?
కైలాస పర్వతం నుంచి అమర్‌నాథ్‌కు శివుడు రావటం వాస్తవమేనా?

లయకారకుడి నిజరూపం శివలింగమేనా?

చావుకీ శివుడికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
1
ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి.. అని ఋగ్వేదం చెప్పింది. వస్తువు ఒక్కటే ఉంటుంది.. కానీ, అది అనేక పేర్లతో పిలువబడుతుంది..అని దీని అర్థం. ఈశ్వరుడు కూడా ఒక్కడే. కానీ ఆయన సహస్ర నామాంకితుడు. ఆయన త్రిమూర్తి స్వరూపుడు. సృష్టికార్యం నిర్వహించేప్పుడు ఆయన బ్రహ్మ అవుతాడు. లోకాల్ని పాలించినప్పుడు విష్ణువుగా ఉంటాడు. లయకారుడుగా మారినప్పుడు ఆయన శివుడవుతాడు. శివుడు దుష్టశక్తుల వినాశకారుడు. అందుకే ఋగ్వేదం శివుడిని రుద్రుడని సంబోధించింది. మనం త్రయంబకేశ్వరుని (రుద్రుని) పూజిస్తాం. ఆతడు పరిమళ భరితమైన ఓషధి వంటి వాడు ఆ ఓషధి మాకు బలమును కలిగిస్తున్నది. ఆతని వల్ల శ్రమ లేకుండా తొడిమ నుండి ఊడిపడిన దోసపండు వలె మృత్యువు నుంచి మేము విడిపోవుదము.''(ఋగ్వేదం).
యజుర్వేదం శివుడిని వీర యోగిగా అభివర్ణిస్తుంది. ఆయన జింకచర్మం ధరించి త్రిశూలధారియై, వీరాసనంలో కనిపిస్తాడని యజుర్వేదం చెప్తుంది. పరమేశ్వరుడి నివాస స్థానం కైలాస పర్వతం కాగా.. ప్రకృతిలో మమేకమైన పురుషుడు కాబట్టి ఆయన మనకు అనేక ప్రాంతాల్లో బహు రూపాలలో సహజసిద్ధంగా దర్శనమిస్తాడు. ప్రకృతిలోని అనేక రూపాలలో మనకు శివదర్శనం కలుగుతుంటుంది. మానస సరోవరం సమీపంలోని కైలాసంతో పాటు, గంగోత్రి సమీపంలో మరో కైలాస శిఖరం ఉంది. అంతే కాకుండా హిమాచల్‌ ప్రదేశ్‌లో కిన్నెర కైలాసం, బద్రీనాథ్‌లో నీలకంఠ శిఖరం, నేపాల్‌లోని ధౌలగిరి, బెంగుళూరులో నంది కొండలు.. ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే.
అంతే కాకుండా టిబెట్‌లోని కైలాస్‌ ప్రభాత్‌ సమీపంలో పార్వతి కుండ్‌, కేదార్‌నాథ్‌లోని గౌరి కుండ్‌, గర్‌వాల్‌ దగ్గర కేదార్‌ తాళ్‌ సరస్సులు, కులు వాలీ మీదుగా ప్రవహించే పార్వతి నది, గంగోత్రి పట్టణంలోని కేదార్‌ గంగ, గర్‌వాల్‌లోని రుద్రప్రయాగ నది ప్రకృతిలోని మహాదేవుని రూపాలు.
కుమావ్‌ ప్రాంతంలో పాతాళ్‌ భువనేశ్వర్‌ గుహ, మధ్యప్రదేశ్‌లోని పాచ్‌మడి లోని జఠా శంకర్‌ గుహ, మహాదేవ గుహలు కూడా శివ తేజస్సుతో ఉట్టిపడుతుంటాయి.
2
చుట్టూ ఎతె్తైన కొండలు.. కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు.. పైకి వెళు్తన్న కొద్దీ ఆక్సీజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్‌ డీగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు.. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళు్తంది.. ఒకే ఒక్క మంత్రం అంతటి దుర్భర వాతావరణాన్ని సైతం సానుకూలంగా మారుస్తుంది.. అదే పంచాక్షరి.. ఓం నమఃశివాయ.. మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది.. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది..ఎందుకీ ఆరాటం? అమర్‌నాథ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు మంచు లింగం ఏర్పడటం, కరిగిపోవటం ఎలా జరుగుతోంది.. జ్యోతిర్లింగం అని చెప్పుకునే అమర్‌నాథుడు కొన్ని రోజులు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు? అమర్‌నాథ్‌లో పరమేశ్వరుని ఉనికి ఏమిటి?
3
జూలై మాసం వచ్చిందంటే అమర్‌నాథ్‌కు భక్తుల యాత్ర మొదలవుతుంది.. ప్రపంచంలోనే అతి కష్టమైంది.. తిరిగి వస్తామో, రామో అన్నంత కఠినమైన ట్రెకింగ్‌.. ఇరుకైన దారి... ఇరుపక్కలా లోయలు.. కళు్ల తెరిస్తే గిర్రున తిరిగి ఎక్కడ పడిపోతామో అన్నంత భయం.. తెరవకపోతే ఎలా వెళు్తన్నామో తెలియని అయోమయం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన వెనకే మృత్యువు నడుస్తుంటే... దాని బారిన పడకుండా వెళ్లటమే అమర్‌నాథ్‌ యాత్ర...
కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు కేవలం 145 కిలోమీటర్ల దూరం..కానీ, ఎత్తులో మాత్రం ఎవరికీ అందనంత..... సముద్రమట్టానికి అక్షరాలా 13, 700 అడుగుల హైట్‌లో అమర్‌నాథ్‌ గు„హ ఉన్నది.. ఇది సాదా సీదా గుహ కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి.. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ.. ఇది మానవనిర్మితం ఎంతమాత్రం కాదు..
ప్రతి ఏటా జూలై నుంచి ఆగస్టు చివరి వరకు అమర్‌నాథ్‌ గుహలో శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. కేవలం 45రోజులు మాత్రమే ఈ శివలింగం కనిపిస్తుంది. ఆ తరువాత క్రమంగా కరిగి, కరిగి అంతర్థానమవుతుంది.. ఈ శివలింగం సగటు మనిషి ఎత్తులో ఏర్పడుతుంది.. జాగ్రత్తగా పరికిస్తే మనిషి ఆకారం ఇందులో గోచరిస్తుంది కూడా..
అమర్‌నాథ్‌ గుహలో సహజంగా ఏర్పడే జ్యోతిర్లింగంతో పాటు, మరో రెండు చిన్న మంచు మూర్తులు కూడా కనిపిస్తాయి.. వీటిని పార్వతి, గణపతులంటూ భక్తులు కొలుస్తారు.. విచిత్రమేమంటే ఈ మూర్తులకు ప్రత్యేక ఆకారాలు ఉండవు.. మంచు ముక్కల్లా మాత్రమే కనిపిస్తాయి. కాకపోతే.. మహాదేవుని లింగరూపం ఏర్పడిన సమయంలో మాత్రమే ఈ రెండు మంచు మూర్తులు కనిపిస్తాయి. ఆ తరువాత ఇవీ ఉండవు..
ఏడాదిలో రెండు మాసాలు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహకు వ్యయప్రయాలకు ఓర్చి భక్తులు వేల సంఖ్యలో వెళ్తారు.. ఇది మామూలు ప్రయాణం కాదు.. ఇంత కష్టపడి అంత దూరం వెళ్లటానికి ఎవరూ సంకోచించకపోవటం విచిత్రం.. ఓ పక్క జారిపడితే ఆనవాళు్ల సైతం చిక్కనంత లోతైన లోయలు.. మరోపక్క ఊపిరితిత్తులు బిగిసిపోయేలా ఆక్సీజన్‌ లేకపోవటం...సన్నటి దారులు.. గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం.. అయినా భక్తులు ఆగిపోరు.. వాళు్ల ముందు వెళు్తంటారు..చావు వాళ్ల వెంటే వస్తూందా అనిపిస్తుంది.. మనం ఒక సెకన్‌ తప్పటడుగు వేస్తే అది వాళ్లను దాటి మింగేస్తుంది.. ఇంత టెన్షన్‌లోనూ అమర్‌నాథ్‌ యాత్రకు అపూర్వంగా వెళు్తంటారు భక్తులు..
4
ఎందుకింత క్రేజి.. ప్రమాదమని తెలిసినా ఎందుకీ యాత్ర.. పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నా ఎందుకీ డిమాండ్‌.. అమర్‌నాథ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు మంచు శివలింగం ఎలా ఏర్పడుతోంది.. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి?
పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అమర్‌నాథ్‌ ఒకటి.. సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభువుగా వెలిస్తే ఒకేసారి అవతరిస్తాడు.. కానీ, అమర్‌నాథ్‌లో ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నాడు.. అంటే ఏర్పడుతున్నాడు.. అదీ మంచుతో.. శివలింగ రూపంలో.. ఇది ఎలా సాధ్యమవుతోంది..?
అమర్‌నాథ్‌ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది.. ఆ సమయంలో మైనస్‌ అయిదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.. గుహను చేరుకోవటం అసాధ్యం... జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది.. మంచు విచ్చుకుంటుంది.. గుహ స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది.. అందువల్లే 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది..
విచిత్రమేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది.. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుందన్నది ప్రశ్న.. సంవత్సరమంతా గడ్డకట్టుకుపోయిన అమర్‌నాథ్‌ గుహ క్రమంగా తేటపడుతున్న సమయంలో జ్యోతిర్లింగం ఏర్పడే చోట గుహ పైభాగం నుంచి ఒక్కొక్కటిగా నీటి చుక్క కింద పడుతూ ఉంటుంది.. సుమారు 45 రోజుల పాటు ఈ నీటిబొట్లు పడుతూనే ఉంటాయి.. ఈ నీటి బొట్లు క్రమంగా మంచుగా మారి, లింగరూపంగా ట్రాన్‌‌సఫామ్‌ చెందుతాయి.
భక్తులు ఈశ్వరుని సందర్శించుకునే 45 రోజులు కూడా నీటి బిందువులు పడుతూనే ఉంటాయి. అయితే శివలింగం గుహ పై భాగాన్ని తాకి ఉండటం వల్ల అవి మామూలుగా కనిపించవు.
భక్తులు చూసే 45 రోజుల తరువాత గుహను మంచు పూర్తిగా కప్పేసినప్పటికీ, శివలింగం ఉండాల్సిన ప్రాంతం నుంచి ఒకరకమైన తేజస్సు స్పష్టంగా కనిపిస్తుందని భక్తులను గుహదాకా తీసుకువచ్చి, మళ్లీ కిందకు తీసుకువెళ్లే స్థానికులు అంటారు.. అందుకే దాన్ని జ్యోతిర్లింగమని చెప్తారు.
5
అమర్‌నాథ్‌లో జ్యోతిర్లింగం మామూలుగా ఏర్పడుతున్నదేనా? లేదా నిజంగానే శివుడు కైలాసం నుంచి దిగి వచ్చి రెండు మాసాల పాటు భక్తులకు కనువిందు చేస్తున్నాడా? దేవుడే ఒక మిథ్‌ అని భావించే వాళు్ల కొల్లలుగా ఉన్నప్పుడు ఇక కైలాసం నుంచి శివుడు రావడమేమిటని అనుకుంటున్నారా? మరదే విచిత్రమంటే..
పరమేశ్వరుడు కైలాసం నుంచి అమర్‌నాథ్‌కు ప్రతి ఏటా బయలు దేరి వస్తున్నాడట.. ? విస్తు పోకండి.. ఆశ్చర్యం అసలే అక్కర్లేదు.. అర్థం లేని ఈ వాదన ఏమిటని నిలదీయకండి..పరమేశ్వరుడు ఈ భూమ్మీదే నడయాడుతున్నాడని అమర్‌నాథ్‌ ప్రజల విశ్వాసం.. హిమాలయాల్లో మరింత ఎతె్తైన కైలాస పర్వతంపైనే మహాదేవుడు ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన అమర్‌నాథ్‌కు తన మందీ మార్బలంతో తరలి వచ్చాడట. మార్గమధ్యంలో ఆయన ఎక్కడెక్కడ ఆగిందీ, ఏం చేసిందీ కూడా వీళు్ల వివరిస్తారు..
మృత్యువు గురించి పార్వతీదేవికి వచ్చిన సందేహాన్ని తీర్చేందుకు శివుడు ఆమెను అమర్‌నాథ్‌కు తీసుకువచ్చాడు.. ఈ దారి కైలాస్‌ మానస్‌ సరోవర్‌ నుంచి నేపాల్‌ మీదుగా కాశ్మీర్‌లోకి ప్రవేశించి అమర్‌నాథ్‌ దగ్గర ముగుస్తుంది.
కైలాసం నుంచి బయలు దేరిన శివుడు దారిలో బైల్‌గావ్‌ దగ్గర తన వాహనాన్ని అదే నందీశ్వరుని వదిలేశాడట.. ఈ బైల్‌గావే.. కాశ్మీర్‌లో ఇవాళ ఉన్న పహల్‌గామ్‌. ఆ తరువాత మరికొంత దూరంలో చందన్‌ వాడి దగ్గర చంద్రుని, మహాగణేశ్‌ గుహ దగ్గర గణపతిని విడిచిపెట్టాడు.. అక్కడి నుంచి అమర్‌నాథ్‌ దగ్గరలోని పంచతరణి ప్రాంతాల్లో పంచభూతాలను వదిలేశాడు. ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికీ పవిత్ర శివ క్షేత్రాలుగా ఉన్నాయి.
అమర్‌నాథ్‌ గుహలోనే పార్వతీదేవికి మృత్యురహస్యం చెప్పాడని స్థానిక కథనం.. ఇదంతా పుక్కిటి పురాణంగా కొందరు కొట్టి పారేయవచ్చు. కానీ, ఇక్కడ టెక్నికల్‌ లాజిక్‌ ఉంది.. అమర్‌నాథ్‌ గుహ 13,700 అడుగుల ఎత్తున ఉంది. ఇరుకుదారిలో ప్రాణంతో చెలగాటమాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి.. ఊపిరి తిత్తులకు ఆక్సీజన్‌ సక్రమంగా అందదు.. మృత్యు బాధ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్లిన వారికి ఈజీగా అర్థమైపోతుంది.. పార్వతికి, శివుడు మృత్యురహస్యం చెప్పాడన్న కథలోని అంతరార్థం ఇదే.
భక్తులు ఒక్కసారి గుహ దగ్గరకు చేరుకున్నాక కూల్‌ అయిపోతారు. అక్కడి వాతావరణం అలాంటిది.. మంచులింగం ఒకవిధంగా భక్తులను మెస్మరైజ్‌ చేస్తుంది.. జీవితంలో చాలా కష్టమైన దారిలోనే సక్సెస్‌ఫుల్‌గా వెళ్లిన తరువాత మిగతా దారులన్నీ చిన్నగానే కనిపించేలా సైకలాజికల్‌ అనుభూతిని కలిగిస్తుంది.
మరి ఇంతటి అనుగ్రహాన్నిచ్చే మహాదేవునికి ఆగ్రహం ఎందుకు వచ్చింది.. ముక్కంటి తన మూడో కంటిని ఎందుకు తెరుస్తున్నాడు..భక్తులను ఆదరించకుండానే ఎందుకు అంతర్థానమైపోతున్నాడు?
ఏదైనా ఒక పని చేయాలంటే దానికి కొన్ని పద్ధతులుంటాయి... ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే దానికి కొన్ని మార్గాలుంటాయి.. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటే గమ్యం చేరుకుంటారే కానీ, లక్ష్యం నెరవేరదు.. అమర్‌నాథ్‌ విషయంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇలాంటిదే..
అమర్‌నాథ్‌ గుహ సముద్ర మట్టానికి చాలా ఎతె్తైన ప్రాంతంలో ఉంది. ఉష్ణోగ్రత పూర్తిగా మైనస్‌ డిగ్రీల్లో ఉంటుంది. దర్శనం చేసుకోవలసిన ఈశ్వరుడూ మంచు రూపంలో ఉంటాడు.. అలాంటి చోటికి హెలికాప్టర్‌లలో వెళ్లటం, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవటం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతోంది.. చల్లగా ఉండాల్సిన చోటును వేడిమయం చేస్తోంది. చలిగా ఉండాల్సిన ప్రాంతంలో వెచ్చదనాన్ని కృత్రిమంగా సృష్టిస్తోంది.
ప్రశాంతంగా ఉన్న అమర్‌నాథ్‌ గుహకూ గ్లోబల్‌ వార్మింగ్‌ అంటుకునే ప్రమాదం మన వాళ్ల వల్లే ఏర్పడుతోంది.. దీనికి తోడు గుహలోకి పూలు, పండ్లు విసిరేయటం, వేలాది అగర్‌బత్తీలు వెలిగించటం అక్కడి విధానానికి వ్యతిరేకం..
ఏదైనా సరే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే, ఆది విపత్తు సృష్టిస్తుంది.. అమర్‌నాథ్‌లో 2007 నుంచి జరుగుతున్న తంతు ఇలాంటిదే.. హెలికాప్టర్లు.. ఇతర ప్రత్యామ్నాయ దారుల్లో వివివిఐపిలు ఇలా వచ్చి అలా వెళ్లేందుకు చేసిన ఏర్పాట్లు మంచు లింగం త్వరగా అంతర్థానమవటానికి కారణమైంది.. వేలాది భక్తులు అమర్‌నాథ్‌కు చేరుకోకుండానే వెనక్కి తిరిగివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది..
మంచుకొండల్లో మహాదేవుని దర్శనం సామాన్యమైంది కాదు.. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు.. సహజంగా ఉన్న వ్యవస్థను అసహజంగా మారిస్తే ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. భారతదేశానికి ఉన్నవి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదలే.. వీటికి కూడా అస్తిత్వం లేకుండా చేసుకుంటామంటే, జవాబు చెప్పేదేముంటుంది?
Categories: Middle

రావణ రహస్యం -3

Tue, 07/06/2010 - 06:55
ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..



పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్‌ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు..

పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్‌ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్‌లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్‌వెయిట్‌ స్టోన్స్‌, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది..
శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్‌ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది..
నీలవరై పుత్తుర్‌ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్‌ రాక్‌ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎతెユ్తన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్‌ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్‌ చేసేవాడు..

ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు...

రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు..
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు..
వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు... చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది..
Categories: Middle

రావణ రహస్యం -2

Tue, 07/06/2010 - 06:49
రావణుడు.. రామాయణం... భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి... లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం..

మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే...ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది..
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్‌ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్‌ తోటలోని తన ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్‌ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్‌ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు..
అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్‌ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రెユ అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది..
.. ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్‌ వుమెన్‌ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్‌ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది...
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..

2
లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి...

లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం...ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు..
రావణుడి కొడుకు ఇంద్రజిత్‌.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి.

రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్‌లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.

తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్‌.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్‌ హౌస్‌ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్‌ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్‌ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్‌ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు..

రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి..

రావణుడు ఆర్కిటెక్ట్‌
రావణుడు ఏరోనాటికల్‌ ఇంజనీర్‌
రావణుడు డాక్టర్‌
రావణుడు వార్‌ఫేర్‌ టెక్నాలజిస్ట్‌
రావణుడు నిత్య పరిశోధకుడు
రావణుడు గొప్ప సంగీతవేత్త

ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్‌ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.

రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.

లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్‌ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్‌ కలిపే నెట్‌వర్క్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి,
Categories: Middle

రావణ రహస్యం

Sat, 07/03/2010 - 14:08
రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..

ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం..
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళు్ల శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి.
ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం.. ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి.
అశోక వాటిక సమీపంలో మొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు...
2
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళు్ల కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది..
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది...
3
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిక్తా్వలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా..
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది..
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక రీసర్‌‌చ టీమ్‌ నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి ట్రాన్‌‌సపోర్‌‌ట సిస్టమ్‌ను, కము్యనికేషన్‌ వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
4
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.

కెలీనియా.. రావణుడి తము్మడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది...

ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్‌ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది.
రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎతె్తైతే, అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ.
లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..

శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎతె్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.

రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నము్మతున్నారు.. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి.

Categories: Middle

గ్రహాంతర వాసులే దేవతలా?-2

Sat, 07/03/2010 - 13:37


దేవతలంటే గ్రహాంతర వాసులని అనుకుంటున్నాం.. అలాంటి గ్రహాంతరవాసులు మొదట్నుంచీ భూమితో చెలిమి చేస్తూ వచ్చారా? వాళ్ల జీవిత కాలానికీ, మన జీవిత కాలానికీ ఏదైనా తేడా ఉందా? వారికి ఉన్న అపురూపమైన శక్తి సామర్థా్యలను, టెక్నాలజీని మనుషులతో పంచుకున్నారా? అవుననే అనిపిస్తుంది.. ఎందుకంటే రామాయణ, భారత, క్రీస్తు కాలాలలో మన సమాజంలో కనిపించే అపూర్వ టెక్నాలజీకి, ఏలియన్‌‌స టెక్నాలజీకి దగ్గరి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆనాటి విమానాలు కానీ, ఆయుధాలు కానీ, మన కాలానికి ఎన్నో రెట్లు అడ్వాన్‌‌సడ్‌ స్టేజిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏమిటీ ఆయుధాలు.. ఎక్కడ ఆ విమానాలు.

మన పురాణాల్లో ఖగోళంలో ఏ గ్రహం ఎంతకాలానికి ఎంత దూరం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో లెక్కించారు.. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా చెప్పగలిగారు..అంతే కాదు.. దేవతలకూ, మనుషుల జీవిత కాలాలకు సంబంధించిన లెక్కలు కట్టారు..ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఏ ప్రాతిపదికన మన వాళు్ల ఈ లెక్కలు వేయగలిగారు? ఇదో అంతుపట్టని మిస్టరీ..

భాగవత పురాణంలో బ్రహ్మ జీవిత కాలాన్ని మనుషుల జీవిత కాలంతో పోలుస్తూ వ్యాసుడు కట్టిన లెక్కలు మనకు కనిపిస్తాయి. దీని ప్రకారం

360 మనిషి సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం


12 వేల దేవతల సంవత్సరాలు ఒక చతుర్యుగం.


అంటే కృత, త్రేత, ద్వాపర కలియుగాలన్నమాట.


మన మనుషుల లెక్క ప్రకారం ఒక చతుర్యుగం అంటే 4లక్షల 32 వేల సంవత్సరాలన్నమాట.


ఇలాంటి చతుర్యుగాలు 2000 పూర్తయితే బ్రహ్మకు ఒక రాత్రి,పగలు అన్నమాట.. అంటే ఒక రోజు గడిచినట్లు.


బ్రహ్మకు ఇలాంటి రోజులు 360 గడిస్తే ఒక సంవత్సరం అయినట్లు.


ఇలాంటి సంవత్సరాలు వంద పూర్తయితే బ్రహ్మ జీవిత కాలం ముగిసినట్లు..


అంటే మన మనుష్యుల కాలమానం ప్రకారం బ్రహ్మ జీవించే కాలం అక్షరాలా 3,11,040,000,000 రోజులన్నమాట.


దీని తరువాత ప్రళయం వస్తుందని, ఆ తరువాత మళ్లీ సృష్టి మొదలవుతుందని భాగవతం చెప్తోంది..
ఈ లెక్కల ప్రకారం దేవతలు అమరులనటంలో ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే మనతో పోలిస్తే 36వేల సంవత్సరాలు గడిస్తే తప్ప వాళ్లకు వందేళు్ల పూర్తి కావు.. అయితే

ఈ కాలమానాన్ని మన వాళు్ల ఎలా లెక్క కట్టగలిగారు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించకపోవచ్చు. కానీ ఖగోళ శాసా్తన్న్రి, నక్షత్రాల కదలికలను అంచనా వేయటంలో ఆరితేరిన వారు కాబట్టి ఇతర గ్రహాలలో ఉండే జీవరాశుల జీవిత కాలాన్ని ఈ విధంగా లెక్కించి ఉండవచ్చు..
పురాణాల్లో చెప్పినట్లు భూమికి ఎగువన ఉన్న లోకాల్లో సత్యలోకం అన్నింటి కంటే పైన ఉన్నది.. బ్రహ్మ ఉండేది కూడా సత్యలోకంలోనే. అంటే భూమి నుంచి ఎగువన ఉన్న గ్రహాల వైపు వెళు్తన్న కొద్దీ కాల గమనంలో మార్పు వస్తుందన్న మాట..
------
రోదసి.. అనంతమైన విశ్వం.. మొదలెక్కడో తెలియదు.. తుది ఏమిటో అంతకంటే తెలియదు.. ఈ విశ్వాంతరాలంలో భూమి పరిమాణం చాలా చాలా చాలా చిన్నది.. దీనికి ఎన్నో రెట్లు పెద్ద వైన గ్రహాలు రోదసిలో కోట్ల సంఖ్యలో ఉన్నాయి.. వీటిలో ఎక్కడో భూమి లాంటి గ్రహం ఉండి ఉండవచ్చు. అక్కడా మనలాగే జీవరాశి ఉండనూ వచ్చు.. స్పేస్‌లో పాలపుంతలు ఒకటి కాదు..వేల సంఖ్యలో ఉన్నాయి. సౌరమండలాలకు లెక్కలేదు.. దూరాలకు అంతే లేదు.

మన సౌర మండలమే దాదాపు 14 వందల కోట్ల మైళ్ల మేర ఉంది. దాని తరువాత మిల్కీ వే ల గురించి చెప్పేదేముంది.. భూమి కంటే ఎంతో పెద్ద వైన గ్రహాలు మన సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దవైన సూర్యుల చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు.. అందుకే దేవతల కాలమానానికి, మన కాలమానానికి తేడా ఉంది. ఒక దేశానికి, ఇంకో దేశానికీ మధ్యనే టైమ్‌లో చాలా తేడా కనిపిస్తుంది మనకు. ఇక రోదసిలో గ్రహాల మధ్య కాలంలో డిఫరెన్‌‌స ఉండటంలో ఆశ్చర్యమేముంది.?
2

గ్రహాల మధ్య దూరం, గ్రహాల మధ్య భ్రమణాన్ని బట్టి ఆయా గ్రహాలలో ఉండే జీవరాశుల జీవిత కాలాన్ని మన వాళు్ల అంచనా వేశారు.. ఈ విధంగానే వారి శక్తి సామర్థా్యలనూ ఏ స్థాయిలో ఉంటాయో రుచి చూశారు.. ఇదిగో ఇవాళ ఏలియన్‌ తిరుగుతున్నదంటున్న యుఎఫ్‌ఓలు, నాడు దేవతలు తిరిగారంటున్న పుష్పక విమానం ఒకటే కావచ్చని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల్లో కొందరి అభిప్రాయం.

ఈజిప్‌‌ట... ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఉన్న దేశం.. ఇక్కడ బయటపడ్డ పిరమిడ్‌లు అనేక చారిత్రక రహస్యాలను విప్పి చెప్తాయి. ఇక్కడి కింగ్‌ జోసెఫ్‌ పిరమిడ్‌ నాలుగు వేల సంవత్సరాల నాటిది.. ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చిన్న చెక్కతో తయారు చేసిన పక్షి బొమ్మ దొరికింది. అక్కడ కనిపించిన రాతల్లో ఐ వాంట్‌ టు ఫై్ల అన్న మాటలూ ఉన్నాయి. అక్కడ తవ్వకాల్లో దొరికిన ఓ పక్షి బొమ్మను నిశితంగా గమనిస్తే, దానికి పక్షిలాగా కళు్ల రెక్కలు ఉన్నాయి. కానీ, రెక్కలు సాధారణ పక్షికి ఉన్నట్లు కాకుండా విమానపు రెక్కలను తలపిస్తున్నాయి. ఆధునిక ఎయిర్‌క్రాఫ్‌‌టకు ఇది నమూనాలాగా ఉంది.

అటు కొలంబియాలో దొరికిన ప్రాచీన ఆనవాళ్లలో సైతం చేప ఆకారంలో ఉన్న అనేక వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ మోడ్రన్‌ ఎయిర్‌ షిప్‌కు సంకేతంగా భావిస్తున్నారు..



మన దేశంలో సంస్కృత గ్రంథాల్లో, శాసనాల్లో విమాన శాస్త్రం ఉంది.. క్రీస్తుకు పూర్వం దాదాపు 6వేల సంవత్సరాల క్రితమే భారతీయులు విమానాన్ని తయారు చేసే ప్రక్రియను కనుక్కున్నారు. ఈ విమానాల్లో కొన్ని ఒక విధమైన జెట్‌ ఇంజన్‌తో నడిచేవని శాస్త్రవేత్తలు చెప్తారు.. ఈ విమానాలు గాల్లోకి ఎగిరే సమయంలో తీవ్ర వేగంతో, భారీ ఇంధన వినియోగంతో, పేలుళు్ల జరిగేవని అంటారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక యుగంలో అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహ వాహక నౌకల్లాంటివే ఇవి.

ఈ విమానాల్లో ఎలక్ట్రిసిటీ పవర్‌ ఉండేదిట.. ఇందుకోసం మెర్కు్యరీని ఇంధనంగా వాడేవారు.. ఇందులో ప్రయాణికులకు చోటు ఉన్నట్లే.. వార్‌హెడ్‌ కూడా ఉండేది. ఈ విమానం ద్వారా ఆయుధాన్ని కూడా ప్రయోగించే వీలుంది.. ఆధునిక మిలటరీ విమానానికి భారతీయ విమాన శాస్త్రంలో చెప్పిన విమానాలు ఎంతమాత్రం తీసిపోవని శాస్త్రవేత్తలే అంటున్నారు..

పుష్పక విమానం కూడా ఇలాంటిదే.. రెండు అంతస్థుల్లో ప్రయాణికులను తీసుకుని వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న అతి పెద్ద విమానం ఇది.. రావణ వధ తరువాత రాముడు ఇదే విమానంలో అయోధ్యకు లంక నుంచి వెళ్లాడట.



ఇంత టెక్నాలజీ మన వారికి అంత ప్రాచీన కాలంలో ఎలా లభించింది..అన్న ప్రశ్నకు జవాబే ఫై్లయింగ్‌ సాసర్‌.. ఎలియాస్‌ యుఎఫ్‌ఓ.. గత అర్థ శతాబ్దంలో ప్రపంచంలో చాలా చోట్ల లిప్తపాటులో కనిపించి వెళ్లిపోతున్న ఫై్లయింగ్‌ సాసర్‌లోని టెక్నాలజీ, మన విమానాల్లో వినియోగించిన పరిజ్ఞానమూ దాదాపు ఒకటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. ఇది పూర్తిగా నిర్థారణ కాకపోయినప్పటికీ ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి రెండు ఒకటే అయితే, గ్రహాంతర వాసులతో మన ప్రాచీనులకు ఉన్న అనుబంధం స్పష్టమవుతుంది..

3

దేవతలు అనగానే మనకు గుర్తొచ్చేది వారి చేతుల్లో ఉండే వివిధ ఆయుధాలు.. కత్తులు, గదలు, బాణాలు, ఇంకా రకరకాలు.. ఈ అసా్తల్ర తోనే దేవతలు బీభత్సాన్ని సృష్టించారా? అవును.. ఇవి సాధారణ ఆయుధాలు కావు.. సామూహిక జనహననాన్ని సృష్టించే భయానక అసా్తల్రు..

1945 జూలై 16 మెక్సికో సరిహద్దుల్లో అమెరికా అణ్వస్త్ర ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా జరిపింది. దాదాపు వంద మైళ్ల ఎత్తున అణు రేడియో ధార్మికత ఎగిసిపడింది.
అమెరికా అణ్వసా్తన్న్రి 1945లో ప్రయోగించింది. కానీ, దానికంటే ఎన్నో ఏళ్ల క్రితం అంటే ప్రాచీన కాలంలోనే, ముఖ్యంగా భారత దేశంలో అణ్వసా్తల్రు ఉన్నాయనటానికి ఆధారాలు ఉన్నాయి. కృత యుగంలో జరిగిన రామాయణంలో రావణుడితో యుద్ధం చేసిన రాముడు అతనిపై రామ బాణాన్ని ప్రయోగించి వధించాడు.. అది న్యూక్లియర్‌ పవర్‌ ఉన్న బాంబుగా భావిస్తున్నారు.. ఎందుకంటే లంకలో రామ రావణ యుద్ధం ఎక్కడైతే జరిగిందని భావిస్తున్నారో, అక్కడ ఇవాళ్టికీ గడ్డి పరక కూడా మొలవదు.. అంతే కాదు.. దాదాపు నాలుగు వేల ఏళ్ల క్రితం జరిగిన మహాభారత యుద్ధంలో మన వారి చేతుల్లో బ్రహ్మాస్త్రం ఉండేది.. అదే అణ్వస్త్రమని ఇప్పటి శాస్త్రవేత్తల అభిప్రాయం..
కురుక్షేత్రంలో కూడా కొంతమేర రేడియేషన్‌ ఆనవాళు్ల ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మహా భారత కాలంలో అణ్వస్త్రం ఉన్నదన్న అభిప్రాయాన్ని అంతా ఒప్పుకోకపోవచ్చు. కానీ మహాభారత యుద్ధంలో భారీ ఎత్తున పేలుళు్ల జరిగాయని మాత్రం అంతా అంగీకరిస్తున్నారు.. భారీ విధ్వంసాన్ని సృష్టించిన పేలుళ్ళే ఇవి..
మెసపటోమియా, మొహంజదారో ఆనవాళు్ల లభించిన ప్రదేశాల్లో కూడా రేడియేషన్‌ ప్రభావం కనిపిస్తోంది. భారత ఇతిహాసాల్లో ఎగిరే రథాలు కనిపిస్తాయి. వాటిపై యుద్ధం చేస్తున్నవారి చేతుల్లో అపూర్వమైన ఆయుధాలు కనిపిస్తాయి. అటు క్రిస్టియానిటీ ప్రాచీన గ్రంథాల్లోనూ, బైబిల్లోనూ ఈ న్యూక్లియర్‌ పవర్‌ గురించిన ప్రస్తావన కనిపిస్తుంది..
మహాభారత యుద్ధాన్ని నడిపించింది శ్రీకృష్ణుడు.. అర్జునుడికి గీతోపదేశం చేసి సంహారకాండను అంతా తానే అయి నడిపించింది కృష్ణుడు.. ఈయన దేవుడు.. దివి నుంచి భువికి దిగి వచ్చిన వాడు.. ఆయన అందించిన టెక్నాలజీతోనే, విజ్ఞానంతోనే మహాభారత పర్వం కొనసాగింది.. పైలోకాల్లో ఉన్న పరమాత్ములతో మనకున్న చెలిమికి ఇవి తార్కాణాలు.. ఈ పరమాత్ములు ఎవరు? దేవతలా? ఏలియన్సా? పరిశోధనలు తేల్చాలి.
Categories: Middle

గ్రహాంతర వాసులే దేవతలా?

Sat, 07/03/2010 - 13:29
దేవతలు ఎవరు? మనల్ని ఈ భూమ్మీద సృష్టించింది వాళ్లేనా? నిజంగా మన సృష్టి కర్తలు దేవతలే అయితే... వాళు్ల ఎలా ఉంటారు? వాళ్ల ఉనికి ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ ఎవరికీ అర్థం కాని ఓ పే..ద్ద బ్రహ్మపదార్థం లాంటివి... అన్ని దేశాల్లో అన్ని మతాల్లో రోజూ ఎక్కడో ఓ చోట.. ఏదో రకంగా జరుగుతున్న చర్చ ఇదే.. మిగతా మతాల మాటెలా ఉన్నా.. మన దేవతల తీరే వేరు.. అనేక రకాల రూపాలు.. అర్థం కాని వాహనాలు.. అసాధారణమైన ఆయుధాలు.. అపూర్వమైన శక్తియుక్తులు.. చిత్రవిచిత్రమైన కథనాలతో కనిపిస్తారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముక్కోటి మంది దేవతలు ఉన్నారని చెప్తారే.. వీళ్లంతా ఎక్కడ ఉన్నారు? అసలు ఈ మాటల్లో , పురాణాల్లో, కథనాల్లో వాస్తవం ఉందా? ఉంటే అదేమిటి?

-----------
భూమ్మీద మనిషి జీవితం మొదలైనప్పటి నుంచీ దేవతల గురించిన వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి చాలా యుగాల క్రితమే మన పురాణాల్లో గ్రహాంతరాలల్లో వేరే లోకాలు ఉన్నాయని, అందులో జీవులు ఉంటున్నారన్న ప్రస్తావన ఉంది.. వారి గురించి పరిశోధన చేసినట్లూ, వారితో మనుషులు కలిసినట్లూ ఉంది... వాళ్లందరూ మనకన్నా చాలా రెట్లు శక్తి మంతులు.. వాళ్ల అనుగ్రహం మనపై ఉంటే మనకు అంతా మంచి జరుగుతుందని భావిస్తూవస్తున్నాం.... వీళ్లే దేవతలా?
------------------------------------
భూమి... లేదా భూగోళం.. ఇంకా చెప్పాలంటే భూలోకం. మనం ఉంటున్న లోకం ఇది.. ఈ లోకానికి కింది భాగాన ఏడు లోకాలు.. పై భాగాన మరో ఆరు లోకాలు ఉన్నట్లు మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి..
భూమికి దిగువన అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఉంటే, ఎగువన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయని భావిస్తున్నాం..పై లోకాల్లో యక్ష, రాక్షస, గరుడ, గంధర్వ, కింపురుష, విద్యాధర, మహర్షి గణం ఉన్నదని, సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడని చెప్తారు.. బ్రహ్మ దేవుడి పైన క్షీరసాగరం, వైకుంఠం, కైలాసాదులు ఉన్నాయంటారు..భూమ్మీద తపస్సు చేసిన వారికి దేవతలు ఆకాశం నుంచి ప్రత్యక్షమవుతారు.. కోరిన వరాలిచ్చి ఆదుకుంటారు.. గంధర్వులు, దేవ కన్యలు దివి నుంచి భువికి దిగివస్తారు.

వీళ్లను మనం పూజిస్తున్నాం.. ఆలయాలను నిర్మించి ఆరాధనలు చేస్తున్నాం.. హోమాలు చేస్తున్నాం.. వీళు్ల మనను అనుగ్రహిస్తున్నారని విశ్వసిస్తున్నాం.. అయితే ఎక్కడి నుంచి మనల్ని చూస్తున్నారు.. ఎలా అనుగ్రహిస్తున్నారు.. ?
బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడు.. అక్కడి నుంచి ఆయన ఈ భూమ్మీద జీవులను సృష్టిస్తుంటాడు.. వాళ్లను పరిపాలించే బాధ్యత.. ఆ బ్రహ్మపైన ఉన్న విష్ణుమూర్తిది.. ఆయన వైకుంఠంలో పాల సముద్రంలో లక్ష్మీదేవి చెంతన ఉంటాడు..
అందరి జీవితాలు ముగిసిపోయిన తరువాత తనలో లయం చేసుకునే దేవుడు పరమ శివుడు.. ఆయన కైలాసంలో ఉంటాడు..అదొక వెండి కొండ... స్వర్గం, నరకం ఇవన్నీ భూమికి ఎగువన ఉన్నాయంటున్న అనేక లోకాలు.. ఈ లోకాల్లో ఈ దేవీ దేవతల ఆవాసం నిజమేనా? అక్కడి నుంచే భూమిని వీరు పరిపాలిస్తున్నారా?
2
దేవుడు లేనే లేనప్పుడు డిస్కషనే వేస్టంటారు హేతువాదులు.. వాస్తవమే.. కానీ, తనకు ఊహకైనా తెలియకుండా ఒక విషయం గురించి మనిషి ఆలోచించటం సాధ్యం కాదు.. ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నాడంటే, చర్చిస్తున్నాడంటే.. అందుకు సంబంధించి ఏదో ఒక చిన్న ఘటన తనకు అనుభవంలోకి వచ్చి ఉండాలి.. దాన్నుంచే తన సృష్టికి కారణం ఎవరన్న దానిపై మనిషి తపన మొదలై ఉండాలి. మనిషి మేధస్సును తొలిచి వేస్తున్న దేవతల గురించిన ఆలోచన కూడా ఈ విధంగా వచ్చిందే కావచ్చు.
దేవతలకు సంబంధించిన కథలు, బొమ్మలు హిందూ పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఆలయాల పైనా చాలానే కనిపిస్తాయి.. వేల ఏళ్ల నాటి నిర్మాణాలపైనా చిత్రాల రూపంలో దేవీ దేవతల కథలు ఉంటాయి.. రకరకాల రూపాల్లో, రథాలపైనా, గుర్రాల పైనా, యుద్ధం చేసుకుంటున్న బొమ్మలు ఎన్నెన్నో ఉన్నాయి.. మన ఇతిహాసాల్లో
ఆకాశ వాణి పలుకుతుంది.. భవిష్యవాణి చెప్తుంది.. దేవుడు ఆగ్రహిస్తే, మబ్బులు ఉరుముతాయి.. మెరుపులు మెరుస్తాయి.. దివి నుంచి గంగ భువికి దిగి వస్తుంది.. భూమి సస్యశ్యామలమవుతుంది.. ఇవన్నీ ఆకాశం నుంచే జరుగుతున్నాయి. అంటే భూమికి ఎగువన ఉన్న లోకాల నుంచి..
ఇలాంటి కథనాలు మన హిందూయిజం లో మాత్రమే లేదు.. క్రైస్తవ చరిత్రలోనూ ఇది మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.. అతీంద్రియ శక్తులు ఉన్నట్లు క్రిస్టియానిటీకి చెందిన ప్రాచీన పెయింటింగ్‌లలో మనకు కనిపిస్తుంది. ఏసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న సందర్భంలో ఆకాశం నుంచి దివ్యమైన వెలుగు ఆయనపై ప్రసరించినట్లు కథనం ఉంది..
అంతే కాదు క్రీస్తును శిలువ వేస్తున్న సందర్భంలో దేవతలు భూమి పైకి వచ్చి ఆ సన్నివేశానికి సాక్షులుగా నిలిచినట్లూ చెప్తారు.. ఈ కథలు, కథనాలన్నీ కూడా దేవీ దేవతల మూలాలను చెప్తున్నాయి.
ఈ కథలన్నింటికీ ఆధారాలు ఏమున్నాయి..? అంటే ఇవాళ ఆధునికంగా సైన్‌‌స పరిశోధిస్తున్న, ప్రస్తావిస్తున్న ఏలియన్‌‌స ఈ కథనాలకు మూలమేమో..
విశ్వంలో ఎక్కడో ఏదో ఒక చోట ఉన్నారని భావిస్తున్న గ్రహాంతర వాసులే మతాలు నము్మతున్న దేవీ దేవతలా? వీళ్లనే, అంటే ఈ గ్రహాంతర వాసులనే మన ప్రాచీనులు దేవతలుగా భావించి ఉండవచ్చు. స్టీఫెన్‌ హాకిన్‌‌స వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చెప్తున్నట్లుగా ఏలియన్‌‌స ఉన్నాయన్న మాటే వాస్తవమైతే వీళ్లను మన పూర్వీకులు చూసి ఉంటారా? వీళ్లు మనకన్నా శక్తిమంతులై వాళ్ల నుంచి మేలును పొందారా?
గ్రహాంతర వాసులు ఎలా ఉండవచ్చన్నదానికి ఆధారాలు మనకు స్పష్టంగానే లభిస్తున్నాయి. ఏసుక్రీస్తుకు పూర్వం అయిదు వేల ఏళ్ల సంవత్సరాలకు పూర్వమే గ్రహాంతర వాసులను నాటి ప్రజలు గుర్తించారు. వాళ్లరూపు రేఖలను భావితరానికి అందించారు ఇరాన్‌లో కొంతకాలం క్రితం తవ్వకాల్లో బయట పడ్డ విగ్రహాలు ఇవే. ఈజిప్‌‌ట పిరమిడ్లలోనూ ఇలాంటి బొమ్మలు మనకు కనిపిస్తాయి...
మన దేశంలోనూ, మొహంజదారో ప్రాంతంలోనూ ఇలాంటి చిత్రవిచిత్రమైన వేషాలు ఉన్న విగ్రహాలు, చిత్రాలు కనిపిస్తాయి. ఈ బొమ్మల్లో కనిపించేది ఏలియన్సే అయితే, వీళు్ల మానవాళికి మేలు చేయటం కోసమే భూమి మీదకు మరో గ్రహం నుంచి వచ్చి ఉంటే, వారిని మన వాళు్ల దేవతలుగా భావించి ఉండవచ్చు. వాళు్ల మనకన్నా శక్తిమంతులు కావటం వల్ల వారిని పూజించి ఉండవచ్చు.
3
దేవతలు ఉన్నారా, లేరా అన్న వాదనల మాదిరిగానే గ్రహాంతర వాసులు ఉన్నారనటానికి ఆధారాల విషయంలోనూ రెండు రకాల వాదనలున్నాయి. కానీ వీటిపై పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు మాత్రం ఏలియన్‌‌స ఉన్నాయని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు.. సైంటిస్టుల వాదనలకు మన పురాణాలు, క్రిస్టియానిటీలోని చిత్రాలు ఆధారాలు కాకపోవచ్చు. కానీ, ఎగిరే పళ్లాల రూపంలో చాలా చోట్ల కనిపించిన స్పేస్‌ షిప్‌లు ఇందుకు మూలం..
ఇలాంటి ఎగిరే పళ్లాలను ప్రపంచంలో చాలా మంది చాలా చోట్ల చూశారు.. రెండు మూడేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దీనిపై కలకలమే రేగింది.. మన దేశంలోనూ కొన్ని నగరాల్లో ఫై్లయింగ్‌ సాసర్లు కనిపించాయి. ఇవి నిజంగా గ్రహాంతరవాసుల వాహనాలేనా అన్నది తేలనైతే తేలలేదు. కానీ, లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి కనురెప్ప పాటులో మాయమై పోయే ఈ వస్తువులను యుఎఫ్‌ఓ లని పేరు పెట్టారు.. వీటిపైన తీవ్రస్థాయిలోనే పరిశోధనలు జరుగుతున్నాయి. చివరకు నాసా ప్రయోగించిన చాలా ఉపగ్రహాల చుట్టూ గ్రహాంతర వాసులు తిరుగుతున్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అవే ఉపగ్రహాలు తీసిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి 1947 జూలైలో మెక్సికోలో జరిగిన ఓ విచిత్రమైన విమాన ప్రమాదం ఫై్లయింగ్‌ సాసర్లపై పరిశోధనలకు నాంది పలికింది.. రాస్‌వెల్‌ సమీపంలో గుండ్రని స్పేస్‌షిప్‌ కూలిపోవటం, నాలుగు వింతజీవుల మృతదేహాలు అందులో ఉన్నట్లు యుఎఫాలజిస్టుల వాదన.. అదే విమానమని, మృతదేహాలు గ్రహాంతర వాసులవనీ వారి వాదన.. దీనిపై అమెరికా సర్కారు ఇప్పటికీ పెదవి విప్పలేదు..
రాస్వెల్‌ ఘటనతో ప్రపంచంలో ఎగిరే పళ్లాల గురించిన చర్చ మొదలైంది కానీ, వీటి లింక్‌ మన పురాణాల్లోనూ కనిపిస్తుంది. విష్ణుమూర్తిని అత్యంత వేగంగా తీసుకుపోగల వాహనం గరుత్మంతుడు.. అలాగే మిగతా దేవతలకూ రకరకాల వాహనాలు ఉన్నాయి. దేవతలు ఏదో ఒక వాహనంలో తిరిగే వారన్నది స్పష్టమయింది..అంతెందుకు ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటునిచ్చే పుష్పక విమానమూ దేవతల దగ్గర ఉంది..
.
ఈ వాహనాలను, పుష్పక విమానాన్ని ఎగిరే పళ్లాలు అదే యుఎఫ్‌ఓలతో పోల్చుకోవచ్చా? కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే ఇదీ వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతర గ్రహాలకు చెందిన వాళు్ల మనకంటే చాలా చాలా తెలివైన వాళు్ల, శక్తిమంతులు కదా.. పైలోకాల్లో ఉన్న దేవతలు టెక్నికల్‌గా మన గ్రహానికి చెందిన వాళు్ల కాదు కాబట్టి వాళు్ల కూడా గ్రహాంతర వాసులే.. అందుకే వాళ్ల వాహనాలు యుఎఫ్‌లు అయ్యే అవకాశం ఉంది..
మన దగ్గరే కాదు.. బాల యేసుతో మేరీమాత ఉన్నట్లుగా వేసిన చిత్రపటాల్లోనూ ఎగిరే పళ్లాలు కనిపిస్తాయి. ఇంతెందుకు.. ఏసుక్రీస్తుకు సంబంధించిన ప్రతి చిత్రపటంలోనూ గాల్లో తేలే వింత వస్తువులు ఉంటాయి. క్రీస్తును శిలువ వేస్తున్న సందర్భంలో దేవతలు వచ్చింది ఫ్లయింగ్‌ సాసర్లలోనే అని మనం గమనించవచ్చు.
ఇప్పటి పరిశోధనలు గ్రహాంతర వాసుల ఉనికిని స్పష్టం చేస్తున్నాయి.. నాటి చిత్రపటాలు, శిల్పాలు, విగ్రహాలు దేవతల ఉనికిని చాటి చెప్తున్నాయి.. ఈ రెండింటి మధ్య లంకె ఏమిటి? ఆ నాటి దేవతలనే ఇప్పుడు గ్రహాంతర వాసులుగా, ఏలియన్‌‌సగా మనం భావిస్తున్నామా?
4
గ్రహాంతర వాసులను దేవతలుగా అనుకోవటానికి ఇంకా చాలా ఆధారాలే ఉన్నాయి.. పురాతన కాలానికి చెందిన చిత్రాలు, కథనాలు మనం వాళ్లతో చెలిమి చేసినట్లుగా కూడా చెప్తున్నాయి.. ఇది వాస్తవమేనా? అదే జరిగితే ఆ చెలిమి ఇప్పుడెందుకు లేదు.. వాళ్ల ఉనికి ఉన్నట్లు కూడా తెలియనంతగా ఆ స్నేహం ఎలా మాయమైంది?
రావణుడితో యుద్ధం చేస్తున్న రాముడు నేలపై నిలబడి ఉంటే, దేవతలు రథాన్ని పంపించారట..
ధృవుడు శరీరంతో సహా నక్షత్ర మండలానికి వెళ్లి దిక్సూచిగా మారాడు..

నక్షత్ర మండలంలో సప్తర్షి మండలం అపురూపమైంది..

దేవతలకు కష్టమొస్తే భరత మహారాజు పై లోకాలకు వెళ్లి వారికి సహాయం చేసి తిరిగి వచ్చాడట.. అతని పేరు మీదే మన దేశం ఏర్పడింది..

పై లోకాల్లో ఉన్న వారితో మనకు ఏదోరకంగా సంబంధాలు ఉన్నాయనే ఈ కథలు చెప్తాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు సహాయం చేసి ఉండవచ్చు. టెక్నాలజీలో మనకన్నా వాళు్ల ఎంతో ముందంజలో ఉంటారు కాబట్టి ఆ టెక్నాలజీతో మనకు మేలు చేసి ఉండవచ్చన్న ఊహకు బలం పెరుగుతుంది.

మన గుహల్లో గోడలపైనా, స్తంభాలపైనా కనిపించే మనలా లేని వింతరూపాలు ఎన్నో ఉన్నాయి..వాటిని చూసి ఉండటం వల్లనే చిత్రించటం సాధ్యమవుతుంది.. కేవలం ఊహా జనితంగా వింత రూపాల చిత్రీకరించారని గుడ్డిగా భావించలేం. ఏదో ఒక ఆకారాన్ని చూడటం వల్లనే ఆ బొమ్మలు చిత్రించి ఉండవచ్చు.

మరి గ్రహాంతర వాసులతో ఇంతగా స్నేహం భూలోకానికి ఉందన్న మాట వాస్తవమే అయితే ఇప్పుడెందుకు లేదు.. ఇప్పటి మనుషులకీ, అప్పటికీ ఉన్న తేడా ఏమిటి? గ్రహాంతర వాసులు ఈ లోకానికి దూరంగా ఎందుకు వెళ్లిపోయారు.. అన్న ప్రశ్నలకు జవాబులు అన్వేషించాల్సి ఉంటుంది.

దేవతలు మనకన్నా శక్తిమంతులనటానికి పురాణాలే ఆధారం.. వారే గ్రహాంతర వాసులైతే.. ఇంతకాలం బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయిన ఓ మహా రహస్యాన్ని ఛేదించేందుకు వీలవుతుంది.. పురాణాలనైనా, క్రిస్టియానిటీనైనా గుడ్డిగా కొట్టిపారేయకుండా వాటిలోని అంశాలను, ఇప్పుడు ఏలియన్‌‌సపై చేస్తున్న పరిశోధనల్లో తేలిన అంశాలతో పోల్చుకుని విశ్లేషిస్తే ఈ దిశగా గొప్ప విజయం సాధ్యమవుతుంది.
Categories: Middle

ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?

Sat, 07/03/2010 - 09:47
జీవితం మీద విసుగు... లోకం మీద ఆగ్రహం.. అంతా ఉండి ఎవరూ లేనితనం.. చీకటి తప్ప వెలుతురు కనపడని భవిష్యత్తు.. ఒకే ఒక్క క్షణం.. నిస్సహాయత ఆవరిస్తుంది... వ్యక్తిత్వాన్ని నిర్వీర్యం చేస్తుంది.. ఆలోచనలని చంపేస్తుంది.. బలవంతంగా లోకం నుంచి వెళ్లిపోవాలన్న నిర్ణయానికి ఉసికొల్పుతుంది.. ఆ క్షణం ఎంత భయంకరం?


చేతికొచ్చిన పంట వరదల పాలైన క్షణం... ముప్పిరిగొన్న అప్పులు.. రైతు మెడకు ఉరిగా మారింది...

ప్రియుడి వంచనను తట్టుకోలేక ప్రేయసి మనసు నిస్తేజమైపోయింది..

కార్పొరేట్‌ చదువుల ఒత్తిడిని భరించలేని పసి హృదయం వికలమైపోయింది.

ఆర్థిక బాధలు కుటుంబ పెద్దను పిల్లలకు దూరం చేశాయి.

చుట్టూ సమస్యలు.. కనిపించని పరిష్కారం.. సాయం చేయని చేతులు.. జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు.... భవిష్యత్తు ఏమిటో అంతుపట్టదు..ప్రపంచం అంత కుటుంబం ఉన్నా... ఒంటరితనం నీడలా వెంటాడుతుంది...నరాలు తెగిపోయేంత టెన్షన్‌... ఇక ఈ ప్రపంచంలో తనకేమీ మిగల్లేదు.. తాను బతికి ఉన్నా, లేకపోయినా ఒకటే... ఇక చావును ఆశ్రయించటమొక్కటే మార్గం... అదొక్కటే దారి.. చివరకు మిగిలేది ఈ చావే... చావే..

ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం. జీవితాన్ని నిలువునా దహించి వేసే క్షణం.. ఏం ఆలోచించినా చావే పరిష్కారంగా తోస్తుంది.. ఏ పని చేసినా నీరసం ఆవహిస్తుంది.. అనుక్షణం అదే ఆలోచన వెంటాడి వేధిస్తుంటుంది.. ఎవరితో ఏమీ చెప్పుకోలేని దారుణమైన నిశ్శబ్దం బలవన్మరణం వైపు లాక్కుపోతుంది...
ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం కోసం ఒకే ఒక్క క్షణం చాలు.. ఆ ఒక్క క్షణం ఆ ఒక్క ఆలోచన మెదడును పనిచేయకుండా అడ్డుకుంటుంది.. ముందుగా మెదడును చంపేస్తుంది.. ఆ తరువాత మనిషిని హతమారుస్తుంది...

మనిషిని శాశ్వతంగా మాయం చేసేది ఆ క్షణం.. ఆ ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చేందుకు తోడెవరూ ఉండరు.. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వ్యక్తి తనంత తానుగా ఒంటరితనంలోకి జారుకుంటాడు.. ఆ ఒంటరితనాన్నే నిరంతరం వెంటబెట్టుకుంటాడు.. నీడలా వెంటాడే ఆ ఒంటరితనం కొంత కాలానికి వ్యక్తిని పూర్తిగా కమ్మేస్తుంది.. చివరకు అదే డామినేట్‌ చేస్తుంది.. తన వెంటబెట్టుకుని కానరాని లోకాలకు తీసుకువెళ్తుంది..
-----2------
ఒక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చిన తరువాత మనిషి పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు.. ఎవరితోనూ మాట్లాడడు.. మనసులో చెలరేగుతున్న కల్లోలాన్ని ఏ ఒక్కరితోనూ పంచుకోడు.. చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి చనిపోవటానికి పూనుకునేంత వరకు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది.. మానసిక వేదన అంతుపట్టని తీరులో ఊహకందదు... చివరకు ఉరి వేసుకోవటమో.. పురుగు మందు తాగిన తరువాతో ఒక్కుదుటున మనసులో మార్పు కనిపిస్తుంది.. అప్పుడు బతకాలన్నా బతకలేని పరిస్థితి.. ఎవరూ వచ్చి కాపాడలేని దుస్థితి.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?
అదొక విచిత్రమైన పరిస్థితి... మానసికంగా కృంగిపోయిన మనిషి.. తనను తాను అంతం చేసుకుంటున్న దుస్థితి.. బలవన్మరణానికి పూనుకునేందుకు కొద్ది నిమిషాల ముందు మనిషి ఆలోచనలు చాలా ఆవేశంగా ఉంటాయి.. కూల్‌గా ఆలోచించే పరిస్థితి ఉండదు.. మెదడులోని అన్ని నరాలు ఎప్పుడు తెగిపోదామా అన్న స్థాయిలో కదిలిపోతుంటాయి.. బాధల్లోంచి కమ్ముకొచ్చిన డిప్రెషన్‌ కనీవినీ ఎరుగని దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది.. ఆ కొద్ది నిమిషాల్లో ఎన్నో ఆలోచనలు.. ఎంతో ఆవేదన.. ఎవరికీ ఏమీ చేయలేకపోయానన్న బాధ.. ఏమీ సాధించలేకపోయానన్న ఆందోళన.. అన్నీ కలిపి వ్యక్తిని చావు వైపు బలవంతంగా లాక్కుపోతుంది...

చనిపోదామని నిర్ణయించుకున్న తరువాత అందరికీ దూరంగా ఉండటం సహజంగానే జరుగుతుంది.. ఒంటరిగా, దూరంగా ఎవరికీ చెప్పకుండా బలవంతంగా మరణాన్ని కొని తెచ్చుకుంటారు.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?

మెడకు ఉరి బిగుసుకుంది.. ఇక చావు ఎంతో దూరంలో లేదు.. అయిదు సెకన్లో.. ఆరో సెకన్లో... లేక పది సెకన్లు మాత్రమే మిగిలి ఉంది...
పురుగుల మందు, లేక విషం గొంతులోకి దిగింది.. ఒక్కో బొట్టు నరనరాల్లోకి పాకుతోంది.. ముందుగా మెదడులోకి ప్రసరిస్తుంది... చావు దగ్గర పడింది.. ముఫ్ఫై సెకన్లో, నలభై సెకన్లో మిగిలి ఉంది.. శరీరం దృఢమైంది అయితే, రెండు మూడు నిమిషాల సమయం మిగులుతుంది..

యాభై నిద్రమాత్రలు శరీరంలోకి ఒకేసారి వెళ్లిపోయాయి... ఒక్కో మాత్ర రక్తంలో కరిగిపోతోంది.. శరీరంపైకి నిద్ర కమ్ముకుంటూ వస్తోంది.. క్రమంగా మగతలోకి జారుకుంటున్న పరిస్థితి.. అయిదారు నిమిషాల్లో అంతా అయిపోతుంది....

ఆ కొద్ది క్షణాల్లో.. కొన్ని నిమిషాల్లో బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఆలోచనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేస్తుంది.. తాను తొందరపడ్డానన్న భావన ఒంట్లో గగుర్పాటు కలిగిస్తుంది.. ఎన్నెన్ని ఆలోచనలు ఒక్కసారిగా కమ్ముకుంటూ వచ్చేస్తాయి.. తన కుటుంబం గుర్తుకు వస్తుంది.. బంధువులు గుర్తుకు వస్తారు.. మిత్రులు గుర్తుకువస్తారు..
ఎలా.. ఏం చేయాలి.. ఒకే ఒక్క క్షణంలో తాను బతకాలి.. బతికి తీరాలి...అన్న ఆలోచన వచ్చేస్తుంది.. కానీ, ఎవరు కాపాడగలరు? బతకాలన్నా బ్రతికేది ఎలా? తాను ఒంటరిగా ఉన్నాడు.. చుట్టూ ఎవరూ లేరు.. కొన్నే కొన్ని క్షణాలు.. వేగంగా గడిచిపోతుంటే శరీరం నిస్తేజమైపోతుంటే.. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండునన్న ఆలోచన కలచివేస్తూనే హృదయ స్పందన ఆగిపోతుంది..
ఎంత భయంకరమైన పరిస్థితి. శత్రువుకైనా రాకూడదనుకునే క్షణాలివి.. ఆ క్షణంలో బలవన్మరణానికి పూనుకోక ముందు ఒక్కరితో తన భావాలను ఒక్కసారి పంచుకున్నా, వ్యక్తిలో మార్పు వస్తుంది.. ఆ ఒక్క క్షణం కూల్‌గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు..?
--------3--------
అవును ఎందుకు అలోచించలేకపోతున్నారు..? చనిపోవాలనుకున్నప్పుడు క్షణికంగా నిర్ణయం తీసుకున్న వాళ్లు విషం లోపలికి దిగుతున్నప్పటి నుంచి ఏదో తప్పు చేశామన్న భావనలో కుమిలిపోవటం ప్రారంభిస్తారు.. అదృష్టవశాత్తూ బతికి బట్టకడితే అప్పుడు వాళ్ల మానసిక పరిస్థితిని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు.. ఇందుకు ఓ ఉదాహరణ చూడండి.. కడప జిల్లాలో రమేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు..అతని పరిస్థితి ఏమిటో చూడండి..

రమేశ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు రాస్తాడు...

అప్పులు.. ఆర్థిక బాధలు అతన్ని చిత్రహింసలకు గురి చేశాయి..

చావు తప్ప గత్యంతరం కనిపించలేదు..

ఆలోచనలు మరిచాడు..

విషం తీసుకున్నాడు

ఒంట్లో నరనరాల్లో మంట రేగినప్పుడు మొదలైంది పశ్చాత్తాపం..

భార్యాపిల్లల కోసమైనా బతకాలని, ఎవరైనా బతికించాలని కోరుకున్నాడు..

ఆ బాధ అతనికి తప్ప మరెవరికీ అర్థంకానిది..చెప్పటానికి కూడా శక్యం కానిది..

అదృష్టవశాత్తూ సమయానికి వైద్యం అందడంతో బతికాడు..
దగ్గరకు తెచ్చుకున్న చావును దూరం తరిమాడు..

ఇతను కేవలం ఒక ఉదాహరణ.. ఇలాంటి వారిలో బతికి బట్టకట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు ఉండే సమయం తక్కువ.. రక్షించే అవకాశాలు తక్కువ.. ఇలాంటి తక్కువ అవకాశాల్లో ప్రాణాలతో బయటపడిన వాళ్లు నిజంగా కోరుకునేది ఒక్కటే.. తనలాగా ఎవరికీ చావు రాకూడదని.. ఎవరూ తనలాగా బతికుండగానే నరకం అనుభవించరాదని...
------------4--------------
పురుగుల మందు తాగితే, విషం మింగితే, ఆ క్షణంలో ఏం జరుగుతుంది.. ఎలా ఉంటుంది.. పరిస్థితి తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చివరి నిమిషంలో ఎవరైనా గుర్తించి ఆసుపత్రికి తరలించి బతికించగలిగితే.. అప్పటికైతే బయటపడవచ్చు.. కానీ, ప్రాణాపాయం తప్పినట్లేనా? కాదు.. అపాయం నీడలా వెంటాడుతూనే ఉంటుంది.. స్లో పాయిజన్‌ మృత్యువును తోడు తీసుకుని కబళించేందుకు సిద్ధంగా ఉంటుంది..

గాఢమైన సాంద్రత కలిగిన రసాయనాలు కలిసిన పురుగుల మందులు, పేస్మాల్‌, హెయిర్‌ డై, ఇతర విష వస్తువులు తాగిన వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది. శరీరంలో నరనరానా ప్రసరిస్తున్నప్పుడు వెయ్యి తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. ఎందుకు మందు తాగానురా అని అనిపిస్తుంది.. భయమేస్తుంది. దీన్నుంచి ఎలా బయటపడాలా అని ఆరాటం మొదలవుతుంది..

ఆ క్షణాల్లో పరిస్థితి చెప్పనలవి కానిది.. ఆవేశంగానో, అనాలోచితంగానో చావాలనే నిర్ణయం తీసకున్న అజ్ఞానులు విషపూరిత రసాయనాలు సేవిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.. పురుగు మందుల కంటే హెయిర్‌డై చాలా డేంజర్‌, దాని కంటే పెస్మాల్‌ చావక ముందే నరకాన్ని చూపిస్తుంది.

ఈ విష రసాయనాలు సేవించిన వాళ్లకు మొట్టమొదట గొంతువాపు వస్తుంది.
తరువాత నాలుక పిడచకట్టుకుపోతుంది.
క్రమంగా గొంతులోపలికి దిగిపోతుంది..
రక్తకణాల్లోకి ప్రసరిస్తుంది..
గుండెకు, కిడ్నీలను వెంటనే ప్రభావితం చేస్తుంది.
ఇంకేం.. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారుతుంది..
వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే అంతే సంగతులు..ఆసుపత్రిలో ట్యూబ్‌ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తారు.. అయితే మోతాదుకు మించి పురుగుమందులు తాగినా, బలహీనమైన శరీరం ఉన్నా.. వైరస్‌ అటాక్‌ తప్పదు.
ఈ విష ప్రభావం వల్ల యూరిన్‌ రంగు మారుతుంది. తొందరగా చనిపోయే అవకాశం ఉంది.. విషం తీసుకున్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే బతికించేందుకు అవకాశాలు ఉండవచ్చు. వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేసి తాగిన విషాన్ని కక్కిస్తారు.. ప్రాణాలను దక్కిస్తారు..
కానీ, అలా బతికినంత మాత్రాన ఆ తరువాత అంతా సవ్యంగా సాగుతుందా? అంటే అదీ లేదు.. ఒకసారి విషం శరీరంలోకి వెళ్లిన తరువాత దాన్ని ఎంత వెలుపలికి తీసినా, చివరలో ఒక్క కణమైనా శరీరంలో ఉండిపోతుంది.. దాని ప్రభావం జీవించి ఉన్నంత కాలం వెంటాడుతూనే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో క్రమంగా విస్తరించి శరీరంలోని ఒక్కోభాగంపై ఎఫెక్ట్‌ చూపడం మొదలు పెడుతుంది.. చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.. బతికున్నన్నాళ్లూ నరకయాతన పడాల్సి వస్తుంది..
---------------5-------------
చావాలని ఒకే ఒక్క క్షణంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కొన్నే కొన్ని క్షణాల్లో అంతులేని నరకాన్ని చూపిస్తుంది. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని అంతం చేయటమే కాదు.. దానిపై ఆధారపడ్డ మరి కొన్ని జీవితాలకు అర్థమే లేకుండా చేస్తుంది.
చనిపోయే ఘడియల్లో అనుభవించే బాధ.. అంతకు ముందు ఆత్మహత్యకు పురికొల్పిన బాధల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది.. ఇంత తీవ్రమైన బాధను అనుభవించటం, జీవితాన్ని అర్ధాంతరంగా ముగించటం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి..
ఆత్మహత్య అన్న ఆలోచన ఎందుకు వస్తుంది?
నిర్హేతుకమైన సుఖాల కోసం ఆలోచించినప్పుడు..
బాధ్యతలు భారంగా మారినప్పుడు..
అవసరం వేరు.. సుఖం వేరు..బాధ్యత వేరు.. బరువు వేరు..
సమస్యలు లేకుండా.. కష్టాలు రాకుండా.. జీవితం గడవాలంటే సాధ్యం కాదు..
ఒక సమస్య పరిష్కారమైతే.. దాడి చేసేందుకు మరో సమస్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. వాటి నుంచి పారిపోవాలనుకోవటం వెర్రితనం తప్ప ఇంకోటి కాదు. ఇలా పారిపోవాలనుకున్నప్పుడే, విరక్తి పెరిగిపోతుంది..
మనకు ఉన్నది ఒకే ఒక్క జీవితం.. ఇంకో జన్మ ఉన్నదనో.. వస్తుందనో ఆలోచించటం.. విశ్వసించటం కంటే, ఉన్న జీవితంలోనే ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నించటం అవసరం.. ఇప్పుడు చావాలని అనుకునే వాళ్లు, అదే క్షణంలో ఎందుకు చావాలి అని ఒక్కసారి ఆలోచిస్తే.. జీవితం సమూలంగా మారిపోతుంది.. ఆ ఒక్క క్షణమే.. జీవితాన్ని ముగించటానికో, కొనసాగించటానికో కారణమవుతుంది.
ఒక్కసారి ఆలోచించండి.. జీవితం ఒకేఒక్కసారి వస్తుంది.. ఆ జీవితాన్ని పూర్తిగా యుటిలైజ్‌ చేసుకోవటం ముఖ్యం.. సుఖంగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు.. ఆ సుఖాన్ని సాధించటం కోసం ప్రయత్నించాలి.. పోరాడాలి కానీ, సుఖం దక్కలేదని లోకం నుంచే మాయమైపోతానంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు..చావు కోసం మనల్ని నిర్వీర్యం చేసే క్షణాన్ని మనమే పూర్తిగా డామినేట్‌ చేయాలి.. అర్థం లేని ఆత్మహత్యలను దూరంగా తరిమికొట్టాలి..
Categories: Middle

డెత్‌ డేట్‌

Sat, 06/19/2010 - 10:17
మరణం ఓ కామా అన్నాడు ఓ తెలుగు కవి.. మరణానికి కొద్దిసేపటికి ముందు.. మరణానికి తరువాత ఏం జరుగుతుంది? చనిపోయిన వాడు ఆత్మ అవుతాడా? స్వర్గానికి పోతాడా? నరకానికి పోతాడా? ఆత్మ అనేది ఉన్నదా? లేదా అన్న దానిపై అబ్బో బోలెడు డిస్కషన్సే జరిగాయి. చావు ఎలా వస్తుందన్న దానిపైనా ఎక్స్పరిమెంట్లు చేయని వాడు ప్రపంచంలో లేడు.. ఇక జ్యోతిష్యులు, కాలజ్ఞాన కర్తల గురించి చెప్పనే అక్కర్లేదు.. చావు గురించి కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడే వారు ఒకరైతే.. శాస్త్ర వాదాన్ని వినిపించేవారు మరొకరు.. వీళ్లలో చాలా మంది చనిపోయారు.. కానీ వీళ్లలో ఎంతమంది తాము ఏరోజు, ఏ క్షణానికి చచ్చిపోతామో ఆక్యురేట్‌గా కనుక్కోగలిగారా?
వాళ్లకా అవకాశం ఉందో లేదో కానీ, ఇప్పుడా అవకాశం అందరికీ లభించింది.. మీరెప్పుడు చచ్చిపోతారు? తెలుసుకోవాలని ఉందా.. అదెలా సాధ్యం? డేట్‌తో సహా ఎలా చెప్పగలరు?

మనిషిగానో, జంతువుగానో పుట్టిన తరువాత చావు రాకుండా పోదు.. ఒకరు ముందు.. మరొకరు వెనుక.. కానీ, సరిగ్గా ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎలా తెలుస్తుంది? కంగారేమీ వద్దు.. సెకన్లతో సహా డెత్‌ డేట్‌లను ప్రొవైడ్‌ చేసే వాళ్లున్నారు.. పైసా ఖర్చు లేకుండా మీరెప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు.. జ్యోతిష్యులకు కొన్ని వివరాలు అందించినట్లే... వీళ్లకూ మీ పర్సనల్‌ వివరాలు కొన్ని మాత్రం చెప్తే చాలు.. డెత్‌ డేట్‌ క్షణాల్లో మీ కళ్ల ముందు ప్రత్యక్ష మవుతుంది. ఎలాగంటారా? ఈ వెబ్‌సైట్‌ మీరే చూడండి..
ఇంటర్నెట్‌ ప్రపంచంలో చెప్పలేనన్ని హిట్లను అందుకుంటున్న ఒకానొక వెబ్‌సైట్‌ అందిస్తున్న ఫ్రీ సర్వీస్‌ ఇది... మతం, జ్యోతిష్యం పరంగానే కాక, అత్యంత శాస్త్రీయంగా కాలిక్యులేట్‌ చేసి మరీ డెత్‌ డేట్‌లను చెప్పేస్తున్నామంటోందీ వెబ్‌సైట్‌....
ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌...

మనుషుల భవిష్యత్తుకు లెక్కలు కడుతున్న వెబ్‌సైట్‌... మీరెన్నాళ్లు జీవిస్తారో ఇట్టే చెప్పేస్తుంది.. కాకపోతే అంతకు ముందు మిమ్మల్ని చక్కగా ఇంటర్వ్యూ చేస్తుంది.. మీ వ్యక్తిగత విషయాలు, అలవాట్లు అందులో మంచివీ, చెడ్డవీ, ఆరోగ్యాన్ని చెడగొట్టేవీ అన్నింటి గురించీ సవివరంగా కనుక్కుంటుంది.. చివరకు మీ వ్యక్తిత్వాన్నీ ప్రశ్నిస్తుంది..
ఓ ఉద్యోగానికి వెళ్తే అప్లికేషన్‌ ఫాం నింపినట్లే మీ డెత్‌ డేట్‌ తెలుసుకోవటానికీ అప్లికేషన్‌ ఫాం నింపాల్సిందే... అప్పుడే అది చెకచెకా లెక్కలు కట్టేసి.. బాల్చీ ఎప్పుడు తన్నేస్తారో చెప్పేస్తుంది....
జీవిత కాలానికి కొలమానం అంటూ ఏదీ లేదన్నది ఇంతవరకూ మనకు తెలిసిన నిజం.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ మాత్రం మనిషి ఆయుష్షును నిర్ణయించేస్తోంది. పోయేకాలం దగ్గర పడుతోందంటూ సెకన్లతో సహా డెత్‌క్లాక్‌ను కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూపిస్తోంది..
మనిషికి తన జీవితంలో ఏం కానుంది.. అని తెలుసుకోవటంపై ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. దాన్ని విశ్వసించటం విశ్వసించకపోవటం వేరే విషయం.. విశ్వసించకపోయినా.. తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఉంటుంది. అదిగో అలాంటి వారికోసమే ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ లాంటి సైట్లు వచ్చాయి...
చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.. చూస్తారు.. సరదాగా నవ్వుకుంటారు.. రెండు రోజుల తరువాత మరిచే పోతారు.. కొందరికి మాత్రం మనసులో ఎక్కడో గుబులు పుడుతుంది. అది ఆందోళనగా మారితే.. అది స్లోపాయిజన్‌గా మారుతుంది.. ఈ రకమైన ట్రెండ్‌ భవిష్యత్తులో ఆ వ్యక్తి జీవితంపైనే ప్రభావం చూపుతుంది..
మానసికంగా ఆందోళన చెందేవారి పరిస్థితి ఏమిటి? వీళ్లు చెప్తున్న లెక్కలు ఏ ప్రాతిపదికన చేశారన్నది వెబ్‌ నిర్వాహకులు ఎక్కడా వివరించటం లేదు.. ఏవేవో లెక్కల ప్రకారం డెత్‌డేట్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారా? లేక నిజంగా శాస్త్రీయత అన్నది ఏమైనా ఉన్నదా?

ఇన్ని రకాల వివరాలను తెలుసుకుని ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ వెబ్‌సైట్‌ చేసిన లెక్కలన్నీ తప్పులయ్యాయి... వీళ్లు చెప్తున్న డెత్‌ డేట్‌ అంతా ఒఠ్ఠిదేనని తేలిపోయింది.. ఎందుకంటే మనకందరికీ మనందరికీ బాగా, బహుబాగా తెలిసిన వాళ్ల వివరాలు ఇస్తే వారు చనిపోయిన తరువాత కూడా ఇంకా ఆయుష్షు ఉందని చూపిసున్నది. మైకెల్‌ జాక్సన్‌ ఇంకా ఇరవై ఏళ్లకు పైగా బతుకుతాడంది.. వైఎస్‌ఆర్‌ మరో పాతికేళ్లు ఉంటారని చెప్పింది.. రాజీవ్‌ గాంధీ ఇంకో పదహారేళ్లు జీవిస్తారని చెప్పింది... ఈ అంచనాలు.. గణాంకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు..
భవిష్యత్తు గురించి, అదృష్టం గురించి, జాతకాల గురించి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ప్రపంచంలో జాతకాల పిచ్చి కాస్త ఎక్కువే.. జ్యోతిష్యాన్ని శాస్త్రమనే వాళ్లు కొందరు.. కాదనే వారు కొందరు.. జ్యోతిష్యం చెప్పేవాళ్లు ఇన్నేళ్లు బతుకుతారంటూ లెక్కలు చెప్పేవారు కొల్లలు.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ మాదిరిగా క్షణాలతో సహా లెక్కలు కట్టి చెప్పిన వారు మాత్రం అరుదు.. లేరు..
మానసికంగా బలహీనుడికి నువ్వు ఫలానా అప్పుడు చనిపోతావని చెప్తే.. ఆ బాధతో అతను ఆ చెప్పిన రోజు దాకా కూడా బతకడు.. అదే ఆలోచనతో కుంగి కృశించిపోతాడు.. ఇలాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అనర్థాలకే దారి తీస్తాయి.
సిగరెట్లు తాగితే ఇన్ని రోజులు ఆయుష్షు తగ్గిపోతుందనీ, మద్యం సేవిస్తే మరి కొన్ని రోజులు వయసు తగ్గుతుందని లెక్కలు కట్టిన వాళ్లూ ఉన్నారు.. వాటికీ మంచి ప్రచారమే వచ్చింది. కానీ, తక్కువ సిగరెట్లు, మద్యం తాగిన వాళ్లు చిన్నవయసులో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.. డబ్బాలకు డబ్బాలు చైన్‌ స్మోకింగ్‌ చేసిన వాళ్లు..ఎనభై ఏళ్లూ బతికిన సందర్భాలూ చూశాం.. అసలు ఎలాంటి అలవాట్లు లేని వాళ్లు సైతం చిన్నవయసులో హఠాత్తుగా కన్నుమూసిన సన్నివేశాలూ ఉన్నాయి.. అలాంటప్పుడు ఈ వెబ్‌సైట్లు, జ్యోతిష శాస్త్రాలు కట్టే లెక్కలకు హేతుబద్ధత ఎలా కట్టబెట్టగలం..
మనిషి శరీర తత్త్వాన్ని బట్టి.. అతని ఆరోగ్య స్థితిని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి అతడి జీవిత కాలం ఆధారపడి ఉంటుంది.. అంతే కానీ, ఏవేవే లెక్కలు గట్టి.. పిచ్చి పిచ్చి సూత్రాలను చూపించి దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చచ్చిపోతావంటే అంతకంటే పెద్ద జోక్‌ ఇంకోటి ఉండదు.. ఇలాంటి వెబ్‌సైట్‌లను చూస్తే సరదాగా చూసి నవ్వుకోవాలి.. అంతే కానీ, సీరియస్‌గా తీసుకుంటే దాని వల్ల మానసిక ఆందోళన తప్ప ఒరిగేదేమీ ఉండదు... సో.. బీ హ్యాపీ.. అండ్‌ ఎంజాయ్‌ యువర్‌ లైఫ్‌... బి కాజ్‌ వుయ్‌ హావ్‌ ఓన్లీ వన్‌ లైఫ్‌... జస్ట్‌ ఎంజాయ్‌.. నథింగ్‌ ఎల్స్‌..
Categories: Middle

పర్సులో ప్లాస్టిక్‌ బాంబ్‌

Sat, 06/19/2010 - 09:49
ప్లాస్టిక్‌ బాంబ్‌.. మీ పర్సులోనే ఉంది.. మీతో పాటు.. మీ వెంటనే నీడలా వస్తోంది.. తేనె పూసిన కత్తి లాంటిది.. మీకు తెలియకుండానే మీ గొంతు కోసేందుకు సిద్ధంగా ఉంది. మీకది ఓ సౌకర్యంగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ఉపకరణంగా అగుపిస్తోంది.. మీ పాలిట అది ప్లాస్టిక్‌ మనీ.. కానీ, మీకే తెలియని ప్లాస్టిక్‌ బాంబ్‌....ఏమిటీ గోల..? ఎందుకింత భయపడాలి..? ప్లాస్టిక్‌ బాంబ్‌ అంటే ఏమిటి? అది జేబులో ఉండటం ఏమిటి? ఆశ్చర్యం వద్దు.. విస్మయం అంతకంటే వద్దు.. మీ పర్సులో ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులే బాంబు ఘంటికలు మోగిస్తున్నాయి.. మీకే తెలియని కాస్తంత నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారి తీస్తోంది..
క్రెడిట్‌ కార్డు.. ఇవాళ ఓ ఫ్యాషన్‌... ఓ స్టేటస్‌ సింబల్‌.. ఓ సరదా.. పర్సులో డబ్బులు పెట్టుకుని వెళ్లటం నామోషీ.. హోటల్లోనో, పబ్బుల్లోనో, షాపింగ్‌లోనో సెユ్టల్‌గా పర్స్‌ నుంచి కార్డు ఇచ్చి బిల్లు పే చేయటం స్టేటస్‌.. ఇవాళ్టి కల్చరే అది.. నోట్ల కట్టలు జేబులో పెట్టుకుని తిరగటం కంటే సింపుల్‌గా ఓ కార్డు పట్టుకుని వెళ్లటం సుఖం...
కార్డు ఉండటం అవసరమే కావచ్చు. ఇవాళ అది సహజమై ఉండవచ్చు. కానీ, కార్డు ఉంటే మీ డబ్బు సేఫ్‌గా ఉన్నట్లేనా? జస్ట్‌ థింక్‌ ఎబౌట్‌ ఇట్‌.. ఇంట్లో కంటే బ్యాంకులో డబ్బులు దాచుకోవటం ఒకప్పుడు చాలా సురక్షితం.. ఇప్పుడు కూడా అంతేనా? బ్యాంకులో సొమ్ములు ఎంత భద్రంగా ఉంటున్నాయి..?
లేదు.. మీ సొమ్ముల కోసం ఎవరో కాచుకుని ఉన్నారు.. ఎల్లవేళలా డబ్బులు అందుబాటులో ఉంచే సౌకర్యం కల్పించటం కోసం మీ సొమ్ముల్ని తమ దగ్గరుంచుకుని, వాటికి బదులుగా మీ జేబులోకి బదిలీ చేసిన ప్లాస్టిక్‌ మనీ.. అదే. బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఇప్పుడు మీ ఆర్థిక నిర్వహణతో చెలగాటమాడుతున్నాయి..మీకు తెలియకుండానే మీ కార్డు మీ చెంతనే ఉంటుంది.. మీకు తెలియకుండా దాని డేటా మరొకరి చేతిలోకీ వెళ్తుంది..
అదెలా సాధ్యం? కార్డు జేబులోనే ఉంది.. సీక్రెట్‌ పిన్‌ నెంబర్‌ ఉంది.. వెనుక మూడు నెంబర్ల సీక్రెట్‌ కోడ్‌ కూడా ఉంది.. గ్రిడ్‌ ఉంది.. ఇన్ని రకాల చెక్‌ అవుట్‌ ఉండి కూడా కార్డును చోరీ అదే డేటాను చోరీ చేయటం ఎలా వీలవుతుంది? ఈజిట్‌ పాజిబుల్‌.. ఎస్‌..ఇటీజ్‌ పాజిబుల్‌..
కార్డులోని డేటాను చోరీ చేయటం ఏ విధంగా కుదురుతుంది.. ఒకవేళ నెంబర్‌ చోరీ అయినా, పిన్‌ నెంబర్‌ ఉంటుంది కదా.. కానీ, అదే పొరపాటు.. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం డెవలప్‌ అయితే.. దొంగలకు దొంగతనాలు చేయటం అంత ఈజీ అవుతుంది.. టెక్నాలజీ అనేది వాళ్లు ఉపయోగించినంతగా ఎవరూ ఉపయోగించుకోలేరు..
మీ క్రెడిట్‌ కార్డులు క్లోనింగ్‌ అవుతున్నాయి. మీ చేతులతో మీరు స్వయంగా ఇచ్చిన కార్డులతోనే దర్జాగా క్లోనింగ్‌ ప్రక్రియ సాగిపోతోంది.. ఇప్పటిదాకా ఎక్కడో అమెరికాకే పరిమితమైన ఈ క్లోనింగ్‌ టెక్నాలజీ ఇప్పుడు మన దేశాన్ని కుదిపేస్తోంది...
పెద్ద ఫ్యాక్టరీ, భారీ యంత్రసామాగ్రి దగ్గరకు మన క్రెడిట్‌ కార్డు ఎలా వెళ్లింది.. ? అదే విచిత్రం.. మీ కార్డును అదే.... నమూనాను మీరే అందించారు.. ఎలాగంటారా? సింపుల్‌.. మీరు హోటల్‌కు వెళ్లినప్పుడు, పబ్‌కు వెళ్లినప్పుడు బిల్‌ పే చేసేందుకు బేరర్‌కు కార్డు ఇస్తారే.. అదిగో అక్కడే ట్విస్ట్‌ ఉంది.. మీ కార్డు బిల్లు కోసమే కాదు.. మరో దానికోసమూ స్వాప్‌ అయిపోతుంది.. స్కిమ్మర్‌ మీ కార్డులోని డేటాను ఒకే ఒక్క సెకన్‌లో కొట్టేస్తుంది.
చేతిలో పట్టే చిన్న మిషన్‌.. అరచేతిలో పట్టుకుంటే కనీసం కనిపించనైనా కనిపించని యంత్రం.. మోసం చేయాలనుకునే వారు ఎవరైనా సరే శరీరంలో ఎక్కడైనా దాచుకోవచ్చు. ఎదుటి వాళ్ల నుంచి ఒక్క క్షణం కార్డు చేతిలోకి వస్తే.. మరుక్షణంలో స్వాప్‌ చేసేయవచ్చు.. అంతే సంగతులు.. మీ కార్డు క్లోనింగ్‌ అయిపోయినట్లే..స్వాప్‌ చేసిన స్కిమ్మర్‌ నుంచి కార్డులోని డేటాను ఎంత సింపుల్‌గా క్లోన్‌ చేయవచ్చో చూడండి..

బయట షాపింగ్‌లోనో, హోటళ్లలోనో, ఇతర పబ్బుల్లోనో క్రెడిట్‌ కార్డులను స్వాప్‌ చేస్తే అవి క్లోనింగ్‌ అవుతాయి... ఇంతటితో అయిపోయిందా? లేదు... మీ కార్డు చోరీ కావటానికి సవాలక్ష అవకాశాలు పొంచి ఉన్నాయి..
అవసరానికి డబ్బులు డ్రా చేయటానికి ఇప్పుడు ఎటిఎం చాలా కీలకమైన సౌకర్యం... కానీ, ఇప్పుడు అదే ఏటిఎం మన కొంపలార్చటానికి సిద్ధంగా ఉంది.. డబ్బులు డ్రా చేసుకోవటానికి ఎటిఎం సెంటర్‌కు వెళ్లితే అక్కడా ప్రమాదం రెడీగా ఉంటుంది.. ఏటిఎంలో మీ కార్డు యాక్సెస్‌ చేసే ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా దొంగ చిన్ని బాక్స్‌ను ఫిక్స్‌ చేసేయవచ్చు. ఓ గంట తరువాత తీరిగ్గా వచ్చి దాన్ని తీసుకుని వెళ్లిపోవచ్చు. కార్డ్‌ యాక్సెస్‌ ప్రాంతంలో మరో బాక్స్‌ ఉన్న సంగతి కూడా గుర్తించటం వీలు కాదు..

అంతే కాదు.. బ్రోచర్స్‌ బాక్స్‌లో సీక్రెట్‌ కెమెరాను ఉంచి దాని ద్వారానూ డేటాను సంపాదించేయవచ్చు..

ఒకటా, రెండా.. మీ కార్డు మీదగ్గరే ఉంచి డేటా దొంగిలించటానికి ఎన్ని అవకాశాలో... ఈ టెక్నాలజీని నిర్వీర్యం చేయటం పోలీసులకు సవాలుగా మారింది.. వీటి నుంచి తప్పించుకోవాలంటే కార్డు విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం తప్ప ప్రత్యామ్నాయం లేదు..

టెక్నాలజీ అంటారు.. ప్రపంచం ఓ కుగ్రామం అంటారు.. క్షణాల్లో కమ్యునికేషన్‌ చేర్చవచ్చంటారు.. కానీ, దేనికీ భద్రత లేదు.. ఎక్కడా ప్రెユవసీ లేదు..మరి టెక్నాలజీ వల్ల ఎవరికి ప్రయోజనం?
కార్డులు కొంప ముంచుతున్నాయి. ఫోన్లు ప్రెユవసీని కాజేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోకి వెళ్దామంటే ఫిషింగ్‌ సిస్టమ్‌ వచ్చేసింది.. బ్యాంకుల వెబ్‌సైట్లను కూడా క్లోన్‌ చేసే వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. మన బ్యాంకు వెబ్‌సైట్‌లాగే ఉంటుంది.. కానీ, సదరు బ్యాంకు సైట్‌ కాదు.. అక్కడ ఐడి, పాస్‌వర్డ్‌ కొట్టారో ఇక అంతే..
అందుకే ముందు జాగ్రత్త పడటం చాలా మంచిదని సైబర్‌ క్రెユం పోలీసులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
షాపులలో, హోటళ్లలో, పబ్‌లలో బిల్‌ పే చేసేందుకు కార్డులను ఎవరికీ ఇవ్వవద్దు.. మీ కళ్ల ముందే కార్డును స్వైప్‌ చేయించండి.. సంతకం చేయండి.. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కస్టమర్‌కేర్‌ను సంప్రతించండి..

ఏటిఎంలో డబ్బులు డ్రా చేసే ముందు అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా అని పరికించండి.. ఏటిఎం కీపాడ్‌కు చుట్టుపక్కల వస్తువులను జాగ్రత్తగా చూసి డ్రా చేయండి..

కాల్‌సెంటర్ల నుంచి అపరిచిత కాల్స్‌ను అటెండ్‌ చేయవద్దు.. వాళ్లు లోతుగా మీ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు.

మొబైల్‌ఫోన్‌లను ఎవరికీ ఇవ్వకండి.. బ్లూటూత్‌ ఆప్షన్‌ను అవసరమైనప్పుడు తప్ప ఆన్‌ చేయకండి.. అపరిచితులకు బ్లూటూత్‌ ద్వారా ప్రవేశించేందుకు అనుమతించవద్దు

ఆన్‌లైన్‌ లావాదేవీలను సైబర్‌ కేఫ్‌ల నుంచి చేయవద్దు .. కీలాగర్లు మీ సొమ్మును హారతికర్పూరం చేస్తాయి.

సెక్యూరిటీ ప్రమాదం లేదని ధృవీకరించుకున్నాకే ఆన్‌లైన్‌ లావాదేవీలకు పూనుకోండి..

జాగ్రత్త,, తస్మాత్‌ జాగ్రత్త.. మీకు కావలసింది అప్రమత్తత.. ఆందోళన వద్దు.. భయం వద్దు.. కించిత్‌ ఆలోచించండి.. ఇంకొంచెం జాగ్రత్త పడండి.. మీ సొమ్ముల్ని కాపాడుకోండి.
Categories: Middle

ఆంజనేయుడి పెళ్లి

Sat, 06/12/2010 - 14:34
ఆంజనేయుడు... బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం.. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి.. బ్రహ్మచారులకు ఆదర్శం హనుమంతుడు.. పెళ్లంటే మొహం మొత్తిన వారికి మంచి మిత్రుడు హనుమాన్‌.. అలియాస్‌ అంజి..కానీ, వీళ్లంతా అనుకుంటున్నట్లు హనుమంతుడు నిజంగా బ్రహ్మచారేనా? ఆయన పెళ్లి చేసుకోలేదా? ఒక వేళ చేసుకున్నట్లయితే.. ఆయన బ్రహ్మచారి కాడని తెలిస్తే.. ఈ బ్రహ్మచారుల గుండెలు పగిలిపోవూ.. హనుమంతుడు కఠిన నియమానికి, కఠోర బ్రహ్మచర్యానికి సింబల్‌. మరణమే లేని వరం పొందిన నవమబ్రహ్మ.. ప్రతి ఊరికీ ఆయన క్షేత్ర పాలకుడు.. అంటే కాపాడే వాడు. అలాంటి అంజి పెళ్లెప్పుడు చేసుకున్నాడు? బహ్మచర్యానికి ఆదర్శపురుషుడైన తానే బ్రహ్మచర్యానికి తిలోదకాలిస్తే.. పాపం ఆయన ఫోటో పెట్టుకుని ఘోటక బ్రహ్మచర్యం చేస్తున్న వారి గతేం కావాలి?

రామభక్త హనుమాన్‌ గురించి ఒకరికి ఒకరు చెప్పేదేముంది? పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా హనుమంతుడంటే ఒక విశ్వాసం.. ఆంజనేయుడి ఫోటో పక్కన ఉంటే పసివాళ్లకు ధైర్యం.. పవనసుతుణ్ణి తలుచుకుంటే పెద్దలకు బలం.. అంజిని అర్చిస్తే యువతకు బుద్ధి.. ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికి అని కాకుండా అన్నింటికీ అతీతంగా, అందరికీ ఆప్యాయంగా ఉండే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అదే ఆంజనేయుడు..
ప్రతి ఊరి ప్రారంభంలో హనుమంతుడి విగ్రహం ఉందంటే ఆ ఊరు ఆయన సంరక్షణలో ఉందని అర్థం. కాలనీ కొత్తగా వెలసిందంటే ముందుగా ఏర్పడేది హనుమంతుడి ఆలయమే..ఆ ఊరికి ఆయనే క్షేత్రపాలకుడు.. ఆ కాలనీకీ ఆయనే పాలకుడు. ఆ తరువాతే ఏదైనా.. ఇంతగా ప్రజల్లో పాపులారిటీ ఉన్న గాడ్‌ ఆంజనేయుడు..
మామూలుగా హనుమంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మొదటగా చెప్పేది ఆయన బ్రహ్మచర్యం గురించే..కానీ ఇప్పుడా బ్రహ్మచర్యానికే ముప్పు వచ్చిపడింది.. భావి బ్రహ్మ అయిన ఆంజనేయుడి బ్రహ్మచర్య దీక్షను సువర్చలా దేవి అనే సూర్యుని కుమార్తె భగ్నం చేసిందిట..
అంతటి కఠోర దీక్షలో ఉన్న హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం చేసుకోవటం నిజమేనా అన్న ఆశ్చర్యం కలగకపోదు.. నిజానికి ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా మనకు కనిపించే రామాయణంలో ఈ పెళ్లి తంతు లేదు.. మరి ఆ రామాయణాన్ని రాసిన వాల్మీకికి హనుమంతుడికి పెళ్లయిన సంగతి తెలుసో లేదో తెలియదు కానీ, అందులో పవన సుతుడి పాత్ర అంతా రాముడికి సేవ చేయటంతోనే సరిపోయింది..
రామాయణంలో తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించిన మన ఆంజనేయుడికి పరాశర సంహిత వంటి కొన్ని పురాణాలు హనుమంతుడిపై ప్రేమ పడి పెళ్లి చేసేశాయి. అలా పెళ్లి చేస్తే వచ్చిన భార్యే సువర్చలా దేవి.. ది డాటర్‌ ఆఫ్‌ గాడ్‌ సన్‌..
సువర్చలాదేవి.. సూర్యుని కూతురు..ఆమెను ఆంజనేయుడు పెళ్లి చేసుకున్నాడట.. హనుమజ్జయంతి రోజునే ఆయన పెళ్లి వేడుకలనూ దేశంలోని అనేక ఆలయాల్లో జరపటం ఆనవాయితీగా కూడా మారిపోయింది...
హనుమంతుడు పసివాడిగా ఉన్నప్పుడే సూర్యుణ్ణి పండుగా భావించి ఎగిరి అందుకోబోయాడట.. అలా సూర్యుణ్ణి చేరిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలనూ అభ్యసించాడు.. విద్యలన్నీ పూర్తయిన తరువాత సూర్యుడు హనుమంతుడిని కోరిక కోరాడట.. తన కుమార్తె సువర్చలా దేవిని వివాహం చేసుకోవాలన్నది ఆ కోరికట..
గురువుగారి కోరిక విని హనుమంతుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తానేమో ఘోటక బ్రహ్మచారి.. తానెలా పెళ్లి చేసుకోవటం.. అదే గురువుగారికి చెప్పుకున్నాడు.. కానీ, సూర్యభగవానుడు ఒత్తిడి చేయటంతో సంసార బాధ్యతలతో నిమిత్తం లేకుండా నామమాత్రంగా వివాహం చేసుకునేందుకు ఆంజనేయస్వామి అంగీకరించాడట.. అలా సువర్చలాదేవితో హనుమంతుడికి వివాహం అయిందని పురాణాల్లో చెప్పారు..
శ్రీరామ నవమినాడు సీతారామ కల్యాణాన్ని ఎలాగైతే జరుపుకుంటామో.. అలాగే హనుమత్‌ జయంతి రోజున సువర్చలాంజనేయుల వివాహాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు..
అయినా చాలామందిలో మాత్రం హనుమంతుడికి వివాహం చేయటం అనేది వింతగా కనిపిస్తోంది.. మరి కొందరిలో ఆగ్రహాన్నీ తెప్పిస్తోంది. ఏవో పురాణాల్లో ఏవేవో కథలు ఉన్నాయని చూపించి బ్రహ్మచర్యానికి ఆదర్శపురుషుడైన ఆంజనేయుడికి వివాహం చేయటం సబబు కాదని ఇంకొందరి వాదన...
పెళ్లిళు్ల చేసే వారికి మాత్రం ఇవేవీ అవసరం లేదు.. తమ స్వామి వారు బ్రహ్మచారి కానే కాదన్నది వారి బలమైన విశ్వాసం.. అదే వారికి నిజం..
హనుమంతుడి వివాహంపై చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన పెళ్లి కథ ఒకటైతే... సంతానం కథ ఇంకోటి.. ఆ సంతానంతో ఫైట్‌ చేసిన కథ మరోటి.. ప్రతి కథా తెగ ఇంటరెస్‌‌ట కలిగిస్తుంది.. ఒక్కో పురాణం ఒక్కో సందర్భంలో ఒక్కో కథనాన్ని వినిపిస్తుంది.. ఆ కథనాలు ప్రజల్లోకి ప్రచారంలోకి వచ్చేసరికి అబ్బో బోలెడు రూపాంతరాలు చెందుతాయి.
పరాశర సంహిత చెప్పిన కథనం ప్రకారం సూర్యుడి కోరికతో సువర్చలా దేవిని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడు.. ఆమెను వివాహం చేసుకున్నా.. ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టలేదట... అందుకే ఆయనకు వివాహం చేయటమూ తప్పుకాదు.. ఆయన పేరుతో బ్రహ్మచర్య దీక్షలు చేపట్టడమూ తప్పు కాదంటారు ఆధ్యాత్మిక వేత్తలు.
లంకానగరంలో సీతాదేవిని అన్వేషించటానికి హనుమంతుడు వెళ్లినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పంటించాడు.. ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు.. ఆ తరువాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్గిని ఆర్చుకుని తిరిగి వెళు్తన్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగిందిట.. తద్వారా ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది.. ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు..
ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై, మైరావణుడి ప్రాణాలకు కాపలా ఉన్నాడట.. మైరావణుడి ప్రాణాలను హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందిట.. యుద్ధం తరువాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్లాడట ఆంజనేయుడు..
హనుమంతుడి గురించి ఇలా ఎన్ని కథనాలైనా ప్రచారంలో ఉండి ఉండవచ్చు. కానీ, ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంతమాత్రం కనిపించదు.. హనుమత్‌ దీక్షలు స్వీకరించేవారు కొల్లలుగా ఉన్నారు.. ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగానే విశ్వసించేవారు ఎక్కువమంది ఉన్నారు.
హనుమంతుడి వివాహం అన్నది ఇప్పుడు దేశమంతటా చర్చగా మారింది.. ఆయన బ్రహ్మచర్య దీక్షకు మచ్చ పడే ప్రమాదం ఏర్పడింది.. తన భక్తుల్లో చెలరేగిన ఈ వివాదాన్ని చూసి బహుశా ఆంజనేయుడు కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు.. ఏమైనా దేవీ దేవుళ్ల విషయంలో ఇలాంటి కథలు ఎందుకు పుడతాయి? ఎలా పుడతాయి?
మన దేశంలో దేవుళ్లకు సంబంధించిన కథలు ఊరికే పుట్టవు.. ఒకే దేవుడికి సంబంధించి రకరకాల కథనాలు ఉంటాయి.. అసలు ఒక్కో దేవుడికి ఒక్కో ఆకారాన్ని కల్పించటం కూడా మన దగ్గర వింతే... ఎందుకంటే మన దేశంలో దేవతలకు సంబంధించిన అంశాల్ని డిస్కస్‌ చేసే పురాణాలు కానీ, ఇతర ఇతిహాసాల్లో కానీ ఒక సీక్రసీ తప్పనిసరిగా ఉంటుంది.. అంటే పైకి కనిపించే కథ వేరు...దాని వెనుక ఇండైరెక్‌‌టగా ఉండే ఉద్దేశ్యం వేరు...
ఈ డైరెక్టు, ఇండైరెక్టు ఏమిటని బురల్రు బద్దలు కొట్టుకోనవసరం లేదు.. చాలా సింపుల్‌లాజిక్‌... రామాయణం కథ కాసేపు పక్కన పెడదాం... ఇక హనుమంతుడికి కోతి రూపమే ఎందుకు ఉండాలి? జస్‌‌ట మీలో మీరు ప్రశ్నించుకోండి... మీకే జవాబు దొరికిపోతుంది..
పాయింట్‌ నెం.1
కోతి మనిషికి పూర్వరూపం అని అంటారు..
పాయింట్‌ నెం.2
కోతి అత్యంత చంచల స్వభావం కలిగింది.
పాయింట్‌ నెం.3
కోతి మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు..
పాయింట్‌ నెం.4
మనిషి మనసు కూడా ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది
పాయింట్‌ నెం. 5
ఇలాంటి చంచల స్వభావం కలిగిన వాళ్ల మనసులను స్థిరంగా ఉంచటం ఎలా?
పాయంట్‌ నెం.6
మెడిటేషన్‌ ఒక్కటే మార్గం..
పాయింట్‌ నెం.7
దాన్నే భక్తి అంటారు.
భక్తి అనేది ఒక కోతిని భగవంతునిగా మార్చింది.. చంచలమైన మనసు కలిగిన మనిషిని స్థిరచిత్తంతో ఉంచే లక్ష్యానికి ప్రతిరూపమే హనుమంతుడు. ఇవాళ ప్రపంచం అంతా మెడిటేషన్‌ చుట్టూ తిరుగుతోంది... మన అంజి, అదే ఆంజనేయుడు దీన్ని ఆనాడే చేసి చూపించాడు.. అంతే కాదు.. మానవుడైన రాముడికి సేవ చేయటం ద్వారా మనిషికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని రుజువు చేసిన వాడు హనుమంతుడు..
ఇక సువర్చలా దేవితో వివాహం సంగతి... దీని వెనుక కూడా లాజిక్‌ లేకపోలేదు..
ప్రపంచంలో విద్యలన్నింటికీ సింబల్‌ వెలుగు.. వర్చస్సు అన్నా వెలుగే..
సు.... వర్చస్సు అంటే మంచి వెలుగు అని అర్థం.. ప్రపంచంలోని ఉన్నతమైన, ఉత్తమమైన విద్యలన్నింటినీ హనుమంతుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సూర్యుడి నుంచి పుట్టిన వెలుగే ఈ విద్యలు.. ఆ వెలుగే సువర్చల.. ఆ సువర్చలనే హనుమంతుడికి సూర్యుడు అందించాడు.. సువర్చలా వివాహం అనేది సామాన్యులకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పింది.. దాని మూట విప్పితేనే కదా.. మర్మమేమిటో తెలిసేది.. దీని గురించి వితండ వాదాలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.. మన దేవతల గురించి ఆలోచించేప్పుడు వారి వెనుక పెద్దలు చెప్పిన సైంటిఫిక్‌ లాజిక్‌ ఏముందో ఒక్కసారి ఆలోచించటం అవసరం.
Categories: Middle

వీరభద్రుడి ప్రతిరూపాలు అఘోరాలు

Sat, 06/12/2010 - 14:24
స్మశానమే నివాసం..కపాలమే పాత్ర..
బూడిదే అలంకారం..ఆచ్చాదన లేదు..ఆహార్యం లేదు..
శవ పూజలు.. మాంస భక్షణలు..
మానవ మాత్రుడికి సాధ్యం కాని..కఠోర సాధన...అఘోరా....

అతడు స్మశానంలో ఒక పొడువాటి కరన్రు పట్టుకుని తిరుగుతున్నాడు...
ఒంటిమీద నూలుపోగైనా లేదు...
చితి మంటల మీది భస్మాన్ని ఒంటినిండా పూసుకున్నాడు..
జుట్టు జడలు కట్టి చెట్టు ఊడల్లా కిందకు వేలాడుతున్నాయి...
జడలు ముఖంపై పడుతున్నా పట్టించుకునే స్థితిలో లేడు..
చూడగానే జుగుప్స కలిగించే వేషం...
తాను ఎలా ఉన్నదీ అతనికి అవసరం లేదు..
లోకం తనను చూసి అసహ్యించుకుంటోందన్న జ్ఞానమూ అతనికి లేదు.
అన్నింటికీ మించి అతను తింటున్న తిండిని చూస్తే.. ఒళ్లంతా వేయి తేళు్ల పాకినంత గగుర్పాటు కలుగుతుంది..
అతను తినేది శవమాంసం... మన కలలో కూడా కనీవినీ ఎరుగనిది.. పవిత్ర గంగా నదిలో కొట్టుకుని వచ్చిన శవాన్నే పార్‌‌టలు పార్‌‌టలుగా నరికేసి ఈజీగా తినేస్తాడు... ఆ తిండిని చూస్తే ఒక్కసారిగా భయం వేస్తుంది.. మనసు కలవరపడిపోతుంది.. భూకంపం వచ్చి కాళ్ల కింద నేల కదిలిపోతున్నదా అన్నంత వేదన కలుగుతుంది.. మనం ఉన్నది భూమ్మీదేనా? ఈ ప్రపంచంలోనేనా? ఐటి విప్లవంతో కుగ్రామంగా మారిన ప్రపంచమేనా ఇది..? సినిమాల్లో హీరోయిజం ప్రదర్శించటానికి ఇలాంటి కేరెక్టర్లను చూశాం...

ఇప్పుడు ఈ సమాజంలో.. ఈ దేశంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం సాధ్యమేనా? మనం చూస్తున్న ఈ విజువల్‌‌స నిజమైనవేనా? లేక గ్రాఫిక్‌‌స మాయా జాలమా? ఏ విధంగానూ నమ్మశక్యం కాని ఈ భీకర జీవులు ఎవరు? పిచ్చివాళ్లా? రాక్షసులా? మానవాతీత శక్తులు కలిగిన జీవాత్మలా?
ఎవరు వీరు? ఏమిటీ విపరీతం? జంతువులు ఇలా వ్యవహరిస్తున్నాయంటే నమ్మవచ్చు. కానీ, మనిషిగా పుట్టిన ఒక వ్యక్తి ఇంత నిర్లజ్జగా, అతి కిరాతకమైన జీవితాన్ని జీవించటం సాధమేనా? వ్యక్తులు ఈ విధంగా ఎలా తయారవుతారు? వీళు్ల ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగా ఆ స్మశానంలో వీరికి ఏం పని?
2
పవిత్ర గంగానదీ తీరం.. ఎక్కడో హిమాలయాల్లో పుట్టి, అత్యంత పవిత్ర జలాలతో భూమిని పునీతం చేస్తున్న పవిత్ర నది.. ఈ నదీ జలాల్లో శక్తిమంతమైన ఔషధ శక్తి గుణాలు ఉంటాయి. గంగానదిని ఈ దేశం అంతా పవిత్రనదిగా చూస్తారు.. దైవ నదిగా భావిస్తారు.. ఇందులో పవిత్ర స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు.. కుంభమేళా వచ్చిందంటే సరేసరి...
ఇంతటి పవిత్ర నదీతీరంలో అన్నపూర్ణా విశ్వేశ్వరులు స్వయంగా వెలిసిన క్షేత్రం వారణాసి.. ఇదే కాశీ.. కడుపునిండా అన్నంపెట్టి సుదీర్ఘమైన జీవితాన్ని ఇచ్చే అమ్మ అన్నపూర్ణ అయితే.. కాలం తీరిపోగానే తన సాన్నిధ్యంలోకి తీసుకుని వెళ్లే లయకారుడు విశ్వేశ్వరుడు..
మన దేశంలో కొందరు వృద్ధాప్యం వచ్చేసిందంటే.. కాశీకి వచ్చి స్థిరపడిపోతారు.. ఎందుకో తెలుసా? కాశీ నేలపై తమ ప్రాణాలు విడిచిపెట్టాలన్న కోరికతో వాళు్ల ఇక్కడికి వస్తారు...
కాశీ అంటే ఈ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇంత గొప్ప ఆధ్యాత్మిక విశ్వాసం ఉన్నది..
అంతే కాదు.. వెనకట హరిశ్చంద్రుడు కాటికాపరిగా కాపలా కాసిన మణికర్ణిక అనే స్మశాన వాటిక ఈ కాశీలోనే, ఈ పవిత్రమైన గంగా నదీ తీరంలోనే ఉంది..
కాశీలో చనిపోయి, మణికర్ణిక స్మశానంలో దహన క్రియలు చేయించుకుంటే మోక్షం సిద్ధించేస్తుందని చాలా మంది నము్మతారు.. ఎంతగా నము్మతారంటే.. ఇవాళ ఆ స్మశాన వాటికకు వెళ్తే.. చితి పేర్చేందుకు స్థలమే దొరకదు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చితి 80శాతం కాలిపోగానే.. అక్కడే మరో చితి పేర్చాల్సిన పరిస్థితి ఉంటుంది..
అడపాదడపా స్మశానవాటికను ఆనుకుని ఉన్న నదీజలాల్లో కూడా శవాలు కొట్టుకుని వస్తుంటాయి కూడా...
ఇదిగో ఈ స్మశాన వాటికలోనే ఆ మానవులు సంచరిస్తున్నారు..ఈ శవాల మధ్యనే, ఈ చితిమంటలను కాచుకుంటూనే, భయంకరంగా జీవిస్తున్నారు.. ఎందుకు? వాళు్ల చేస్తున్న పూజలు ఏమిటి? సామాన్యులకు అంతుపట్టని రీతిలో వీళు్ల చేసే పూజలు ఎవరి కోసం?
3
వీళ్లిలా సంచరించటానికి, ఇలా జీవించటానికి కారణం ఉంది.. అపర వీరభద్రుల్లా భయం కొల్పిస్తున్న వీళ్లే అఘోరాలు.. అత్యంత కఠోరమైన రుద్రోపాసనను సాధిస్తున్న వాళు్ల.. అయితే ఈశ్వరుని పూజించటానికి, కఠినమైన సాధన అవసరమా? చండాలుడిలా వ్యవహరించటాన్ని సాధన అని కూడా అంటారా? ఎవరీ అఘోరాలు..
మన దేశంలో సాధు సంతులకు లోటు లేదు.. సన్యాసం స్వీకరించి గురుతత్తా్వన్ని, ధర్మాన్ని బోధించే పీఠాధిపతులనయితే మనం రోజూ చూస్తూనే ఉంటాం... కానీ, అసలు లోకంతో, మనుషులతో సంబంధం లేకుండా మామూలుగా మనకు కనిపించరు..ఎక్కడో హిమాలయాల్లోనో, మరెక్కడో ఉండిపోతారు.. జీవనదుల్లో కుంభమేళాలు జరిగే సందర్భంలోనే వారు ఒక్కసారిగా ముందుకు వస్తారు.. పవిత్ర నదీస్నానాలు చేసి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు.. వీరిలో నాగా సాధువులు ఉన్నారు.. దింగంబరులు ఉన్నారు.. కాపాలికులు ఉన్నారు.. ఇలా చాలా మంది మనకు కనిపిస్తారు..
వీరందరికీ అతీతమైన సాధు జాతి ఒకటుంది.. దాని పేరే అఘోరా...
వీళ్లకు ఎవరూ అక్కర లేదు.. పుణ్యస్నానాలతో పని లేదు.. పవిత్రత అనేది వీరి ఒంటికి ఎంతమాత్రం పడదు. ఎందుకంటే వీరి రూటే సపరేటు.

4
భారతీయ తాంత్రిక పద్ధతుల్లో వామాచారం ఒకటి.. ఇందులో అతి కఠోరమైన విధానం అఘోరా... అఘోరా తాంత్రిక పద్ధతిలో ఉపాసనా మార్గాన్ని ఎంచుకునే వారు ప్రపంచంలో కనీవినీ ఎరుగని కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. స్మశానంలోనే జీవించాలి...కపాలాన్ని పాత్రగా మలచుకుని అందులోనే ఆహారాన్ని స్వీకరించాలి.
ఎవరి దగ్గరా ఏదీ అడిగి తీసుకోరాదు.. భిక్షాటన నిషేధం.. అయాచితంగా ఏదైనా లభిస్తే దాన్నే ఆహారంగా స్వీకరించాలి..ఈ పరీక్షలన్నీ ఎదుర్కొన్న తరువాత కానీ, గురువు నుంచి అఘోర దీక్ష లభించదు..
ఇలా అన్ని పరీక్షలు ఎదుర్కొన్న తరువాత కూడా వీరు సాధారణ సాధువుల్లా మనుగడ సాగించరు.. వీరికి ఎదుటి మనిషితో పని లేదు.. కఠినమైన తాంత్రిక ఉపాసన చేయటమే నిత్యవిధి.....అయితే వీళు్ల చేస్తున్నది క్షుద్ర పూజ ఎంతమాత్రం కాదు.. ఇది ముమ్మాటికీ రుద్రపూజ. అఘోరా ఒక ప్రత్యేక తాంత్రిక విద్య..ఈ విద్యను ఉపాసించే వారికి అపారమైన శక్తి ఉంటుందని అంటారు.. కఠిన మైన పద్ధతులతో ఉపాసన చేసి సాధించుకున్న సిద్ధులతో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించుకోవచ్చనీ చెప్తారు.. సిద్ధులు, శక్తియుక్తుల మాట ఎలా ఉన్నా... ఇంతటి కాఠిన్యమైన ఉపాసనా పద్ధతి, మరే సాధనామార్గంలో లేదన్నది నిజం.
ఈ కఠోర సాధనలో అతి ముఖ్యమైంది సెల్‌‌ఫలెస్‌నెస్‌... నేను అన్న అహాన్ని పూర్తిగా వదిలేయటం.. ఈ శరీరంపై మమకారాన్ని విడిచిపెట్టడం... అందుకే ఇలాంటి చేష్టలు.. మాంసాదులను తినటం.. స్మశానంలో, కపాలంలో తినటం వంటివి తమపై తమకు ఉన్న నేను అన్న భావనను కోల్పోవటానికేనని తత్త్వవేత్తలంటారు. వీటి ద్వారా అఘోరాలు సెల్‌‌ఫలెస్‌నెస్‌ను సాధించటంలో అఘోరాలు పూర్తి సక్సెస్‌ను సాధిస్తారు..
దొరికితే తింటారు..దొరక్కపోతే ఊరుకుంటారు.. ఒక్కోసారి సూర్యుడి కిరణాలే వారికి ఆహారంగా మారుతుందట. వారికి రుచి మీద మోజు ఉండదు.. శరీరం మీద ఇష్టమూ లేదు.. ఎవరినీ తమ దగ్గరకు రానీయరు.. ఎవరికీ హాని చేయరు.. తమ దగ్గరకు ఇతరులు రాకుండా ఉండేందుకు...తమను తామే జుగుప్స కలిగించే విధంగా తయారవుతారు.. భయానక వాతావరణాన్ని తమ చుట్టూ కల్పించుకుంటారు.. శివుడు ఆగ్రహంతో తన ఝట నుంచి వెంట్రుకల సముదాయాన్ని నేలకు విసిరికొట్టినప్పుడు ఉద్భవించిన వీరభద్రుడి ప్రతిరూపాలు అఘోరాలు.. వీరభద్రుడిలోని ఆవేశం... బీభత్సం, ఆగ్రహం అన్నీ అఘోరాల్లో స్పష్టంగా కనిపిస్తాయి...
Categories: Middle

నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

Sat, 06/12/2010 - 14:08
పేరు సోషల్‌ సర్వీస్‌...
జంతువుల పరిరక్షణే ధ్యేయం..
పర్యావరణాన్ని రక్షించటమే తపన..
ప్రపంచశాంతి కోసం తెగ „పడి చస్తారు..
నిరసనల కోసం వలువలు విడుస్తారు..
నగ్నంగా ఆందోళనలు.. సమాజానికి సందేశాలు..
లాభసాటి వ్యాపారంగా సమాజ సేవ..
అంగడి సరుకు న్యూడిటీ..
పాపులారిటీ కోసం చీప్‌ ట్రిక్‌‌స
నిరసనలకు న్యూడిటీ అవసరమా?
నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

ప్రపంచంలో అదో గొప్ప సంస్థ..పాపులారిటీలో దానికి సాటి లేదు.. యాడ్‌ కాంపెయిన్‌లో ఆ సంస్థ సిబ్బందిలో ఉన్న క్రియేటివిటీ అబ్బో ఎక్కడా కనిపించదు.. ఈ సంస్థ ఓ ఉద్యమ సంస్థ. అది చేసే ఉద్యమం సాదా సీదా ఉద్యమం కాదు.. ప్రపంచంలోని మనుషులందరినీ జంతు ప్రేమికులుగా మార్చేయటం.. అంతే కాదు.. వెజిటేరియన్‌లుగా మార్చేయటం.. ఇందుకోసం వారిలో చైతన్యం తీసుకురావటం కోసం ప్రచారం చేస్తుంటుంది..
దాని పేరు పెటా... పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్‌‌స...
అమెరికా లో జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న ఓ సంస్థ..
పేరులో గొప్ప ఆశయం?
జంతువుల సంరక్షణ ధ్యేయం..
వాటిని ఉద్ధరించటమే పరమావధి..
జంతు సంరక్షణ గురించి ప్రపంచానికి సందేశాన్ని అందించటం,
ప్రజలను జంతు ప్రేమికులుగా మార్చటం అ సంస్థ టార్గెట్‌..
ఓకే.. జంతువులను ప్రేమించటాన్ని ఎవరు మాత్రం కాదంటారు? జంతువులను కాపాడటం.. వారి యోగక్షేమాలను చూసుకోవటంపై ఎవరికి మాత్రం ఏం అభ్యంతరం? జంతు సంరక్షణ కోసం ప్రచారం చేయటమూ గొప్ప సంగతే... కానీ, పెటా ఇందుకోసం ఏం చేస్తుందో తెలుసా? దాని రూటే సపరేటు మరి..
జంతువుల పరిరక్షణ కోసం ప్రచారానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, పెటా మాత్రం అందుకు భిన్నంగా న్యూడిటీని ఎంచుకుంది. గొర్రెలను కాపాడాలంటూ ఓ నగ్న సుందరాంగి చేతిలో గొర్రెపిల్లను పెట్టి ఫోటో షూట్‌ చేస్తారు..
కోడిపిల్లలను కాపాడాలన్న ప్రకటనకు కూడా వలువలు లేని భామలే వారికి కావాలి..
జంతు చర్మాలతో తయారు చేసిన బట్టల వేసుకోవటం కంటే అసలు బట్టలే వేసుకోకుండా ఉండేందుకు ఇష్టపడతామంటూ నగ్న సుందరులను నిలబెడతారు..
ఈ సంస్థ తన ప్రచారాన్ని ఇంతటితో ఆపలేదు.. మనుషులంతా వెజిటేరియన్లుగా మారాలంటూ తెగ ఆరాటపడుతుంది.. దీనికి సంబంధించిన ప్రచారం విషయంలో పెటా మెంబర్లు కెమెరాకు ఇచ్చే పోజులే వేరు..
బాడీ పెయింటింగ్‌ వేసుకుంటారు.. రకరకాల వేషాలు వేసుకుంటారు.. ఆకులు కట్టుకుంటారు.. మాస్కులు వేసుకుంటారు.. అసలేమీ లేకుండా అడ్డగోలుగా ఫోటోషూట్‌లు చేసేసి ప్రపంచం మీదకు వదిలేస్తారు.. ఇంకేం ప్రచారానికి ప్రచారం... పాపులారిటీకి పాపులారిటీ...
2
వాళు్ల చేసేది సోషల్‌ సర్వీస్‌... ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వాళు్ల ఉద్యమిస్తారు.. ఆందోళనలు చేస్తారు.. నిరసనలు వ్యక్తం చేస్తారు.. పక్కా ప్రొఫెషనల్‌‌స... కాకపోతే వాళ్ల ఆందోళనలు వినూత్నంగా ఉంటాయి.. క్షణాల్లో ప్రపంచమంతటా పాపులర్‌ అవుతాయి.. ఎందుకింత పాపులారిటీ వస్తుంది? అందులోనే ట్విస్‌‌ట ఉంది..
కొన్నాళు్లగా ప్రపంచంలో తీవ్రవాదుల మారణకాండ, మావోయిస్టుల హింసాకాండ, ఆకలి చావులు, జాతి వివక్షలు.. యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న దేశాలు..ఈ ఉద్రిక్త వాతావరణంలో ప్రపంచ శాంతి సాధన కోసం ఆందోళన చెందుతున్న వారు ఎందరో ఉన్నారు.. కానీ, అదే ప్రపంచ శాంతిని కోరుకుంటున్న మరో జాతి ఉంది.. అందుకోసం ఆ జాతి చేసే ఫీట్లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంటాయి... ఈ ఆందోళనకారులు ఉద్యమించిన తీరును చూడండి...ప్రపంచ శాంతి కావాలంటే ప్లకార్డులు పట్టుకుని నగ్నంగా ప్రదర్శనలు చేయాలి... రకరకాల విన్యాసాలు చేయాలి.. ఇంగ్లీషు అక్షరాల ఆకారాల్లో పోజులివ్వాలి.. వావ్‌.. వీళ్లకు ఇంతకంటే మంచి ఆలోచన రాలేదు..
ప్రపంచ శాంతికి, నగ్న ప్రదర్శనకు లింకేమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు..ఇలా చేస్తేనే శాంతి సాధ్యమని ఎవరి మెదడుకు తోచిందో కానీ, వారికి జోహారు.. కానీ, శాంతి కోసం వీళు్ల తెగ ఆరాటపడిపోతున్నారన్న పాపులారిటీ క్షణాల్లో విశ్వవ్యాప్తంగా వచ్చేస్తుంది..
ఇంతేనా.. మరో ప్రదర్శన ఉంది.. అది భూగోళాన్నే రక్షించటం కోసం.. గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటూ ఆడా మగా కలిసి చల్లని మంచు ప్రదేశంలో నగ్నంగా ప్రదర్శన చేస్తారు.. దాన్ని ఫోటోలు తీసేసి ప్రచారం చేసేసుకుంటారు..
ఇక్కడితోనూ తృప్తి పడలేదు, నగ్నప్రియులు.. సందర్భం, సమయోచితం, విలువలు అన్న తేడా లేకుండా, ఇషూ్య ఏదైనా సరే, న్యూడ్‌గా పోజులివ్వటానికి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు.. ఇదిగో బుల్‌ఫైట్‌ను నిషేధించాలంటూ ప్రదర్శన చేయటం ఇలాంటిదే...
నిస్సిగ్గుగా వీళు్ల చేసే ప్రదర్శనలకు, నిరసనలకూ అక్కడి సమాజాలూ అంగీకరిస్తాయి.. ప్రభుత్వాలూ పట్టించుకోవు.. నిర్వాహకులకు మాత్రం వారు చేసే ఈ సోషల్‌ సర్వీస్‌కు స్పాన్సరర్ల రూపంలో కాసులు మాత్రం సూపర్‌గా వచ్చిపడతాయి..
3
కాదేదీ వ్యాపారానికి అనర్హం.. కాసిన్ని సొము్మలు వచ్చి పడతాయంటే చాలు.. దేనికైనా బరితెగించే లోకంలో ఉన్నాం మనం.. డబ్బులతోనే అన్ని వ్యవహారాలు.. కాకపోతే ముసుగులే వేరు.. ఒకరు వ్యాపారం కోసం న్యూడిటీని అంగట్లో పెట్టి అము్మకుంటున్నారు.. మరొకరు సర్వీస్‌ ముసుగు వేసుకుని వ్యభిచారం చేస్తారు..

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి వెకిలి చేష్టలు.. వీళ్ల పోస్టర్లపై చెప్పే మాటలు.. చేసే నినాదాలు.. ప్రతి మనిషికీ ఆదర్శంగా ఉంటాయి.. చూపించే బొమ్మలు మాత్రం జుగుప్స కలిగిస్తాయి.. గ్లోబల్‌ వార్మింగ్‌ కోసం, బుల్‌ఫైట్లను నిషేధించటం కోసం,
జంతు సంరక్షణ కోసం..విజిటేరియన్లుగా మార్చేయటం కోసం.. న్యూడిటీ అవసరమా? వలువలు లేని మనుషులతో ప్రచారం చేస్తే తప్ప ప్రపంచానికి సందేశం ఇచ్చే మార్గం ఇంకోటి లేదా?
వీళ్లంతా ఎందుకు న్యూడిటీనే ఆశ్రయిస్తున్నారు? వీళ్ల ప్రచారం కేవలం అడల్‌‌ట కోసమే కాదు కదా...జంతువుల సంరక్షణ గురించి, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి, విజిటేరియనిజం గురించి చిన్న పిల్లలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదా? లేక పిల్లలకు సైతం ఇలాంటి పోస్టర్లను, ప్రదర్శనలను చూపించటం వల్ల నష్టం లేదని వీళు్ల భావిస్తున్నారా?
టూమచ్‌ సెక్‌‌స ఆరోగ్యానికి హానికరం అని కూడా వీళు్ల తెగ ప్రచారం చేసేస్తుంటారు.. మరి వీళ్ల పోస్టర్లు దేనికి సంకేతాలు..? దేనికి ఉత్ప్రేరకాలు..?
తక్కువ డబ్బులకు ఎక్కువ అందాలు ఆరబోసే వాళ్లను తీసుకొచ్చి ఇలాంటి ఫోటోషూట్‌లు, ప్రదర్శనలు చేయిస్తారు... వీరికి చేంతాడంత స్పాన్సరర్ల లిస్‌‌ట ఉంటుంది.. పేరుకు చేసేది సేవ.. స్పాన్సరర్ల ద్వారా వచ్చేది సంపాదన... అది పెటా గానీ, మరేదైనా సంస్థ కానీ.. ఎవరైనా ఇంతే.. అందినకాడికి అందినంత దోచుకోవటమే వారికి కావలసింది.. చేసేదంతా వ్యాపారం.. పక్కా వ్యాపారం... చూపేది సర్వీస్‌.. సోషల్‌ సర్వీస్‌... కాదు కాదు.. న్యూడ్‌ సర్వీస్‌.. ఇప్పటికే జనం పర్వర్‌‌ట అయ్యే పరిస్థితి.. సర్వీసు చేయాలనుకుంటే దాని పద్ధతిలో అది చేయాలి.. కానీ, పాపులారిటీ కోసం న్యూడ్‌ ట్రిక్‌‌స ప్లే చేయటం దారుణం.. ఇప్పుడిప్పుడే ఇండియాలోకీ ఇది పాకింది.. షెర్లిన్‌ చోప్రా, నేహా దూఫియా వంటి వారు పాపులారిటీ కోసం దేనికైనా సిద్ధమేనని ప్రకటించేశారు.. న్యూడిటీయే అందమని, అదే గ్లామరనీ కూడా ప్రకటించారు.. దీన్ని విపరీత పోకడలంటే కొందరికి కోపం రావచ్చు... కానీ, ఇండియాలో.. ఇంతగా బరితెగించిన వాతావరణంలోనూ ఎక్కడో ఒక చోట కొంతైనా విలువలంటూ మిగిలి ఉన్నాయి. అందుకే ఈ దేశాన్ని, ఇక్కడి జన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న వాళు్ల ఇంకా ఉన్నారు.. కాస్తో కూస్తో మిగిలి ఉన్న ఈ కాస్త విలువల వలువలు విప్పకుండా ఉంటే అదే పదివేలు.
Categories: Middle

మహానటుడికి మహా పరాభవం...

Tue, 06/01/2010 - 09:02
తెలుగు సినిమా... ఈ పేరు చెప్పగానే ఇప్పటిదాకా మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు ఎన్టీరామారావు.. ఆయన్నే కొందరు అన్నగారు అని పిలుస్తారు.. పల్లెల్లో అభిమానులైతే ఎన్టోడు అని ముద్దుగా పిలుచుకుంటారు.. ఇదంతా ఇప్పటిదాకా ఉన్న మాట.. కానీ, ఇక ముందు ఈ మాట వినిపించదు.. ఆ బొమ్మ కనిపించదు.. ఆ పేరే మటుమాయం కానుంది.. ఎన్టీయార్‌ అంటే ఇప్పుడున్న కుర్ర ఎన్టీయార్‌ మాత్రమే కనిపిస్తాడు.. అతని మాటలే వినిపిస్తాయి.. సీనియర్‌ ఎన్టీరామారావు అంటే ఆయన అంటూ ఒకరున్నారా అన్న అనుమానమూ కలుగుతుంది...ఎందుకు? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
తెలుగు చిత్రానికి ఆయన రారాజు.. 1949 దాకా తప్పటడుగులు వేస్తున్న తెలుగు సినిమా నడకను, నడతను తీర్చిదిద్ది స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టిన సినీ భోజుడు.. ఆయన పేరు నందమూరి తారక రామారావు.. మూడున్నర దశాబ్దాలు.. మూడు వందల ఇరవైకి పైగా సినిమాలు.. చలన చిత్ర సెల్యూలాయిడ్‌ కావ్యానికి అందమైన ముఖచిత్రం నుంచి చివరి పుట దాకా అంతా ఆయనే.. ఇవాళ సినీ పరిశ్రమలో ఆయన పేరు తలచే వారే లేరు.. మాట్లాడే వారే లేరు...

చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే సంస్కృతి తెలుగు సినిమా వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. ఇదొక మాయా ప్రపంచం.. ఎవరికి ఎవరూ ఏమీ కారు.. అందరూ మొనగాళ్లకు మొనగాళ్లే.. కళామతల్లి ముద్దుబిడ్డలం అని చెప్పుకునే ప్రబుద్ధులంతా ఆ కళకు సేవలు అందించిన వారికి పంగనామాలు పెట్టడం కొత్తేమీ కాదు.. నాటి ఎన్టీయార్‌ నుంచి నేటి వేటూరి దాకా లివింగ్‌ లెజెండ్స్‌ పరిస్థితి అంతా ఇంతే..
ఒక మహోన్నత వ్యక్తికి జయంతి....వర్థంతి ఉత్సవాలు జరిగాయంటే... ఆ వ్యక్తిని జనం పది కాలల పాటు గుర్తు పెట్టుకున్నారని అర్థం.

తెలుగు సినిమాను, తెలుగు జాతి ఔనత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నటుడు, రాజకీయ వేత్త నందమూరి తారాకరామారావు జయంతి ఎప్పటిలాగే ఎన్‌టిఆర్‌ ఘాట్‌ వద్ద జరిగింది.

తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు రొటీన్‌గా వచ్చి నివాళులు అర్పించేసి వెళ్లిపోయారు..

పార్టీకి ఇంకా రామారావు పేరు అవసరం తీరిపోలేదు కాబట్టి వాళ్లు వచ్చారు.. కుటుంబసభ్యులకు తప్పదు కాబట్టి వారూ వచ్చారు..

కానీ, తెలుగు సినిమా పరిశ్రమ నెలకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగిందా? కనీసం ఆనవాలైనా కనిపించదు..
ఎన్టీయార్‌ జయంతిని జరుపుకోవలసిన అవసరం, బాధ్యత సినీ పరిశ్రమకు లేదు..
నందమూరి నట వారసులతో పాటు సినీ పరిశ్రమలో ఉన్న నందమూరి అభిమానులు కూడా పెద్ద ఎన్‌టిఆర్‌ను పూర్తిగా మరిచిపోయారు.. కాదు.. కావాలనే విస్మరించారు.. ఎందుకంటే ఇప్పుడు సినిరంగానికి చనిపోయిన ఎన్టీయార్‌తో అవసరం ఏముంది కనుక?
ఒక్క నాగేశ్వరరావు తప్ప ఒక్కరంటే ఒక్కరు సీనీపరిశ్రమకు చెందిన వాళ్లు ఎన్టీయార్‌ ఘాట్‌కు వచ్చిన పాపాన పోలేదు..ఫిలింనగర్‌ సంగతి సరేసరి..


సినిమా వాళ్లు వ్యక్తులను గుర్తు పెట్టుకుంటే ￧అదో విచిత్రం.. విశేషం.. మరచిపోవడం సహాజ లక్షణం. ఎన్టీయార్‌ దాకా ఎందుకు.. సినిమా పాటకు పల్లవి లాంటి వేటూరి సుందర రామ్మూర్తి మరణించి మూడు రోజులైనా కాలేదు.. ఆయన సంతాప సభ పెడ్తే ఆ సభలో సినీ పెద్దలెవరూ కనిపించని దుస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎప్పుడో వెళ్లిపోయిన ఎన్‌టిఆర్‌ జయంతిని మాత్రం సినిమా వాళ్లు ఏం గుర్తు పెట్టుకుంటారు లేండి.

తెలుగు సినిమాకు మోరల్స్‌ లేవా? ఇదీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.. వేదికలపైన సినీపెద్దలు పోచికోలు కబుర్లు చెప్పటానికి ఎలాగైనా సిద్ధపడతారు కానీ, వేదికలు దిగగానే చెవులు దులుపుకుని వెళ్లిపోతారు.. అందుకే ఇప్పుడు ఎన్టీయార్‌ గతకాలపు స్మృతి కాదు.. ఎన్టీయార్‌ అంటే అదే సినీప్రముఖులకే అర్థం కాని మాట..

సినిమా రంగానికి మిగతా వారంతా అక్కర్లేక పోవచ్చు. కానీ ఎన్టీయార్‌ ఒక లెజెండ్‌ సినీపరిశ్రమకే కాదు.. తెలుగు వారికి, సాంస్కృతికంగా, రాజకీయంగా కూడా దిశ, దశ చూపించిన వాడు.. అలాంటి మహానేతకు సినీరంగం ఎందుకు మంగళం పాడుతోంది. దీని వెనుక సినీ ప్రముఖులకు వేరే ఉద్దేశ్యాలు వేరే ఏమైనా ఉన్నాయా? ఒక పథకం ప్రకారమే చేస్తున్నారా? సినిమా ఒక కళ.. ఇదో కళారంగం.. మేమంతా కళాకారులం.. కళాకారులకు కళే జాతి.. కళామతల్లి ముద్దుబిడ్డలం మేమంతా...
ఇవన్నీ.. సినీ ప్రముఖులు ఎప్పుడూ చెప్పుకునే మాట.. భుజాలు తడుముకునే చేత.. ఇది ఒక విచిత్రమైన వ్యవస్థ.. చిత్రమైన రంగం.. తెలుగు సినిమా ఒక కళారంగం అని చెప్పుకునే దశను ఎప్పుడో దాటిపోయింది.. వీళ్లకు లాభసాటి వ్యాపారం జరగాలి.. ప్రభుత్వాల నుంచి రాయితీలు రావాలి.. ప్రేక్షకుల నుంచి కోట్లు వచ్చిపడాలి. ఫక్తు వ్యాపారం.. ఎవరు డామినేట్‌ చేస్తే వాళ్లదే రాజ్యం.. వీళ్లు వల్లించేవన్నీ ఒఠ్ఠిమాటలే.. ఇక చనిపోయిన వారిని గుర్తుంచుకుని స్మరించేంత తీరిక, ఓపికా వారికెక్కడుంటుంది?

సినిమా వాళ్లు చెప్పేదంతా నిజం కాదని జనాలకు ఇప్పుడిప్పుడే బుర్రకెక్కుతున్నది. నిజంగానే సినిమా వాళ్లకు వేటూరి మీద అంతటి అభిమానం ఉండి ఉంటే...ఫిలించాంబర్‌లో జరిగిన సంతాప సభకు సినీ పెద్దలెందుకు రాలేదు? ఎన్‌టిఆర్‌ జయంతిని ఫిలింనగర్‌లో ఎందుకు జరుపుకోలేదు? ఒకనాడు లెజెండ్స్‌గా ఉన్న వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆలనాపాలనా పట్టించుకోవలసిన బాధ్యత సైతం సినీరంగానికి పట్టదు.. అప్పుడప్పుడూ పేద కళాకారులకోసం క్రికెట్టు మాత్రం తెగ ఆడేస్తారు.. డబ్బులు పోగేస్తారు.. కొందరికి పంచేస్తారు.. చిత్రమేమంటే ఈ హీరోలు, హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు పారితోషికంగా వసూలు చేస్తారు.. పేదకళాకారులకు సాయం చేసే విషయానికి వచ్చే సరికి మళ్లీ ప్రేక్షకుల దగ్గర నుంచే వసూలు చేస్తారు.. జేబులోనుంచి ఒక్క పైసా బయటకు తీయరు.. ఇలాంటి వ్యాపారులు ఇక ఎన్టీయార్‌ కోసం ఏం చేస్తారు? ఆయన్ను ఏం గుర్తుంచుకుంటారు?
ఎన్టీయార్‌ నట సార్వభౌముడు.. తెలుగు సినిమాకు ఒక ఐకాన్‌.. ఆయన నటించని పాత్ర లేదు.. జీవించని కేరెక్టర్‌ లేదు..ఇవాళ తెలుగు సినిమాలో ఎవరు ఎలాంటి కేరెక్టర్‌ చేయాలన్నా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఎన్టీయార్‌ అంతకు ముందు చేసిన ఆ కేరెక్టర్‌ను ఒక్కసారి చూస్తే చాలు.. అన్ని రకాల కేరెక్టర్లు చేసిన వాడు ఎన్టీయార్‌. అలాంటి ఎన్టీయార్‌ నటించిన కేరెక్టర్లకు సంబంధించి ఉపయోగించిన ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తువులు, దుస్తులు మ్యూజియం పేరుతో ఉన్న ఒక బిల్డింగ్‌లో దుమ్ముపట్టుకుని పోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిగొడవగా మారి కోర్టులో పెండింగ్‌ ఫైళ్ల మధ్య ఇరుక్కుపోయింది.. ఎన్టీయార్‌ మ్యూజియం అన్నది తెలుగు సినిమా ఆస్తి కనీసం దాన్నైనా పరిరక్షించేందుకు ప్రయత్నించిన పాపాన పోలేదు..
ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఎవరికీ ఎన్టీయార్‌ అక్కర్లేదు.. ఎందుకంటే ఇవాళ ఎన్టీయార్‌ వ్యాపార వస్తువు కాదు.. ఆయన పేరుతో కానీ, స్మరణతో కానీ పైసా లాభం రాదు.. ఆయన ఉన్నప్పుడు సినిమాపరంగా, రాజకీయ పరంగా ఆయన్ను ఉపయోగించుకున్నారు.. ఇప్పుడు ఆ అవసరం లేదు.. దానవీరశూర కర్ణలో ఎన్టీయారే చరిత మరువదు నీ చతురత అంటాడు.. కానీ, ఇప్పుడు అది రివర్స్‌ అయింది.. చరిత మరిచిన నీ నటనా చాతుర్యం..
Categories: Middle

కూలిందా? కూల్చారా? రాజగోపుర రహస్యం

Fri, 05/28/2010 - 23:57

శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయింది. అయిదు శతాబ్దాల చరిత్ర అంతా చూస్తుండగానే నిట్టనిలువునా సమాధి అయిపోయింది. విజయనగర సామ్రాజ్య విజయ పతాక పతనమైపోయింది.. ఎందుకిలా జరిగింది? అత్యంత పురాతనమైన నిర్మాణం ఎలా కూలిపోయింది? అది సహజంగా కూలిపోయిందా? అసహజంగా కూల్చేశారా? రాజగోపురం కూలిపోవటానికి ముందు ఏం జరిగింది? అన్నీ అనుమానాలే.. అన్నీ సందేహాలే.. లోగుట్టు తెలిసేదెవరికి.. సాక్షాత్తూ వాయులింగేశ్వరునికైనా తెలుసా?

శ్రీకాళహస్తి రాజగోపురం ఎలా కూలిపోయింది?
కూలిందా? కూల్చేశారా?
ఒకవైపు మాత్రమే బీటలు వారిన గోపురం నిట్టనిలువునా ఎలా కూలింది?
గోపురం కూలిపోవటానికి పదిహేను నిమిషాలకు ముందు దానిపైకి ఎక్కిన ఇద్దరు ఎవరు?
గోపురం రెండో అంతస్థులోకి ప్రవేశించిన ఆ ఇద్దరు అక్కడ ఏం చేశారు?
గోపురం రెండో అంతస్థులో జరిగింది ఏమిటి?
గోపురం కూలేముందు ఎలాంటి శబ్దాలు వచ్చాయి?
గోపురంలో సౌండ్‌ప్రూఫ్‌ బాంబులు పెట్టి పేల్చారా?
శిథిలాల తొలగింపునకు అప్పటికప్పుడు చెనై్న నుంచి వాహనాలు ఎలా వచ్చాయి?
అంతా పథకం ప్రకారమే జరిగిందా?
కూల్చివేత పథకానికి సూత్రధారులు ఎవరు?

part-1
నిజం.. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని రాజగోపురం కూలిపోవటంపై అనుమానాలు తీవ్రమవుతూనే ఉన్నాయి.. దేవాలయ అధికారులు.. దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అనుసరించిన విధానం గోపురాన్ని అసహజంగా కూల్చివేశారనే వాదనలకే బలం చేకూరుతోంది.. దీనికి ఎవరు బాధ్యులు.. ? ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందెవరు?

శ్రీకాళహస్తి పవిత్ర రాజగోపురం నిట్టనిలువునా కూలిపోవటానికి కారకులు ఎవరు? రాష్ర్టంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులను తొలుస్తున్న ప్రశ్న.. రాజగోపురం ఒక్కసారిగా కుప్పకూలటం సంచలనం సృష్టించింది.. ఎందుకు, ఎలా కూలిపోయింది? పరిరక్షించే ప్రయత్నాలు ఎందుకు జరగలేదన్నది జవాబులు దొరకని ప్రశ్నలు...

1517 తొలినాళ్లలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై తన సమరాంగణ విజయ చిహ్నంగా కాళహస్తీశ్వరునికి కట్టిచ్చిన రాజగోపురం ఇది. ఇందులోని తొలి రెండు ప్రాకారాలు రాతితో నిర్మించినా.. మిగతా అయిదు ప్రాకారాలు ఇటుకతో నిర్మించారు.. 1979లోనే తొలిసారి రాజగోపురంపై పగుళ్లను గుర్తించారు.. దీన్ని పరిరక్షించే విషయంలో దేవాదాయ శాఖలో ఫైలు అటూ ఇటూ తెగ తిరిగింది.. 1990లలో మరోసారి దీనిపై పగుళ్లను పరిశీలించారు.. గోపురం కుడివైపు నెరల్రు వాచిన ప్రాంతంలో కొన్ని మరమ్మతులైతే చేశారు.. కానీ, గోపురాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ ఏనాడూ వహించలేదు..

గోపురం గురించి కొన్నాళ్ల క్రితం ప్రస్తుత ఇఓ ఎంతో గొప్పలు చెప్పారు.. పురాతన స్మృతి చిహ్నమైన కాళహస్తి రాజగోపురాన్ని కాపాడుకునేందుకు ఎంతో చేస్తున్నట్లు భుజాలు తడుముకున్నారు..
ఇదే పెద్ద మనిషి, వీర శివ భక్తుడు.. గోపురం కూలిన తరువాత వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టారు..ఏ కట్టడానికైనా అంతం తప్పదంటున్నారు..కానీ, తమిళనాడులో వేల ఏళ్ల నాటి గుళు్ల, చారిత్రక ఆనవాళు్ల ఎలా పరిరక్షింపబడుతున్నాయో ఈయనగారికి కాస్తంతైనా తెలియదు..
ఇఓ మాటల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యమే రాజగోపురం కూలిపోవటానికి కారణం. గోపురాన్ని ఎలా రక్షించాలో తెలియక, దాని గురించి ఆలోచించనైనా ఆలోచించక నిష్కర్షగా కూల్చివేశారా? ఇది ప్రజల భావోద్వేగంతో ఆడుకున్నట్లు కాదా?
part-2

రాజగోపురాన్ని కూలిపోకముందే కూల్చేశారన్న వాదన ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక వాస్తవాలు ఏమిటి? కూలిపోవటానికి ముందు కాళహస్తిలో ఏం జరిగింది? కేవలం ఒక వైపు మాత్రమే నెరల్రు వాచిన గోపురం మొత్తంగా కుప్పకూలటం సహజంగా జరిగిందేనా?
మే 26 న రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి రాజగోపురం నిట్టనిలువునా కూలిపోయింది? అంతకు ముందు నాలుగు రోజుల నుంచి రాజగోపురం శిథిలావస్థపై కథనాలు వినవస్తూనే ఉన్నాయి. ఐఐటి నిపుణులు, పురావస్తుశాఖ నిపుణులు వచ్చి పరిశీలించి మరీ వెళ్లారు.. ఏ క్షణానై్ననా కూలే అవకాశం ఉందంటూ నిపుణులు అప్పుడే చెప్పారు.
నిపుణులు హెచ్చరించిన మర్నాడే రాజగోపురం కూలిపోయింది.. మట్టిదిబ్బలా మారిపోయింది.. ఎలా సాధ్యమైందన్నదే అంతుపట్టని ప్రశ్న.. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి..
(అనుమానం నెం1)
రాజగోపురానికి కుడివైపున మూడు ఫీట్ల విస్తీర్ణంలో నిట్టనిలువునా పగులు ఏర్పడింది.. ఎడమ వైపున 75 శాతం గోపురం అంతా బాగానే ఉంది.. ఒకవేళ పగులు ఏర్పడిన భాగానికి ప్రధాన భాగానికి దూరం పెరిగితే కుడివైపు మొత్తం పడిపోవాలి. కానీ, గోపురం మొత్తం కూలిపోయింది.. ఇదెలా జరిగింది..?
కుడివైపున మాత్రమే పునాదులు కదిలినట్లు అధికారులే స్పష్టంగా చెప్తున్నారు..
(అనుమానం నెం2)
ఎడమ వైపు పటిష్ఠంగానే ఉందని చెప్పకనే చెప్తున్నారు.. అలాంటప్పుడు గోపురం మొత్తంగా నిట్టనిలువునా కూలే అవకాశాలు చాలా తక్కువని ఇంజనీర్లే అంటున్నారు.. కానీ, గోపురం పూర్తిగా పేకమేడలా ఎలా కూలిపోయింది?
(అనుమానం నెం.3)
రెండో అంతస్థు వరకు రాతికట్టడం ఉంది.. ఆ తరువాత ఇటుక కట్టడం ఉంది.. రెండో అంతస్థు పైనుంచి మిగతా గోపుర ప్రాకారాలన్నీ నిట్ట నిలువునా కూలిపోయింది...ఏం జరిగింది?
(అనుమానం నెం.4)
గోపురం కూలిపోవటానికి సరిగ్గా పదిహేను నిమిషాలకు ముందు ఇద్దరు వ్యక్తులు గోపురంలోని రెండో అంతస్థు లోకి వెళ్లి దాదాపు పదిహేను నిమిషాలు గడిపి వచ్చారు.. వారిద్దరు ఎవరు? రెండో అంతస్థులో వారేం చేశారు?

(అనుమానం నెం.5)
ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సెక్యూరిటీ చీఫ్‌లు ఇద్దరే లోపలికి వెళ్లి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షు్యల వాదన.. వాళ్లిద్దరు కానీ, ఇతర అధికారులు కానీ, ఎందుకు మౌనంగా ఉన్నారు?

(అనుమానం నెం. 6)
గోపురం కూలిపోయిన తరువాత తెల్లవారి ఉదయం దాకా శిథిలాలను తొలగించేందుకు ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు.. దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చాక కానీ, తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేది లేదని అధికారులు చెప్పారు.. కమిషనర్‌ మధ్యాహ్నం రెండు గంటలకు కానీ రాలేదు.. కానీ, శిథిలాల తొలగింపును ఉదయం పదకొండు గంటలకు గుడి వెనుక వైపు నుంచి రహస్యంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమాన్ని కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..?

(అనుమానం నెం.7)

దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చి వెళ్లిన కొద్ది సేపటికే చెనై్న నుంచి మూడు పొక్లయినర్లు, 12 ట్రక్కులు వచ్చేశాయి.. ఎలాంటి పక్కా ప్రణాళిక లేకుండా ఇవి కాళహస్తికి ఎలా చేరుకున్నాయి..
గోపురం కూలినప్పుడు పిడుగులాంటి శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.. ఇది బాంబు పేల్చిన శబ్దమా? చారిత్రక ఆనవాలును ఎంతో అపురూపంగా కాపాడుకోవలసిన జాతి, బ్యూరోక్రసీ నిర్లక్ష్యానికి సమాధి అవుతున్న శిథిల చరిత్రను మౌనంగా చూసి రోదించాల్సిన స్థితి నెలకొంది..
part-3
శ్రీకాళహస్తి రాజగోపురం సహజంగా కూలిపోలేదనటానికి మరో బలమైన ఆధారం ఉంది.. గోపురం కూలిపోయిన నాటి నుంచి ముగ్గురు వ్యక్తుల జాడ తెలియటం లేదు.. శిథిలాల కింది నుంచి దుర్వాసన కూడా వస్తోంది.. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఎవరి దగ్గరా లేదు.. దీని వెనుక మతలబు ఏమిటి? అధికారులు ఏదైనా వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాళహస్తి రాజగోపురానికి అతి దగ్గరలో న్యూ గణేశ్‌ హోటల్‌ ఉంది.. ఈ హోటల్‌లో ఉన్న పనిచేసే రాజా అనే కార్మికుడు గోపురం కూలిన రాత్రి నుంచి కనిపించటం లేదు. అన్న జాడ వెతుక్కుంటూ రాజా తము్మడు రమేశ్‌ నెల్లూరు నుంచి కాళహస్తికి వచ్చి వాకబు చేస్తే, హోటల్‌ యజమాని తనకేం తెలియదన్నాడు.. మధ్యాహ్నమే వెళ్లిపోయాడన్నాడు..

నిజానికి హోటల్‌ వెనుక భాగంలో ఒక రేకుల షెడ్డు ఉంది.. గోపురం కూలినప్పుడు అది కూడా పూర్తిగా నేలమట్టమైంది.. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ముక్కు పుటాలు అదిరేలా దుర్గంధ వాసన బయటకు వస్తోంది.. ఈ శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు సమాధి అయినట్లు ప్రచారం జరిగింది.. అంతే కాదు.. అక్కడే ఉన్న స్టేట్‌బ్యాంక్‌ పరిసరాల నుంచి కూడా ఇదే రకమైన వాసన వస్తోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.. కారణం మాత్రం తెలియదు.. జాడ తెలియకుండా పోయిన వారిలో ఆలయ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నట్లు సమాచారం వస్తోంది.. వీరికి సంబంధించిన అన్ని రికార్డులనూ మాయం చేసినట్లు తెలుస్తోంది.. అధికారులు ఎందుకిలా చేశారు.? కారణం ఏమిటి? ఆలయ గోపురం ప్రమాద వశాత్తు కూలిపోవటం వాస్తవమే అయితే దుర్గంధం వస్తున్న చోట శిథిలాలను ఇంకా ఎందుకు తొలగించటం లేదు..? జాడ తెలియకుండా పోయిన వారి వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు?

గోపుర శిథిలాల కింద ఎవరైనా చనిపోవటం అంటూ జరిగితే అందుకు ఎవరు బాధ్యులు..? గోపురాన్ని అధికారులు కావాలనే కూల్చి వేసినట్లయితే, చుట్టుపక్కల ఎవరూ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తీరాలి... అలా కాకుండా అన్నీ చూసుకోకుండా తొందరపడి ఉంటే, ఎలాంటి అనర్థం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. ప్రజల నుంచి, మిస్సింగ్‌ అయిన వారి బంధువుల నుంచి వెల్లువెత్తుతున్న అనుమానాలకు, ఆరోపణలకు జవాబు ఇవ్వలేని అధికార గణం రాజగోపుర రహస్యాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది..
Categories: Middle

సత్యానికి సంకెళ్లు

Sat, 05/22/2010 - 11:18
సత్యంబాబు తప్పించుకున్నాడు.. సత్యంబాబు దొరికిపోయాడు.. తప్పించకుకోవటమే ఒక విచిత్రం.. పారిపోయిన వాడు దొరకడం మరో విచిత్రం.. అయిదు గంటల హైడ్రామాలో విజయవాడ పోలీసులు నిర్వహించిన పాత్ర రిలీజ్‌ కంటే ముందే సంచలనం సృష్టిస్తున్న రాంగోపాల్‌వర్మ రక్తచరిత్రను మించిపోయింది.. అనేక ట్విస్ట్‌లు.. జవాబు లేని ప్రశ్నలు.. అనుమానాలు... ఆరోపణలు.. ఏం జరిగింది? దోషులెవరు? ఒక హత్య కేసులో నేరం రుజువు చేయటం కంటే ఇతర అంశాలపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలకు జవాబుదారీ ఎవరు?

ఉదయం పది గంటలు...
అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు తప్పిపోయాడన్న వార్త దావానలంలా పాకింది...

ఉదయం 11 గంటలు..
మీడియాలో హడావుడి..

మధ్యాహ్నం 12గంటలు..
సత్యంబాబు తప్పించుకున్న కేసులో ఎస్కార్ట్‌ పోలీసుల సస్పెన్షన్‌

మధ్యాహ్నం 1 గంట..
సత్యంబాబును ఎన్‌కౌంటర్‌ చేశారన్న అనుమానాలు..

మధ్యాహ్నం 3 గంటలు..
సత్యంబాబు దొరికాడన్న వార్త...


మొత్తం అయిదు గంటలు.. శనివారం మధ్యాహ్నం పోలీసులు ఓ మ్యాట్నీ షోను చూపించారు.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన సత్యంబాబు స్టోరీలో పోలీసులు మాత్రం ఫెయిలయ్యారు.. మొత్తం స్టోరీలో అన్నీ ట్విస్ట్‌లే.. అన్నీ సంచలనాలే.. మరెన్నో అనుమానాలే.. ? కొసమెరుపేమిటంటే పోలీసుల నుంచి తప్పించుకున్న సత్యంబాబు పోలీసులకే దొరకడం...

అయేషా హత్య కేసులో నడవలేని స్థితిలో ఉన్న నిందితుడు సత్యం బాబును మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెండు రోజుల క్రితం తీసుకువచ్చారు... నిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయిన తరువాత పోలీసులు తిరిగి విజయవాడకు బయలు దేరారు.. సూర్యాపేట దగ్గరకు వచ్చిన తరువాత భోజనం కోసం ఆగినప్పుడు సత్యం బాబు సంకెళ్లను తెంచుకుని పారిపోయాడు... వెంట ఉన్న పోలీసులందరినీ విజయవాడ సిపి సీతారామాంజనేయులు సస్పెండ్‌ చేశారు...
సత్యం ఎలా పారిపోయాడు? సంకెళ్లు తెంచుకుని పదిమంది పోలీసుల కళ్లు కప్పి పారిపోయే అవకాశం సత్యంకు ఉందా? సత్యం కేసులో సత్యానికి సంకెళ్లు వేస్తున్నది ఎవరు?
అయేషామీరా హత్యకేసులో అరెస్టు చేసిన తరువాత విచిత్ర పరిస్థితుల్లో సత్యం బాబు ఆరోగ్యం చెడిపోయింది... పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే విచిత్రమైన సిండ్రోమ్‌ అతణ్ణి పట్టుకుంది.. కనీసం నడిచే పరిస్థితిలో కూడా అతను లేడు.. కోర్డుకు సైతం పోలీసులు చేతుల మీద మోసుకురావలసిన పరిస్థితి. అంత అనారోగ్యంతో ఉన్న సత్యం బాబు చేతులకు ఉన్న సంకెళ్లు.. కాళ్లకు వేసుకున్న గొలుసులను తెంచుకొని ఎలా పారిపోగలిగాడు? అతనికి అంత శక్తి ఉందా? ఒక వేళ తెంచుకున్నాడే అనుకుంటే... నడిచే పరిస్థితిలోనే లేని వాడు.. పదిమంది పోలీసుల కళ్లు గప్పి ఎలా పారిపోగలిగాడు? ఇది సాధ్యమేనా? ఎలా జరిగింది..?
నిమ్స్‌లో ఉన్న రెండు రోజుల్లోనే సత్యం బాబు పూర్తి ఆరోగ్యవంతుడై పిటి ఉషలా పరిగెత్తే స్థాయికి చేరుకున్నాడా? అలా కానప్పుడు పారిపోవటం ఎలా సాధ్యపడింది? ఈ అనుమానాలే.. సత్యం పారిపోవటం వెనుక పోలీసుల పాత్రను అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. సత్యంను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు పోలీసులు ఎత్తుగడ వేశారా? చివరకు పోలీసుల పాచిక ఫలించకుండా మీడియా అడ్డుపడటంతో సత్యంను తిరిగి వెలుగులోకి తెచ్చారా?

సత్యం బాబు సూర్యాపేటలో కళ్లు కప్పి ౮౦ కిలోమీటర్ల దూరంలోని నందిగామలోని డిఎస్‌పి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు.. సత్యం తప్పించుకుని ఎలా వెళ్లాడు? అతను మార్చుకున్న చొక్కా ఎవరిచ్చారు? సత్యం జిల్లా పరిధులు ఎట్లా దాటి వెళ్లగలిగాడు? అంటే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదా? పది మందిని మాత్రం సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారా? అయేషా హత్య కేసు మిస్టరీలాగానే, సత్యం పరారీ కూడా మిగలనుందా?
Categories: Middle

గుర్తుకొస్తున్నాయి...

Wed, 05/19/2010 - 11:55
రాష్ట్ర రాజకీయాల్లో మే 20 , 2009 ఒక సంచలనాన్ని నమోదు చేసిన రోజు.. తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి వరుసగా రెండోసారి వైఎస్‌ఆర్‌ అధికార ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. ఏడాది తిరిగిపోయింది.. అంతలోనే ఎంత మార్పు...వైఎస్‌ఆర్‌ అకాల మరణం రాష్ట్ర రాజకీయాల రూపు రేఖల్ని సమూలంగా మార్చేసింది.. అధికార పార్టీలో నిరుటి వెలుగులు ఇవాళ కనిపించటం లేదు..
ఆరేళ్ల పాటు ఏక వ్యక్తి నేతృత్వంలో విజయపరంపరలతో కొనసాగిన కాంగ్రెస్‌ ఇప్పుడు బేలగా ఎందుకు తయారైంది.....

సరిగ్గా ఏడాది క్రితం లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేష జనవాహిని సాక్షిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్న కలలను కల్లలు చేయటమే కాదు.. తెలంగాణా రాష్ట్ర సమితి తో సహా ప్రతిపక్షాలన్నింటినీ గుక్క తిప్పుకోకుండా చేసి చీలికలు, పేలికలు అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు..

వైఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకోవటమే కష్టమైంది. ఆపరేషన్‌ ఆకర్ష కానీ, ఆపరేషన్‌ స్వగృహలు కానీ, మరే పేరు కానీ,,, రాజకీయాల్లో చాణుక్యుడనుకున్న చంద్రబాబులో సైతం కల్లోలం రేపిన రాజకీయం వైఎస్‌ఆర్‌ది..
తొలిసారి అధికారంలోకి వచ్చి అయిదేళ్లూ, మూడు సంక్షేమాలు.. ఆరు ప్రాజెక్టులన్న రీతిలో విజయవంతంగా పూర్తి చేశారు... సాధారణ మెజారిటీయే అయినా, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి వైఎస్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు.. రాష్ట్రంలోనే సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రికార్డు సృష్టిస్తారనీ అంతా భావించారు. రెండో టర్మ్‌ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో విపక్షాలకు ఉనికే లేకుండా చేస్తారని భావించారు..కానీ అంతలోనే జరగరాని అనర్థం జరిగిపోయింది.. హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హఠాత్తుగా రాష్ట్ర ప్రజానీకానికి శాశ్వతంగా దూరమైపోయారు..
అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయాయి.. వైఎస్‌ఆర్‌ లేరన్న లోటు స్పష్టంగానే కనిపిస్తోంది. అటు ప్రజల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ.. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ను వైఎస్‌ లోటు చీలికలు పేలికలు చేసింది...

కాలం చక్రంలా తిరుగుతూనే ఉంది.. వైఎస్‌ లేకపోవటం అన్నది ఇవాళ్టికీ అనూహ్యమైంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు సంభవించిన ప్రతిసారీ, కొత్త సమీకరణాలు చోటు చేసుకున్న ప్రతిసారీ వైఎస్‌-- అధికార, విపక్షాలకు గుర్తుకురాని సందర్భం ఉండదు.. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పటి రాజకీయానికీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ఎక్కడైనా పొంతన ఉందా?
వైఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించినప్పటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది.. ఆ తరువాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత వైఎస్‌కు ఎదురే లేకుండా పోయింది.. ౨౦౦౪లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2009 సెప్టెంబర్‌ 2న ఆయన ప్రమాద వశాత్తూ మరణించేంత వరకూ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా చేశారు.. అధిష్ఠానానికి ఏపి వైపు కన్నెత్తి చూసే అవసరమే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్‌కు అన్నీ తానే అయ్యారు..
కాంగ్రెస్‌లో వైఎస్‌ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఆయన నాయకత్వంలో ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం మచ్చుకైనా వినిపించలేదు.. ఆయన వినిపించనివ్వలేదు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు లేవు.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంలా మారిపోయింది..

కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా ఉంటే విపక్షాల పరిస్థితి అయోమయంలా మారిపోయింది.. వైఎస్‌ ఉన్నంతకాలం టిడిపి, టిఆర్‌ఎస్‌ల నాయకత్వాలు దాదాపుగా నిద్రలేని రాత్రులనే గడిపాయని చెప్పవచ్చు. నిత్య అసమ్మతులు, రాజీనామాలతో రెండు ప్రధాన పార్టీలు గందరగోళంలో పడిపోయాయి..

ఇప్పుడు.........వైఎస్‌ లేరు.. విపక్షాలు పుంజుకుంటున్నాయి.. కాంగ్రెస్‌లో పాత సంస్కృతి పూర్తిగా జడలు విప్పుకుంది... అధిష్ఠానం ఆశీస్సులతో మాత్రమే కొనసాగే ముఖ్యమంత్రి.. సహకరించని మంత్రులు.. అసమ్మతులు... పరస్పర ఆరోపణలు.. కాంగ్రెస్‌లో ఇంతకాలం మౌనంగా ఉన్న గొంతులన్నీ ఇప్పుడు స్వరం పెంచాయి.. అధిష్ఠానానికి ఫిర్యాదుల పైన ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటున్నా ఆపేవారు లేరు..
రాజకీయం ఇలా ఉంటే.. వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమం మరోదారిలో వెళ్తోంది.. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ప్రకటించిన సంక్షేమ పథకాలను ఏ విధమైన ఆర్థిక నిర్వహణతో ఆయన కొనసాగించారో.. ఆ విధమైన నిర్వహణ ఇప్పుడు కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు.. వైఎస్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన రోశయ్యే ఇప్పుడు సిఎంగా ఉన్నారు.. కానీ, ఆర్థిక నిర్వహణ మాత్రం భారంగా మారింది. వైఎస్‌ మొదలు పెట్టిన స్కీములన్నింటికీ క్రమంగా మంగళం పాడే పనిలో పడ్డారు.. ఎంతోమంది లబ్ధి పొందుతున్న ఈ స్కీములు ఆగిపోతే పరిస్థితి ఏమిటి అన్నది సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్న.. వైఎస్‌ ఒక నిర్దిష్టమైన దారిలో నడిపించిన కాంగ్రెస్‌ ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోతోంది.. వైఎస్‌ ఒక ప్రణాళిక ప్రకారం మొదలు పెట్టిన పథకాలు ఒక్కటొక్కటిగా కనుమరుగవుతాయని వినిపిస్తోంది.. వైఎస్‌ మాత్రం అందరికీ గుర్తుకు వస్తూనే ఉన్నారు...
Categories: Middle

స్నేహితుడే హంతకుడు

Mon, 05/17/2010 - 11:02
నరహంతకుడు రామారావు హత్య కేసు మిస్టరీ వీడిపోతోంది.. పోలీసుల కళ్లు గప్పి ఇన్నాళ్లూ ఎవరి పంచన తలదాచుకుంటూ వస్తున్నాడో.. ఎవరి ద్వారా అన్ని రకాల సహాయాన్ని పొందుతూ వస్తున్నాడో.. ఇంతకాలం ఎవరిని అత్యంత విశ్వాస పాత్రుడిగా భావించాడో.. ఆ మిత్రుడే హంతకుడుగా స్పష్టమవుతోంది.. పోలీసులు ఈ విషయంలో దాదాపుగా నిర్థారణకు వచ్చేశారు..

నరహంతకుడు రామారావు ఎంత కిరాతకంగా మనుషుల్ని హతమార్చాడో.. అంతకంటే కిరాతకంగా అతను చనిపోయాడు.. రామారావు హత్య ఎవరినీ బాధపెట్టలేదు.. పైగా అందరినీ సంతోషపరిచింది.. చిక్కినట్లే చిక్కి ఎప్పటికప్పుడు పారిపోతూ, కనిపించిన చోటల్లా దోపిడీలు, హత్యలు చేస్తూ ఒకటిన్నర దశాబ్దంగా అల్లాడిస్తున్న రామారావు చనిపోవటం పోలీసులకు సైతం ఒకవిధంగా నమ్మశక్యం కావటం లేదు. రామారావు శవం ముందుగా కనిపించినప్పుడు పోలీసులే మట్టుబెట్టారని అంతా భావించారు. తమదైన రీతిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చి హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్న దన్న ఆరోపణపై ఆమె భర్తను విచారించినప్పుడు కేసు చిక్కుముడి నెమ్మదిగా వీడిపోవటం మొదలైంది..
పోలీసులు అరెస్టు చేసిన రాణి మేకల చలపతిరావుకు, రామారావుకు మొదట్నుంచీ స్నేహం ఉంది.. ఇద్దరూ కలిసి కొన్ని దొంగతనాలు కూడా చేసినట్లు సమాచారం.. దీని ప్రకారం.. జైలు నుంచి రామారావు పరారయి వచ్చిన ప్రతిసారీ, చలపతిరావే అతనికి షెల్టర్‌ ఇచ్చేవాడు.. మందు, మగువలను ఏర్పాటు చేసేవాడు.. అదే విధంగా ఈ నెల ౮న శ్రీకాకుళం జైలు నుంచి తప్పించుకున్న రామారావు కృష్ణా జిల్లా అగిరిపల్లికి నేరుగా చేరుకున్నాడు.. చలపతిరావు ఇంట్లోనే ఆశ్రయం పొందాడు.. కానీ, ఈసారి రామారావు స్నేహితుడికే ఎసరు పెట్టాడు.. తిన్నింటి వాసాలు లెక్కించాడు. చలపతి రావు భార్యపై రామారావు కన్నేయటంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.. ఆ కారణంగానే చలపతిరావు రామారావును హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది..
విచిత్రమేమంటే రామారావు హత్య జరిగిన ౪౮ గంటల తరువాత అతని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు.. కానీ, అతనికి అంత్యక్రియలు చేసే దిక్కు లేకుండా పోయింది.. మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చిన బంధువులు సైతం పోస్ట్‌మార్టమ్‌ తరువాత దాన్ని తీసుకుపోయేందుకు రానే లేదు.. ఇన్నేళ్ల పాటు కిరాతకుడుగా అందరినీ గడగడలాడించిన రామారావు చివరకు ఎవరికీ కాకుండా పోయాడు..

Categories: Middle