http://ammaodi.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 29 min 55 sec ago

మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి! [ఒకే అంశం – విభిన్న కోణాలు - 05]

Wed, 07/28/2010 - 08:57
చంద్రబాబు ‘సువర్ణముఖి’ని రెండు రకాలుగా అనుభవిస్తున్నాడు.

ఒకటి - మాకు చేసిన కర్మల ఫలంగా!

మరొకటి - ఈ దేశానికి, రాష్ట్రప్రజలకి చేసిన కర్మల ఫలంగా!

వాటి గురించి వివరించే ముందు ఒక పోలిక చెబుతాను.

మనం ఒక చిన్న పిల్లవాడికి "నాయనా! ప్రతిరోజూ సూర్యుడు ఒక దిక్కునే ఉదయిస్తాడు. ఆ దిక్కుని తూర్పు అంటాం" అనో, లేక "నాయనా! ప్రతి రోజూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు" అనో, చెప్పామనుకోండి!

దాన్ని నమ్మడానికి ఆ పిల్లవాడు నాలుగు రోజులో, నలభై రోజులో సూర్యోదయాన్ని పరిశీలిస్తే చాలు, నిర్దారించుకోగలుగుతాడు. నమ్మకాన్ని స్థిర పరుచుకోగలుగు తాడు. ఎందుకంటే - అది చర్మ చక్షువులకి కనబడే దృశ్యం!

అదే ఒక వ్యక్తికి, "నాయనా! ధర్మోరక్షితి రక్షితః అంటారు పెద్దలు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది" అనో, లేక "నాయనా! మనం చేసుకున్న కర్మఫలం మనమే అనుభవిస్తాం. అంచేత సత్కర్మలే చెయ్యాలి" అనో, చెప్పామనుకొండి.

దాన్ని నమ్మడానికి, ఆ వ్యక్తి, నాలుగు రోజుల్లోనో, నలభై రోజుల్లోనో పరిశీలనలూ, నిర్దారణలూ చేసుకోలేడు. దాన్ని పరిశీలించడానికి ఒకోసారి జీవిత కాలం పడుతుంది. అదీగాక అది భౌతిక దృష్టికి స్పష్టపడటం అరుదుగా జరుగుతుంది. అంతశ్చక్షువులతో, జ్ఞాన దృష్టితో గ్రహించవలసి వస్తుంది.

వేల సంవత్సరాల క్రితం, ఈ గడ్డమీద జన్మనెత్తిన వారు, ఎక్కువగా ఈ నమ్మకాలని కలిగి ఉండేవాళ్ళు. ‘చేసుకున్న కర్మ అనుభవించక తీరదు!’ ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ వంటి పెద్దల మాటలు, సూక్తులు, తత్వాలు, ఇతిహాసాలు, మత విశ్వాసాలు, ప్రజలని ఈ విషయమై నిత్య జాగరూకులని చేసేవి.

నమ్మకాలు సడలిపోయి, సంస్కృతీ సంప్రదాయాలు మరిచిపోయి, ‘డబ్బూ అధికారాలతో ఏమైనా చేసేయ వచ్చు’ అనుకునే పదార్ద వాదం పెరిగిపోయాక.... సత్యాలను చూడగల కన్నూ, గ్రహించగల బుద్దీ చాలా మందిలో కరువయ్యాయి.

అయితే, ఒక్కసారి, మన మీద పరచుకున్న కృత్రిమ ప్రచారాల మాయ అనే తెరలని తొలగించి చూస్తే, ‘ఎవరైనా సరే, చేసుకున్న కర్మఫలం అనుభవించే తీరతారు’ అన్న సత్యం మన కళ్ళముందే ఉంది.


అలాంటి వాటిల్లో ఒకటి ‘చంద్రబాబు ని, అతని బృందాన్ని మరాఠా పోలీసులు కుళ్ళ బొడవటం’.

ఇక మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి ని వివరించే ముందు....

‘హలో బ్రదర్’ సినిమాలోని రెండు హాస్య సన్నివేశాల్ని చెబుతాను.

నాగార్జున ద్విపాత్రిభినయం చేసిన ఆ సినిమాలోని తొలి సీన్లలో.... దొంగ అయిన నాగార్జున, అతడి అనుచరుడు & కమేడియన్ బ్రహ్మనందం జైలు నుండి పారిపోయి, పోలీసుల జీపుని చేజిక్కుంచుకొని, బ్యాంకు నుండి వస్తున్న గిరిబాబు క్యాష్ బ్యాగు కొట్టేసిన దొంగ [రమ్యకృష్ణ] వెంట బడతారు. జీపులో డ్యాష్ కొట్టి, క్రిందబడిన ఆ మోటర్ సైకిలిస్ట్ తో, నాగార్జున...

"ఏరా! పవిత్ర భారత దేశంలో పుట్టేసి, నెత్తిన హెల్మెట్ పెట్టేసి, దొంగతనం చేస్తావా?" అంటాడు.

వెంటనే బ్రహ్మానందం... "గుర్రంలా ఉన్నావ్! గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతకక, పిల్లిలా దొంగతనం చేస్తావా?" అంటాడు.

అంతలో ఆ ‘మోటార్ సైకిలిస్ట్ కమ్ దొంగా’ మగవాడు కాదనీ, ఆడ లేడీస్ అనీ అర్దమయ్యాక, వాళ్ళు పండించే హాస్యానికి మనం నవ్వుకుంటాం.

అయితే తదుపరి కథలో, ఈ సీన్ కి కొనసాగింపు ఉంటుంది. నాగార్జున, బ్రహ్మానందాలు, బంగారు నగల తాకట్టు దుకాణానికి వెళ్ళి, సేటు [జెన్ని] కి ఠోకరా ఇచ్చి, అతడి నగలు వీళ్ళు చేతుల్లోకి, వీళ్ళ కత్తి అతడి చేతిలోకి వచ్చేటట్లుగా ట్రాప్ చేస్తారు. "నాకీ నగలు నాకీ ఇవ్వండి" అనే సేటుని, ‘తమ నగలు కాజెయ్యాలని సేటు తమని కత్తితో బెదిరించాలని చూస్తున్నాడంటూ’ బనాయిస్తారు. న్యాయం చెప్పమని చుట్టూ ఉన్న వారి నడుగుతారు. ఇంతలో పోలీసు వేషంలో వచ్చిన హీరోయిన్ [రమ్యకృష్ణ]....

"నేను చెబుతాను. పవిత్ర భారత దేశంలో పుట్టీ, అమాయకుల జేబుల్లో బీడీలు పెట్టి, కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా!" అంటుంది. డైలాగ్ కొనసాగిస్తూ "నత్తల్లా ఉన్నారు. పీతల్లా పని చేసుకుని, బాతుల్లా బతకక, కోతుల్లా దొంగతనం చేస్తారా, రౌడీల్లారా!?" అంటుంది. అది విన్న బ్రహ్మానందం సాలోచనగా "ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే?" అంటాడు.

అప్పటికే తత్తర చూపులు చూస్తున్న నాగార్జున "విన్నట్లు కాదు, అన్నట్లుంది!" అంటాడు.

సరిగ్గా అదే పరిస్థితి... బాబ్లీ యాత్రలో చంద్రబాబుది!

ఏ విధంగా అంటే....

1995 సెప్టెంబరు లో చంద్రబాబు, మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటికి మేము మా బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నాము.. మా నాన్న గారప్పటికి స్వర్గస్తులయ్యారు. అమ్మా చెల్లీ, తమ్ముళ్ళు [ఈ పోరాటం తమ వల్ల కాదని] హైదరాబాద్ వెళ్ళిపోయారు.

1992లో నేదురుమల్లి జనార్దన రెడ్డి ప్రభుత్వం దిగిపోయి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రభుత్వం ఎక్కే సమయంలో మా ఫ్యాక్టరీ సీజ్ చేసిన APSFC అధికారులు, 1995 వరకూ తిరిగి చూడలేదు గానీ, మా అమ్మా, చెల్లీ,తమ్ముళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాక, 1995 అక్టోబరులో వచ్చి, ఫ్యాక్టరీ ఖాళీ చెయ్యమన్నారు.

మేం మకాం నంబూరు పల్లెకు మార్చాము. అప్పటి వివరాలన్నీ నా గత టపాలు ‘పీవీజీ-రామోజీరావు-మా కథ’ అనే లేబుల్ లో ఉంచాను. 1995 ద్వితీయార్దంలో, నంబూరులోని మా ఇంటి క్రింది వాటాల వాళ్ళు, మమ్మల్ని మంచీనీళ్ళు పట్టుకోనిచ్చే వాళ్ళు కాదు. బావి నీళ్ళ మోటారు మీద నీళ్ళు పోసి, చీటికి మాటికి కాల్చేసేవాళ్ళు. మంచినీళ్ళు, కొళ్ళాయి వస్తున్నంత సేపూ వాళ్ళే పట్టుకునేవాళ్ళు. పైవాటాలో ఉండి నీళ్ళు మోసుకోవటం అంటే చాలా కష్టంగా ఉండేది.

దీనికి అదనంగా కరెంటు వేధింపులూ ఉండేవి గానీ, ప్రస్తుతానికి నీటి వేధింపు గురించి చెబుతాను. [ఈ నీళ్ళూ, కరెంటు వేధింపులు మా మీద 2007 దాకా ప్రయోగింపబడుతూ ఉన్నదే లెండి.] ఈ వేధింపుల నేపధ్యంలో 1997 మార్చిలో, నంబూరులో మా వారి మీద భౌతిక దాడి జరిగింది. మా వారి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. అందరూ చూస్తూ ఉన్నారే గానీ, ఒక్కరూ సాయం రాలేదు. కనీసం మాట సాయం కూడా!

మేము పోలీసు కేసు పెట్టడానికి వెళ్తే, పోలీసులు "ముందుగా వాళ్ళే మీ మీద కేసు పెట్టారు" అన్నారు.

అప్పట్లో రాజీవ్ త్రివేది అనే ఐపీఎస్ అధికారి, గుంటూరుకు ఎస్పీగా ఉండేవాడు. అతణ్ణి కలిసి ఫిర్యాదు చేస్తే "మీరు చదువుకున్నారు. వాళ్ళు ఇల్లిటిరేటెడ్. ఏమో! మీరే వాళ్ళ మీద కేసు బనాయిస్తున్నారేమో?" అన్నాడు. అక్కడ వ్యక్తుల [మాతో సహా] మోటివ్స్ గానీ, కెరీర్ & ప్రీవియస్ రికార్డు గానీ పట్టించుకోలేదు. ఇక అనవసరం అనుకొని, నంబూరు నుండి గుంటూరుకు మకాం మార్చుకున్నాము.

ఇదే మాటను, ఇదే ట్రిట్ మెంట్ నూ, మేము సూర్యాపేటలోనూ ఎదుర్కొన్నాము. ఆ వివరాలన్నీ నేను నా గత టపాలు [వ్యవస్థీకృత వేధింపు] లలో ఉంచినవే!

వెరసి నంబూరు గ్రామంలో ‘నీళ్ళు’ అన్న పైకారణం [over leaf reason]తో మా మీద భౌతిక దాడి చేయటం, బూతులు తిట్టటం, మా కంటే ముందే వాళ్ళే కేసులు పెట్టడం, మేము క్రిందే ఉంచిన ఇనప సామానులు దొంగతనం చేయటం గట్రాలు చేసారు. అంతేగాక మా విద్యార్ది తల్లిదండ్రులే గాక, ఊరి వాళ్ళు కూడా ఎవ్వరూ సహాయం చేయటానికి రాలేదు.

ఇలాగే, సూర్యాపేటలో... మా ఇంటి ఓనరు భాగ్యలక్ష్మి! గతంలో ఆ ఊరిలో ఉన్న ఒక సంపన్నుడి ఇంటిలో పనిమనిషిగా ఉంటూ, తన స్త్రీత్వాన్ని ఎర వేసి, ఉచ్చు బిగించి, యాగీ [బ్లాక్ మెయిల్] చేసి ఆస్థి వ్రాయించుకున్న రికార్డు కలది. ఆమె భర్త అంతకు ముందు టైలరు. తర్వాత చికెన్ కొట్టు యజమానులయ్యారు, పెద్ద ఇల్లు కట్టారు.

ఇదంతా ఆ ఇంటిలో దిగక ముందు మాకు తెలియదు. ముందుగా మాట్లాడుకున్న నియమాలన్నిటినీ ఉల్లంఘించీ, ఆమే మమ్మల్ని... నీళ్ళు, కరెంటు గట్రా అన్ని విధాలుగా వేధించింది. ఉన్న ఫళంగా ఇల్లు ఖాళీ చేయమంటుంది. ఊళ్ళో మరెవ్వరూ ఇల్లివ్వ మంటారు.

ఈ నేపధ్యంలో ఆమె మమ్మల్ని బండబూతులు తిట్టింది. పోలీసులు ఎంత రఫ్ డీల్ చేశారంటే, ఓ రోజు ఓ హోంగార్డు వచ్చి "ఎస్.ఐ.గారు పిలుచుకురమ్మన్నారు మిమ్మల్ని! ఏడీ నీ మొగుణ్ణి బయటకు పిలు!" అన్నాడు. ఎంసెట్ ర్యాంకుల అవకతవకలపై ఫిర్యాదు ఇచ్చినందుకు, మేము ఎదుర్కొన్న వ్యవస్థీకృత వేధింపు అది!

ఇంటికి తాళం వేయటం, పాల వాణ్ణి సైతం రానివ్వక పోవటం గట్రా వేధింపులతో బాటు, నిరంతరం బూతులు తిట్టేది. అద్దె తీసుకోవటానికి తిరస్కరించింది. పోలీసులతో "మేము గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాము. ఎంసెట్ మీద ఫిర్యాదు ఇచ్చిన లెక్చరర్ ని, ఇలా 420 లా డీల్ చేయటం సరికాదు" అని ఆక్రోశంతో వాదించాను.

మా ఇంటి ఓనరు "చావగొట్టి నట్టింట పాతేసినా అడిగే దిక్కులేదు. ఏం చూసుకుని ఇంత పొగరు" అని మమ్మల్ని ఉద్దేశించి అనేది.

గుంటూరు ఎస్పీ రాజీవ్ త్రివేది లాగానే, నల్గొండ ఎఎస్పీ శివానంద రెడ్డి ఐపీఎస్, "మీరు చదువుకున్న వాళ్ళు. వాళ్ళు చదువు రానివాళ్ళు. మీరే వాళ్ళని harass చేయటం లేదని గ్యారంటీ ఏమిటి?" అన్నాడు.

వెరసి ఎంసెట్ ర్యాంకుల ఫిక్సింగ్, ఇంటర్ పేపర్ లింకుల మీద ఫిర్యాదు చేసినందుకు ‘ఇల్లు ఖాళీ చేయటం’ అన్న పైకారణం [over leaf reason]తో పోలీసులు, అన్నిపార్టీల రాజకీయ నాయకులు, మా విద్యార్దుల తల్లిదండ్రులతో సహా సహాయం చేయకుండా, అందరూ కలిసి వ్యవస్థీకృతంగా వేధించారు.

సూర్యాపేట లో సాయం కోసం మేము అన్ని పార్టీ నాయకులు దగ్గరికి వెళ్ళాము. వేధింపు మరింత పెరగటమే గానీ, ఒక్కరూ పైకారణంగా ఉన్న ఇంటి సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇంటికి దాదాపు 47వేల రూపాయల కరెంట్ బిల్లు ఇచ్చారు. అదీ వేధింపు స్థాయి! సూర్యాపేట లోనే... ‘Increase of expenditure and Decrease of income' అన్న స్ట్రాటజీ మాకు చూపించబడింది.

వీటన్నింటిని తర్వాత, ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్ట బడితే, కొన్ని నెలలపాటు, ఆ పంచనా ఈ పంచనా ఉన్నాం. చంద్రబాబు నాయుడి కొడుకుతో స్నేహం చేస్తున్న మా తమ్ముడు, తన వంతు సాయంగా, నానల్ నగర్ లో ఒక రేకుల గది చూసాడు. అక్కడ కామన్ బాత్ రూం, కామన్ టాయ్ లెట్ ఉండేవి.

వీధి కార్పోరేషన్ బోరు పంపు దగ్గర నీళ్ళు పట్టుకునేటప్పుడు, ఆ పంపు ఎదురు ఇంటి అతను తాగి వచ్చి మావారితో కావాలని గొడవ పెట్టుకుని చొక్కా పట్టుకున్నాడు. మా తమ్ముడు డబ్బులు పంపుతుండగా గడిపేవాళ్ళం. చివరికి ఫోన్ కీ కూడా అందుబాటులో ఉండకుండా, డబ్బులు పంపలేదు. చివరికి పస్తులండవలసి వచ్చింది. మా తమ్ముడితో కట్ అయ్యింది. తరువాత వేరే స్నేహితుడి నుండి అప్పు తీసుకొని, చివరికి శ్రీశైలం చేరి స్కూల్ పెట్టుకున్నాం.

ఈ మొత్తం వ్యవస్థీకృత వేధింపు వెనక ఉన్నది.... రామోజీరావు, చంద్రబాబు నాయుడులే! చాలా వరకు ఫిర్యాదు చేసాము. కొన్నింటిని ఊరుకుండి పోయాము.

నంబూరు, సూర్యాపేట, హైదరాబాద్ నానల్ నగర్ లో, మేం పడిన వ్యవస్థీకృత వేధింపు... కొన్ని నెలలు, సంవత్సరాలు సాగితే... చంద్రబాబు బాబ్లీయాత్ర... అయిదు రోజులు సాగింది.

మమ్మల్ని మానసికంగా ‘బ్రేక్’ చెయ్యటం అన్నదే టార్గెట్ గా... చంద్రబాబు, రామోజీరావులు వెనక నడిపించటాన్నే, మా కేసులో సాక్ష్యాధార పత్రాల సహితంగా, దృష్టాంత పూరితంగా నిరూపించాము. ఆ వివరాలన్నీ గత టపాలలో పొందుపరిచిన విషయం మీకు తెలిసిందే!

మేం కొన్ని నెలలు పాటు భరించిన వేధింపుని, బాబ్లీ [నీళ్ళు] అనే పైకారణంతో [over leaf reasonతో] అయిదు రోజులు భరించే సరికే చంద్రబాబు బేర్ మన్నాడు. అసలు మూడు రోజులకే కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

తమను పోలీసులు బూతులు తిట్టారనీ, తిండీ నీళ్ళు ఇవ్వలేదనీ, 70 మందికి ఒకే బాత్ రూమ్, టాయిలెట్ ఉండటంతో నరకం చూశామని, ఔరంగాబాద్ ప్రయాణం 8 గంటలలో మూత్ర విసర్జనకి కూడా బస్సులాపలేదని, రెండు చపాతీలు ఇచ్చారనీ, ఈడ్చుకు వెళ్ళారనీ, కోపం వచ్చిన పోలీసల్లా లాఠీలతో కుళ్ళబొడిచారని, తమ గొలుసులు, డబ్బు, సెల్ ఫోన్ లాక్కున్నారని.... కష్టాలన్నీ వెళ్ళబోసుకుని ఏడ్చాడు.

మేము అందుకున్న వ్యాఖ్యల్ని అతడూ అందుకున్నాడు. వీళ్ళని కొట్టి, ఆపైన మరాఠా పోలీసులే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అచ్చం నంబూరులో మా క్రింది వాటాల వాళ్ళు, తామే మా వారిని కొట్టి, మళ్ళీ ముందుగా తామే మా మీద కేసులు పెట్ట ప్రయత్నించినట్లుగానే....

"వాళ్ళే మమ్మల్ని కొట్టారు. తలలు గోడకేసి కొట్టబోయారు" అన్నారు మరాఠా పోలీసు అధికారులు.

"వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు" అని కూడా అన్నారు.

చంద్రబాబు కూడా... "అడిగే వాళ్ళు లేరు కదా అని, మమ్మల్ని అక్కడే చంపేయాలని కుట్ర పన్నారు" అన్నాడు.

"మేం గౌరవనీయమైన ప్రజా ప్రతినిధులం. మమ్మల్నింత అమర్యాదగా చూస్తారా?" అని దుఃఖ పడ్డాడు.

ఆ విధంగా... ఆ డైలాగులు [హలో బ్రదర్ సినిమాలో లాగా...] అతడికి విన్నట్లో, చదివినట్లో అన్పించక తప్పింది కాదు.

ఒక్క మాటలో చెప్పాలంటే - మాకు చేసిన ‘వేధింపు కర్మలలో’ కొన్నింటిని, చంద్రబాబు యధాతధంగా అనుభవించాడు.

నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, అంత నీచమైన స్థితి సంభవిస్తుందని ఎవ్వరూ ఊహించరు. ఎంత ప్రక్క రాష్ట్రపు పోలీసులైనా, ఐపీఎస్ అధికారుల కన్నా ఒక ‘భయం’ ఉంటుంది.

"ఏమో! ప్రక్క రాష్ట్రానికి ఒకప్పటి ముఖ్యమంత్రి. మళ్ళీ ముఖ్యమంత్రి అయినా, మనం డెప్యూటేషన్ మీద అక్కడికి పోయినా, ఎందుకొచ్చిన ఉపద్రవం!" అనుకుంటారు.

అదీగాక "ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి. ఒకవేళ మళ్ళీ పరిస్థితులు మారి ఇతడికి హవా నడిస్తే... అప్పుడు మనం రిస్క్ లో పడతాం" అనుకునైనా.... రాజకీయ నాయకుల పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు. ‘ఎంత రాజకీయ కారణాలైనా సరే, ప్రాక్టికల్ గా ఫీల్డ్ మీద, ఆయా ఆపరేషన్లని నిర్వహిస్తోంది మనం!’ అనే జాగ్రత్త తీసుకుంటారు.

అలాంటిది, ఎలాంటి జంకూ గొంకూ గానీ, సందేహ భయాలు కానీ లేకుండా, మామూలు జేబు దొంగలకి చూపించినట్లుగా ధర్డ్ డిగ్రీ చంద్రబాబుకి చూపించటం ఎవ్వరూ ఊహించనైనా ఊహించనిది. అతడి మాటల్లోనే చెప్పాలంటే... "70 మంది మీదికి, దాదాపు మూడు నాలుగు వేల మంది పోలీసులు... తలుపులు విరగ్గొట్టి వచ్చారు. బస్సుల దగ్గరికి వచ్చేలోగా, దాదాపు 200 మీటర్ల దూరం, ఎవరికి కోపం వచ్చినా తన్నటమే" అనేంత స్థితి రాదు గాక రాదు.

చేసుకున్న కర్మ అనుభవించవలసి నందునే అంతటి అనూహ్య స్థితి వచ్చి ఎదురుగా కూర్చొంది. మాకు చేసిన కర్మలలో కొన్నిటి సువర్ణముఖి అతడు అందుకున్నాడు. ఒంటరి కావటంతో సహా! చంద్రబాబుని, అతడి బృందాన్ని కొట్టటాన్ని అన్నిపార్టీల నాయకులు, జాతీయ పార్టీ నాయకులు నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు.

ఇతడే కాదు, మమ్మల్ని వేధించిన వాళ్ళలో చాలామంది, తరువాత కాలంలో ‘వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించటం’ జరిగింది. కాకపోతే ఆ విషయాలు మాకు చాలా కాలం తరువాత తెలిసేవి. ఎందుకంటే - వాళ్ళు వాళ్ళ సువర్ణముఖిలు అనుభవించే రోజుల్లో... మేము వేరే విషయాల్లో, సమస్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉండేవాళ్ళం. [అదీగాక మా జీవితంలో గూఢచర్యపు ప్రమేయాన్ని గుర్తించనందునా మేము కూడా మా సమస్యలు తప్ప, మిగిలినవేవి పట్టించుకునే వాళ్ళం కాదు.]

ఇక మా సమస్యలు ఆర్దిక పరమైనవి లేదా కెరీర్ పరమైనవి, లేదా ఆ స్థలం నుండి బయటకు వచ్చేయటం వంటివి అయి ఉండేవి. కొన్ని సంవత్సరాల తరువాత, నాటకీయంగా, ఆ ఊరిలోని వ్యక్తులు కలిసి, ఆయా సంఘటనలు మాకు తెలియజేసేవారు. మొత్తంగా ‘వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించారు’ అన్న విషయం మా కర్ధమయ్యేది. [2005 తరువాత మా జీవితాల్లో గూఢచర్య ప్రమేయం అర్దమయ్యాక, ఈ విషయమై మరింత అవగాహన కలిగింది.]

చంద్రబాబు తన సువర్ణముఖి అనుభవించటం అన్నది, దాదాపు 14 సంవత్సరాల తరువాత, ఇప్పుడు స్పష్టంగా బయటకు కనిపించింది.

ఇక్కడ నేను ఒక విషయం స్పష్టం చేయ దలుచు కున్నాను. మాకు చంద్రబాబు మీద ద్వేషం లేదు. అలాగని జాలి కూడా లేదు. మేం ఒకటే అనుకుంటాం. "మనం అతడి మీద ద్వేష పడినంత మాత్రానో, జాలీ పడినంత మాత్రానో, అతడి కర్మ అతడు అనుభవించక మానడు. మనమే ముందు జన్మలలో ఏదో దుష్కర్మలు చేసి ఉంటాం. ఈ జన్మలో ఇతడి నెపాన అనుభవించాం. అంతే! ఇదే గీత సాధన! ఇలా అనుకుంటే - జన్మజన్మలుండనీ లేకపోనీ, ఆ నమ్మకపు పునాది మీద మనం మాత్రం, మన భావోద్రేకాలని దాటగలం.

అప్పుడే... మనల్ని బాధ పెట్టిన వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు, ‘అయ్యో! వాళ్ళు సుఖంగానే ఉన్నారే’ అన్న దుగ్ధ మనల్ని బాధించదు. అదే విధంగా... మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, ‘హా! వాళ్ళు నానా చావూ ఛస్తున్నారు’ అన్న కచ్చ మనల్ని కాల్చదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా... ప్రశాంతంగా, హాయిగా ఉండగలం" - ఈ సాధనని మేం బాగానే నేర్చుకున్నాం. అదీ గీత మాకు చూపిన మార్గం, గురువు నేర్పిన పాఠం.

అంతే కాదు, ఆధునిక హేతు వాదుల సిద్దాంతం ప్రకారం, జన్మలు లేవనుకున్నా, ‘ఎవరి కర్మకు వారే కర్తలు’ అనుకుంటే, మనం మాత్రం సుఖంగా ఉంటాం. అలాగని ‘తప్పుచేసిన వాళ్ళకి, శిక్ష పడకూడదనీ’ అనుకోం - ఇదీ మా దృక్పధం.

ఇక ఈ వివరణని పక్కన బెడితే.... చంద్రబాబు ‘అనుభవించిన సువర్ణముఖి’ గూఢచర్యమే అయితే... దాన్ని నెం.5 వర్గం విధించాలి. గూఢచర్యాన్ని ఒప్పుకోకపోతే... భగవంతుడే ఆ శిక్షని విధించినట్లు ఒప్పుకోవాలి. నేనయితే రెండింటిని నమ్ముతాను. నెం.5 వర్గం ద్వారా భగవంతుడే ఆ శిక్షను విధించాడనుకుంటాను.

ఇకపోతే... చంద్రబాబు మా పరంగానే కాదు, జనం పరంగా కూడా.... సువర్ణముఖిని అందుకున్నాడు.

పరిశీలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~~~~
Categories: Left

చంద్రబాబు, రామోజీరావు+సోనియాల మధ్య నడుస్తున్న సంకేత భాష![ఒకే అంశం – విభిన్న కోణాలు -04]

Tue, 07/27/2010 - 04:25
మామూలుగా అందరిలాగే, చంద్రబాబు కూడా ‘రామోజీరావు కాంగ్రెస్ కి వ్యతిరేకం, తెదేపాకి అనుకూలం’ అనుకున్నాడు కొంతకాలం పాటు! వై.యస్. పాదయాత్రకు పూర్తి కవరేజి, అతడికి ఇమేజి ఇచ్చి సీఎం ని చేస్తున్నప్పుడు దుఃఖ పడ్డాడు. అంతకు ముందు సీటు దిగనని మొరాయించాడు. అలిపిరి దాడితో దెబ్బకు దిగి వచ్చాడు.

అయితే ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ వంటి రాజకీయ పైకారణాలతో, రామోజీరావు ‘ఓసారి తెదేపాని, మరోసారి కాంగ్రెస్ ని పైకెత్తటం [కుర్చీలాటలో లాగా] తెలిసిందే కదా’ అని సరిపెట్టుకున్నాడు. 1989 లో చెన్నారెడ్డి, 1990లో జనార్దన రెడ్డిల మాదిరిగా వై.యస్. కూడా అనుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళల్లో కొందరికి సీన్ ఇచ్చినా, కేంద్రంలో కాంగ్రెస్ కి మాత్రం రామోజీరావు వ్యతిరేకేనని నమ్మాడు.

2004 లో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఇందిరాగాంధీకి వ్యతిరేకి అయిన రామోజీరావు, సోనియాకీ, అంత స్థాయిలో వ్యతిరేకి కాకపోయినా... సంపూర్ణ అనుకూలుడని మాత్రం, ఊహించలేక పోయాడు. గూఢచర్య జ్ఞానాన్ని గ్రహించటంలో ఎంత నేర్పరికైనా, తన చుట్టూ కప్పబడే ఇనుప తెర, చూపించబడిన వర్ణ చిత్రాన్ని దాటి చూడటం అసాధ్యం కూడా!

మార్గదర్శి పేరిట ‘రాజ రామోజీ రావుల యుద్దం’ నడుస్తున్న రోజుల్లో కూడా ‘ఎందుకో ఇద్దరికీ ప్రస్తుతం చెడినట్లుంది’ అనుకున్నాడే గానీ, కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానమూ, రామోజీరావు, వై.యస్. కలిసి నాటకం ఆడుతున్నారనుకోలేదు. అనుమానం వచ్చినా ఎవరు తీర్చగలరు? అలాంటి చోట... వై.యస్. ఆడిన సందట్లో సడేమియా నాటకం, గారెల వంట గూఢచర్యం [చంద్రబాబు] ఎలా గ్రహించగలడు!

కాబట్టే, 2009 ఎన్నికలలో తనకి తప్పకుండా అవకాశం వస్తుందని ఆశపడ్డాడు. కాంగ్రెసేతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడేందుకు పెనుగులాడాడు. అదే డిస్ అడ్వాంటేజ్ అయ్యి, తెరాస కేసీఆర్, సీట్ల సర్ధుబాటు విషయంలో, పుణ్యకాలం కాస్తా కరిగించాడు. వెరసి, నెలకి రెండు వేల రూపాయలు నగదు బదిలీ పధకం చేపట్టినా, వైఫల్యం చెందక తప్పలేదు.

ఎన్నికల ప్రచార సరళిలో మీడియా వైఖరి, అతడి ఆశలకి ఆదిలోనే గండి కొట్టింది. కుటుంబాన్ని ఒక తాటి మీదకు తెచ్చుకున్నా ఫలితం లేక పోయింది. జూనియర్ ఎన్టీఆర్ కి ఈనాడు ఇచ్చిన కవరేజిలో ఆశలు రెప రెప లాడినా, త్వరలోనే నీరు గారి పోయాయి. ఫలితాలు జావ గారి పోయాయి.

ఆ గందర గోళంలో, పరిస్థితులను గూర్చిన అయోమయంలో అతడుండగానే, వై.యస్. దారుణ మరణాన్ని పొందాడు. తర్వాతే చంద్రబాబుకు పరిస్థితుల పట్ల ఓ స్పష్టత వచ్చింది. ‘వై.యస్. జగనూ, కాంగ్రెస్ అధిష్టానాల అంతర్లీన పోరు’ నేపధ్యంలో, రాజకీయ వర్గాల్లో లోతట్టున షికార్లు చేసే సమాచారం, అతడి అవగాహనకి మరింత బలాన్ని సమకూర్చింది. అప్పటికి... అతడికి, ‘రామోజీరావుకీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఉన్న సంబంధం’లోని నిగూఢ గాఢత బాగా అర్దమైంది.

ఈ నేపధ్యంలోనే, అతడు, తన గూఢచర్యపు అవగాహనని సమగ్రీకరించుకొని, తన పరిధిలోని వారికి పంపకం మొదలు పెట్టాడు. అప్పటి నుండీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాల గురి చంద్రబాబు మీదికి తిరిగింది.

అప్పుడే - తోక ఝాడిస్తున్న జగనూ, చంద్రబాబూ వగైరా రాష్ట్ర రాజకీయ నాయకులే గాక, జాతీయ నాయకులకు కూడా ‘మధు కోడా’ దెబ్బలబ్బాయిగా చూపెట్టబడ్డాడు. ‘రాజకీయాల్లో అక్రమార్జన చేసి, దాచుకున్న నిల్వలన్నిటికీ కన్నాలు పెట్టీ, ఐటీ దాడులతో కొడతాను జాగ్రత్త!’ అన్న హెచ్చరిక అది. దెబ్బతో చిరంజీవి లాంటి రాజకీయ కమేడియన్లు, కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ మీద పడ్డారు. [చిరంజీవికైతే పైరసీ దెబ్బకూడా చూపెట్టారు. మగధీర సినిమా పైరసీ సీడి, సినిమా విడుదలకు ముందురోజే వచ్చేసింది.]

జగన్ కి కూడా... అధిష్టానంతో రాజీ పడి, సందుగొందుల్లో తిరిగినా, కొన్ని నెలల అనంతరమైనా రహదారి ఎక్కి, ఎదురు పోరాటం తప్పలేదు. రాజకీయంలోనూ, గూఢచర్య అవగాహన లోనూ, జగన్ కంటే చంద్రబాబుది సుదీర్ఘ అనుభవం. అందుచేత ఇతడు ‘సందుగొందుల్లోకి ప్రయాణించినా నిష్ఫలం’ అన్న సంగతి ముందే గ్రహించాడు. ‘ముందుకు పోవటమే బెటర్’ అనుకున్నాడు. అందుచేత, తన గూఢచర్య అవగాహనని అందరికీ పంచటం ఆపలేదు.

ఇదే సమయంలో తెలంగాణా రచ్చ మొదలైంది. అప్పుడు కూడా, కేసీఆర్, కాంగ్రెస్ మీద గాకుండా, తెదేపా మీదే గురిపెట్టుకు తిట్టటం, విమర్శించటం వంటివి చేశాడు.

‘గూఢచర్య సమాచార పంపిణీ’ అనే కార్యక్రమంలో, చంద్రబాబుకి సహకరిస్తున్నందున, తెదేపాలోని కొందరు నాయకుల మీద కూడా టార్గెట్ చేయబడింది.

ఇందులో భాగమే, నాగం జనార్దన రెడ్డికి ఓయూలో తన్నటం! కిరాయి రౌడీలే ఈ పని చేసారని, ఓయూ విద్యార్దుల ప్రమేయ మందులో లేదనీ తర్వాత వార్తలొచ్చాయి.[అది, మరో కోణంలో చంద్రబాబుకి హెచ్చరిక కూడా!] అంతగా భౌతిక దాడి జరిగినా... చంద్రబాబు గానీ, అతడి అనుచరులు గానీ, ‘లోతట్టు సమాచారాల సేకరణ, విశ్లేషణ, ఆపైన తమ గూఢచర్య అవగాహనల పంపకం’ చేయటం మానలేదు. [అది మరి వాళ్ళ ఎదుట ఉన్న ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీ! ‘చంపు లేదా ఛస్తావు, దెబ్బకొట్టు లేదా దెబ్బతింటావు’ అనే విధంగా, ఎదుట నిలబడిన, అనివార్య ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్ల వంటివి.]

ఇది ఎంతగా కొనసాగిందంటే - ఓయూలో నాగం జనార్దన రెడ్డిని స్పృహ తప్పేలా కొట్టినా సరే.... తదుపరి జరిగిన తెలంగాణా జేఎసీ సమావేశాలకి హాజరైన నాగం బృందం, తెరాస, తెలంగాణా కాంగ్రెస్ నాయకులని మాటలతో కెలికి, లోగుట్లు తెలుసుకు పోవటం ఆపలేదు. తర్వాత్తర్వాత, జేఏసీ మీటింగ్ లకి నాగం బృందం హాజరవ్వటం, అప్పటి వరకూ అందులో రెగ్యులర్ గా పాల్గొంటూ వస్తున్న తెరాస నాయకులు , మరి కొందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా,గైర్హాజరయ్యారు. ఆ జేఏసీని నీర్చుగార్చటం మొదలు పెట్టారు. ఆ తర్వాత, జేఏసీ లోంచి తెదేపా బయటకు ‘వచ్చింది.’

క్రమంగా ‘గూఢచర్య అవగాహనా పంపిణీ’ కార్యక్రమాన్ని, జాతీయ స్థాయిలో... లాలూ, పవార్, శరద్ యాదవ్ గట్రాలకి కూడా చంద్రబాబు విస్తరించాడు. తనకి తక్షణ ఫలితం రాకున్నా, ఎదిరి వర్గానికి [రామోజీరావు+సోనియాలకి] ఇరుకు సృష్టింపబడటం, పరిస్థితుల మీద మరింత అవగాహన కలగటం, తన అనుభవానికి తెలుస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే... కాంగ్రెస్ అధిష్టానమూ, మీడియా రాజకీయమూ, చంద్రబాబుకి నయానా భయానా చాలానే చెప్పజూసింది. అధిష్టానం ‘ఐటీ దాడులనీ, సాధారణ నాకా బంధీలలో పట్టుబడ్డ నల్లడబ్బుల్నీ’ చూపించింది. ‘ఆ సమాచార పంపిణీ ఆపకపోతే డబ్బులన్నీ కరిగిస్తా!’ అన్న హెచ్చరిక అది.

మీడియా, చంద్రబాబుని వీలైనన్ని రకాలుగా ఏకాకిని చేసింది, ఇబ్బందుల పాలు చేసింది. ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు అతడి మీద పడ్డాయి. చదువరులకది సొల్లులాగా ఉంటుంది. కానీ, అనుభవించే చంద్రబాబుకి అది చాలా బాధ పెడుతుంది. ఎలాగంటే - పార్టీ సీనియర్లు పార్టీని వీడబోతున్నారని ప్రచారం. దాన్ని ఎదుర్కొని, సరిదిద్దుకునే సరికి, చంద్రబాబుకు తల ప్రాణం తోకకి వస్తుంది. ‘హయ్మయ్య’ అనుకునేంత లో, కుటుంబంలోనే "ఇదిగో బాలకృష్ణ పార్టీని చేతిలోకి తీసుకోబోతున్నాడట" అనే వార్తాంశం షికారు మొదలు పెడుతుంది.

నిజానికి దీని వెనుక స్ట్రాటజీ ఏమిటంటే - ఒక దశలో బాలకృష్ణ తాను ‘సీఎం పదవికి నేను రెడీ’ అని ప్రకటించాడు కూడా! అంటే ఒక వేళ చంద్రబాబు కాల్షీటు ముగించినా, తదుపరి పగ్గాలు తాను చేపట్టి, చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న పనిని కొనసాగిస్తానన్న హెచ్చరిక, బాలకృష్ణ+చంద్రబాబులు, ఆ విధంగా బయటకు ఇచ్చారన్న మాట.

తరువాత చంద్రబాబు ‘ఇలాంటివి నాలుగు రోజులు ప్రచారంలో ఉండి ఆరిపోతాయి. వాటిని పట్టించుకోనక్కర లేదు’ అన్నాడు. ఆ తరువాత బాలకృష్ణ ‘తమ నాయకుడు చంద్రబాబేనని, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని’ ప్రకటించటంతో, ఆ సమస్య మీడియాలో చల్లారింది. ఇలా ప్రకటించటం, నెం.5 వర్గానికీ, నెం.10 వర్గానికీ తమ గొంతు వినిపించటం కోసమే!

కాని, ఈ సంఘటనల కాలంలో మాత్రం, చంద్రబాబు బయట దొరికాడో, విలేఖర్లు ఈగల్లా ముసురుకుని, దోమల్లా కుట్టడం ప్రారంభించారు. చికాకు తప్పించుకునేందుకు బయటకు రాకపోతే, "చంద్రబాబు లోపల దాక్కున్నాడేం? బయటకు రాడెందుకని?" అంటూ కేసీఆర్ లూ, రాంరెడ్డి దామోదర రెడ్డిలు నోరు చేసుకున్నారు. ఏం చేసినా డిజ్ అడ్వాంటేజే!

ఇలాంటి చికాకులనీ, ఇక్కట్లనీ తప్పించుకోవాలంటే... చాలా సహనం, సంయమనం అవసరం. ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగే దాకా, ఇలాంటి ‘పంటి క్రింద రాయి, చెవిలోని జోరిగ, చెప్పులోని రాయి, ఇంటిలోని పోరు’ చంద్రబాబుకి చుక్కలు చూపెట్టాయి. [అదే కాంగ్రెస్ అధిష్టానం సోనియా అయితే ఎప్పుడూ బయటకు రాదు, విలేఖర్లకు దొరకదు. అయినా గానీ ఎవ్వరూ విమర్శించరు. అదే చిత్రం ఇక్కడ! కాని అందరికి తెలుసు కాంగ్రెస్ ప్రతిచర్య వెనుక సోనియానే ఉంటుందని. గతంలో ఇందిరాగాంధీ కూడా చంద్రబాబుల్లాగే విలేఖరుల ‘ఈగా,దోమ’ సమస్యలు ఎదుర్కుంది.]

ఇక ఆ క్రమంలో... చంద్రబాబు, కుటుంబ సభ్యులకీ, బంధు కుటుంబాలకీ [పురంధరేశ్వరి, లక్ష్మీ పార్వతీలతో సహా] సమాచారాన్ని పారదర్శకంగా అందించి, ‘ఐకమత్యంగా ఉండకపోతే, ఏ పార్టీలో ఉన్నా మట్టి కలవటం ఖాయమనీ, రామోజీరావు ఎవరినైనా ఉపయోగించుకొని, ఆనక కూరలో కరివేపాకులా తీసి పారేస్తాడనీ’ సోదాహరణంగా తన జీవిత విశేషాలతో సహా వివరించాడు. దాంతో కొన్ని చికాకులు తగ్గాయి.

క్రమంగా బయట సమస్యలు పెరిగాయి. ప్రజలలో ఇమేజి తెచ్చుకోవాలంటే, మీడియా కవరేజి ఇస్తే సరిపోతుంది. లేనట్లయితే... సభలూ, ర్యాలీలు.... అంటూ ఏదో అలజడి చేయాలి. జనాన్ని సమీకరించటం దగ్గరి నుండి, సభా నిర్వహణల దాకా అన్ని ఖర్చుతో కూడుకున్నవే! ఇంతా చేసినా, మీడియా కవరేజి ఇవ్వకపోతే దండగే! కవరేజి ఇచ్చినా ‘శల్య సారధ్యం’ లాగా ఇస్తే వొరిగేదేం లేదు.

ఈ పరిస్థితుల్లో.... చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడిన ఎలుక లాంటిదే! కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు పెద్దలు. అధికారం లేకపోతే ఆదాయం లేదు. వార్తల్లో, రాజకీయాల్లో లైవ్ గా ఉండకపోతే, కొన్నాళ్ళకి పార్టీ డెడ్ అయిపోతుంది. దాంతో ‘ఖర్చులు పెరగటం, ఆదాయం తరగటం’ అనే పెనం మీద ఉన్నట్లయ్యింది అతడి పరిస్థితి! [increase of Expendature, Decrease of Income అన్నది ఒక స్ట్రాటజీ!]

తాత్కాలిక రాజీలు పడినా, రాణించేదేమీ లేదన్నది జగన్ ఉదంతం నిరూపించింది. దాంతో ‘లోతట్టు సమాచార సేకరణ - విశ్లేషణ, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకున్న తన గూఢచర్య అవగాహన’ని పంపిణీ చేయటం ఆపలేదు సరికదా, మరింత పెంచాడు.

ఎన్ని బెదిరింపులు బెదిరించినా, 7కోట్లు నల్లడబ్బుని హుహ్ కాకీ అనిపించినా[7కోట్లు అన్నవి ఒక నెపం మాత్రమే], ఆగని చంద్రబాబుని "ఆగకపోతే ఎంతకైనా వెళ్తాం! కుళ్ళ బొడవ గలం! బూతులు తిట్టించి, కొట్టించగలం! ‘ఆ ఊ’ అన్నావంటే, పక్కా పైకారణాలు చూపెట్టి శాల్తీలని గల్లంతు చేయగలం! ఖబడ్డార్!!" అనటానికే, బాబ్లీ యాత్ర కెళ్ళిన బాబుని ‘చితక్కొట్టి, విమానంలో పడేసి పంపించటం’గా పరిణమించింది.

బాబు బాబ్లీ యాత్రకి వెళ్తానన్నప్పుడే... రోశయ్యా, అతడి మంత్రులూ, [ఎర్రపార్టీల వాళ్ళతో సహా] చంద్రబాబుకి వెళ్ళవద్దని హితవు చెప్పారు. అన్యాపదేశంగా, "వెనక్కి తగ్గు, లేకపోతే అవమాన పడతావు" అన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. [ఇదే హెచ్చరిక కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపడతానన్నప్పుడు, ప్రధానితో సహా, చాలామంది జాతీయ నాయకులు చెప్పారు.]

"ఎంతైనా రాజకీయ నాయకుణ్ణి. తొమ్మిదేళ్ళు రాష్ట్ర సీఎంగా ఉన్నవాణ్ణి! ఎంతగా ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందనుకున్నా, ఎంత చేస్తారులే!" అనుకున్నాడు. ‘చొక్కా పట్టుకు లాగటం, చింపి పాతరెయ్యటం, మెడపట్టుకు తోయటం, తిట్టి, తన్ని తగలెయ్యటం’ వంటివి ఊహించనైనా లేదు. అటు జగన్ శిబిరానికీ, లోలోన తోక ఝాడించాలనుకుంటున్న లాలూ గట్రాలకి, మాయవతిల దగ్గర నుండి చాలామందికీ, ఈ దెబ్బలబ్బాయిని ‘మహా’ కిరాతకంగా చూపెట్టారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు సోనియా, రామోజీరావులు.

"ఎంతకైనా తెగిస్తాం. మక్కెలిరగ్గొట్టటమే కాదు, కాల్పులు జరిపి, పైకారణాలు ప్రచారిస్తాం" అనేంత తీవ్రమైన హెచ్చరిక అది. [ఇందిరాగాంధీ ని హత్య చేసి ఆపరేషన్ బ్లూస్టార్ నీ, రాజీవ్ గాంధీని హత్య చేసి ఎల్టీటీఈనీ చూపించినట్లుగానే!]

చంద్రబాబుని, ముందుగా బాబ్లీ చూపిస్తాం రమ్మని తీసికెళ్ళి, ధర్మాబాద్ ఐటీఐలో నిర్బధించారు. కటిక నేల మీద కూర్చోబెట్టటం, తిండీ నీళ్ళూ ఇవ్వకపోవటం, కరెంటు లేకుండా కూర్చోబెట్టటం, మానసికంగా ‘బ్రేక్’ చెయ్యటమే లక్ష్యంగా సాగిన ప్రహసనం అది! ప్రాణ భయం కూడా సరిపడినంతగా పెట్టామనుకున్నాకే, విమానంలో కూలేసి వెనక్కి పంపారు. ఒంటరిని చేయ ప్రయత్నించటమూ మానసిక తంత్రమే!

క్రమంగా, బాబ్లీ యాత్రలో బాబు మీద దాడి తీవ్రత, పెంచుతూ పోయారు. ఒంటరిగా అయితే "నా చుట్టూ నా వాళ్ళుంటే ఇంత జరగక పోను!" అనే భావం చంద్రబాబుకి మిగలకుండా, బృందంతో సహా, అందునా ఆడవారిపై కూడా... అమర్యాద, జులుం చూపెట్టి వదిలారు. అంతేగాక, జాతీయ స్థాయిలో ఏ నాయకులు, చంద్రబాబు గురించి అగ్గగ్గలాడకపోవటం చూపెట్టం ద్వారా ‘నీకోసం ఎవరూ రారు సుమా!’ అన్నట్లుగా, మొత్తం తమ గ్రిప్ ని చూపించారు.

తెదేపా, రాష్ట్రంలో [19 జూలై] ఒక రోజు బంద్ చేయించారు. ఆ తర్వాతే చంద్రబాబునీ, అతడి బృందాన్ని మరాఠా పోలీసులు కుళ్ళ బొడిచారు.

"నీ చుట్టూ ‘మందిబలం’ ఉన్నా ఏం లాభం లేదు. జనాలు వచ్చినా లాభం లేదు" అన్న దాన్ని, ఆ విధంగా అతడికి ఇంకించే ప్రయత్నం చేసారు. ఎన్ని రోజులని బందులకు పిలుపివ్వగలరు? ఓ ప్రక్క కోర్టులు ఊరుకోవు. మరో ప్రక్క, చీటికి మాటికి బందులంటే ప్రజలూ ఊరుకోరు. [ఇదే హెచ్చరిక వై.యస్. జగన్ కి, అతడి వర్గానికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది.]

ఆనాటి ఎన్టీఆర్ బర్తరఫ్ [నాదెండ్ల భాస్కర రావుతో] రోజుల్లోలా జనాలు ఉర్రూత లూగి, మద్దతుగా వచ్చేందుకు... మీడియా, ఆ విధంగా జనాలని ట్యూన్ చేయటం లేదు కదా! ఒక రోజు కూలీ ఇచ్చి జనాలని.... సభలకీ, ధర్నాలకీ, ర్యాలీలకీ సమకూర్చు కోవాలంటే, బాగా ఖర్చు అవుతుంది. ఎటూ ‘ఖర్చులు పెంచటం, ఆదాయానికి గండి కొట్టటం’ తమ మీద అమలు పరుస్తున్న తంత్రమేనయ్యే! మరి ఎలా తమని తాము రక్షించుకోవటం?

ఆ అగచాట్లే ఇప్పుడు చంద్రబాబువి!

అయితే.... రామోజీరావు దర్శకత్వంలో, కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన "బాబు బాబ్లీ యాత్ర కెళ్తే, కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టటం" లో మరో విభిన్న కోణం ఉంది.

అది చంద్రబాబు సువర్ణముఖి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

రామోజీరావు + కాంగ్రెస్ అధిష్టానానికీ, చంద్రబాబుకీ మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం![ఒకే అంశం – విభిన్న కోణాలు -03]

Mon, 07/26/2010 - 04:45
సాధారణంగా రాజకీయ నాయకులు, ప్రజా సమస్యలు పట్టుకుని [ధరలు పెరిగాయనో, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనో, తమ పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారనో/ పధకాల వర్తింపులో అన్యాయం జరుగుతుందనో, మరో xyz అనో... ] ధర్నాలు, రోడ్దు రోకోలు చేస్తుంటారు. [ఎక్కువగా ఎర్రపార్టీల వాళ్ళిలా చేస్తుంటారు. ఆ క్రమంలో కాసిన్ని తన్నులూ తింటుంటారు. తన్నులు తినటమే... పైకి ఎదగటానికి మార్గం అనుకునే సంస్కృతి ఎర్రపార్టీలలో ఉంది.] నిరాహార దీక్షలూ చేస్తుంటారు. [తెలంగాణా కోసం కేసీఆర్ చేసిన దొంగ దీక్షల్లాగా కూడా!] అలాంటప్పుడు, మామూలుగానే పోలీసులు వాళ్ళని అరెస్టులు చేస్తుంటారు.

అంతే గానీ... కుళ్ళ బొడవరు, చితక్కొట్టరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక కెరీర్ రికార్డు ఉంది. ఐటీ అభివృద్దితో జాతీయఖ్యాతి గడించిన వాడు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక వ్యక్తిగా వ్యవహరించిన వాడు. అలాంటి వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది.

అలాంటి చోట... తెదేపా నేతల్ని ‘బాబ్లీ చూపిస్తాం రమ్మని’ నమ్మించి తీసికెళ్ళి [చంద్రబాబు ఇలాగే చెప్పుకున్నాడు మరి!], చెప్పులూడి పోయేదాక, దుస్తులు చిరిగి పోయే దాకా.... ఎలా కుళ్ళ బొడవ గలిగినట్లు?

పైగా ‘వాళ్ళ బాధలు చూడలేక, తామే విమాన ఖర్చులు భరించి, వెనక్కి రప్పించామని’ ముఖ్యమంత్రి రోశయ్య సెలవిచ్చాడు. వాళ్ళ బాధలు చూడలేనప్పుడు "నేరగాళ్ళ మీదే ధర్డ్ డిగ్రీ ఉపయోగించరు. అలాంటిది, మాతోటి ప్రజా ప్రతినిధులని అలా విరగ తన్నటం ఏమిటి?" అని మహారాష్ట్రని నిలదీయాలి గానీ, "ఏదో ఒక బండిలో ప్యాక్ చేసి పంపండి" అనటం ఏమిటి? ఖర్చులు భరించి... చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం, మిగిలిన తెదేపా నేతలందరికీ కలిపి ఒక విమానం ఎందుకు సిద్దం చేయించినట్లు?

‘ఔరంగబాద్ జైలుకి తీసికెళ్తున్నామని చెప్పి, ఎయిర్ పోర్టుకి తీసికెళ్ళారని’ చంద్రబాబు చెబుతున్నాడు. అంటే 20 జూలై, 2010, మంగళ వారం, ముందుగా రోశయ్య ప్రభుత్వం చెప్పినందునే, వాళ్ళని ధర్మాబాద్ నుండి ఔరంగాబాద్ కు తరలించి, విమానంలోకి ఎక్కించి పంపించారా? అంటే ‘వాళ్ళని తన్ని మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ కు పంపండి’ అని చెప్పాడా, రోశయ్య[అధిష్టానం]?

"కేసులు ఎత్తేసాం. వెళ్ళిపొండి" అన్నారు మరాఠా పోలీసులు. ఆ తర్వాత మరాఠా గృహమంత్రి పాటిల్ "అదేం లేదు. వాళ్ళ మీద కేసులు అలాగే ఉన్నాయి" అన్నాడు. [అసలుకే... కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పి, ఆస్తిపాస్తుల్ని అమ్మించటం, చాలా సులభమన్నది ఈ రాజకీయ నాయకులకి బాగానే తెలుసు.]

దీన్నంతటినీ తెదేపా వాళ్ళు, కోర్టులో సవాలు చేయక పోవటం వింతే! నిజామాబాద్ నుండి ఓ నారాయణ ప్రజావ్యాజ్యం [పిల్] వేసాడు.

సాక్షి దిన పత్రిక, 22 జూలై, 2010, మొదటి పేజీలో చెప్పినట్లుగా, హైకోర్టు:

>>> అన్నీ తెలిసిన వ్యక్తులు అక్కడికి ఎందుకు వెళ్ళారు?
అక్కడికి వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా...
వారు చట్టాన్ని ధిక్కరించవచ్చా, శాంతి భద్రతల సమస్య సృష్టించవచ్చా?
మహారాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల చర్యలు తీసుకోకూడదా!
శాంతి భద్రతల విధులను నిర్వర్తించవద్దని ప్రభుత్వాలను ఆదేశించగలమా?
రాష్ట్రం పరిధిలోని వ్యవహారంలో కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది?
ఇటు వంటి వ్యాఖ్యాలను విచారించే ప్రసక్తే లేదు... పిటిషనర్ ను హాజరు పరచండి.

అన్నది. నిజానికి మొదట, ఆంధ్రా మహారాష్ట్ర సరిహద్దుల దగ్గర, మరాఠా పోలీసులు కదా చంద్రబాబుని, అతని బృందాన్ని ‘బాబ్లీని చూపిస్తామని’ తమ వ్యానుల్లో తీసుకెళ్ళి, ఆ తరువాత మీరు అరెస్టు చేయబడ్డారని చెప్పింది? దీన్ని కదా కోర్టు మొదట విచారించాలి. అది తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడింది కోర్టు.

గతంలో కొన్ని వందల వేల పిల్స్, రకరకాల విషయాల గురించి, కోర్టుల్లో పడి ఉంటాయి. అప్పుడెప్పుడూ కూడా "నీకేం అవసరం? నువ్వెందుకు కేసు వేసావు? నీకేం అధికారం ఉంది? నీకెవరు అధికారం ఇచ్చారు? అసలు వాళ్ళకీ నీకూ సంబంధం ఏమిటి?" అని, కోర్టు, పిల్ వేసిన వాళ్ళని అడిగినట్లు వార్తలు లేవు. ఆ ‘పిల్స్’ ‘వేసేంత అవసరం ఉందా? లేదా?’ అన్నది చూడటం మాత్రమే కోర్టు చేసింది. అవి కూడా ఆప్రాధాన్య విషయాల మీదే ఎక్కువ!

చివరికి జంతు పరిరక్షణ కై వేయబడ్డ కేసుల్లో కూడా, "సదరు ప్రాణులు నీకు అధికారం ఇచ్చాయా?" అని కోర్టులు అనవు కదా? మీదు మిక్కిలి "ఇలాంటి పిల్ వేసినందుకు జరిమానా వేస్తాం. సోమవారం కోర్టుకు ఫిర్యాదుదారుణ్ణి హాజరు కమ్మనండి" అంటూ హుకుం జారీ చేసింది కూడా!

ఇది చూసాక... ఇక తెదేపా వాళ్ళు గానీ, చంద్రబాబు గానీ, వాళ్ళ తరుపున మరొకరు గానీ సుప్రీం కోర్టుతో సహా ఏ కోర్టుకీ వెళ్ళే ఆలోచన చేయరు, చేయించరు. అవినీతి నేరాలతో ఎందరో న్యాయమూర్తుల కేసులు బహిర్గతం అయ్యాక... కోర్టులు నీతికి నిలయాలనీ, న్యాయమూర్తులు నిజాయితీకి నిలువెత్తు రూపాలనీ, ఈ రాజకీయ నాయకులు నమ్మరు. మన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సింఘ్వీ విషయంలో, ఇది మాకు స్వానుభవం. దీని గురించి గత టపాలలో వ్రాసాను. ఆధార పత్రాలను స్కాన్ చేసి, మా ఆంగ్లబ్లాగు ‘Coups On World' లో ఉంచాను.

పైకి అనక పోయినా, న్యాయమూర్తుల పదవులకి సంబంధించిన బదిలీలూ, పదోన్నతలూ అన్నీ... కేంద్రప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నాక, [రాష్ట్రపతి భవనం రబ్బరు రహదారి, రాష్ట్రపతి రబ్బరు బొమ్మలే కదా!] కోర్టు తీర్పులూ, న్యాయమూర్తుల వ్యాఖ్యలూ, సామాన్యులకి అర్దం గాకపోయినా, చంద్రబాబు నాయుడి లాంటి ముదురు రాజకీయ నాయకులకి బాగానే తెలుసు.

కాబట్టే ‘మెతుకు పట్టి చూస్తే తెలియదా అన్నం ఉడికిందో లేదో చెప్పటానికి?’ అన్నట్లు, రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యను చూడగానే అర్ధమైంది, చంద్రబాబుకి, తనకి కోర్టు ద్వారం మూయబడిందని. గూఢచర్యపు వలయంలోకి ఇష్టపూర్తిగా దిగబడ్డాక, తనకి తెరచి ఉన్న ద్వారం తప్ప మిగిలిన వేవీ వర్కవుట్ కావు. అచ్చం గదిలో బంధించిబడిన పాముకి, తెరచి ఉన్న దారి తప్ప మరేదీ ఉండనట్లు!

కొన్నిరోజుల క్రితం... సానియా మీర్జా వరుడు సోయబ్ మాలిక్ Vs ఆయేషా సిద్దిఖీ కేసులో... షోయబ్ ‘సిద్దిఖీ మీద పరువు నష్టం దావా వేస్తాననీ, కోర్టు కెక్కుతాననీ’ బీరాలు పలికాడు. అదే సమయంలో కోర్టు, ఇలాంటి మరో కేసులో "ఇవాళ పెళ్ళి చేసుకోవటం - రేపు కాదనటం ఫ్యాషనై పోయింది" అని చురక వేసి వ్యాఖ్యానించింది. దెబ్బతో షోయబ్, తనకి కోర్టు ద్వారం ముసుకుపోయిందని అర్ధమై, ఆ దారి తొక్కలేదు. గూఢచర్యంలో ప్రవేశం ఉన్నవారికి, ఆ మాత్రం [సంకేత] భాష బాగానే అర్ధమౌతుంది.

ఇక చంద్రబాబునీ, అతడి బృందాన్నీ మరాఠా పోలీసులు కొట్టి తిట్టి పంపించేశాక కూడా అటు శివసేన నేత బాల్ థ్రాక్రే, ఇటు మహారాష్ట్ర గృహమంత్రి పాటిల్ కూడా బాగానే నోరు చేసుకున్నారు.

సరే, వాళ్ళు ప్రక్క రాష్ట్రపు వాళ్ళు! అందునా.... కొళాయిలో నీళ్ళ దగ్గర, ఇరుగుపొరుగులు, ఒకళ్ళు మరొకళ్ళని నీళ్ళు పట్టుకోనివ్వడం లేదనో, ఒకళ్ళ మరొకళ్ళకి నీళ్ళు రానివ్వడం లేదనో... తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అలాగే, దిగువ రాష్ట్రాల వాళ్ళు, ఎగువ రాష్ట్రాల వాళ్ళతో, తమ నీటి వనరులకి గండి కొడుతున్నారని వివాద పడతారు. కాబట్టి, ఎగువ రాష్ట్రమైన మరాఠా రాజకీయ నాయకులు, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులైన తెదేపా వాళ్ళని, తిట్టి కొట్టారనుకుందాం.

అప్పుడు మిగిలిన ఆంధ్రా నాయకులైనా బాబుకు గట్టిమద్దతుగా రావాలి కదా? ఎర్రపార్టీలు గానీ, తెరాస ప్రరాపాలు గానీ, కాంగ్రెస్ గానీ... ఒక్క పార్టీ రాలేదు, మచ్చుకి ఒక్క నాయకుడూ రాలేదు. కనీసం చంద్రబాబు బృందానికి "అరే! పాపం! ప్రక్క రాష్ట్రానికి పోయి, మనకు నీళ్ళ కోసం, తన్నులు తిని వచ్చారే" అనే సానుభూతి కూడా రాలేదు.

నిజానికి.... మీడియా తలుచుకుంటే అదేమంత విషయం కాదు. ఈ పాటికి చంద్రబాబు ‘ఆంధ్రా భగీరధుడు’ అయిపోయి ఉండేవాడు. అలాంటి సహకారాన్ని, మీడియా, బాబుకి ఇవ్వలేదు గాక ఇవ్వలేదు. చితక్కొట్టించుకున్న నాలుగు రోజులు కూడా, చిలవలూ పలువలూ, చంద్రబాబు అగచాట్ల గురించే చెప్పబడింది గానీ, బాబ్లీలో నీళ్ళ కోసం అతడి effort ని గానీ, వాళ్ళ [so called] పోరాటం గురించి గానీ, మీడియా చెప్పలేదు.

అదే మీడియా చెప్పదలుచుకుంటే... తాను పాజిటివ్ బాకా ఇవ్వదలుచుకుంటే... ఎలా ఉంటుందో -

1982-83ల్లో ఎన్టీఆర్ ని ఈనాడు ఆకాశానికి కెత్తేసిన నాడు మనకు తెలుసు. తెలుగు వాడి ఆత్మగౌరవం అంటూ పలికిన నాడు తెలుసు.

గతంలో, అంతదూరం ఎందుకులే అనుకుంటే, గత ఏడాది సెప్టెంబరులో, వై.యస్సార్ చనిపోయినప్పుడు, ఈనాడు అతణ్ణి ‘దేవుణ్ణి’ చేసినప్పుడు మనకు తెలుసు.

అదే విధంగా, గత ఏడాది డిసెంబరు 10న, [అంతకు ముందు కూడా] ‘బక్క మహత్ముడు’, ‘ముక్కు మనీషి’ కేసీఆర్ ని ‘తెలంగాణా గాంధీ’ని చేస్తూ ఈనాడు, పేపరంతా నింపినప్పుడు మనకు తెలుసు! [లేక పోతే లగడపాటి బదులు ఈనాడు పత్రికే ముందు చెప్పి ఉండేది TPN గురించి?]

ఈనాడు ట్రెండ్ ని అనుసరించి, అదే బాకాని భారీగా వాయించే కొన్ని మీడియా సంస్థల సహకారమూ మనకి తెలుసు. అధిష్టానపు ఆశీస్సులతో, రవి ప్రకాష్ ల వంటి మీడియా మెగా పర్సన్స్ చూపించే పెరఫార్మెన్సులూ మనకి తెలుసు.

వాటన్నిటితో సరిపోల్చి చూసినా, చంద్రబాబుకి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదు. ఎందుకని?

ఎందుకంటే -

మీడియా నవాబు, ఈనాడు రామోజీరావుకీ, చంద్రబాబుకీ చెడింది గనక!

ఈనాడు రామోజీరావుకి చంద్రబాబు కంటే కూడా, కాంగ్రెస్ అధిష్టానం సోనియా నే ఆప్తురాలు గనక!

వివరంగా చెప్పాలంటే -

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు తరుపున, ప్రపంచపు అంచుల దాకా ‘లాబీయింగ్’, ‘కొరియర్ షిప్’ చేసి వచ్చేందుకు, శక్తి వంచన లేకుండా పనిచేసిన రోజుల్లో, చంద్రబాబుకి అది గూఢచర్యమని తెలుసు గానీ, మెదళ్ళతో యుద్దమని తెలియదు. ఓటమే స్ట్రాటజీ అయిన రీత్యా... నెం.5 వర్గపు బలమూ, పట్టు కూడా తెలియదు. అసలతడికి, అప్పటికి, రామోజీరావుకి సోనియా ఎంత ముఖ్యమైనదో కూడా తెలియదు.

అంచేత... రామోజీరావు పలకమన్నది పలికాడు. పెట్టమన్న పరుగు పెట్టాడు, మామకైనా వెన్నుపోటు పొడవమంటే, పొడిచాడు.

అయితే పెద్దలంటారు... ‘దుష్టుడితో చెలిమి ఎప్పటికైనా చేటే’ అని! అప్పట్లో ఇది మరిచిపోయాడు చంద్రబాబు. [తానూ దుష్టుడే గనక అది సహజమే కదా!] దుష్ట భాగస్వామ్యం నడిచినంత కాలం బాగానే నడుస్తుంది. చెడినాకే తెలుస్తుంది చేటెంతో! ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సంభవించిన సంకటం!

చంద్రబాబుకి, అప్పట్లో, రామోజీరావు గూఢచర్యపరంగా బలంగా కనిపించాడు. మామ ఎన్టీఆర్ కి అమెరికా వైట్ హౌస్ కి ఆహ్వానం ఇప్పించేంత బలంగా! అమెరికా అధ్యక్షుడు క్లింటన్ చేత, తన భుజాల మీద చేతులు వేయించి, తనకి కితాబు లిప్పించేంత బలంగా! ఇప్పుడు, దాదాపు ఆరేడేళ్ళు తిరిగే సరికి, పరిస్థితి తిరగబడి కన్పిస్తోంది.

మరో వైపు... నెం.5 వర్గం, మొత్తంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని వారికి అనివార్యం చేస్తున్న ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు, ‘కన్నా?కాలా?’ స్ట్రాటజీ తో పడుతున్న కడగండ్లు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఒక దశలో పార్టీ మూత వేసుకుంటాను అనేంతగా చంద్రబాబు విసిగి వేసారి పోయాడు కూడా! అప్పటి పైకారణం వై.యస్.కి హవా నడవటం. [అఫ్ కోర్సు! అందులో వై.యస్. గారెల వంట గూఢచర్యం కూడా ఉందనుకొండి.]

ఇలాంటి నేపధ్యంలో.... డబ్బు పరంగా, కెరీర్ పరంగా, [పార్టీ కుటుంబ ఆస్తిగా పరిణమించటంతో] పార్టీ పరంగా కూడా, చెప్పుకోలేని బాధలు చంద్రబాబుకి చాలానే ఉన్నాయి.

ఇతడికి [చాలామందితో పోలిస్తే] గూఢచర్యాన్ని బాగానే ఆకళింపు చేసుకునే లక్షణం ఉంది. కాబట్టే, ఎన్టీఆర్ హయంలోనూ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కంటే, ఈ చిన్నల్లుడికే హవా నడిచింది. వై.యస్. లో ఆ లక్షణం తక్కువ గనకే, 1992 ల దాకా కూడా, వై.యస్.ని రామోజీరావు అసలు ఎప్పుడూ తలకెత్తుకోలేదు. [ఇప్పుడు జగన్ కి సొంతబలం చూపించుకోవాలన్న లక్షణం, అతడి తండ్రి దగ్గర నుండి వచ్చిందే! కాబట్టే రామోజీరావు, వై.యస్.ని ఎప్పుడూ తలకెత్తుకోలేదు. అనివార్య అవసర పరిస్థితుల రీత్యా, 2003లో పాదయాత్రతో వై.యస్.ని తలకెత్తుకున్నాడు.]

ఆ విధంగా చంద్రబాబుకి, గూఢచర్యాన్ని ఆకళింపు చేసుకునే లక్షణం, సాపేక్షంగా ఎక్కువగా ఉండటంతో, ఇప్పుడు రామోజీరవుకి తిరగబడ్డ కథ కూడా, రిలేటివ్ గా అతడికే ఎక్కువ అవగాహన కలిగింది, కలుగుతోంది. ‘తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ’ అంటూ... వేర్పాటు సమైక్య వాదాల నిప్పు బాగా రేగిన సమయానికి కాస్త ముందూ వెనకలుగా, చంద్రబాబు, తనకి తెలిసిన గూఢచర్యపు గుట్టుమట్లని, ముందుగా తన పార్టీ అగ్రనేతల దగ్గర నుండి ముఖ్యమైన వారని తాను భావించే ప్రాంతీయ, జాతీయ నాయకుల దాకా, అందరికీ పంచాడు. [ఇక్కడా, అతడి తన సహజ లక్షణం ‘వెన్నుపోటు’ను రామోజీరావుకి చూపించాడు.]

క్రమంగా ఇతరులకీ [స్ప్రెడ్ చేయటం] పంపకం చేయటం మొదలుపెట్టాడు. అదే ‘గుర్రు’ రామోజీరావుకీ, చంద్రబాబుకీ మధ్య ప్రారంభమైంది! కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానంని ప్రయోగించి, చంద్రబాబు మెడలు వంచే కార్యక్రమాన్ని, రామోజీరావు ఉపయోగించటం మొదలు పెట్టాడు. ఇది ప్రారంభమై కొన్ని నెలలు గడిచింది, పాకన బడి ఇప్పటికి పైకి కనబడుతోంది.

ఇందులో భాగమే... మొన్నామధ్య పోలీసులు క్యాజువల్ గా నాకాబందీ నిర్వహిస్తుంటే పట్టుబడ్డ 7 కోట్ల రూపాయలు నగదు కూడా! ‘ఇలాగే నీ నల్లడబ్బుని పట్టుకుంటాను సుమా’ అన్న బెదిరింపూ, కోడాల వంటి దెబ్బలబ్బాయిలని గుర్తుకు తేవటమూ, అందులో ఉన్నాయి.

గత టపాలలో చెప్పినట్లు... గూఢచారికి, గూఢచర్యానికి ‘బహిర్గతం కావటం’ మరణం వంటిది. లోతట్టున జరిగే current spying events గురించిన అవగాహనని, చంద్రబాబు తన పరిధిలో అందరికీ అంద చేస్తే... అది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలకు చాలా ‘ఇరుకు’ సృష్టిస్తుంది.

క్రమంగా చాలామంది [లాలూ ప్రసాద్ లు, శిబూ సోరెన్ లూ గట్రాలు చాలామంది] తోకఝాడిస్తారు. అందుకే కట్టడి చేయ ప్రయత్నం! ఈ విధంగా ‘గూఢచర్య గుట్టు మట్ల పంపిణీ’ వ్యవహారంలో, చంద్రబాబుకి హెచ్చరికగా.... అతడికి, చేదోడు వాదోడుగా ఉండే నాగం జనార్దన రెడ్డిని, తెలంగాణా వేర్పాటు వాదం పేరుతో, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, కిరాయి విద్యార్దులు[రౌడీలు] చితక్కొట్టారు. చంద్రబాబు బృందాన్ని మరాఠా పోలీసులు చితక్కొట్టారు.

కాబట్టే, చంద్రబాబుకి మీడియా సపోర్టు రాలేదు. జాతీయ పార్టీల నాయకులెవ్వరూ సపోర్టు రాలేదు. ఏదీ, అద్వానీ ఒక్క మాటయినా అన్నాడా? ఒకప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చి, కేంద్రంలో చక్రం తిప్పి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు గురించి, అద్వానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదేం? ఎర్రపార్టీల అగ్రనేతలూ గట్టిగా నోరు విప్పలేదేం? ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు చేత మద్దతు ఇప్పించటానికి కీలక పాత్ర వహించిన రామోజీరావు, ఇప్పుడు చంద్రబాబుకి జరిగిన అవమానానికి, జాతీయ స్థాయిలో నాయకుల చేత, పత్రికల చేత మద్దతు ఇప్పించేందుకు రామోజీరావు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి లాబీయింగ్ చేయలేదేం?

ఎందుకంటే - రామోజీరావు + కాంగ్రెస్ అధిష్టానానికీ, చంద్రబాబుకీ మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం ఇదే!

"ఇకనైనా నోరు మూసుకుని కూర్చో! గూఢచర్య స్థితిగతుల గురించి ఇతరులకి అవగాహన కలిగించటం మానెయ్" ఇదే హెచ్చరిక చంద్రబాబుకి పదే పదే ఇవ్వబడుతోంది.

ఈ నేపధ్యంలో.... నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాకి, చంద్రబాబుకి మధ్య నడుస్తున్న సంకేత భాషనీ, సంబంధిత దృష్టాంతాలనీ పరిశీలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~
Categories: Left

పరమ గురువు, తాత పీవీజీ కి అక్షర నీరాజనం !

Sat, 07/24/2010 - 22:16

దేహాన్ని తల్లిదండ్రులిచ్చారు.
దేవుడు జీవితాన్నిచ్చాడు.
‘జీవితం’ అంటే ఏమిటో పీవీజీ నేర్పాడు.
ఈ గురు పూర్ణిమ నాడు
మా ప్రియ తాత, పరమ గురువు,
శ్రీ పీవీ నరసింహారావు కు
ఈ ‘అమ్మఒడి’ లోని
అక్షరక్షరమూ
అణువణువూ
అంకితం!

వ్రాసింది మేమే అయినా.... వ్రాయగల జ్ఞానాన్నిచ్చింది పీవీజీ నే
సత్యాన్ని చూసింది మేమే అయినా... చూడగల చక్షువుల నిచ్చింది పీవీజీ నే
పోరాడింది మేమే అయినా... పోరాడగల స్థైర్యాన్నిచ్చింది పీవిజీ నే!
జీవితం పట్ల దృక్పధాన్నిచ్చిందీ పీవీజీ నే
జీవిత గమ్యాన్ని నిర్దేశింప జేసిందీ పీవీజీ నే
లక్ష్య సాధన మార్గంలోకి నడిపించిందీ పీవీజీ నే!

ఈ రోజు ‘అమ్మఒడి’లో మేమనే బొమ్మలున్నాయంటే,
వాటిని చెక్కిన శిల్పి పీవీజీ నే!

"ఈ నిద్రాణ నిశీధి
మహిత జాగృత పుంజముగా
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుటయే నా ప్రతిజ్ఞ"

అని అప్రతిహతంగా ప్రకటించిన ఆ మేరునగధీర మేధావితో
మా గురు శిష్య సంబంధం
తాతా మనుమల బాంధవ్యమై,
అదే నిండు జీవితమైంది.

మొదట తెలియక పోయినా...
అమాయకంగా ఆగ్రహించినా...
ఆధిగమించలేక అహంకరించినా...

క్రమ పరిణాములో పరిణతి చెందగా చెందగా
కొంచెం కొంచెంగా తెలుస్తూ
తెలిమబ్బుల్లోంచి తొంగి చూసే సూర్యుడిలా
జ్ఞానం హృదయాన్ని వెలిగించగా
వెలుగు నిండగా
క్రమంగా అనుభవాని కొచ్చిన సత్యమిది.

"తన కెంతో బాగా తెలిసిన
తన జీవిత పర్యంతమూ తెలిసిన
ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలో తనకే తెలియని
అనేక జన్మల నుంచి తన జీవనానుభూతికి మాత్రమే తెలిసిన
తన మరో సగం"

మేమేననే ప్రేమ కురిపించిన
మా ప్రియ ‘తాత’ కి
గుండెలని దండగా మార్చి
అర్పించాలన్నా.... ఆశక్తులమే!

ఈ గురుపూర్ణిమ నాడు
కురుస్తున్న ఆ చల్లని వెన్నెలలా
ఆయన ప్రేమ,
మమ్మల్ని ఇప్పటికీ చేయి పట్టి నడిపిస్తున్నట్లే అన్పిస్తుంది.

ఇంతకంటే బాగా చెప్పలేని
నిస్సహాయతతో కూడిన అక్షర నీరాజనం ఇది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

‘మహా కిరాతకం’లో కొన్ని కీలక ఘటనలు![ఒకే అంశం – విభిన్న కోణాలు - 02]

Sat, 07/24/2010 - 02:17
ముందుగా చిన్న వివరణతో నా విశ్లేషణని ప్రారంభిస్తున్నాను.

వివరణ - ఈ టపాల మాలికలో నేను కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టాన దేవత సోనియాని విమర్శించానంటే అర్ధం - చంద్రబాబుని గానీ, వై.ఎస్. జగన్ ని గానీ సమర్దించానని కాదని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే - ‘ఏ రాయ అయినా ఒకటే పళ్ళుడగొట్టటానికి’ అని పెద్దలన్నట్లు, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా... ఒకటే! చేసేది స్వార్ద రాజకీయాలూ, ప్రజా దోపిడినే! - కాబట్టి! ఇక ఈ విశ్లేషణలలో జగన్ ఓదార్పు యాత్ర, బాబు బాబ్లీ యాత్ర నెపాన జరుగుతున్న వ్యవహారాలలో లోతట్టున జరుగుతున్న ‘అంశం’ లోని విభిన్న కోణాలని ఎత్తి చూపటమే నా ఉద్దేశం.

విశ్లేషణ:-

చంద్రబాబు బాబ్లీ యాత్రలో ఎన్నో కీలక ఘటనలూ, అసాధారణాలూ ఉన్నాయి. తెలంగాణాలో ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే కానివ్వండి, రాజకీయంగా ప్రయోజనం పొందాలను కునే కానివ్వండి, చంద్రబాబు, అనుచర బృందాన్ని వెంట బెట్టుకుని బాబ్లీ చూడబోయాడు. సరిహద్దుల్లోనే వాళ్ళని ‘రిసీవ్’ చేసుకున్న మరాఠా పోలీసులు ‘బాబ్లీ చూపెడతాం రండి!’ అంటూ తీసికెళ్ళి, ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గోనెపట్టాలేసి [ఈనాడు ఇలాగే వ్రాసింది మరి. ఫోటోలో చూస్తే పండగలూ, పేరంటాలలో పరిచే ఎర్రటి జంఖానా (తివాచీ లాంటిది) లా ఉంది.] ఆనక తీరిగ్గా ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అన్నారట.

ఆపైన కరెంటు ఇచ్చీ, తీసారట. దోమలు కుట్టి, నీళ్ళు నిప్పులూ లేకుండా, అమర్యాదకర వ్యవహారసరళితో పోలీసులు చంద్రబాబు బృందానికి చుక్కలు చూపారట! అయిదో రోజుకి అది పరాకాష్టకి చేరి లాఠీలతో చితక్కొట్టటం, కుళ్ళ బొడవటం, ఈడ్చుకెళ్ళటం, బూతులు తిట్టటం గట్రాలుగా పరిణమించాయి.

అసలు వద్దంటున్నా ‘ఎందుకు వెళ్ళినట్లు?’ అని హుంకరించే వారు కొందరు, ‘వెళ్ళకుండా ఉండాల్సింది కదా!’ అని ఊరడిస్తున్న వారు మరి కొందరు.

అసలెందుకు వెళ్ళవద్దన్నట్లు? బాబ్లీని వెళ్ళి చూస్తేనే ఏమవుతుంది? మరాఠా ప్రజలు భావోద్రేకాలకి గురవుతున్నారట. ఎందుకు? బాబ్లీ పరిరక్షణ సమితుల వెనక ఉన్నది అక్కడి రాజకీయ నాయకులే! ఇక్కడ తెలంగాణా, సీమాంధ్రా జేఏసీల కన్వీనర్లు ఎంతో, అక్కడి సమితుల కన్వీనర్లూ అంతే!

ఇవాళా రేపూ ఏ ఉద్యమాలైనా ప్రజల్లోంచి రావటం లేదు. డబ్బు ఖర్చుపెట్టి ఆయా నాయకులే జనాల్ని సమీకరించుకోవాల్సి వస్తోంది, మీడియా కవరేజిని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. లేదా స్వంత మీడియా సంస్థలతో డప్పు వేసుకోవాల్సి వస్తోంది.

అలాంటి చోట.... బాబ్లీ పరిరక్షణ సమితులైనా ఇందుకు మినహాయింపేమీ కాదు. అలాగ్గాక, నిజంగా ప్రజలకే గనుక... తమ ప్రాంతం, రాష్ట్రం, దేశం పట్టినట్లయితే.... ఏ ప్రాంతంలోలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఈ రాజకీయ నాయకుల డ్రామాలు, ఆడుతున్న దోపిడి ఆటలు... సాగుతాయా?

ఈ నేపధ్యంలో పరిశీలించినా, బాబు బాబ్లీ సందర్శనని, ప్రమాదమని భావించి, శ్రమ తీసుకొని, పనీ పాటా వదిలేసుకు వచ్చి మరాఠాలు నిరోధించేది ఎంత? వెనుకనున్న ‘డ్రైవింగ్ ఫోర్సు’ ముందుకు నెట్టగా వచ్చి నిరోధించేది ఎంత? [ఇదే స్థితి నిన్నటి సాలూరు రగడది కూడా!]

సరే! మరాఠా ప్రజలే, స్వచ్ఛందంగా, బాబు బాబ్లీ యాత్రని వ్యతిరేకిస్తున్నారను కుందాం. అలాంటప్పుడు మన రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపి అదే సామరస్యంగా చెప్పవచ్చు. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర సరిహద్దుల్లోనే నిరాహార దీక్షే చేసేవాడో, లేదా ఇంటికెళ్ళి నిమ్మకాయ పులిహోరే తినేవాడో! మరాఠా ప్రభుత్వానికైతే మచ్చ అంటుకునేది కాదు కదా!

ధర్మాబాద్ ఐటిఐ లోనూ సామరస్యంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, మొత్తం మీడియాను ఆహ్వానించి, ప్రజల ఆగ్రహావేశాలను లైవ్ చూపించి, చంద్రబాబు నాయుడికి, అతని బృందానికి ఓపిగ్గా చెప్పవచ్చు. [ఇంత రచ్చకు బదులుగా అంత ఓపికా సహేతుకమే! అప్పటికి వినకపోతే బాబే expose అయ్యి ఉండేవాడు.] 9 ఏళ్ళు ప్రక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడికి, ఎంఎల్ ఏ లకీ, ఎంపీలకీ ప్రజాగ్రహన్ని, ప్రజల భావోద్రేకాలని పట్టించుకోవలసిన అవసరం గురించి మరింత ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

చెప్పినా బాబు వినలేదు అంటారు కొందరు. సరే! అదే నిజమైనా... అసలు ‘మహా కిరాతకం’ స్థాయిలో ‘మహా సామరస్యం’ నడిచిన దాఖలాలు కూడా లేవు కదా? మొదలే వాళ్ల న్యాయమూర్తి బెయిల్ తీసుకుని వెళ్ళండంటూ చెప్పటమే జరిగింది.

బాబు బాబ్లీ యాత్ర నేపధ్యంలో [22 జూలై, 2010], కొన్ని పత్రికలలో ప్రచురింపబడిన వార్తల్లో....

ఈ వార్త 22 జూలై, 2010 సాక్షి దినపత్రిక 9 వ పేజీలోనిది.

>>>మహారాష్ట్ర తీరుపై చంద్రబాబు ఆవేదన

మన పోలీసులు కాల్పులు జరిపితే... ఆ నెపంతో అందర్నీ ఫినిష్ చేసేవాళ్ళు.
ప్రాజెక్టు చూపిస్తామని మాయమాటలతో తీసుకెళ్ళి, తప్పుడు కేసులు పెట్టారు.
65 మందిని ఒకే గదిలో బంధించారు... నరక యాతన అనుభవించాం.
సరైన తిండి లేదు. నీళ్ళు లేవు, కటిక నేలపై దోమలతో సావాసం చేశాం.
ఆ రాత్రి నాలుగు వేల మంది పోలీసులు ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డారు.
పిడిగుద్దులు గుద్దారు.... లాఠీలతో, గన్నులతో కొట్టారు... బూట్లతో తన్నారు.
మహిళా ఎమ్యేల్యేలను సైతం ఈడ్చుకుంటూ వెళ్ళి బస్సులో పడేశారు.
సోనియా చెప్పిన తర్వాతే చవాన్ మాపై ఎక్కువ ప్రతాపం చూపారు.
స్పీకర్ కూడా స్పందించలేదు. ఉద్యోగాలు ఊడతాయనే అందరి భయం.
ఆసెంబ్లీ ఆవరణలో టీడీపీ నాయకుల ధర్నాలో చంద్రబాబు స్పష్టీకరణ.
~~~~~~

ఈ వార్త 22 జూలై, 2010 ఈనాడు దినపత్రిక 13 వ పేజీలోనిది.


~~~~~~
దీనికి ముందు రోజు అంటే 21జూలై, 2010న
>>>‘మరాఠా గాయం’... అంటూ సాక్షి పత్రిక, క్లుప్తంగా విషయం వివరించి.... ‘అతి స్పందన, అనాలోచన’ అంటూ సంపాదకీయం, ఒక పేజీ కేటాయించి వార్తలూ వ్రాసింది. చంద్రబాబు తమకి ప్రత్యర్ది వర్గం కాబట్టి, ‘వార్తల్ని వ్రాసాం’ అన్నట్లుగా వ్రాసింది. అది రాజకీయం!

‘సహ పడవ ప్రయాణీకులం’ అనే ముసుగు వేసుకుంటున్నాడేమో చంద్రబాబు! మామకే వెన్నుపోటు పొడిచిన మోసగాడితడు! ఎన్ని నటనలైనా చేస్తాడు, ఎన్ని నాటకాలైన వేస్తాడు. అదే జాగ్రత్త జగన్ ది! ఇది గూఢచర్యం!

దీని గురించిన స్పష్టత, మరికొన్ని వివరణల తర్వాత, ఈ టపాల మాలికలోనే వ్రాస్తాను.

>>>కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టారు :- 21 జూలై, 2010 ఈనాడు పత్రిక :

‘మహా కిరాతకం’
‘అశోక్ సర్కారు అమానుషం’ సంపాదకీయం.
‘అక్రమాలే పునాది బాబ్లీ’ అంటూ బాబ్లీపై పూర్తి కవరేజితో మూడవ పేజీ.
‘నరకం చూపించారు’ గట్రా వార్తలతో....
ఒక్క సంపాదకీయంలో తప్పితే.... ఏ వార్తల్లోనైనా, చంద్రబాబు పడిన అగచాట్లనీ, ఆపైన మహారాష్ట్ర, [కేంద్ర] కాంగ్రెస్ ల జులుంని గురించి వ్రాసారు. పైకి చూడటానికి... ‘కాంగ్రెస్ వ్యతిరేకి, తెదేపా అనుకూల పత్రిక ఇలాగ్గాక ఇంకెలా వ్రాస్తుంది?’ అన్పిస్తుంది.

అయితే... మొత్తం ఈనాడు చదివి తలపైకెత్తే సామాన్య పాఠకుడి బుర్రలోకి మాత్రం, ‘కాంగ్రెస్ బలం’ బలంగా చొచ్చుకెళ్తుంది. అదే విశేషం ఇక్కడ!

కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తే, మాజీ ముఖ్యమంత్రికైనా, ప్రస్తుత ప్రజాప్రతినిధుల కైనా ఏ గతి పట్టిందో చూడమన్న ‘మానసిక యుద్ద తంత్రమే’ ఉందిక్కడ! అసెంబ్లీ స్పీకర్ గానీ, [పార్లమెంట్] లోకసభ స్పీకర్ గానీ, రాజ్యసభ స్పీకర్ గానీ ఎవరూ దాని మీద చర్యలు తీసుకోలేదు.

సాధారణ నేరగాళ్ళకు, కేడీ గాళ్లకు పోలీసులు చూపించే ధర్డ్ డిగ్రీ!
చట్టప్రకారం అయితే, ఎవరి పట్లా చూపకూడని ధర్డ్ డిగ్రీ!
పోలీసులు సైతం ఠాణాలో మాత్రమే చూపించి, పబ్లిక్ లో బుకాయించే ధర్డ్ డిగ్రీ!
వందల మంది మనుష్యుల్ని బాహాటంగా చంపిన పాక్ తీవ్రవాది కసబ్ పైన కూడా ఇంతగా చూపించని ధర్డ్ డిగ్రీ!

ఇది ఎంతగా మానసికంగా ‘బ్రేక్’ చేసే తంత్రమంటే - ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టాల్సిందిగా [ఈనాడు సంపాదకీయంలో] వత్తిడి చేసారట. ఎందుకోసమైనా సరే, [బెయిల్ అభ్యర్దన కోసమని కొందరు ప్రత్యేక వ్యక్తులు వాదిస్తుంటారు.] ఖాళీ బాండుపేపర్ల మీద సంతకాలు తీసుకుంటారా? అది చట్ట విరుద్దం కాదా?

అసలుకే రామోజీరావు తరుపున గూఢచర్యం కోసం, పెట్టుబడుల ఆహ్వానం పేరిట, ప్రపంచం అంచుల దాకా పరుగులెత్తి వచ్చిన వాడైన చంద్రబాబుని ఇలాంటి ‘కిరికిరీ’లు ఎంతగా భయభ్రాంతుణ్ణి చేస్తాయో, చంద్రబాబుకి మాత్రమే బాగా అర్ధమౌతుంది.

నిజానికి బాబ్లీ యాత్ర నేపధ్యంలో... చంద్రబాబు, మరాఠా కాంగ్రెస్, కేంద్ర కాంగ్రెస్, శివసేన లది రాజకీయమే.

అయితే, ఆ సంఘటనలు... ఇలాగ్గాక, ఇంకెలాగనైనా జరిగే అవకాశం ఉంది. అది సామరస్య చర్చలు కావచ్చు. ఆంధ్రా సరిహద్దు దాటనివ్వకుండా బాబు బృందాన్ని పోలీసులు అడ్డుకోవటం కావచ్చు. ‘బాబ్లీ చూపిస్తాం రమ్మని’ వాహనాల్లో ఎక్కించుకు పోయినా, ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గాక, ఎకా ఎకి ఏ కారాగారానికైనా తీసుకు పోవచ్చు. మరాఠా ప్రజా నాయకుల, ప్రజల... ధర్నాలకు, ఉద్రిక్తతతో కూడిన దాడులకు, ఐటీఐ ప్రాంగణం ఉన్నంత అందుబాటులో, జైలు గోడలూ ప్రాంగణమూ అందుబాటులో ఉండవు కదా?

ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు మీద ఎంతగా గురిపెట్టబడిందో చూడండి.

‘కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టారు’ అంటూ 21 జూలై, 2010 ఈనాడు కవర్ చేసిన వార్తాంశంలో ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి.

>>> ‘అసలు మీ డిమాండ్లు ఏమిటి?’ అంటూ కొద్ది నిముషాల పాటు కొందరు కీలక నేతలను విమానాశ్రయంలోని ఓ గదిలో కూర్చొబెట్టి చర్చలు జరిపారు. చివరకు చంద్రబాబును ఓ విమానంలో కూర్చోబెట్టి, మిగతా వారందరినీ మరో విమానంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబును మరో ప్రాంతానికి తరలిస్తారనే బెంగతో.... తమందరినీ చంద్రబాబుతో సహా తీసుకెళ్ళాలని, లేకపోతే వెళ్ళే ప్రసక్తిలేదని మిగతా నేతలు భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబును ఒక విమానంలో, మిగతా వారందరినీ మరో విమానంలో తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న విమానయానశాఖ అధికారులను, పోలీసులు సంప్రదించి ఎట్టకేలకు అందరినీ ఒకే విమానంలో కూర్చొబెట్టించారు. అందులో కూర్చున్న వారంతా తమను బాబ్లీ సందర్శనానికి తీసుకెళ్ళాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసినా పోలీసులు స్పందించలేదు. విమానం ఎక్కే సమయంలో కూడా నేతలు, పోలీసులు ఎవరి పంతాన్ని వారు కొనసాగించడంతో... కొద్ది సేపు పోలీసులు, నేతలకు మధ్య విమానంలోనే పెనుగులాట జరిగింది. ఎట్టకేలకు విమానాశ్రయ రక్షణ సిబ్బందితో పాటు పోలీసులు విమానం తలుపులు మూసివేయించి టేక్ ఆఫ్ కోసం అధికారులను ఆదేశించారు. చివరికి నేతలంతా విమానంలోనే కూర్చుండి పోయారు. రాత్రి 9 గంటల సమయంలో విమానం హైదరాబాద్ కు బయలు దేరింది.
~~~~~
ఇదీ వార్త!

అందరినీ కలిపి ఒకే విమానంలో గాకుండా చంద్రబాబు ఒక్కడినే ఎందుకు మరో విమానంలోకి ఎక్కించినట్లు?

[ఈ రోజు అంటే 24 జూలై, 2010 "విమాన ఖర్చులు తమ ప్రభుత్వమే భరించగలదని మన రాష్ట్రప్రభుత్వం మరాఠా ప్రభుత్వానికి హామీ ఇచ్చాకే, తెదేపా నేతలను జౌరంగా బాద్ నుండి హైదరాబాద్ కు విమానంలో తరలించారని వార్తలొచ్చాయి. అంటే చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం, మిగిలిన వారికి మరో విమానం ఏర్పాటు చేయమని రోశయ్య చెప్పాడా? చెబుతాడా? దీన్ని బట్టి తెలియటం లేదా ఈ వెనుక ఉన్నది అధిష్టానమేనని? ]

అప్పటికే ఔరంగాబాద్ లో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దారిలోనూ బాబు బృందం ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై రాళ్ళు రువ్వబడ్డాయి.

"మన పోలీసులు [తమ గన్ మెన్స్] కాల్పులు జరిపితే... ఆ నెపంతో మమ్మల్ని అక్కడే ఫినిష్ చేసే వాళ్ళు."

"అడిగే వాళ్ళెవ్వరూ లేరని మమ్మల్ని అక్కడే చంపేయాలనుకున్నారు" అన్నాడు చంద్రబాబు.

అంతగా అతడికి ప్రాణ భయం పెట్టబడింది.

‘వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు’ అని ఎటూ నాందేడ్ ఎంపీ అంటూనే ఉన్నాడు. ఎటూ ‘వాళ్ళు అవునంటారు, మనం కాదంటాం, అంతే’ అనుకోవటం రాజకీయ నాయకులందరికీ [పార్టీలకతీతంగా] అలవాటే.

కాబట్టి "వాళ్ళ గన్ మెన్ ముందుగా కాల్పులు జరపటంతో, ఆత్మరక్షణ కై మేమూ కాల్పులు జరిపాం. అందులో చంద్రబాబుకి తూటా తగిలి మరణించాడు!?" అని... మరాఠా పోలీసుల్ని ‘పైబాసులు’ చెప్పమంటే చెబుతారు. తాను పైబాసుగా ఉన్నప్పుడు చెప్పమంటే, తన క్రింది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు గతంలో ఇలాంటివి ఎన్ని చెప్పలేదు?

విమానాశ్రయంలో నైనా... "మరాఠా ప్రజలు, శివసేన కార్యకర్తలూ, భావోద్రేకాలతో బాబు బృందాన్ని చుట్టిముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపుని చెదర గొట్టటానికి కాల్పులు జరిపాం. పొరబాటున తూటా తగిలి చంద్రబాబు ఫినిష్ అయిపోయాడు." అన్నా మాత్రం దిక్కేముంది? పాకిస్తాన్ లో మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో కేసు ఏమయ్యింది? భారత్ లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యకేసు లేమయ్యాయి?

తాను పైలోక ప్రయాణం చేసాక, ఎన్ని ధర్నాలు, ఎన్ని గగ్గోళ్ళు నడిస్తే మాత్రం ఏముంది?

"మరోసారి చంద్రబాబు వస్తాడను కోను" అన్నాడు మరాఠా హోంమంత్రి పాటిల్.

"బాబ్లీని చూడటానికి చంద్రబాబు ఒక్కరే రావచ్చని" సూచన చేసాడు నాందేడ్ ఎంపి. అంటే - "జరిగింది చాలా? ఇప్పటికైనా వెనక్కి తగ్గు" అని అంటూ "ఇంకా ముందుకే వెళతావా? ఒంటరిగా రా! అప్పుడు చూద్దువు గానీ!" అని.

ఈ సంకేత భాష ఎందుకంటారా?

యాత్ర పేరిట జగన్ అయినా, చంద్రబాబు అయినా.... ‘[తమకు వ్యతిరేకమైన పని] చేస్తాను’ అంటున్నారు. ‘వద్దు’ అంటున్నది కాంగ్రెస్ అధిష్టానం, నకిలీ కణిక వ్యవస్థ! అదే ఇక్కడ కీలకాంశం.

వివరంగా చెప్పాలంటే... ఇంకొన్ని కీలక ఘటనలు వివరించాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

తెలుగు వారిలో ఆత్మగౌరవం, ఐకమత్యం లోపించాయా? [ఒకే అంశం - విభిన్న కోణాలు -01]

Wed, 07/21/2010 - 07:49
ముందుగా భారతీయ ఇతిహాసమైన మహాభారతం నుండి ఒక సన్నివేశాన్ని వివరించి, ఆపైన ‘ఒకే అంశం’ ఏమిటో, దాని ‘విభిన్న కోణాలు’ ఏమిటో వివరిస్తాను.

ఇక మహాభారతంలోకి ప్రవేశిస్తే....

ఇది అరణ్య పర్వం లోని సంఘటన!

ద్వైత వనంలో అరణ్యవాసం చేస్తున్న, వనవాసక్లేశాలతో ఉన్న పాండవులకి, తమ భోగ భాగ్య దర్పాన్ని ప్రదర్శించి కుపితులను చేయాలనే అహంకార అతిశయాలతో, దుర్యోధనుడు, కర్ణ శకుని దుశ్శాసనులని, ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని, ఘోష యాత్ర నిర్వహిస్తాడు.

మృగయావినోద విహారాల అనంతరం, సుందర సరోవరాన్ని చేరి, దాని అధిపతియైన చిత్రసేనుడనే గంధర్వునితో గొడవ పడతారు. గంధర్వులు, ఈ దుష్ట చతుష్టయాన్ని యుద్దంలో జయించి బంధించగా, ఆ వార్త విన్న పాండవులలో భీముడు...

"హా! కాగల కార్యము గంధర్వులు తీర్చారు" అంటాడు. భీమార్జున నకుల సహదేవులకు ‘కౌరవులకు తగిన శాస్త్రి జరిగిందన్న’ అభిప్రాయం ఉంటుంది. అయితే ధర్మరాజు, కౌరవులని గంధర్వుల చెర నుండి విడిపించాల్సిందిగా తమ్ములను ఆజ్ఞాపిస్తాడు. అందుకు ఇష్టపడని తమ్ములతో "మనలో మనం కలహించుకునేటప్పుడు... మనం అయిదుగురం, వాళ్ళు నూరు మంది. అయితే ఇతరులు మన మీదికి దండెత్తినప్పుడు మాత్రం, మనం నూటయిదుగురం అన్నదమ్ములం" అంటాడు.

అక్కడ ధర్మరాజు చూపిన విజ్ఞతలో.... వంశ గౌరవం పట్ల, పది మందిలో తమ కుటుంబ మర్యాద పట్ల జాగ్రత్త ఉంది. మనలో మనం ఎంత ఘర్షణ అయినా పడనీ! ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఐక్యతా, ఆత్మగౌరవం తప్పనిసరిగా పరిగణించాల్సిన అంశాలు.

ఇతిహాసాలనీ, సంస్కృతీ సంప్రదాయాలనీ, మంచీ మర్యాదలనీ... అన్నిటినీ మరిచిపోయాక, ఇలాంటి సంఘటనలే సంభవిస్తాయని నిన్నటి చంద్రబాబు బాబ్లీ యాత్ర నిరూపించింది.

నా గత టపాలలో ఒకసారి వ్రాసినట్లుగా.... 1989లో ఒకసారి బెంగుళూరు వెళ్ళాను. [నా బ్యాటరీ తయారీ సంస్థ యంత్రపరికరాలను అక్కడి నుండే కొనుగోలు చేశాను.] అందుకు కొద్దికాలం ముందు, ఏదో రాజకీయ వ్యవహారం మీద, ఎన్టీఆర్ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపాడు. దాన్ని ఉటంకిస్తూ బెంగుళూరులోని యంత్ర సామాగ్రి సరఫరాదారుడు, కొంత అవహేళనగా "అదేమిటి? మీ సీఎం ఎన్టీరామారావు రోడ్డు మీద పడుకున్నాడు?" అన్నాడు. అతడి నవ్వులో చాలా వ్యంగ్యం ఉంది.

చాలా అవమాన కరంగా అన్పించింది. ఇప్పుడంటే రాజకీయ నేతలు రోడ్డు మీద పడుకోవడం సాధారణమై పోయింది గానీ, అప్పట్లో ధర్నాలు మాత్రమే చేసేవాళ్ళు. మహా అయితే బైఠాయించేవాళ్ళు.

ఆ నేపధ్యంలో... ప్రక్క రాష్ట్రపు వారి పరిహాసం చాలా అవమానకరంగా తోచింది. దేశాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే - నాయకులు ఏం చేసినా, అది వారి వ్యక్తిగతంగా మిగలదు. జాతికి ప్రతినిధులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి జరిగిన అవమానం ప్రజలకి జరిగిన అవమానంగానే భావిస్తాం. వాళ్ళూ ఆ స్థాయిలోనే ప్రవర్తించాలని ఆశిస్తాం.

నిన్నటి చంద్రబాబు బాబ్లీ యాత్ర విషయంలో కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యవహరించిన తీరు అత్యంత అసహ్యకరం. పార్టీలు ఏవైనా సరే, రాజకీయాలు ఏవైనా సరే, ఇది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం!

నిజానికి, కలిసికట్టుగా.... ప్రాజెక్టులు, మౌలిక వసతులు, నీటి వనరులు, ప్రకృతి సంపద వినిమయాలు సాధించుకోవలసిన చోట... పార్టీలు, ప్రజలు, చీలికలూ పీలికలూ అయ్యి, అనైక్యత కారణంగా దగా పడటం ఓ ప్రక్కన నడుస్తుండగా.... మరో ప్రక్క ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళినందుకు "కుళ్ళ బొడిచి వెళ్ళ గొట్టటం" ఎందుకు?

ఈ విషయంలో ప్రక్కనున్న తమిళులు మన తెలుగు వాళ్ళ కంటే మెరుగ్గా వ్యవహరిస్తారు. వాళ్ళల్లో వాళ్ళకి, ఒకటికి నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉండనీ గాక! వాళ్ళల్లో వాళ్ళు అధికారం కోసం కాట్లాడుకోవచ్చు గాక! రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అయితే, మరికొంత ఎక్కువ ఆత్మగౌరవంతోనూ, మరికొంత ఎక్కువ ఐకమత్యంతోనూ ప్రవరిస్తారు.

కాబట్టి మన కంటే ఎక్కువ ప్రాజెక్టులూ, పరిశ్రమలనీ, అభివృద్దినీ సాధించు కోగలిగారు. అయితే అదీ, మరికొంత అవధులు మీరి ‘తమిళ జాతీయ గీతం’ ఆలపిస్తామనే దగ్గరికి రావటం ప్రమాదకరం. ‘అన్నిట్లోంచి డిస్ అడ్వాంటేజ్ రావటం’ అనే ప్రక్రియకి ఇది మరొక ఉదాహరణన్న మాట!

ఇక తమిళుల మాట అటుంచితే.... ఎన్టీఆర్ రోడ్డు మీద పడుకున్నాడని కన్నడిగులు అవహేళనగా అంటే, తెలుగు వారిగా నేనూ, మా నాన్న, అవమానం మాకే జరిగినట్లుగా అనుభూతించాము. మా పరిస్థితిలో ఎవరు ఉన్నా అలాగే అనుభూతిస్తారు. పరిస్థితులు అలాగే దారితీస్తాయి.

బాబ్లీ వ్యవహారంలో చంద్రబాబు బృందం ‘తన్నులు తినడం’ తెలుగు వాళ్ళగా మనకెంతో అవమానకరంగా ఉంటుందో, ‘రాష్ట్రానికొచ్చిన వాళ్ళని తన్ని పంపించడం’ సామాన్య మరాఠాలకు అంతే అవమానకరంగా అన్పిస్తుంది. ఇంటికొచ్చిన వాళ్ళని తన్ని పంపినంతగా! శివసేన గట్రా పార్టీలు సమీకరించిన కార్యకర్తలని మినహాయిస్తే సామాన్య మరాఠాలు అలాగే భావిస్తారు.

శివసేన కార్యకర్తలకి ఉద్యోగార్ధులని సైతం తన్ని పంపటం అలవాటే! అందుకోసమే డబ్బివ్వబడినప్పుడు, అలాగే చేసేందుకు వచ్చిన కిరాయితనం అది! డబ్బిస్తే ఇక్కడి తెరాస కార్యకర్తలూ, ఇతరులూ చూపించే కిరాయితనం కూడా అదే! అందుకే... ‘సంస్కృతీ ధర్మాలు మరిచిపోయిన పరిణామం ఇది’ అన్నాను.

ఇప్పుడు... ప్రక్క రాష్ట్రాల్లో, దేశాల్లో... ఎవరైనా సరే, ఏ తెలుగు వాడినైనా సరే, ‘మీ మాజీ ముఖ్యమంత్రినీ, [ఎం.ఎల్.ఏ., ఎం.ఎల్.సీ. లని] ప్రక్కరాష్ట్రం వాళ్ళు కుళ్ళ బొడిచి వెళ్లగొట్టారట కదా!’ అంటే - ఎంత అవమానంగా ఉంటుంది?

సరే! కుళ్ళ బొడిచి వెళ్ల గొట్టటం మరాఠీలు పాటించే అతిధి మర్యాద, గృహస్థ ధర్మం అనుకుందాం. [నిజానికి దీన్ని మరాఠా ప్రజలకి అంటగట్టడం అనవసరం. అశోక్ చవాన్ ఆజ్ఞలు పోలీసులు పాటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆజ్ఞను చవాన్ పాటించాడు. అంతే! ఇందులో ఉన్న అసలు కారణాలు, అంతర్గత పోరులని తర్వాత ముచ్చటిద్దాం.]

కనీసం వాళ్ళ ’మర్యాద లేని తనాన్ని’ తెలుగు వాళ్ళు తిప్పి కొట్టారు అన్పించుకున్నా కొంత గౌరవంగా ఉంటుంది. అలాంటి చోట, ప్రజలకు ప్రతినిధుల మని చెప్పుకునే రాజకీయ రాక్షసుల ప్రవర్తన ఎంత నీచంగా ఉంది?

ఎర్రపార్టీల చికెన్ నారాయణ, రాఘవులు, రోజూ వారీ దిన చర్య అన్నంత యాంత్రికంగా, మీడియాకి ఒక ప్రకటన వదిలి గమ్మునుంటున్నారు. చంద్రబాబు గతంలో ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు. అతడు తప్పులే చెయ్యనీ, ఒప్పులే చేయనీ. కానీ అతడు, అతడి బృందం ప్రజాప్రతినిధులు. ప్రజా సమస్య మీదే ప్రక్క రాష్ట్రానికి వెళ్ళారు.

వాళ్ళ స్వంత పని మీద కాదు. వ్యక్తిగత విహారాలకీ కాదు. నదిపైన [అక్రమ కట్టడమో, కాదో,] బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చూడటానికి వెళ్ళారు. చూస్తే ఏమవుతుంది? ఎటూ వీళ్ళు నిర్మాణం ‘అక్రమం’ అంటారు. వాళ్ళు కాదు ‘సక్రమం’ అంటారు. వెరసి ఇరు పక్షాలూ కాస్సేపు మీడియాలో గోల చేసుకున్నాక, ‘విషయం కోర్టులో ఉంది ఆనక మాట్లాడుకుందాం’ అంటారు. ఆపాటి దానికి ఎందుకింత ‘కిరాతకం’ జరిగింది?

ఈ పాటి కిరాతకం గురించి, ఎందుకు ఎర్రపార్టీల జాతీయ నాయకత్వం కిమ్మనటం లేదు? రాష్ట్రస్థాయి నాయకుల రోజు వారీ మొక్కుబడి ప్రకటన తప్పితే... ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరీ, బర్డన్ గట్రాల కంఠాలు విన్పించటం లేదెందుకని?

ఒకప్పుడు.... 1984 లో ఆగస్టులో [తమ అంతర్నాటకాన్ని అతి సమర్ధంగా రక్తికట్టిస్తూ] రామ్ లాల్, నాదెండ్లలు కలిసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే... జాతీయ పార్టీల అగ్రనాయకులందరూ హైదరాబాద్ కు పరిగెత్తుకు వచ్చి ఇందిరాగాంధీని ఎండగట్టారే?



అలాంటిది... చంద్రబాబు నాయుడిని, ఇతర ప్రజా ప్రతినిధులనీ, ఆడా మగా అన్న తేడా కూడా లేకుండా కుళ్ళ బోడిచినా, క్రింద పడేసి ఈడ్చుకు పోయినా, తోసుకు పోయి బండ్లలో కూలేసినా, నీరు నిప్పులూ లేకుండా మాడ్చినా, బండబూతులూ తిట్టినా, డబ్బూ దస్కం నగా నట్రా లాక్కుని, సెల్ ఫోనులూ విరగ గొట్టినా.... "ఏమిటీ ఆరాచకం? ఇదేం ప్రజాస్వామ్యం?" అని ఒక్కరు గాక పోతే ఒక్కరూ, నేటి కాంగ్రెస్ అధిష్టానం అయిన ఇటలీ గాంధీని అడగ లేక పోతున్నారేం?

ఎన్టీఆర్ బర్తరఫ్ నాడు ఎర్ర పార్టీలూ, భాజపా తో సహా జాతీయ నాయకులందరూ, మీడియాతో కలిసి ఐక్యంగా అరిచారే? మరిప్పుడు మాట్లాడటం లేదేందుకు? ఆనాటి ఇందిరాగాంధీకి ఈనాటి ఇటలీ గాంధీకి ఏమిటి తేడా?

గత ఏభై ఏళ్ళుగా ఎప్పుడూ ఇలాంటిది చూడలేదంటున్నారు దేవెగౌడ, వెంకయ్య నాయుడూలు! ఎమర్జీన్సీలో కూడా ఇలాంటివి జరగలేదు. ఎమర్జన్సీని ‘మాయని మచ్చ’ అనీ, ‘చీకటి రోజులు’ అనీ, గొంతు చించుకునే మీడియా, జాతీయ పార్టీల అగ్రనాయకులూ, ఈ అప్రకటిత ఎమర్జీన్సీని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామికంగా తగల బెట్టడాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు?

ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే! ప్రక్కనున్న మహారాష్ట్రలో ఉన్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమే! కేంద్రంలో ఉన్నదీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వమే! అందునా చంద్రబాబు బృందం బాబ్లీ యాత్ర చేపట్టాక... ఇటు రోశయ్య, అటు మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్, ఒకేసారి ఢిల్లీ వెళ్ళారు. అధిష్టాన దేవతని కలిసి మాట్లాడి వచ్చారు. ఎవరి పైకారణాలు[over leaf reasons] వాళ్ళు చెప్పారు గాక, కలిసి కట్టుగా ఉమ్మడి వ్యూహం రచించుకుని, ఎవరి పాత్ర వాళ్ళు పోషించినట్లుగా, ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజా ప్రతినిధులని చితక బాదారు.

>>> "ఏరా మీకు నీళ్ళు కావాలా? నీళ్ళడిగితే తన్నులు తప్పవురా....? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటార్రా....? తన్నులు కావాలా? బస్సులెక్కుతారా?" అంటూ మరాఠీలో బండబూతులు తిడుతూ లాఠీలతో పైశాచికంగా దాడి చేశారు. - ఈనాడు వార్త.

కేవలం ఒక ప్రాజెక్టును చూస్తామంటే ఇంతగా తన్నాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళేం టెర్రరిస్టులా! బాంబు వేస్తారా? మహారాష్ట్ర కు వెళ్లటానికి పాస్ పోర్టు వీసాలక్కర్లేదని అందరికీ తెలిసిందే, అందరూ అంటున్నదే! అసలు బాబ్లీ ప్రాజెక్టుని చూసినంత మాత్రాన ఏమవుతుంది?

వీళ్ళ దృష్టి సోకి నంతనే అది తునాతునకలైపోదు కదా! అందులో ఉన్న అక్రమాలని కనిపెట్టి బయటపెడతారు అనటానికీ లేదు. అదే చంద్రబాబు లక్ష్యమైతే... అక్కడి విలేఖరుల/అధికారులని లోబరుచుకుంటే చాలు! ఎవరి నిజాయితీకైనా ఒక రేటుంది అనుకునే రోజుల్లో... బాబ్లీ ప్రాజెక్ట్ వీడియో చిత్రీకరణలు సంపాదించటం అసాధ్యం కాదు.

అదీగాక, బాబ్లీ నిర్మాణం చేపట్టిన సోమా కంపెనీ లో ఒక తెదేపా నేత డైరెక్టర్ గా ఉన్నాడంటున్నారు. సదరు తెదేపా నేత కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్ లో డైరెక్టరు, అతడికి దూరపు బంధువు. అలాంటి చోట బాబ్లీ ప్రాజెక్ట్ వీడియో చిత్రీకరణలు సంపాదించటం అసాధ్యం కాదు.

అలాంటి చోట... చంద్రబాబు బృందం ప్రాజెక్టును చూస్తే చవాన్ కి పోయేదేమీ ఉండదు. చంద్రబాబుకు వచ్చేదీ ఉండదు. మరి అయినా, ఎందుకు, ఇంత అమానుష, అమర్యాద కాండ నడిచింది?

ఇందులో అసహ్యకరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - తెదేపా తప్ప, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ, రాజకీయ నాయకులందరూ, దీన్ని రాజకీయంగానే చూడటం, రాజకీయాలే మాట్లాడటం!

తెరాస, ప్రరాపాలు కాంగ్రెస్ అధిష్టానం జేబులో బొమ్మలు. పొరపాటు, కుర్చీ మహిళకి జేబులుండవు కదా! అందుచేత పర్సులో బొమ్మలు! నిజానికి ‘ఏమాత్రం స్త్రీత్వం కనబడని అధిష్టాన నాయకత్వం’ అన్న విషయాన్ని.... స్త్రీ పురుష బేధం లేకుండా ప్రజాప్రతినిధులని Man handle చేయటంతో నిరూపించుకున్నదీ ఇటలీ మహిళ!

అదేదో వ్యక్తిగత ద్వేషం ఉన్నంత భారీ పరిమాణంలో, గురి పెట్టుకుని నిర్వహించినట్లుగా, కుళ్ళ బొడవాల్సిన అవసరం చవాన్ కి గానీ, మరొకరికి గానీ ఎందుకుంటాయి? "మరి సోనియాకి అయినా ఎందుకుంటాయి?" అనుకుంటున్నారేమో! ఉంటాయి. ఎందుకుంటాయో ఈ టపాల మాలికలోనే వివరిస్తాను.

ఇక, తెరాస, ప్రరాపా ల ప్రలాపాలనీ, కాంగ్రెస్ పనికి మాలినతనాన్నీ, లజ్జా రాహిత్యాన్నీ పరిశీలిద్దాం.

ఉప ఎన్నికలలో లబ్ది పొందటానికి చంద్రబాబు ఇదంతా చేసాడు - తెరాస కేసీఆర్ వ్యాఖ్య!

నిజానికి ఇప్పుడు ఉపఎన్నికలలో జరుగుతున్న 12 స్థానాలు, ముందుగా కూడా తెదేపా వి కావు. అవి తెరాసావి, ఒకటి భాజపాది. ఇప్పుడు కొత్తగా పోయే సీట్లేవీ లేవు. అదీగాక, ఒకవేళ తొక్కలోవి ఆ 12 సీట్లు గెలిచినా, ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి ఒరిగేదేమీ లేదు. అవి గెలిస్తే ఇప్పటికిప్పుడు అధికారం రాదు. అందుకోసం ఇంతగా ‘తన్నులు’ తినాల్సిన అవసరం లేదు.

అదీగాక, ఈవీఎం లుండగా ఎన్నికల గెలుపు, ఈ రాజకీయ డ్రామాలతో సిద్దించదు. ‘తన్నులు తినాల్సి వస్తుందని చంద్రబాబు అనుకోలేదు’ అంటారేమో ఎవరైనా! ఇంతగా తన్నులు తినాల్సి వస్తుందను కోకపోయినా, లోతట్టున మరుగుతున్న వ్యవహారం రీత్యా, చంద్రబాబు అవగాహన చంద్రబాబుకి ఉంది.

అలాంటప్పుడు.... కేవలం ఉప ఎన్నికలలో 12 సీట్లు గెలవటం కోసం చంద్రబాబు ఇదంతా చేసాడన్న కేసీఆర్ వాదనకి విలువ లేదు. ఇక బాబ్లీలాగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు రాడు? అంటూ కేసీఆర్ పాయింట్ లేవనెత్తాడు. రాని దాని సంగతి ఎందుకు? వచ్చిన విషయంలో ఏపాటి వత్తాసు వచ్చారు కేసీఆర్, భాజపాలు చంద్రబాబుకి?

నష్టం, తెలంగాణాకి కావచ్చు, మరో జిల్లాలకి కావచ్చు, మొత్తంగా అది మన రాష్ట్ర సమస్య! తెలుగు వాళ్ళ గౌరవానికి సంబంధించిన సమస్య! మన వాళ్ళ పట్ల మహారాష్ట్ర పోలీసుల అమర్యాద, జులుంల గురించి వార్తలొచ్చాక కూడా, ఇదే కుతర్కం, ఇదే కుటిల రాజకీయాలు మాట్లాడటం ఎంత నీచం?

ఇటు గీతా రెడ్డిలు, ఇతర మంత్రులూ, అందరూ, ఎంత లజ్జా రాహిత్యాన్ని చూపించారంటే - ఎక్కడ అధిష్టానానికి తమ మీద కోపం వస్తుందో, దెబ్బకి తమ పదవులు, కెరీర్ లేచి పోతాయేమో అన్న భయాన్ని నిలువునా ప్రదర్శించారు. అసలుకే వాళ్ళ ఉద్దేశంలో అధిష్టానాన్ని ఎదిరిస్తే ఫ్యూజులు లేచి పోతాయయ్యే మరి! దాదాపుగా యజమాని పాదాలను నాకుతున్న కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎంత నిస్సిగ్గుగా "ఛాయ్!" మన్నా తోకాడిస్తూ దగ్గర కొస్తాయో, అంతకన్నా ఎక్కువ లజ్జా రాహిత్యాన్నే చూపెట్టారు.

"మనలో మనం ఎంతగానైనా కలహించుకోవచ్చుగాక! ఇతరులు మన మీదికి వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే" అనే తెలుగు దనం కాదు గదా, కనీస పాటి ‘మనిషి తనం’ కూడా లేదు కాంగ్రెస్ లో!

ఇంకా ప్రజలే... వ్యక్తిగతంగా ఇళ్ళల్లో టీవీల ముందు కూర్చొనో, సామూహికంగా రోడ్డెక్కి ధర్నాలు, హర్తాళ్ లు చేసో, దిష్టి బొమ్మల్ని తగలేసో... తమ ఆక్రోసాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తీ కరించారు. తమ ఆత్మ గౌరవాన్ని గుర్తు తెచ్చుకున్నారు.

ప్రజలు కూడా కాంగ్రెస్ మంత్రుల్లాగే ఉంటే.... కాంగ్రెస్ అధిష్టానం "అవును. మీరంతా నా పాద దాసులు! కుక్కిన పేనుల్లా, చచ్చిన దోమల్లా పడుండండి" అని బహిరంగంగా హుంకరించినా ఆశ్చర్యం లేదు.

"పాక్ లో సైనిక ప్రభుత్వం తమని తాము ప్రకటించుకున్నప్పుడు, అక్కడి బేచారాలు ఏం చేయగలిగారు? ఇక్కడైనా అంతే!" అనుకోగలరు సోనియాలు, ఆమెని నడిపే గూఢచార ఏజన్సీలు!

నిజానికి... ఓదార్పు యాత్ర పేరిట వై.యస్. జగన్ శిబిరానికీ కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఒక అంతర్లీన పోరు నడుస్తోంది. ఆఫ్టరాల్ ఓదార్పు యాత్ర చేస్తే ఏమవుతుంది? చేసినా ఏమవలేదు కదా? మరి అధిష్టానం ఎందుకంతగా వద్దని పోరింది? ఆ పేరిట వాళ్ళ మధ్య నడిచిన సంకేత భాష వేరు. అంశం ఒకటే!

అలాగే... బాబ్లీ యాత్ర పేరిట చంద్రబాబుకీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య అంతర్లీన పోరు నడుస్తోంది. అంశం ఒకటే! ఇవి దాని విభిన్న కోణాలు, అంతే! రానున్న రోజుల్లో ఆ అంశం, దాని విభిన్న కోణాలు కూడా, మనకి ప్రస్ఫుటంగానూ, బహిరంగంగానూ దృగ్గోచరం అవుతాయి. వేచి చూడటం, జరుగుతున్న పరిమాణాలని నిశితంగా పరిశీలించటమే ప్రస్తుతం మనం చేయగలిగింది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

ఇరాన్ అమీరీలు – జార్ఖండ్ శిబు శోరెన్ ల అకౌంట్లలో డబ్బులు ! [నకిలీకణికుడి వ్యవస్థ గురించి కొన్ని దృష్టాంతాలు [Circumstantial] – 17]

Fri, 07/16/2010 - 07:00
ముందుగా ఈ రోజు[16 July, 2010] సాక్షి పత్రికలో ప్రచురింపబడిన క్రింది వార్తాంశాన్ని ఓసారి పరిశీలించండి.

>>>ఇరాన్ శాస్త్రవేత్తకు రూ.23 కోట్ల సీఐఏ నజరానా
అమీరీ దేశద్రోహా? దేశభక్తుడా?
పరువూ, డబ్బూ పోగొట్టుకున్న సీఐఏ

అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఎత్తుకుపోయిందని చెబుతున్న ఇరాన్ అణు శాస్త్రవేత్త షరామ్ అమీరీ[32]కి ఇరాన్ రాజధాని టెహ్రన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఐఏ జిత్తులను చిత్తు చేసి, తప్పించుకుని వచ్చానని చెప్పుకుంటున్న అమీరీకి ఇరాన్ బ్రహ్మరధం పట్టింది. అమీరీ దేశభక్తిని, అమెరికా కుటిల నీతిని అది విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికారుల కథనం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అమీరీ, తనంతకు తానే అమెరికాకు వచ్చాడని అంటోంది. ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలను వెల్లడించడానికి సీఐఏ అతనికి 50 లక్షల డాలర్లు [రూ.23 కోట్లు] ముట్టజెప్పిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

అమీరీ అకౌంట్లలో ఈ డబ్బున్న విషయం వాస్తవమేననీ తేలింది. దీంతో అమీరీ దేశభక్తుడా? లేక దేశద్రోహా? రెండూగాక. అటు సీఐఏ కూ ఇటు మాతృదేశానికీ కూడా టోకరా ఇచ్చిన డబుల్ క్రాసరా? అనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు. గత వారంలో అమీరీ హఠాత్తుగా పాక్ ఎంబసీలో ఊడిపడి.... సీఐఏ తనను సౌదీ అరేబియా నుండి గత ఏడాది అమెరికాకు ఎత్తుకొచ్చిందని ప్రకటించాడు.

ఇరాన్ అణు రహస్యాల కోసం డబ్బు ఆశ చూపించిదన్నాడు. కానీ అణ్వస్త్ర రహస్యాలు తెలియనే తెలియవనీ అంటున్నాడు. ఏది ఏమైనా... అమీరీ అకౌంట్లలో లక్షలాది డాలర్లున్న మాట నిజం. అమీరీ, ఆ సొమ్ములోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకోలేడనేది అంత కంటే నిజం. ఇరాన్ పై అమెరికా ఆంక్షలే అందుకు కారణం. బెడిసి కొట్టిన ఈ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న సీఐఏ, డబ్బన్నా దక్కించుకుందామంటే... అదీ పోయినట్లేనని తెలుస్తోంది.
~~~~~~~~~~~
ఇదీ వార్త!

ఒకప్పుడు గూఢచర్య వ్యవహారాలు రహస్యాలుగానే మిగిలిపోయేవి. అచ్చం ఇర్వింగ్ వ్యాలెస్ నవలల్లో లాగా! భూగోళం బ్రద్దలవబోయేంత పెను ప్రమాదాలు సంభవించి తృటిలో తప్పిపోయినా, చాపక్రింద నీరులా భూభాగం మెల్లిగా మునుగుతున్నా... అన్నీ రహస్యాలుగానే ఉండిపోయేవి.

ఇటీవలి కాలంలోనే రహస్యాలు రచ్చకెక్కుతున్నాయి. గుట్టుమట్లు గట్లు తెంచుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో పైవార్త ఒకటి.

ఇందులో ఎన్ని గమ్మత్తులు ఉన్నాయో చూడండి.

>>>అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఎత్తుకుపోయిందని చెబుతున్న ఇరాన్ అణు శాస్త్రవేత్త షరామ్ అమీరీ[32]కి ఇరాన్ రాజధాని టెహ్రన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఐఏ జిత్తులను చిత్తు చేసి, తప్పించుకుని వచ్చానని చెప్పుకుంటున్న అమీరీకి ఇరాన్ బ్రహ్మరధం పట్టింది. అమీరీ దేశభక్తిని, అమెరికా కుటిల నీతిని అది విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఇది ఇరాన్ చేసుకుంటున్న ప్రచారం.

>>>అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికారుల కథనం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అమీరీ, తనంతకు తానే అమెరికాకు వచ్చాడని అంటోంది. ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలను వెల్లడించడానికి సీఐఏ అతనికి 50 లక్షల డాలర్లు [రూ.23 కోట్లు] ముట్టజెప్పిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

ఇది అమెరికా ప్రచారం.

ఇందులో ఏది నిజం? ఎలా తెలుసుకోవటం? మనం దగ్గరి కెళ్ళి చూసేందుకు, తెలుసుకునేందుకు ఏమీ ఉండదు. ఏ దుర్భిణి వేసీ నిజాన్ని చూడలేము. మరెలా?

మామూలుగానే అమెరికా అవునంటుంది. ఇరాన్ కాదంటుంది. లేదా ఇరాన్ ‘ఎస్’ అంటుంది. అమెరికా ‘నో’ అంటుంది. ఇప్పుడు మరో గమ్మత్తు పరిశీలించండి.

>>> అమీరీ అకౌంట్లలో ఈ డబ్బున్న విషయం వాస్తవమేననీ తేలింది. దీంతో అమీరీ దేశభక్తుడా? లేక దేశద్రోహా? రెండూగాక. అటు సీఐఏ కూ ఇటు మాతృదేశానికీ కూడా టోకరా ఇచ్చిన డబుల్ క్రాసరా? అనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు.

అమీరీ ఇరాన్ అణ్వస్త్ర రహస్యాలు అమెరికాకి అమ్ముకున్నందుకే అతడి అకౌంట్ లో డబ్బొచ్చి పడిందా? అవన్నీ బయటికొస్తే తనకి ముప్పు వస్తుందని అమీరీ కొత్త కథ [తాను ‘హీరోయిక్’గా తప్పించుకొచ్చానని] అందంగా అల్లుతున్నాడా?

లేక అమీరీ ని ఇరికించేందుకు, సీఐఏ నే అమీరీ అకౌంట్ లో డబ్బు జమ చేసిందా? మరెవ్వరైనా ఆ పని చేశారా? ఎందుకు చేస్తారు? ఇంతా చేసి, ఈ డబ్బుని అమీరీ వాడుకోలేదు. అటు సీఐఏ కూడా ‘ఆ డబ్బుని’ పోగొట్టుకున్నట్లే! విషయం బైటకి పొక్కక డబ్బు వెనక్కి తీసుకోలేరు కదా ఎవరైనా!?

ఇంతకీ... ఎత్తుకుపోయింది అమెరికా సీఐఏ! ఎత్తుకెళ్ళింది ఇరాన్ అణు శాస్త్రవేత్తని! మరితడు హఠాత్తుగా, గతవారంలో, పాక్ ఎంబసీలో ఎలా తేలాడో? తనను సౌదీ నుండి అమెరికా ఎత్తుకెళ్ళిందన్న అమీరీ, మరే దేశపు ఎంబసీలోనో గాకుండా ‘పాక్ ఎంబసీ’లోనే ఎందుకు ఊడి పడ్డాడు? అమెరికా - ఇరాన్ ల మధ్య ‘పాక్’ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది?

అసలే, అమెరికా పాక్ కు, ఆర్దిక సాయాలు చేతులు నొప్పి పుట్టేదాకా చేస్తూనే ఉంది. అలాంటప్పుడు పాక్, తనను మళ్ళీ అమెరికాకు లోతట్టునే పట్టిస్తుందన్న భయం వేయలేదా ఈ శాస్త్రవేత్తకు!?

ఎవరం చెప్పగలం? వాళ్ళేవో చెబితే నోరెళ్ళ బెట్టి వినగలం తప్ప, నిజం ఎవరికి తెలుసు?

ఇప్పుడిదంతా ఎందుకు చెప్పానంటే...

‘అమీరీ అకౌంట్ లో డబ్బు’ తో ముడిపడిన ఈ వ్యవహారం[స్ట్రాటజీ] లాంటిదే, మన దేశంలోనూ జరిగింది గనక!

వివరాల్లోకి వెళితే....

పీవీజీ హయాంలో, అవిశ్వాస తీర్మానం గట్టెక్కడానికి, తన మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి, పీవీజీ తరుపున తనతో బేరసారాలు నడిచాయని జేఎంఎం నేత శిబూసోరన్ ఆరోపించాడు. జేఎంఎం ముడుపుల కేసుగా అది మీడియాలో మారుమ్రోగింది. అచ్చంగా అమీరీ లాగానే, శోరెన్ అకౌంట్ లో కూడా డబ్బు జమ అయ్యి కనబడింది. ఆ డబ్బు పీవీజీనే జమ చేసాడా?

"ఆయన కాదంటాడు, మనం ఔనంటాం. ఇంతే గదా?" అనుకున్నారు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు సోనియాలు, రామోజీరావులు.

అయితే... అక్కడ డబ్బు అకౌంట్ లో ఉంది, ఇక్కడ ఆ డబ్బుతో తనకు అనుకూలంగా ఓటు వెయ్యాల్సిందని బేరాలు నడిచాయని శోరెన్ అన్నాడు. ఇంకేం? మీడియాకి కావలసినంత ‘రచ్చ’ దొరికింది. సరే! కోర్టులో ఆ కేసులు ఏళ్ళూ పూళ్ళూయ్యాక తేలాయి. అందుకోసం పీవీజీ ఇల్లు అమ్ముకున్నాడని వార్తలూ వచ్చాయి.

అయితే ఇందులో ఏది నిజమో కాలం నిరూపించింది కదా!

ఎలాగో వివరిస్తాను.

ఏ కారణంగానైతేనేం, శోరెన్ పీవీజీకి మద్దతిచ్చి, ఆయన మైనారిటీ ప్రభుత్వం అయిదేళ్ళు కొనసాగేందుకు దోహదపడ్డాడనుకుందాం!

నేటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకి పీవీజీ అంటే ఎంత కసీ, ద్వేషమో, పగా ప్రతీకారమో... మరణానంతరం ఆయన పార్దివ శరీరానికే కాదు, ఆరేళ్ళు గడిచినా ఆయన స్మృతికీ చేస్తున్న అవమానాలే సాక్షి!

పీవీజీకి సోరెన్ అనుకూలంగా ఓటేసాడు. అయిదేళ్ళు నిలబడేందుకు సహాయపడ్డాడు. పీవీజీ అయిదేళ్ళు అధికారంలో ఉండబట్టే గదా... ఇప్పుడిన్ని సువర్ణముఖిలు అనుభవించాల్సి వస్తుంది?

అలాంటప్పుడు... శిబూ సోరెన్ మీద, సోనియా గట్రాలకి ఎంత కోపం ఉండాలి? సోనియాకి పీవీజీ మీద ఉన్న కోపంలో, సగమన్నా, కనీసం అందులో పావు వంతన్నా ఉండాలి కదా!? ఆ కోపానికి శిబూ శోరెన్ ని చితక్కొట్టాలి కదా? మరెందుకు చంక నెత్తుకున్నారు?

అందునా.... జూలై 22, 2008 న పార్లమెంట్ సాక్షిగా ‘ఓటుకు నోటు’ తో అవిశ్వాసం గట్టెక్కడం అందరూ ప్రత్యక్ష ప్రసారంలో చూసినా... ‘ఠాఠ్! అదంతా గిట్టనోళ్ళ కుట్ర’ అంటూ కిశోర్ చంద్రదేవ్... అన్నీ మాఫీ చేసేసినా...

శిబూ శోరెన్ మటుకూ ఢంకా భాజాయించి "అవిశ్వాస తీర్మానం విషయంలో, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవితో పాటు ఇతర ప్రయోజనాలు సమకూరుస్తామని కాంగ్రెస్, అధినేత్రి మాట ఇచ్చారు. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటారా? లేదా!" అని మీడియా సాక్షిగా బహిరంగంగా అల్టిమేటం ఇచ్చాడు.

దెబ్బతో కాంగ్రెస్ అధిష్టానం, అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న మధుకోడాను దించి, శోరెన్ ని సీఎం ని చేసింది. [ఆ కోడానే తర్వాత హవాలా కేసు తాలూకూ అవకతవకల్లో దొరికాడు.]

ప్రభుత్వ మనుగడ కోసం పదవులిచ్చి ఓట్లు కొన్న అధినేత్రి, పైసలు మాత్రం ఇవ్వదా? ఇలాంటి ఈ శోరెన్ లు పదవులూ, పైసల కోసం, చెప్పమన్నట్లల్లా చెప్పడా? అతడి అకౌంట్ లో డబ్బు కన్పించేలా చెయ్యడం పెద్ద అసాధ్యమైన పనా?

ఇప్పుడు జార్ఖండ్ లో ఈ సోరెన్ తో పొత్తుపెట్టుకుని అంట కాగుతున్నది కాంగ్రెస్, భాజపాలే! ఎంత చక్కగా అన్నిపార్టీలూ, అందరూ రాజకీయ నాయకులూ, ఒకే శృతిలో నడుస్తున్నారని చెప్పుకున్నారో చూశారా? ఆ శృతే నకిలీ కణిక వ్యవస్థ!

ఇదీ... కాలం, నిజాన్ని నిరూపించే తీరు!

రెండు దశాబ్దాల క్రితం వరకూ గడపదాటని ఇల్లాలు, దశాబ్దం న్నర క్రితం నుండి నేటి వరకూ xyz సార్లు ప్రధాని పదవి త్యాగం చేసిన త్యాగశీలి, సోనియా అధికార దాహం ఎంతటి దంటే... అడ్డదారిలో అధికారం చేజిక్కించుకునేందుకు, రాజ్యాంగంలో లేని ప్రభుత్వ కుర్చీ వ్యక్తి పదవినీ, సీటునీ సృష్టించుకొని అధిష్టించేటంత!

ఈ నిజాన్నీ కాలమే నిరూపించింది మరి!

ఎప్పుడో 70 ఏళ్ళ క్రిందట ఇటలీ నియంత ముస్సోలినీ, తొలుత మీడియా వ్యక్తి . పిదప దేశాధినేత అయ్యాడు. అతడు బ్రిటన్ గూఢచారి అని ఇటీవల బయటపడింది. [ ఆ వార్త సాక్షి తప్ప మిగిలిన వాళ్ళు ప్రచురించ లేదు లెండి.] అదీ బ్రిటన్ గూఢచార సంస్థ MI 5 లు ప్రకటిస్తే బయటకు వచ్చింది.

ఇప్పుడు 23 కోట్ల రూపాయలతో అమీరీ కథ బయటికొచ్చింది. [మరీ ఇంత తక్కువ డబ్బా? మన దేశంలో అయితే చిన్నస్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఏసిబి పట్టుకుంటే దొరుకుతున్నాయి.]

ఇందులో ఓ కొసమెరుపు ఏమిటంటే - ఇరాన్ అణు రహస్యాల కోసం అమెరికా తనకి డబ్బాశ చూపిందనీ, కానీ అణ్వస్త్ర రహస్యాలు అమ్మడానికి... తనకి అసలు ఎలాంటి రహస్యాలు తెలియనే తెలియవనీ అమీరీ అంటున్నాడు. అణ్వస్త్ర శాస్త్రవేత్తకి అసలు ఏ రహస్యాలూ తెలియవనడంలో రహస్యమేమిటో? నిజమేమిటో?

కాలం నిరూపిస్తే తెలియాల్సిందే!

అచ్చంగా అద్వానీ Vs జస్వంత్ సింగ్ ల ఆత్మకథల నేపధ్యంలో, 2001 నాటి కాందహార్ హైజాక్ రహస్యాలు బయటికొచ్చినట్లుగా నన్న మాట!

ఎందుకంటే... నిజం బహిర్గతం కావాలంటే - సంఘటనలన్నా జరగాలి. లేదా అందులో ప్రమేయమున్న వ్యక్తులు నోరన్నా విప్పాలి? [కలహమో, మరొకటో] ఏ కారణం చేతనైనా, వ్యక్తులకి మాత్రమే తెలిసిన రహస్య విషయాలు బయటపెడితే తెలియాల్సిందే!

అలాంటి నేపధ్యంలో... శోరెన్ వ్యవహారం ఒక్కటి చాలదా సోనియా నిబద్దత తెలియటానికి? అయినా ఇటలీ మహిళకి ఇండియా పట్ల నిబద్దత ఎలా ఉంటుంది? వింత గాకపోతే!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~
Categories: Left

భాజపా రాంజఠ్మలానీలూ, నారిమన్ లూ! [నకిలీకణికుడి వ్యవస్థ గురించి కొన్ని దృష్టాంతాలు [Circumstantial] – 16]

Thu, 07/15/2010 - 08:11
మొన్నటి మా టపాకు వ్యాఖ్య వ్రాస్తూ, మిత్రులు ‘చంద-మామ’ గారు, ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన దిగువ వార్తని ప్రస్తావించారు. ‘చంద-మామ’ గారికి కృతజ్ఞతలతో ఈ టపా!

ముందుగా దిగువ వార్తని ఓ సారి పరిశీలించండి.

>>>ఇండియా గేట్
బిజెపి విభిన్న స్వరూపం- ఎ. కృష్ణారావు
భారతీయ జనతా పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా విచిత్రంగా, వివాదాస్పదంగా ఉంటాయి. చాలా నిర్ణయాలను దాని సిద్ధాంతాలతో ముడిపెట్టలేం. ఇటీవల బిజెపి మద్దతుతో ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం ఇలాంటి నిర్ణయాల్లో ఒకటి. న్యాయవాదిగా ఆయన సామర్థ్యాన్ని ఎవ రూ ప్రశ్నించలేరు. కాని బిజెపికి ఇప్పుడు 87 ఏళ్ల రాంజెఠ్మలానీతో ఏం అవసరం వచ్చిందా అన్న విషయం ఆలోచించా ల్సి ఉన్నది.

గుజరాత్‌లో గత 8 సంవత్సరాల క్రితం జరిగిన వేలాది మంది ఊచకోతకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన సమాన్లను సవాలు చేసే బాధ్యతను జెఠ్మలానీ తన భుజస్కంధాలపై వేసుకున్న తర్వాత బిజెపికి జెఠ్మలానీపై ప్రేమ కలిగి ఉంటుంది. విచిత్రమేమంటే ఆయన అంతకుముందు గుజరాత్ అల్లర్ల బాధితు ల తరఫున కేసులు వాదించారు. బా«ధితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాదులు ఎవరైనా ముందుకు రావల్సిందిగా సుప్రీంకోర్టు కోరినప్పుడు రాం జెఠ్మలానీ తనంతట తాను ముందుకు వచ్చారు.

ఒక ఎన్‌జిఓ తరఫున ఆయన గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు. కాని అదే రాంజెఠ్మలానీ గత మార్చిలో మోడీ తరఫున వకా ల్తా తీసుకున్నారంటే ఆయనకూ బిజెపికి మధ్య ఏదో ఒక ఒప్పందం కుదిరిఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసిన వారు లేకపోలేదు. తదనుగుణంగా రాంజెఠ్మలానీకి రాజ్యసభ నుంచి బిజెపి తరఫున సీటు వరించింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా తన పార్టీ శాసన సభ్యులను జైపూర్‌లో అయిదు నక్షత్రాల హోటల్‌లో విడిది చేయించి వారికి అక్కడే సకల ఏర్పాట్లు చేయించి వారు మరో పార్టీ వైపు మొగ్గు చూపకుండా కాపాడుకున్నందువల్లనే రాంజెఠ్మలానీ విజయం సాధించగలిగారు.

పనిలో పనిగా ఈ ఎమ్మెల్యేలకు రాజనీతి సినిమా పైరేటెడ్ కాపీని తెప్పించి మరీ వినోదం కలిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్రమంగా చూసినందుకు వారిపై కేసు పెడతానని సినిమా దర్శకుడు ప్రకాశ్ ఝా హెచ్చరించారు.. అయనా వారికేం భయం ఉద్దండ పిండమైన న్యాయవాది రాంజెఠ్మలానీ బిజెపి పక్షంలోనే ఉన్నారు కదా.. ఏదో రకంగా వారిని ఆయన ఈ కేసు నుంచి తప్పించగల చతురుడు. నరేంద్ర మోడీనే కాదు, ఐపిఎల్ కుంభకోణంలో ఇరుక్కున్న లలిత్ మోడీని కూడా కాపాడేందుకు రంగంలోకి దిగిన రాంజెఠ్మలానీ గతంలో ఏ కేసులు వాదించారన్న విషయంలో, ఏ విధంగా తమ పట్ల ప్రవర్తించారన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు.

2004లో ఆయన అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికి వ్యతిరేకంగానే లక్నోనుంచి పోటీ చేశారన్న విషయం బిజెపికి తెలిసిందే కదా.. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకులను సమర్థిస్తూ ఆయన కోర్టుల్లో వాదించారన్న విషయం కూడా ఆ పార్టీకి తెలియని కాదు కదా.. సంచలనాత్మకమైన మార్కెట్ కుంభకోణాలకు పాల్పడిన హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారిని, స్మగ్లర్లను, ముఠాకోర్లను.

అందరూ చూస్తుండగానే జెస్సికాలాల్ అనే మోడల్‌ను కాల్చి చంపిన మనుశర్మ అనే హంతకుడిని కాపాడేందుకు ప్రయత్నించింది కూడా ఆయనే నని బిజెపికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. అన్నిటికన్నా మించి పార్లమెంట్ దాడిలో నిందితుడైన పాకిస్తానీ టెర్రరిస్టు మహమ్మద్ అఫ్జల్‌ను ఉరితీయకూడదని కోర్టులో వాదించడమే కాక, పార్లమెంట్‌లో అప్జల్ ఉరి ని వ్యతిరేకించింది రాంజెఠ్మలానీయేనని భారతీయ జనతా పార్టీకి చెప్పే ప్రయత్నం చేయడం అమాయకత్వమే కదా..

అయినా భారతీయ జనతా పార్టీకి రాంజెఠ్మలానీ వంటి న్యాయవాదులకు అందలమెక్కించడం కొత్త కాదు. 15వేల మంది ప్రాణాలను బలిగొన్న యూనియన్ కార్బైడ్ కేసులో ఆ కంపెనీ తరఫున వాదించి వాయిదాల వాయిదాలు కోరి, ఆ కేసు 26 ఏళ్లు పట్టేందుకు కారణమైన మరో ప్రముఖ న్యాయవాది ఫాలి నారిమన్ కూడా బిజెపికి అంతరంగికుడే. భోపాల్‌లో కేసు విచారణ జరిగిన తొలి రోజుల్లో ఒక్క నారిమన్ మాత్రమే ఢిల్లీ నుంచి వెళ్లేలా చేసేందుకు యూనియన్ కార్బైడ్ కంపెనీ విమానం టిక్కెట్లనన్నీ తానే కొన్న సందర్భాలున్నాయని అప్పటి ప్రముఖ న్యాయవేత్త ఒకరు చెప్పా రు.

ఇటీవల నారిమన్ 'జ్ఞాపకాలు చెరిగిపోకముందే.. (బిఫోర్ మెమోరీ ఫేడ్స్ అవుట్)' అనే పుస్తకాన్ని రాశా రు. ఇందిరాగాంధీ హత్యకేసులో నిందితులను కాపాడేందుకు రాంజెఠ్మలానీ వంటి న్యాయవాదులు కేసు వాదించినప్పుడు తానెందుకు యూనియన్ కార్బైడ్ తరఫున వాదించకూడదని నారిమన్ ఈ పుస్తకంలో రాసుకున్నారు.

హత్యకేసులో నిందితులెవరో తేలేందుకు విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. కాని భోపాల్‌లో విషవాయువు లీకై 15వేలమంది మరణించిన దృశ్యాలు కళ్లముందున్నప్పుడు అందుకు కారణమైన ఆ కంపెనీ తరఫున వాదించి, కంపెనీ నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రయత్నించడం సరైనదేనా.. అది భారత ప్రజల తరఫున దుర్మార్గం కాదా.. అని ఎవరైనా ప్రశ్నించేందు కు ఆస్కారం ఉన్నది. అందునా నారిమన్ అంతకుముందు మానవ హక్కులకోసం పోరాడిన వారు.

ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారు. అలాంటి నారిమన్ యూనియన్ కార్బైడ్ ప్రలోభాలకు లొంగిపోవడం జీర్ణించుకోలేని విషయం కాదు. అందుకే బిజెపి ఆయనను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేయడం, పద్మభూషణ్ లాంటి బిరుదులు ఇవ్వడం జరిగిందంటే ఆ పార్టీ గురించి కొంత ఆలోచించాల్సి ఉంటుంది. తనకు అప్పటి డిప్యూటీ ప్రధానమంత్రి అద్వానీ స్వయంగా ఫోన్ చేసి తనను రాజ్యసభకు నామినేట్ చేశారని తన ఆత్మకథలో రాసుకున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ కార్బైడ్ కేసులో సిబిఐ ఛార్జిషీటులో నిందితుడైన కేశవ్ చంద్ర మహేంద్రకు పద్మభూషణ్ అవార్డు వరించడం కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

న్యాయవాదులు ఏ కేసులోనైనా వాదించవచ్చు కనుక వారి వృత్తికీ ప్రవృత్తికీ ముడిపెట్టరాదని వాదించే బిజెపి నేత లు ఉండవచ్చు కాని రాంజెఠ్మలానీ ఉదంతం బిజెపిలో ఉన్న ఒక గందరగోళాన్ని, నిస్సహాయతను సూచిస్తుంది. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వం ఎంత అస్తవ్యస్తంగా పాలిస్తున్నప్పటికీ, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, యూనియన్ కార్బైడ్ వంటి ఉదంతాలు ఆ పార్టీ నిజస్వరూపాన్ని వ్యక్తం చేసినప్పటికీ బిజెపి దాన్ని గట్టిగా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నదంటే ఆ పార్టీ నైతికతయే ప్రశ్నార్థకంగా మారిందని భావించవలిసి ఉంటుంది.

దేశ ప్రజలకు సంబంధించి ఒక ఘోరమైన అన్యాయం గురించి వాస్తవాలు వెల్లడవుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బిజెపి ప్రజలను ఉద్యమించేందుకు పురికొల్పలేని ఒక అసమర్థ దుస్థితిలో ఉన్నదని చెప్పవలిసి ఉంటుంది. తాజాగా బీహార్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీని ఒక విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టివేశాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ముఖ్యమంత్రితోనే ఢీకొనేందుకు బిజె పి పూనుకోవడం ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతుంది.

నిజానికి ఇలాంటి కార్యవర్గ సమావేశాలు సంబంధాలు బలపడేందు కు దోహదం చేయాలి కాని కూటమిలో ఉన్న ఒక ప్రధాన పార్టీ తప్పుకునే పరిస్థితికి సమావేశాలు దారి తీయడం ఆశ్చర్యకరం. ముందునుంచీ జనతాదళ్ (యు)కు చెందిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి నరేంద్ర మోడీ క రచాలనం చేస్తున్న పోస్టర్లు అంటించడం, మోడీ తమ పార్టీ మంత్రులను ఆకాశానికెత్తడం, కావాలంటే తెగతెంపులు చేసుకోవల్సిందిగా సీనియర్ బిజెపి నాయకుడు యశ్వంత్ సిన్హా సవా లు చేయడం, ముఖమంత్రి రాష్ట్రంలో చేపడుతున్న యాత్రనుంచి తప్పుకోవాలని బిజెపి ఉప ముఖ్యమంత్రి సుశీల్ షిండే సహా మరికొందరు మంత్రులు నిర్ణయించడం, చివర కు క్యాబినెట్ సమావేశాల్నే బహిష్కరించాలని యోచించడం చిలికి చిలికి గాలివానగా మారింది.

చివరకు రాష్ట్రంలో వరద బాధితులకు నరేంద్ర మోడీ ప్రకటించిన నిధులను తిరస్కరించాలని నితీశ్ కుమార్ నిర్ణయించడంతో ఇక ఎన్‌డిఏతో జెడి(యు) తెగతెంపులు చేసుకోవడం తప్పదన్న అభిప్రాయాన్ని ఏర్పర్చింది. నిజానికి బిజెపితో సంబంధాలు కొనసాగించే విషయంలో జెడి(యు)కు ఎలాంటి అభ్యంతరం లేకున్నా నరేంద్ర మోడీ, వరుణ్ గాంధీ వంటి వివాదాస్పదమైన వ్యక్తుల విషయంలోనే నితీశ్ కుమార్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

గుజరాత్ అల్లర్లకు కారకుడైన మోడీతో స్నేహసంబంధాల వల్ల తన ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయం ఇందుకు కారణం కావచ్చు. కాని బిజెపి ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకుం డా, బీహార్‌లో మోడీకి పెద్ద పీట వేయడం సహజంగానే నితీశ్‌కు కోపం తెప్పించి ఉంటుంది. బహుశా బిజెపి బుద్ధి పూర్వకంగానే బీహార్‌లో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తి ఆయనకు ఎనలేని ప్రాధాన్యం కలిగించి ఉంటుంది.

వచ్చే ఏడాది బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న రీత్యా మోడీని ప్రచార రంగంలోకి దించేందుకు ఆ పార్టీ వ్యూహరచ న చేస్తున్నట్లు కనపడుతోంది. బీహార్‌లోనే కాదు మహారాష్ట్ర లో శివసేనతో కూడా బిజెపి సంబంధాలు రోజురోజుకూ దెబ్బతింటున్నాయి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఆ పార్టీతో తెగతెంపులుచేసుకున్న విషయం తెలిసిందే.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం తప్ప ఏ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్న విషయం తెలిసినప్పటికీ బిజెపి ఒక్కో మిత్రపక్షాన్నీ వదులుకోవడం ఆశ్చర్యకరం. యుపిఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సాధించేందేమీ లేదని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ బీహార్‌లో బిజెపి కార్యవర్గ సమావేశాల్లో అన్నారు. కాని ఈ ఏడాదిలో ప్రతిపక్షంగా, బలమైన పార్టీగా నిలదొక్కుకునేందుకు బిజెపి ఏం చేసిందో ఆయనే చెప్పాలి. (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


దేశ విభజన నాడు పాక్ నుండి భారత్ కు వలస వచ్చి, ఆనక ప్రముఖులైపోయిన సమూహంలో - ఒకడు రాంజెఠ్మలానీ! భారతదేశానికి వ్యతిరేకంగా ఏ కేసునైనా వాదించటానికి ఎల్లవేళలా సిద్దంగా ఉంటాడీతడు. చిత్రమేమిటంటే - ఒకే కేసులో.... ఒకసారి వాది తరుపునా, మరికొంత కాలం తర్వాత ప్రతివాది తరుపునా కూడా వాదించగల ‘దిట్ట’. అది చట్టబద్దం కావచ్చేమో గానీ, వ్యక్తిగతంగా ఏ పాటి ‘నీతి వంతమో’ సదరు న్యాయవాదికే తెలియాలి.

గమ్మత్తు ఏమిటంటే - ఇందిర హంతకుల తరుపునా, పార్లమెంటుపై దాడి కేసులో ముద్దాయి ‘అఫ్జల్ గురు’ ల తరుపునా వాదించిన ఈ న్యాయవాది, ప్రతీకేసు లోనూ భారత్ కు వ్యతిరేకంగా వాదించేందుకే సిద్దపడే ఈ న్యాయవాది, తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాల్సిందిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

అతడి దృష్టిలో .... భారత్ కు వ్యతిరేకంగా, కుట్రదారులకు అనుకూలంగా, తాను చేసిన సేవలకు, తనకు ముట్ట చెప్పవలసిన ‘కూలీ’ అది! ఆ డిమాండునే తెరపైన ఎన్డీయేనీ, ఆ విధంగా తెరవెనుక.... ఎన్డీయే యూపీఏ లని ఆడించే గూఢచర్య వ్యవస్థ యైన నకిలీ కణిక వ్యవస్థనీ డిమాండ్ చేశాడు.

"నువ్వు చేసిన సేవలకు అంత ఖరీదు లేదులే! మహా అయితే ఇదిగో ఈ రాజ్యసభ సీటు ఇస్తాం" అని భాజపా ద్వారా ఆ ‘కూలీ’ అతడికి ఇచ్చింది నకిలీ కణిక వ్యవస్థ!

లేకపోతే, అంత అడ్దదిడ్డంగా భాజపా ప్రవర్తిస్తుందా? అంత నగ్నంగా, అంత పచ్చిగా, అంత బహిరంగంగా, విలువలు వదిలేసి నిలబడి కనబడుతుందా?

చేసిన కర్మను అనుభవింప చేసే సువర్ణముఖి ఎదురుగా ఉంటే...
‘కన్నా?కాలా?’ స్ట్రాటజీలో చిక్కుకొని తప్పని సరి పరిస్థితి అయితే....
‘ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్’ ని నిర్వహించడం తప్పని సరి అయితే....
భాజపా అయినా ఏం చేస్తుంది? సోనియా అయినా ఏం చేస్తుంది?

కాబట్టే - రాంజఠ్మలానీ లకు రాజ్యసభ టిక్కెట్లు వస్తాయి, నారిమన్ లకు పద్మ అవార్డులొస్తాయి. [ఈ రాంజెఠ్మలానీని 1992 ద్వితీయార్దంలో ఢిల్లీలో రోడ్డు మీద జనాలు బాహాబాహీ కొట్టారు. జనం మధ్యలో నలుగుతూ, కళ్ళద్దాలు పప్పుపప్పు కాగా, బిగ్గరగా రోదించిన రాంజఠ్మలానీ విజువల్ ని, అప్పట్లో డీడీ వార్తల్లో చూశాను.]

రాంజఠ్మలానీ చరిత్ర ఇదయితే, ప్రముఖ న్యాయవాది ఫాలి నారిమన్ చరిత్రని ఆంధ్రజ్యోతి వ్రాసింది. సదరు నారిమన్, యూనియన్ కార్బైయిడ్ కు ‘పరమతొత్తు’ గా పనిచేసాడు. [ఇలాంటి పనులు చేసినందుకు బహుమానంగా పద్మ అవార్డులు గట్రా తెచ్చుకున్నాడన్న మాట!]

ఇక ఈ ఎన్డీయే యూపీఏలు... పార్లమెంట్ లోనూ, రాష్ట్ర అసెంబ్లీలలోనూ అరుచుకునేటప్పుడు....

ఉదాహరణకి -
ఎన్డీయే వాళ్ళు గనక, అఫ్జల్ గురు గురించి ఎత్తేరనుకొండి! అప్పుడు యూపీఏ వాళ్ళు, "ఆ ‘ఆఫ్జల్ గురు’ తరుపున వాదించిన రాంజఠ్మలానీ ని మీరే కదా నెత్తి కెత్తుకొని రాజ్యసభకు పంపించారు? ఇంకా మీరూ మాట్లాడతారా?" అంటారు. ‘అవును కదా!’ అనుకుని, పాపం బిజేపీ, తన గొంతు క్రమంగా తగ్గించేస్తుంది.

అలాగే యూనియన్ కార్బైయిడ్ గురించి మాట్లాడితే.... "ఆ నారిమన్ ని మీరు నెత్తికెక్కించుకోలేదా? ఇంకేం మాట్లాడతారు?" [యూపీఏ కైతే యూనియన్ కార్బైయిడ్ పాపమంతా పీవీజీదే!] అంటారు. ‘అవును కదా!’ అని, ఎన్డీయే తమ వాదనా పటిమని తగ్గించుకుంటుంది.

మరో ఉదాహరణ చెప్పాలంటే.... ఇప్పుడు కర్నాటన చట్టసభలో, గాలి గనుల గొడవల్లో, ఒకరి నొకరు అరుచుకుంటూ, భాజపా కాంగ్రెస్ ని "ఇప్పుడు కర్ణాటక గవర్నరుగా ఉన్న హెచ్.ఆర్.భరద్వాజ, అప్పట్లో న్యాయమంత్రిగా ఉండి, భోపోర్సు కేసులో ద్రోహి ఖత్రోచికి ఎలాంటి సాయం చేశారో దేశమంతా తెలుసు. అలాంటిది తగుదునమ్మా అంటూ, గవర్నరుని అంటూ, ఓ తెగ గోల చేస్తున్నాడు!? ఇంకా ఏం చెప్పొచ్చారు?" అంటున్నారు, చూడండి! అలాగన్న మాట!

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి "రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వారిపై వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యం ఏమైపోవాలి?" అంటూ సెలవిస్తున్నాడు. అసలు ప్రభుత్వ కుర్చీ వ్యక్తి అనే పదవి రాజ్యాంగంలో ఉందా? తమకి కావాలసినప్పుడు కావాల్సినట్లుగా వాడుకునేదే వాళ్ళ ‘రాజ్యాంగం’ కాబోలు!

ఇక ఇలాంటి ఎన్డీయేలనీ, యూపీఏలనీ ఏమనగలం? వీరా దేశాన్ని కాపాడేది?

ఇక్కడ ఓ పోలిక చెబుతాను.

మన పల్లెటూళ్ళల్లో, నాలుగు దారుల కూడళ్ళలో, ఆ వీధి కుక్కలు ఓ పది, ఈ వీధి కుక్కలు ఓ పది చేరి, ‘ఖయ్యి ఖయ్యి’ మని అరుచుకుంటూ ఉంటాయి. చెవులు చిల్లులు పడేలా మొరుగుతాయి. మనం అదిలించినా వాటికి పట్టదు. ఒక్కళ్ళుగా అదిలిస్తే కరిచినా కరిచేస్తాయి.

కాస్సేపలా ‘గ్యాంగ్ వార్’ నడిచాక, వేటి దారిన అవి పోతాయి. సరిగ్గా అలాగే, ఎన్నికల ప్రచార సభల్లోనూ, ఎన్నికయ్యాక అన్ని చట్టసభల్లోనూ, అన్ని పార్టీల వాళ్ళూ, చేస్తున్నది ఈ ‘గ్యాంగ్ వార్’ నాటకమే! అంతా అయిపోయాక, తమ జీత భత్యాలు పెంచుకోవటం వంటి, తమ స్వార్దప్రయోజనాలకు సంబంధించిన బిల్లుల్ని మాత్రం, చల్లగా ‘పాస్’ చేసుకుని చక్కా పోతుంటారు.

ఇంకా ఇది ప్రజాస్వామ్యమనీ,
వీళ్ళు ప్రజాప్రతినిధులనీ,
వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారనీ,
ఫలానా ఫలానా సిద్దాంతం ప్రకారం ఈ రాజకీయాలు నడుస్తున్నాయనీ,
ఫలానా ఫలానా సూత్రాల ప్రకారం ఈ పత్రికలు వ్రాస్తుంటాయి అనే వాళ్ళకు ‘జిందాబాద్’ చెబుతూ....
వాళ్ళకే నా ఈ టపాని అంకితం చేస్తున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

సందుగొందుల నుండి రహదారి మీద ప్రయాణం! [జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 05]

Tue, 07/13/2010 - 03:17
ముందుగా ఓ పోలిక!

ఎక్కువగా రాంగోపాల్ వర్మ వంటి దర్శకుల సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం!

ఉదాహరణకి కొందరు వ్యక్తులు ఓ గచ్చకాయ రంగు అంబాసిడర్ , మరో తెల్ల అంబాసిడర్ మీద ప్రయాణిస్తూ, ఒకరి నొకరు తరుముకుంటున్నారనుకొండి. విశాలమైన రహదారి పైన, ఇతర వాహనాల రాకపోకలున్నా, ఈ రెండు కార్ల ఛేజింగు దశ, దిశ స్పష్టంగానే కనబడతాయి. గచ్చకాయ రంగు అంబాసిడర్, తెల్ల అంబాసిడర్ ని తరుముతోందనుకుందాం.

ఇంతలో ఏ కారణం చేతనైనా, ఈ రెండు కార్లు, ప్రధాన రహదారి నుండి ప్రక్కకి మళ్ళి, సందుగొందుల్లోకి ప్రవేశించాయనుకొండి. అప్పుడు వాటి ప్రయాణపు దశ, దిశ స్పష్టంగా గోచరించవు. ఒకోసారి అసలు వేటి దారిన అవి ప్రయాణిస్తున్నట్లుగా కూడా అన్పిస్తుంది. ఎవరిని ఎవరు తరుము తున్నారో అర్దం కాదు.

మళ్ళీ ఆ రెండు కార్లు ప్రధాన రహదారి [Main Road] మీదికెక్కితే... అప్పుడు వాటి దశ, దిశ మళ్ళీ స్పష్టంగా గోచరిస్తాయి. అప్పుడు చూస్తే, ముందు ప్రయాణిస్తున్న దారిలోనే, అవి మరికొంత ముందు కెళ్ళి... వేగంగానో, మెల్లిగానో [చాలా సందర్భాల్లో వేగంగానే] ప్రయాణించటం తెలుస్తుంది. అంతే కాదు, మరింత స్పష్టంగా ఎవరు ఎవరిని తరుముతున్నారో తెలుస్తుంది.

ఇక ఈ పోలిక అనువర్తన ఏమిటంటే -

వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వారం తర్వాత ప్రారంభమైన జగన్ శిబిరం, కాంగ్రెస్ అధిష్టానాల మధ్య నడుస్తున్న అంతర్లీన పోరు ఇలాంటిదే!

మధ్యలో... జగన్, అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూ "అమ్మ చెప్పింది అమ్మకిమ్మని" అంటూ, పులివెందుల అసెంబ్లీకి వై.యస్. విజయలక్ష్మి చేత నామినేషన్ వేయించినా...

అలాగే, జగన్ అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూ, వై.యస్. మరణానంతర సీఎల్పీ సమావేశపు మొక్కుబడిలో, రోశయ్యని నాయకుడిగా ప్రతిపాదించినా...

సమాంతరంగా, జగన్ అధిష్టానానికి అవిధేయత ప్రకటిస్తూ, సాక్షి పత్రికలో రోశయ్య ప్రభుత్వాన్ని విమర్శించినా ...

అవన్నీ సందుగొందుల్లో ప్రయాణాలే!

అదే విధంగా జగన్ విషయమై...

కాంగ్రెస్ అధిష్టానం తరుపున కేంద్రంలో వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ వంటి అధిష్టానపు అనుచరులు నాటకీయ సన్నివేశాలు నడిపినా...

అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ, జయంతీ నటరాజన్ వంటి అధికార ప్రతినిధులు రకరకాల పత్రికా ప్రకటనలు గుప్పించినా....

రాష్ట్రంలో రోశయ్య, కేకే, డీఎస్, పాల్వాయి, వీహెచ్ ల వంటి వృద్దనేతలు వంతుల వారీగా ‘హల్ చల్’ నిర్వహిస్తూ రోజు కో ప్రకటన, వారానికో మాట పడంచినా....

పబ్లిక్ గా కనిపించకుండా జగన్ కు పార్టీలో పట్టును ఊడగొడుతూ, దెబ్బలు కొట్టినా...

అలాగే అధిష్టానం గాలి గనుల మీదకి ప్రభుత్వాధికారులని పంపినా...

అవన్నీ కూడా సందుగొందుల్లో ప్రయాణాలే!

తొమ్మిది నెలల తర్వాతయినా, ఎన్ని సందుగొందులలో తిరిగినా, ప్రధాన రహదారి మీద.... జగన్ శిబిరం, కాంగ్రెస్ అధిష్టానం ల ఛేజింగ్... అదే దిశలోనూ, మరింత తీవ్ర దశలోనూ ఉంది.

గత టపాలోని ఈ క్రింది పేరా పరిశీలించండి.

[అధిష్టానం ముందున్న దారులు రెండు! ఒకటి, జగన్ శిబిరపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది జగన్ శిబిరాన్ని Over power చేయడం. మొదటిది చేస్తే, ఇక జగన్ శిబిరం అంతకంతకూ తమ పట్టుపెంచుకుంటూ పోతుంది. కోరికల జాబితానూ పెంచుకుంటూ పోతుంది. ఆ విధంగా నైనా తము, తమ స్ట్రాటజీ Expose అవుతాయి. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు, దాదాపుగా అదే మార్గంలో ప్రయాణిస్తుంది.

అలాగే జగన్ శిబిరం ముందున్న దారులు కూడా రెండే! ఒకటి, అధిష్టానపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది వాళ్ళ గుట్టు బయటపెట్టటం. మొదటిది చేస్తే, ఇక తమకు భవిష్యత్తు ఉండదు. క్రమంగా కాంగ్రెస్ అధిష్టానం తమని మట్టి కలిపేస్తుంది. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానానికీ, జగన్ శిబిరానికీ మధ్య నడుస్తున్న అంతర్లీన పోరుఇదే!]

ఇప్పటికీ... అధిష్టానం, జగన్ శిబిరం, ఇద్దరిదీ రెండో మార్గాన్ని ఎంచుకున్న స్థితి!

ఈ నేపధ్యంలో, ఈ బ్లాగులో గత ఏడాది, వై.యస్.ఆర్. మృతి తర్వాత [10, అక్టోబరు, 06 నవంబరు లలో] వ్రాసిన నాలుగు టపాలలో, వీరి అంతర్లీన పోరు పూర్వ పరిస్థితులని విశదీకరించాను. మరోసారి పరిశీలించాలంటే....

1].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 01 [ద్విముఖ వ్యూహం][Oct. 10, 2009]


2].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 02 [పిల్లిదూరే కంతలో ఎలుక దూరదా సత్తెయ్యా!] [Nov.03, 2009]


3].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 03 [ఎవరు ఎవరికి దాసోహం అన్నారు?] [Nov.05, 2009]


4].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 04 [ఏకాంత భేటీ వరకూ…] [Nov.06, 2009]

ఇక ఇప్పుడు `ఈనాడు Vs సాక్షి పత్రికల నడుమ మీడియా పోరు'గా రూపాంతరం చెందిన, కాంగ్రెస్ అధిష్టానం Vs జగన్ శిబిరాల నడుమ సాగుతున్న అంతర్లీన పోరును విశ్లేషించాలంటే....

ముందుగా పైకారణం[over leaf reason] లోని కొన్ని వైరుధ్యాలను, విచిత్రాలనూ పరిశీలించాల్సి ఉంది. అవి నిజంగా ఆసక్తికరమైనవి, ఆశ్చర్యకరమైనవి కూడా!

ఆయా వైరుధ్యాలనీ, విచిత్రాలనీ పరిశీలించే ముందు, ఒక చిన్న వివరణ!

నేను ఈ టపాలలో, ఈనాడు రామోజీరావునీ, సోనియానీ విమర్శిస్తున్నానంటే అర్దం - సాక్షినీ, జగన్ నీ సమర్దిస్తున్నానని కాదు.

అధిష్టానపు అకృత్యాలని, అబద్దాలనీ ఎత్తి చూపుతున్నానంటే అర్ధం - జగన్ సచ్ఛీలుడనీ కాదు.

ఈ వ్యవహారంలో... సోనియా, రామోజీరావుల సంయుక్త హస్తాన్నీ, కుట్ర స్వరూపాన్నీ ఎత్తి చూపడమే నా ఉద్దేశం!

మరోమాట ఏమిటంటే - పోల్చి చూస్తే... ఈ దేశానికీ, దేశ ప్రజలకీ... మరణించిన వై.యస్.ఆర్, అతడి కుమారుడు జగన్, చంద్రబాబు నాయుడు ల వంటి రాష్ట్ర రాజకీయుల కంటే... సోనియా, రామోజీరావుల బృందమే పెద్ద శతృవులు!

ఎంతగా ప్రజాధనం దోచుకుతిన్నారన్నా... చంద్రబాబులూ, వై.యస్. జగన్ లూ దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టలేరు. పాక్ కి పాదాక్రాంతం కాలేరు.

అవకాశం వస్తే అందరూ రామోజీరావులే కావచ్చు గాక! ఆ అవకాశం... చంద్రబాబు నాయుడికీ, జగన్ లకీ రాక పోవటమే వాళ్ల అదృష్టం! అదృష్ట దురదృష్టాలు పూర్వ జన్మ సుకృత దుషృతాలని పెద్దలంటారు. ఏదేమైనా... అంతటి అవకాశం చంద్రబాబులకీ, జగన్ లకీ రాకపోవటమే ఇక్కడ ముఖ్యమైన అంశం!

ఒక వేళ చంద్రబాబు నాయుళ్ళూ, జగన్ లూ గనక... సోనియా, రామోజీరావుల స్థానంలో ఉండి ఉంటే,

సోనియా, రామోజీరావుల స్థాయిలో ఈ దేశానికి, సామాన్య ప్రజానీకానికీ, ధర్మానికీ హాని చేయగలుగుతుంటే,

అప్పుడు వాళ్ళే ప్రధమ శతృవులై ఉండేవాళ్ళు.

ఆయా వ్యక్తుల కుట్ర భాగస్వామ్యం వారిని ‘శతృవు’ అనే మెట్ల మీద, వారి వారి స్థానాల్లో నిలిపింది. అదే విధంగా వారి వారి సువర్ణముఖినీ అనుభవింప చేస్తుంది.

ఏతావాతా విషయమేమిటంటే - కాంగ్రెస్ అధిష్టానం సోనియాతో... చంద్రబాబులూ, జగన్ లూ వంటి రాష్ట్ర రాజకీయుల్ని పోల్చి చూస్తే... దేశానికి కీడు చెయ్యడంలో సోనియాదే ఫస్ట్ ర్యాంకు!

కాబట్టి, ఈ దేశానికి ప్రధమ శతృవు సోనియా, ఆమెకు అండదండా అయిన రామోజీరావులే! [రామోజీరావుకీ, సోనియాకీ మధ్య సంబంధ బాంధ్యావ్యాలేమిటో నా గత టపాలలో వివరించాను.]

ఇక ఇప్పుడు... జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య నడుస్తున్న అంతర్లీన పోరులోని పైకారణాలనీ[over leaf reasons], వైరుధ్యాలనీ విచిత్రాలనీ పరిశీలిద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

ప్రభుత్వానికి తక్షణ ఆదాయం - పరమ రహస్యం సుమా!

Mon, 07/12/2010 - 03:54
అది గూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్! విశాలమైన అవరణలో ఠీవిగా నిలబడిన బహుళ అంతస్థుల భవనం. ఆఫీసు గది ముందు అందంగా ఒదిగిన క్రోటన్ మొక్కలు.

గేటు ముందు బీఎండబ్యూ కారు ఆగింది. లోపలున్నది మంత్రి గారి సతీమణి! ఒక సెక్యూరిటీ గార్డు సెల్యూట్ చేసి గేటు తీస్తుండగానే, మరో గార్డు ఫోన్ లో ప్రిన్స్ పాల్ కి సమాచారం చేరేసాడు.

కారు పోర్టికోలో ఆగేసరికే ప్రిన్స్ పాల్, కరస్పాండెంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎదురు వచ్చి ‘మేడమ్’ కి స్వాగతం చెప్పారు. ఆఫీసు గదిలో కూర్చున్నాక, అటెండరు కూల్ డ్రింకులందిస్తుండగా....

"మీరు వచ్చారేమిటి మేడం, కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళంగా...?" మృదువుగా నవ్వుతూ వినయంగా అన్నాడు కరస్పాండెంట్!

అది పైమాటేనని మంత్రి గారి సతీమణికీ తెలుసు. ఎందుకంటే - గూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో సిటీలోని ప్రముఖుల పిల్లలంతా చదువుతుంటారు. అసలు గూబ్లీ హిల్సే ప్రతిష్టాత్మక ప్రదేశం. అక్కడుండే వాళ్ళంతా విఐపీలే!

తాను ఫోన్ చేసినా కరస్పాండెంట్ రాడు. మహా అయితే ఏఓ ని పంపిస్తాడంతే! అందుకే అవేవీ పట్టించుకోలేదావిడ!

సూటిగా విషయంలోకి వచ్చేసింది.

"ఈ మధ్య మా వినోద్, దెయ్యాలున్నాయనీ, తాను చూసాననీ విపరీతంగా మాట్లాడుతున్నాడు. చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు" ఉపోద్ఘాతంగా అంది.

"అవును మేడం. క్లాసులో మిగితా పిల్లలు చెప్పగా మాకు తెలిసింది. తాను నిజంగా దెయ్యాన్ని చూసానంటున్నాడు. మేమూ కౌన్సిల్ చేసి చూశాము" రాబోయే పరిస్థితులకి సమాయత్త పడినట్లుగా అన్నాడు ప్రిన్స్ పాల్!

"నేను అడిగి చూశాను. మీ స్కూలు బిల్డింగ్ వెనకాల శ్మశానం ఉందట?"

"అవును మేడం. వెనకాల బండాపూర్ శ్మశానం ఉంది"

"ప్రతీరోజూ ఆ శ్మశానం లోకి గోడ దూకి, సంచితో దెయ్యం శ్మశానం మధ్యలో ఉన్న.... పాకో, గుడిసో, అందులోకి పోతున్నాడంటున్నాడు మావాడు. అదేమిటో కనుక్కోండి" అంది కూర్చో లోంచి పైకి లేస్తూ మంత్రిగారి సతీమణి!

"తప్పకుండా మేడం! అవసరమైతే పోలీసు కంప్లైయింట్ ఇస్తాం" హామీ ఇచ్చాడు కరస్పాండెంటు.

మంత్రిగారి భార్య అటు వెళ్ళటంతోనే, సెల్ తీసి బండాపూర్ ఇన్స్ సెక్టర్ కి ఫోన్ కొట్టాడు ప్రిన్స్ పాల్!

~~~~~~~~~~

సెక్రటేరియట్! సమతా బ్లాక్! ముఖ్యమంత్రి కార్యాలయం. మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.

"ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఉద్యోగులకి జీతాలిచ్చేందుకు కూడా మన దగ్గర డబ్బులు లేవు. అర్జంటుగా డబ్బొచ్చే మార్గం చూడండి" ముఖ్యమంత్రి గొంతులో ఆదుర్దా!

"ఆర్టీసీ రేట్లు పెంచుదాం" రెవిన్యూమంత్రి అన్నాడు.

"ఇప్పటికే అక్యూపెన్సీ రేటు పడిపోయింది" రవాణా మంత్రి రిపోర్టు.

"అదీగాక... పెంచినా వెంటనే ఆదాయం రాదు. ప్రతిపక్షాల గొడవ, బందులూ గట్రా చల్లారి, పైకం వచ్చేసరికి రోజుల టైం పడుతుంది. అంత టైం మనకి లేదు. అర్జంటుగా డబ్బులొచ్చే దారి చూడండి" ముఖ్యమంత్రి పరిస్థితి విశదం చేసాడు.

"ఏ పన్నులు పెంచినా... వ్యతిరేకతలు తగ్గి, రాబడి వచ్చేసరికి కనీసం పక్షం రోజులన్నా పడుతుంది. అదీగాక ఆ వచ్చేది ఏమూలకు?" సాలోచనగా అన్నాడు పరిశ్రమల మంత్రి.

"నీటి పారుదల శాఖలో ప్రాజెక్టుల సొమ్ము లేదా?" మరో మంత్రి ఆరా!

"ఆ ఎక్కడ? ప్రతిపక్షాలు పత్రికలు కలిసి గోలే తప్పితే, నా శాఖలో అంత డబ్బేం కాల్వలు గట్టి ప్రవహించట్లేదు" ఇరిటేట్ అయ్యాడు ఇరిగేషన్ మంత్రి.

"నీ దగ్గర ఏమయినా మిగులుంటే సర్దుబాటు చేస్తావని అడగటమే" అన్నాడు మరో మంత్రి.

"ఆపండయ్యా మీ గోల!" ముఖ్యమంత్రి కలగ జేసుకున్నాడు.

"అర్జంటుగా కాసులు రాలాలంటే అబ్కారీ శాఖ సమకూర్చాల్సిందే!" విద్యుత్ మంత్రి విశ్లేషణ!

"ఇప్పటికే పెట్టగలిగినన్ని మద్యం షాపులూ, బెల్టు దుకాణాలూ పెట్టేసాం. పిల్లలకి పాలసీసా నోట్లో పెట్టి తాగించినట్లుగా, ప్రజలకి మందు సీసా పెట్టమని మా శాఖని ఆదేశించాను. లక్ష్యాలు నిర్ణయించి అదిలించాను కూడా! ఇంక ఆడవాళ్ళకి కూడా తాగిస్తే గానీ ఆదాయం బాగా పెరగదు! అంతకంటే ఇంకేం చెయ్యలేం" అబ్కారీ మంత్రి, తన నిస్సహాయతని వ్యక్తం చేశాడు.

"అయితే ఇంకేందుకు సినిమాలో ఆడవాళ్ళు మందు తాగటం ఫ్యాషన్ చేసి, తాగితే తప్పులేదని చెప్పిద్దాం!" అంది సినిమాట్రోగఫీ మంత్రి!

"ఏదో మార్గం చూడండి! అర్జంటుగా ఆదాయం పెరిగే ఏ ఆలోచన తట్టినా ఆచరణలో పెడదాం" సమావేశం ముగించాడు ముఖ్యమంత్రి.

~~~~~~~

బండాపూర్ పోలీసు స్టేషన్! ఎస్.ఐ. సుబ్బారాయుడు ఫైలులోకి చూస్తున్నాడు. ఇప్పటికి అది యాభై ఆరో కేసు. బండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, చోరీ కేసులు ఎక్కువై పోయాయి. దొంగలు నగల జోలికో, ఇతర విలువైన వస్తువుల జోలికో పోవటం లేదు. డబ్బు మాత్రమే పోతోంది. వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. బీరువాల్లోనే కాదు పోపుల డబ్బాల్లో డబ్బులూ మాయమవుతున్నాయి.

కొత్త వాళ్ళు వచ్చిపోయిన దాఖలాలు లేవు. పోన్లే ‘అంతా... చిన్నా చితక మధ్య తరగతి ఇళ్ళల్లో చోరిలే కదా!’ అని ఇప్పటి దాకా నిర్లక్ష్యం వహించాడు.

అప్పుడే గుండు పగిలే వార్తొకటి మోసుకొచ్చింది సెల్ ఫోన్. ప్రక్కనే ఉన్న గూబ్లీ హిల్స్ లోని డబ్బున్న ఆసామీల ఇళ్ళల్లోనూ డబ్బు మాయ మౌతోందని, ఆ ఏరియా ఎస్.ఐ. ఇప్పుడే ఫోన్ చేసాడు.

ఏం చెయ్యాలో అర్దం గాక బుర్ర గోక్కున్నాడు సుబ్బారాయుడు.

~~~~~~~~

అబ్కారీ మంత్రి వెంకట స్వామి ఇల్లు. ఆఫీసు గదిలో కాగితాలు చూస్తున్నాడు మంత్రి గారి సెక్రటరీ సోమలింగం. హడావుడీగా గదిలోకి వచ్చాడు మంత్రి. ఠక్కున లేచి నిలుచున్నాడు సోమలింగం.

కుర్చీలో కూలబడి ఉస్సురన్నాడు వెంకట స్వామి.

"చూడు సోమలింగం! మా మనవడు వినోద్ స్కూల్లో దెయ్యాన్ని చూసాడని గోల చేస్తున్నాడు. కలవరింతలు. ఉలిక్కిపడటాలు. నిద్రకూడా సరిగ్గా పోవటం లేదు. జ్వరాన పడతాడేమోనని నా భార్య దిగులు పడుతోంది. వాళ్ళ స్కూలు వెనక శ్మశానంలోకి, ప్రతీ రోజూ ఎవడో గోడ దూకి పాకలోకి పోతున్నాడట. ‘వాడు కాటి కాపారి అయ్యిండచ్చు లేరా!’ అంటే.... ‘అయితే గేటు తాళం తీసుకు పోవచ్చుగా! గోడెందుకు దూకటం?’ అంటాడు.

‘ఏ పేకాట రాయిడో, తాగుబోతో అయ్యుండచ్చు!’ అంటే... ‘కంపెనీ లేకుండా ఒక్కడే ఎందుకెళతాడంటాడు?’ అబ్బబ్బ ఈ పిల్లల లాజిక్కుకి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు. అదెంటో కాస్త చూడు. ఆ గోడ దూకే వాణ్ణే పట్టుకొచ్చి, వాడి కాళ్ళ మడమలు వెనక్కి తిరిగి లేవని చూపిస్తే తప్ప, మన వాడు ఒప్పుకునేటట్లు లేడు" అన్నాడు ఆయాసపడుతూ!

అంతలోనే సెల్లు ఫోన్ ఖంగుమంది.

అవతల ముఖ్యమంత్రి. ఫోన్ లో మాట్లాడి పెట్టేస్తూ ఉస్సూరన్నాడు మంత్రి వెంకట స్వామి.

‘ఆదాయం పెంచు. ఆదాయం పెరిగే మార్గం ఆలోచించు’ అంటాడు ముఖ్యమంత్రి! అదేదో స్విచ్ఛ్ వేస్తే బల్పు వెలిగినట్లు అయిడియాలు వచ్చేస్తాయా?- విసుక్కుంటూ లోపలికెళ్ళాడు.

సెక్రటరీ సోమలింగం ఆలోచిస్తూ బయలు దేరాడు.

~~~~~~

రెండు రోజుల తర్వాత.....

అబ్కారీ మంత్రి ఆఫీసు! రయ్యిన ఉరుక్కుంటూ వచ్చాడు సోమలింగం. అతడి ముఖం వెలిగి పోతుంది.

"సార్! ప్రభుత్వ ఆదాయం తక్షణం పెరిగే మార్గం దొరికింది" రొప్పుతూ చెప్పాడు.

"ఏమిటి?" అరిచాడు మంత్రి.

మంత్రి చెవిలో గుసగుసలాడాడు సోమలింగం.

ఈసారి కెవ్వున అరిచాడు అబ్కారీ మంత్రి.

ఒక్క పరుగున ముఖ్యమంత్రి ఛాంబర్ చేరాడు. సుడిగాలిలా లోపలికి దూసుకుపోయాడు. అప్పటికి ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నాడు.

"సార్! తక్షణం ప్రభుత్వ ఆదాయం పెరిగే మార్గం దొరికింది" ఆనందంతో అరిచాడు. అతడి ముఖం, సెక్రటరీ సోమలింగం ముఖం కంటే రెట్టింపు సంతోషంతో వెలిగిపోతుంది.

"ఎలా?" ప్రశ్నార్దకంగా చూసాడు ముఖ్యమంత్రి.

ముఖ్యమంత్రి చెవిలో గుసగుసలాడాడు అబ్కారీ మంత్రి వెంకట స్వామి.

"నిజంగా?" నమ్మలేనట్లు అడిగాడు ముఖ్యమంత్రి.

"నిజం సార్! ఒట్టు" అన్నాడు అబ్కారీ మంత్రి.

"అయితే వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని శ్మశానల దగ్గర మద్యం షాపులు పెట్టించెయ్!" ఓ వైపు అబ్కారీ మంత్రిని అభినందించి, ఆదేశిస్తూనే, ఫోన్ లో హోంమంత్రిని రమ్మన్నాడు.

ఆఘమేఘాల మీద పరుగెత్తుకు వచ్చింది హోంమినిస్టర్!

"చూడమ్మా! అన్ని పోలీసు స్టేషన్ లని, ఇక ముందు చోరీ కేసులు వస్తే, చూసీ చూడనట్లు ఊరుకొమ్మను" హోంమినిస్టర్ కి ఆర్డరు వేసాడు సీఎం.

"అలాగే సార్!" అర్ధం గాకపోయినా, అయోమయంగా ఉన్నా, అన్నిటికీ సరేననటమే హోం మినిస్టర్ కి వచ్చిన మంత్రం.

~~~~~~

ఆ తర్వాత, అనూహ్యంగా, రాష్ట్రంలో మద్యపు అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వస్తోంది. మరిన్ని మద్యం షాపులు తెరుస్తూ ప్రభుత్వం పరుగులు పెడుతోంది. నిరుద్యోగ తాగుబోతులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. వచ్చిన డబ్బుల్తో మరికొన్ని ఆకర్షణీయమైన పేర్లతో సంక్షేమ పధకాలు ప్రకటించింది. అమలు చేసినా, చేయకపోయినా, ఆ పధకాల పేరిట పత్రికలకి పుల్ పేజీ ప్రకటన లిచ్చింది.

దాంతో పెరిగిన చోరీ కేసుల గురించి వ్రాయడం పత్రికలూ మరిచిపోయాయి. అంతా హ్యాపీ!

~~~~~~~

ఈ లోగా వెంకటస్వామి మనుమడు వినోద్ ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడా పిల్లాడు దెయ్యాలున్నాయంటే నమ్మటం లేదు. నవ్వుతూ కొట్టిపారేస్తున్నాడు. ఆ సాయంత్రం టీ తాగేటప్పుడు అబ్కారీ మంత్రి వెంకట స్వామి సతీమణి, భర్తనడిగింది...."ఈ మధ్య మన వినోద్ దెయ్యం గియ్యం అనడం మానేసాడండి. మొన్నోరోజు సోమలింగం, మీరు తీసుకురమ్మన్నారని వినోద్ ని బయటికి తీసికెళ్ళాడు. అప్పటి నుండీ వినోద్, ఈ దెయ్యం గోల మానేసాడు. ఏం చేశారేమిటి?"

భార్య వైపు విజయగర్వంతో చూస్తూ "ఆ గోడ దూకుతున్నవాడు దెయ్యం కాదే పిచ్చి మొహమా? మన పాలిట పాడిగేదే! ఆ దెయ్యం అయిడియా చెప్పినందుకే... ముఖ్యమంత్రి కీ, మనకీ వందల కోట్లు ఆదాయం వచ్చింది?"

"అదెలాగో చెబుదురూ!" అంది మంత్రి గారి ఇల్లాలు.

"వినోద్ దెయ్యం దెయ్యం అన్నాడా! అదేదో కనుక్కోమని మన సెక్రటరీ సోమలింగానికి చెప్పాను. అతడెళ్ళి స్కూల్లోనూ, శ్మశానం దగ్గరా, పోలీసుల దగ్గరా ఆరా తీసాడు. బండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకేసులు పెరిగిపోయాయి. సోమలింగం ఆ ఏరియా ఎస్.ఐ.ని తీసుకొని, మాటేసి, బండాపూర్ శ్మశానంలో గోడ దూకే వాణ్ణి పట్టుకుని విచారిస్తే తేలిందేమిటో తెలుసా!" సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నట్లు చెప్పటం ఆపాడు.

"అబ్బా! చెబుదురూ!" అతృతగా అడిగింది అతడి భార్యామణి!

"బండాపూర్ శ్మశానం గేటు దూకేవాడు వట్టి తాగుబోతు. ఓ రోజు వాడు తాగేందుకు మందు సీసా, తినేందుకు చిప్సూ చీకులూ తీసుకొని, శ్మశానం గోడ దూకి, పాకలోకి పోయాడట. అంతే! బ్రాందీ వాసనకి, సమాధుల్లోంచి దెయ్యాలు బయటికి వచ్చి "మందు తాగి తాగి చచ్చిపోయాము. చచ్చినా మాకు మందు మీద మక్కువ పోలేదు. అందుకే ఇక్కడే దెయ్యాలై పడున్నాము. బ్రాందీ వాసనకి ప్రాణాలు లేచి వచ్చినట్లుంది. మాకూ పోయ్!" అన్నాయట. వీడు దడుచుకుంటే అవి ధైర్యం చెప్పి, ఆనక చీర్సు చెప్పాయట.

మర్నాటి నుండి వీడు, దెయ్యాలతో కలిసి కూర్చొని తాగటం షురూ అయ్యిందట. మందు తేవటానికి డబ్బులు లేవంటే దెయ్యాలే, తమ ఒకప్పటి ఇళ్ళల్లో దొంగతనాలు చేసి, డబ్బులు తెచ్చాయట. క్రమంగా ఎవరింట్లోబడితే వాళ్ళింట్లో చోరీ చేసి డబ్బు తెస్తున్నాయ్. వీడు మందు తెస్తున్నాడు.

సోమలింగం ఇదంతా ఎంక్వయిరీ చేసుకొచ్చాడు. ఇదంతా ముఖ్యమంత్రికి చెబితే ఎగిరి గంతేసాడు తెలుసా? ఆ రోజు నుండి, శ్మశానం దగ్గర స్పెషల్ కౌంటర్లు తెరిచాం. ఇహ చూస్కో! ఒకటే అమ్మకాలు! ఇబ్బడిముబ్బడిగా డబ్బు! దయ్యాలకి కంపెనీ ఇవ్వటానికి నిరుద్యోగ తాగుబోతు యువకులకు ఉద్యోగాలు, చిప్స్ చీకులు అమ్మటం ద్వారా బండి వాళ్ళకి ఉపాధి, స్పెషల్ కౌంటర్ల లో ఉద్యోగాలు! మన రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది" అన్నాడు ఒకింత గర్వంగా!

"మరి దయ్యాలు, డబ్బులు బదులుగా మందునే దొంగతనం చేయవచ్చు కదా?" అనుమానం తీరకా మంత్రి గారి సతీమణి.

"మందు దొంగతనం చేస్తే కొన్నాళ్ళకి ఆ షాపు మూతపడుతుంది కదా! అప్పుడు మందు దొరకటం కష్టం కదా, అంతేగాక మందు అమ్మే షాపు వాడు పచ్చగా ఉండాలని కూడా! అందుకని ఆ దయ్యాలు డబ్బులే దొంగతనం చేస్తున్నాయట!" అని భార్య అనుమానం తీర్చాడు.

"మరి చోరీ కేసులు ఎక్కువైతే గగ్గోలు కాదా?" బుగ్గలు నొక్కుకుంది భార్యమణి!

"పిచ్చిదానా! ఋజువులు దొరికినప్పుడు గదా కేసులు!? పత్రికలు నిలదీస్తే కదా గొడవ!?" ఫకాలున నవ్వాడు మంత్రి.

"నిజమే నండోయ్! మరి మన వినోద్...."

"ఏముంది! వినోద్ ని తీసికెళ్ళి ఆ తాగుబోతు వాడి కాళ్ళు చూపించాడు సోమలింగం. ‘దెయ్యానికి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయంటారు కదా! వీడు మనిషే! తాగటానికే శ్మశానం గోడ దూకుతున్నాడు’ అని చెప్పించాను. దాంతో అన్నీ సరై పోయాయి" అన్నాడు మంత్రి.

అతడి తెలివికి సంబరపడింది మంత్రి భార్య!

వెరసి, ‘ఈ ప్రభుత్వం... చచ్చే వరకే కాదు, చచ్చాక కూడా మద్యం తాగించగలదు’ అన్న విషయం రహస్యంగానే ఉండిపోయింది.

అంకితం: ప్రజలు తాగి చచ్చినా సరే, వ్యవస్థ నిర్వీర్యం అయినా సరే... ‘తాగితే తప్పేంలేదన్న’ కాంగ్రెస్ పాలిట యువరాజు రాహుల్ గాంధీకి, ప్రభుత్వ ఆదాయం పెరిగాలనుకునే నాయకులకూ, ప్రభుత్వాధికారులకూ ఈ కథ అంకితం!
Categories: Left

అంబానీల ఐశ్వర్యం – వెండి లండన్ కు చేరవేత !

Fri, 07/09/2010 - 05:31
ఎప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా... ఈనాడు, అంబానీలని ఆకాశానికి కెత్తేయకుండా ఊరుకోదు. మదుపర్ల మీటింగ్ కి ముఖేష్ అంబానీ భార్యాబిడ్డల్నీ, తల్లినీ వెంటేసేకు వస్తే అదో పండగనీ, అందరి కళ్ళూ వాళ్ళ మీదేనని ఉత్ప్రేక్ష ఉపమాలంకారాలన్నీ జోడించి వ్రాసేస్తుంది.

‘అన్నం చపాతీ తినను’ అని ముఖేష్ అంబానీ సతీమణి నీతా సెలవిస్తే, దాన్ని ముఖపత్ర ప్రత్యేక కథనంగా ఆదివారం అనుబంధంలో వేసేస్తుంది. ఇలా.... ఏమాత్రం... సందు దొరికినా సదరు కుటుంబాన్ని ప్రశంశల్లో ముంచెత్తడం ఈనాడుకి ఎప్పటి నుండో ఉన్న రివాజు.

ఉదాహరణకి క్రింది వార్తాంశం పరిశీలించండి. జూలై 6 న ధీరూభాయ్ అంబానీ ‘వర్ధంతి’ సందర్భంగా ఈనాడు బిజినెస్ పేజీలో ప్రచురించిన వార్తాంశం ఇది.

"ధైర్యం చేస్తే ప్రపంచాన్ని జయించొచ్చు" హెడ్డింగ్ క్రింద వార్తాంశం.
‘కలలు కనడానికి ధైర్యం చేసేవారు. యావత్ ప్రపంచాన్ని జయించవచ్చు. కలలు కనండి. ధైర్యం చేయండి’


ఇందులో ముఖ్యంగా పరిశీలించాల్సిన అంశం ఒకటుంది...

>>>ధీరు భాయ్ జీవితంలో ప్రారంభ రోజులు చాలా ఆసక్తికరంగా నడిచాయి. హీరాచంద్ గోర్దన్ దాస్ అంబానీ, జమ్నా బెన్ లకు రెండో కుమారుడే ధీరూభాయ్. స్కూలు మాస్టారైన తండ్రికి సాయం చేయరా అంటూ తల్లి ఓసారి అడిగితే.. ‘ఎందుకలా అంటారు. ఏదో ఒకరోజు నేను గుట్టల కొద్దీ డబ్బును సంఫాదిస్తా’ అని కోపంగా అన్నారట. 16 ఏళ్ళ వయసులో రూ.300 జీతం కోసం యెమెన్ లో ఓ కంపెనీలో చేరి అక్కడ డబ్బు సంపాదించాడు. అప్పట్లో యెమెన్ రియాల్ స్వచ్ఛమైన వెండితో తయారు చేసే వారు. దీనికి లండన్ బులియన్ ఎక్స్చేంజిలో బోలెడు గిరాకీ ఉండేది. దీనిని కనిపెట్టి ధీరూభాయ్ వాటిని కరిగించి లండన్ లో విక్రయించే వారు. తద్వారా కొన్ని లక్షలు సంపాదించారు. ఇదంతా 1950 నాటి సంగతి.

16 ఏళ్ళకే డబ్బు సంపాదించాలన్న కాంక్ష అధికంగా ఉన్న వ్యక్తి ధీరూభాయ్ అంబానీ. అప్పట్లో 300/-రూ. జీతం అంటే ఎక్కువే! అంత పెద్ద జీతం కోసం యెమెన్ వెళ్లాడు. అందులో తప్పేం లేదు.

అయితే....
అప్పట్లో యెమెన్ రియాల్ స్వచ్చమైన వెండితో తయారు చేసేవారు. దాన్ని కరిగించి లండన్ లో అమ్ముకున్నాడు ధీరూభాయ్ అంబానీ! ఏ దేశంలోనైనా ఆ దేశపు కరెన్సీని కరిగించి అమ్ముకోవటం నేరమౌతుంది కదా? అంబానీ యెమెన్ రియాల్ ని కరిగించి, లండన్ లో అమ్ముకుంటే, యెమెన్ ప్రభుత్వం ఎలా ఊరుకుంది? ఆ దేశపు చట్టాలు, అధికారులు ఏం చేసారు? వాళ్ళకి తెలియకుండా ధీరూభాయ్ ‘పనులు’ చక్కబెట్టాడా?

కరెన్సీ కరిగించిన వెండిని లండన్ కి ఎలా చేరవేసి అమ్మినట్లు? అంటే అది స్మగ్లింగా? లేక అధికారికంగా, చట్టబద్దంగా, వెండి లండన్ కు చేరవేసాడా? ఆ వివరాలేం ఈనాడు వ్రాయలేదు!

ఏమైనా.... ఒక దేశపు కరెన్సీ నాణాలని కరిగించి, ఆ లోహాన్ని ప్రక్క దేశానికి చేరవేసి అమ్మటం.... చట్టబద్దమా?

అతడలా చేయటం యెమెన్ లో చట్టబద్దమే అయితే, ఆపని యెమెన్ ప్రభుత్వమే చేసుకునేది కదా! అంటే తానే వెండి లండన్ లో అమ్ముకునేది కదా! అంతేగాక, అది చట్టబద్దమే అయితే, ఆ అవకాశం ధీరూభాయ్ అంబానీకే ఎందుకు దొరుకుతుంది? ఇంకా చాలామంది అందుకు పోటీ పడతారు కదా!

అసలే విలువలకు పూతపూసిన విగ్రహమైన రామోజీరావు, ఏ దేశపు చట్టాలనైనా గౌరవించాలంటాడు. అలాంటిది మరి ధీరూభాయ్ అంబానీ 1950 లలో చేసిన ‘వెండి లండన్ కు చేరవేత’ న్యాయమూ, ధర్మాల విషయం వదిలేసినా, వాళ్ళు గౌరవించే చట్టమూ అంగీకరించని పని కదా?

అలాంటి పనులు చేసి పైకి వచ్చిన ధీరూభాయ్ అంబానీ ‘కలలు కనండి, ధైర్యం చేయండి’ అన్నాడంటూ, ఆ ఆదర్శమూర్తి గురించి ఈనాడు ఊదర!

అందులోనూ ఎంత గమ్మత్తో చూడండి.

1950 ల నాటికి భారత దేశంలో అన్ని రంగాలలో గూఢచర్యపూరిత కుట్ర నడుస్తుందని ఊహలైనా ఎవరికీ తెలియదు. ఆ రోజులలో.... ధీరూభాయ్ అంబానీ జీవితం, పరమ పద సోపానంలో చకచకా నిచ్చెనలన్నీ అందుబాటులోకి వచ్చిన వడ్డించిన విస్తరి మరి! కావాలంటే చూడండి అతడికి ఎంతగా పరిస్థితులు కలిసి వచ్చాయో!

ఎక్కడా, ఎవరి నుండీ ఫండింగ్ లేకుండా యెమెన్ కరెన్సీని కరిగించి, లండన్ మార్కెట్ కి తరలించే వరకూ ‘మార్గం’ సుగమం చేయబడింది. ఆ విధంగా, వ్యాపారానికి కావలసిన ప్రాధమిక పెట్టుబడి సంపాదించుకున్నాడు. ఆ విధంగా గాడ్ ఫాదర్లు అతడికి మార్గం చూపారు.

>>>ఆ తరువాత 1958 లో ఆయన ముంబై కి తిరిగి వచ్చి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేశారు. వచ్చిన లభాలతో, అదే సంవత్సరంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించారు. ఆనక అంతా విస్తరణలూ, విజయాలే. దీనికంతటికి ధీరూభాయ్ నమ్మిన సిద్దాంతాలు కారణం.


అన్ని విస్తరణలూ విజయాలూ పొందటానికి, ధీరూభాయ్ నమ్మిన సిద్దాంతాలే కారణమట! ఏం సిద్దాంతాలో అవి? ‘ఏ దారైనా తొక్కు, డబ్బు సంపాదించటం ముఖ్యం!’ అంటూ ఇప్పుడు అతడి కొడుకులు ఆచరిస్తున్న సిద్దాంతాలేనా? తండ్రి నుండే కదా కొడుకులకి వారసత్వంగా సంక్రమిస్తాయి ఏదైనా![ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?]

ఇందుకు మరో తార్కాణం చూడండి. ఇది సరిగ్గా నెలక్రితం [09 June, 2010] న ఈనాడు ప్రచురించిన వార్తే!

>>>అనిల్ దావా వేయడానికి కారణం ఇదీ:

అమెరికా నుండి వెలువడే ద న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్యూలో, ముఖేష్ అంబానీ తన పరువుకు నష్టం కలిగేలా మాట్లాడారంటూ, అనిల్ కోర్టును ఆశ్రయించారు. అందులో తమ తండ్రి మరణానంతరం, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన జరగడానికి కన్నా ముందు... తన తమ్ముడు న్యూఢిల్లీలో కొంతమంది పైరవీకారులు, గూఢచారుల నెట్ వర్క్ ను పర్యవేక్షించేవారని ముఖేష్ చెప్పినట్లు ఉంది. [అంబానీ సోదరులు 2005 జూన్ లో విడిపోయారు.] ‘మేం దానంతటి నుంచీ వేరుపడిపోయాం’ అని ముఖేష్ వ్యాఖ్యానించినట్లు పత్రిక కథనం. కాగా ఆ వార్తా పత్రికలపైన అనిల్ వేసిన దావాను కూడా ప్రస్తుతం ఉపసంహరించుకొన్నారు.
వెరసి అంబానీలు న్యూఢిల్లీలో కొంతమంది పైరవీకారులు [వీరిని లైజాన్ లంటారు.] గూఢచారుల నెట్ వర్క్ ను [ఎవరి బలహీనతలు ఏమిటీ, ఎవరిని ఎలా ఒప్పించాలి గట్రా వివరాలు కనుక్కోవటమే!] పర్యవేక్షించేవారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ బ్రతికి ఉన్న రోజులలో కూడా, తన తమ్ముడు అనిల్, ఆ ‘లాబీయింగ్’ వ్యవహారాలన్నీ పర్యవేక్షించేవాడని ముకేష్ గతంలో ఓసారి అన్నాడు. ఇలాంటి ఈ అంబానీలు చేసేదంతా సిద్దాంతపరమైన వ్యాపారమా?

అసలుకే మనదేశంలో ఇటలీ మహిళ నేతృత్వంలో చట్టాలు సామాన్య ప్రజలని అణిచిపెట్టడానికి, నేరస్తులని కాపాడటానికి పనిచేస్తున్నాయయ్యె!

ముకేష్ అంబానీ కోసం చట్టాలు మార్చి మరీ, రాయితీలు ధారదత్తం చేసింది యూపీఏ ప్రభుత్వం. ఈ క్రింది వార్తాంశాన్ని చూడండి.

>>>అంబానీకే లాభం: మైసురా

ఇంధన భద్రతకు స్వంత సౌకర్యాలు కల్పించినందుకు ఆదాయపన్ను చట్టం కింద పన్ను రాయితీ కల్పించడంపై టీడీపీ సభ్యుడు మైసూరా రెడ్డి తీవ్ర అభ్యంతరం చేశారు. ముఖేశ్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ సంస్థకు దీనివల్ల 20 వేల కోట్ల పన్ను మినహాయింపు లభిస్తుందని, తన బడ్జెట్‌ ప్రసంగంలో అన్నారు. ఈ సంస్థకు రాయితీ కల్పించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఇవీ ఈ వ్యాపార సామ్రాట్టుల సిద్దాంతాలు! ఇలాంటి ఈ అంబానీల మీద, ఈనాడు రామోజీరావుకు, యూపీయే కుర్చీవ్యక్తి కి, ఆమె బృందానికి అంత అమిత ప్రేమ ఎందుకనో!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~
Categories: Left

ఏం చేసినా వచ్చేది డిజ్ ఎడ్వాంటేజే ! – మర్యాద రామన్న కథ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 18]

Wed, 07/07/2010 - 23:16
ఈ కథ మర్యాద రామన్న పేరిట ప్రచారమైంది. గ్రామ సీమల్లో.... ఒకప్పుడు [అంటే శతాబ్దాల క్రితం] ‘మర్యాద రామన్న’ అనే తెలివైన న్యాయాధికారి ఉండేవాడనీ, ప్రజల మధ్య ఏర్పడే వివాదాలని అతడు అద్భుత తార్కిక శక్తితో తీర్పు లిచ్చేవాడనీ, న్యాయం చెప్పడంలో అతడి విశ్లేషణ కడు సునిశితమైనదనీ ప్రచారాలుండేవి.

తీర్పులు చెప్పడంలో అతడి పేరు ప్రఖ్యాతులు విని, క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండే గాక, సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అతడి తీర్పు కోసం వచ్చేవారని చెప్పుకుంటారు. మొదట్లో మౌఖిక ప్రచారంతో ఉన్న ఈ కథలు తర్వాత లిఖించబడ్డాయి. ఆపైన సినిమాలుగా వచ్చాయి. [సినిమా సొల్లుతో నిండి ఉంటుంది లెండి. మర్యాద రామన్నని Degrade చేసే విధంగా ఉంటాయి.]

పిల్లలని ఆకర్షించే ఈ నీతి కథలో మంచి పోలిక కూడా ఉంది. ఇక కథలోకి వస్తే....

అనగా అనగా....

ఓ గ్రామంలో మల్లయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతడు ఎంత ధనికుడో అంత లోభి కూడా! అందుచేత అతడి దగ్గర ఎవరూ నికరంగా పని చేసేవాళ్ళు కాదు.

ఒక రోజూ ఆ ఊరికి గంగయ్య అనే యువకుడు పని వెదుక్కుంటూ వచ్చాడు. గంగయ్య అమాయకుడు. దేహదారుఢ్యం కలవాడు. ఎద్దులా పని చేస్తాడు. అంతే మోతాదులో తిండి పుష్టి కలవాడు.

అతడి స్వగ్రామంలో అతడి గురించి తెలిసిన వాళ్ళు, గంగయ్యకి రోజూ కూలీ ఇస్తామనే వాళ్ళే గానీ, సంవత్సరమంతా జీతగాడిగా పెట్టుకొనేందుకు సిద్దపడలేదు. దాంతో మనవాడు పని వెదుక్కుంటూ దేశం మీద పడ్డాడు. రోజు కూలీతో వాడికి ఒకపూట కడుపు నిండుతుంది మరి!

ఇలాంటి గంగయ్య, మల్లయ్యని కలిసి పని ఇమ్మని అడిగాడు. మల్లయ్యకి గంగయ్యని చూడగా తమ ఊరి వాడు కాదని అర్ధమైంది. మరికొన్ని ప్రశ్నలతో గంగయ్య ఉత్త అమాయకుడనీ అర్ధమైంది.

దాంతో మల్లయ్య గంభీరంగా మొహం పెట్టి "చూడబ్బాయ్! నేన్నీకు మా ఇంట్లో పని ఇస్తాను. నేను చెప్పిన పనల్లా చెయ్యాలి. రోజుకి రెండు పూటలా నీకు కడుపు నిండా అన్నం పెడతాను. దానిపైన ఇక జీతమంటూ ఏదీ ఇవ్వను. ఒక వేళ నువ్వెప్పుడైనా పని మానేసి పోవాలనుకుంటే, నువ్వు నాకు కోడిగుడ్డంత బంగారం ఇవ్వాలి. అలాగ్గాక, ఒక వేళ నేనే నిన్ను పని మానెయ్యమంటే, నేనే నీకు కోడి గుడ్డంత బంగారం ఇచ్చుకుంటాను. ఇదీ షరతు! ఇది నీకు ఇష్టమైతే ఇప్పుడే పనిలో చేరు" అన్నాడు.

గంగయ్యకి ఉద్యోగం అత్యవసరం కావటంతో, మరో మాట లేకుండా తక్షణమే మల్లయ్య షరతుకు ఒప్పుకొని పనిలో చేరిపోయాడు.

ప్రతీ రోజూ గంగయ్య బావి నుండి నీళ్ళు తోడాల్సి వచ్చేది. ఇంటి ముందూ వెనకా ఉన్న జాగాలో గల పూల మొక్కలకీ, పండ్ల చెట్లకీ , కూర పాదులకీ నీళ్ళు పెట్టాలి. బట్టలుతకడం, గిన్నెలు కడగటం, ఇల్లూ, పెరడూ శుభ్రం చేయటం.... పశువుల పాకని శుభ్రం చేయటం, పశువుల్ని సాకటం... అబ్బో చాలా పనులు!

మల్లయ్య, గంగయ్యకి రోజుకి రెండు పూటలా కడుపునిండేలా అన్నం పెట్టాడు. మొదట్లో గంగయ్యకి మల్లయ్య ఇంట్లో పని సుఖంగా అన్పించింది. మొదటగా కడుపునిండా తిండి దొరికింది. ఎద్దులా పనిచేసే గంగయ్యకి పని కష్టమని పించదు.

అయితే మల్లయ్య, మెల్లిగా గంగయ్యకి అంతకంతకూ ఎక్కువ చెప్ప సాగాడు. గంగయ్య మారుమాట్లాడకుండా చేసుకు పోయేవాడు. రోజులు గడిచాయి. నెలలు మారాయి. ఇలా రెండేళ్ళు గడిచింది. రాను రాను గంగయ్యకి అలసటగా, పని భారంగా అన్పించసాగింది. తన ఊరు, తన వాళ్ళు గుర్తొచ్చారు. ఇంటి కెళ్ళి పోవాలన్పించింది.

మల్లయ్యని సమీపించి, ఇక పని మానేసి స్వంత ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. మల్లయ్య "అలాగైతే కోడి గుడ్డంత బంగారం నా ముఖాన కొట్టి, ఎంచక్కా మీ ఊరి కెళ్ళిపో!" అన్నాడు నింపాదిగా!

అదిరిపడ్డాడు గంగయ్య! అప్పటికి గానీ, అమాయకపు గంగయ్యకి మల్లయ్య పెట్టిన షరతులోని కిటుకేమిటో అర్దం కాలేదు. దీనంగా మల్లయ్యని బ్రతిమిలాడాడు. తానిన్నాళ్ళు చేసిన సేవలని గుర్తించి తనని వదిలెయ్యమన్నాడు. మల్లయ్య ససేమిరా అన్నాడు.

చేసేది లేక గంగయ్య పనిలో కొనసాగుతున్నాడు. పాపం! వాడి ముఖంలో ఎంతో దిగులు, నిరాశ! మల్లయ్య అమానుషత్వమూ, పిసినారి తనమూ తెలిసిన ఇరుగుపొరుగు వాళ్ళు, మల్లయ్య చూడకుండా, గంగయ్యతో "పోయి మర్యాద రామన్నకు మొరపెట్టుకో! ఆయన నీకు న్యాయం చేస్తాడు" అని చెప్పారు.

ఒకనాటి రాత్రి గంగయ్య, మర్యాద రామన్నని కలిసి, తన సమస్య చెప్పుకొని, న్యాయం చెయ్యమని అర్దించాడు. అతడు చెప్పిందంతా విన్న మర్యాద రామన్న, కొన్ని క్షణాలు ఆలోచించాడు. మల్లయ్య లోభత్వం గురించి మర్యాద రామన్నకి తెలుసు. నచ్చజెప్పడం ద్వారా మల్లయ్యలో మార్పు తేవటం అసాధ్యమనీ ఆయనకి తెలుసు. మల్లయ్య లోభి మాత్రమే కాదు, మోసకారి కూడా!

బాగా ఆలోచించి మర్యాద రామన్న, మల్లయ్యకి గుణపాఠం నేర్పేందుకూ, మల్లయ్య నుండి విముక్తి పొందేందుకూ ఏం చెయ్యాలో, గంగయ్యకి వివరించాడు. గంగయ్య గమ్మున ఇంటికి తిరిగి వచ్చాడు.

మర్నాటి ఉదయం, మల్లయ్య, గంగయ్యని బావిలోంచి నీళ్ళు తోడి గాబులూ, కుండలూ నింపమన్నప్పుడు, సగం పైగా కుండల్ని పగల గొట్టేసాడు. "క్షమించండయ్యా! చెయ్యి జారాయి" అన్నాడు. మల్లయ్య, నిజంగానే గంగయ్య కుండల్ని పొరపాటున పగలేసాడనుకొని ‘జాగ్రత్తగా పని చెయ్య’మని హెచ్చరించి ఊరుకున్నాడు.

తర్వాత మొక్కలకి నీళ్ళు పొయ్యమన్నాడు. గంగయ్య పూలమొక్కల మీదా, కూరపాదుల మీదా అడ్డదిడ్డంగా నడుస్తూ, నీళ్ళు పోసేలోగా సగం మొక్కల్ని పీకి పాకాన పెట్టినంత పనిచేసాడు. అలాగే బట్టలుతకమంటే సగం బట్టల్ని చింపి పాతరేసాడు. గిన్నెలు కడగమంటే సగం ఇత్తడి గిన్నెలకి నిండా సొట్టలే! మట్టిచట్లు ముక్కలూ చెక్కలై పోయాయి.

పశువులకి గడ్డీ కుడితీ పెట్టేటప్పుడు వాటిని చితక బాదాడు. పాల కోసం వెళితే అవి ఈడ్చి తన్నాయి. దాంతో చిర్రెత్తు కొచ్చిన మల్లయ్య గంగయ్యని నోటి కొచ్చినట్లు తిట్టాడు. గంగయ్య అదేం పట్టించుకోకుండా కడుపునిండా తిని గుర్రు కొట్టాడు.

మర్నాడూ అదే పని తీరు. ఆ మర్నాడు కూడా అంతే! మరుసటి రోజూ, ఆపై రోజూ కూడా!.... ఇలా వారం తిరిగే సరికి, మల్లయ్యకి నష్టం నషాళాని కంటింది. గంగయ్య చేత గతంలో లాగే పని చేయించుకునేందుకు నయానా భయానా ప్రయత్నించాడు. ఊహు! లాభం ఉంటేగా! దాంతో సహనం కోల్పోయిన మల్లయ్య.... "ఒరే పనికి మాలిన వెధవా! తక్షణం నా ఇంట్లోంచి బయటకు పో!ఈ క్షణమే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను" అంటూ అరిచాడు.

మరుక్షణం గంగయ్య "అట్లా అయితే మీరే నాకు కోడి గుడ్డంత బంగారం ఇవ్వాలి. అది కాస్తా ఇచ్చారంటే చక్కా పోతాను" అన్నాడు. మల్లయ్య గతుక్కుమన్నాడు. అప్పటికి మాట్లాడకుండా, కోపం దిగమించుకొని లోపలికి వెళ్ళిపోయాడు.

అయితే గంగయ్య పనులన్నీ అడ్డదిడ్డంగా చేస్తూ, అన్నీ నష్టపరుస్తూనే ఉన్నాడు. చేసేది లేక, మల్లయ్య మర్యాద రామన్నకి గంగయ్య మీద ఫిర్యాదు చేసాడు.

మర్యాద రామన్న "మల్లయ్యా! షరతు విధించింది నువ్వు! గంగయ్య దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు అతణ్ణి పనిలోంచి పొమ్మంటున్నావు. షరతు ప్రకారం నువ్వు అతడికి కోడిగుడ్డంత బంగారం ఇవ్వటమే న్యాయం. కాబట్టి గంగయ్యకి బంగారం ఇచ్చెయ్యి. తప్పదు" అన్నాడు.

లోభి మల్లయ్య గొల్లుమని ఏడ్చుకుంటూ, గంగయ్యకి కోడిగుడ్డంత బంగారం ఇచ్చాడు. అమాయకపు పేద గంగయ్య ఆనందంగా, మర్యాద రామన్నకు కృతజ్ఞతలు చెప్పుకుని, తన గ్రామానికి తాను పోయాడు.

మర్యాద రామన్న "మల్లయ్యా! నీవు ధనికుడివి. పేదవాళ్ళు ధనికులకి సేవలు చేసేందుకు వస్తారు. బదులుగా ధనికులు పేదవాళ్ళ పట్ల దయ, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు, తమ యజమానుల పట్ల విధేయత తోనూ, నిజాయితీ తోనూ ఉండి, సేవలు అందిస్తారు. నీవు డబ్బిస్తావు. వాళ్ళు పని చేస్తారు. యజమానికీ, పనివాళ్ళకీ మధ్య ఆర్దిక సంబంధం అంతటితో అంతమౌతుంది.

అయితే మానవ సంబంధం దీనంతటికీ అతీతమైనది. ఆ సంబంధంలో దయ, సానుభూతి, ప్రేమ, విధేయత, గౌరవం, నిజాయితీ, వాత్సల్యం వంటి మానవీయ విలువలన్నీ మిళితమై ఉంటాయి.

ఈ మానవీయ విలువలని అమలు పరచటంలో.... ఏ చట్టాలూ, షరతులూ, ప్రభుత్వ నియమాలూ ఏమీ చేయలేవు. ఇవి కేవలం మనిషి హృదయానికి సంబంధించినవి.

గుర్రాన్ని నీటి దాకా తీసికెళ్ళగలం కానీ నీరు త్రాగించలేమని పెద్దలంటారు. అలాగే మానవీయ విలువల విషయం కూడా! ఎవరంతట వారు, హృదయానుభూతితో పాటించవలసినవే అవన్నీ! నీ అంతట నీవే గంగయ్య లాంటి వారి పట్ల సానుభూతితో ఉంటే బాగుంటుంది. పేదల పట్ల లోభగుణం చూపటం నీచం! ఇకనైనా పేదసాదల పట్ల, సాటి వారిపట్ల సానుభూతితో, దయా కరుణలతో ఉండటం నేర్చుకో!" అని చెప్పాడు.

మల్లయ్య సిగ్గుతో తలదించుకొన్నాడు. మర్యాద రామన్నకు క్షమాపణలు చెప్పుకొని, తన మనఃస్థితిని [mind set] మార్చుకున్నాడు.

ఈ కథలో మర్యాద రామన్న, మల్లయ్యకు నీతిని బోధించిన తీరు మనోహరంగా ఉంటుంది. నీతి నిర్మలంగా ఉంటుంది. పిల్లలకి ఎంతో ఉపకరించే ఈ కథలో నీతి విషయం ప్రక్కన బెడితే...

గంగయ్య మల్లయ్యకి, ప్రతి పనిలో Disadvantage చూపిస్తాడు.

అదే స్ట్రాటజీని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు ఒకప్పటి ప్రభుత్వాల మీదా, ప్రజల పట్ల దేశం పట్ల నిబద్దత గల నాయకుల మీదా ప్రయోగించారు. ఇప్పటికీ చట్టాలు మార్చదలుచుకున్నప్పుడు, ఇలాగే Disadvantages చూపిస్తారు. తమకు అనుకూలంగా కొత్తకొత్త చట్టాలు తెచ్చుకుంటారు.

ఉదాహరణకు రామబ్రహ్మం ఇంటర్ పేపర్ లీక్ తో, మొత్తం రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రభుత్వం నుండి తప్పనిసరిగా గుర్తింపు తీసుకోవాలని చట్టాలు చేసారు. అలాగే ఏవో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు డబ్బులు తీసుకొని పారిపోయాయి. దాంతో పాఠశాలలకు తప్పని సరిగా గుర్తింపు తీసుకోవాలని రూల్స్ జారీ చేసారు. ఆ విధంగా తమ గ్రిప్ లోకి మొత్తం విద్యవ్యాపారాన్ని తెచ్చుకున్నారు.ఇలాంటివే మినరల్ వాటర్ లోకల్ బ్రాండ్స్ వ్యవహారం కూడా! అదే కూల్ డ్రింక్స్ నిల్వ కోసం ఎరువుల మందు కలుపుతారన్న విషయం బయటకు వచ్చినా,ఆ కార్పోరేట్ కంపెనీలకు ఏమీ అవ్వదు!

ఇక భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా జరిపిన కుట్రలో మరో ప్రధాన అంశం బ్యాంకులు!

ఇందిరా గాంధీ హయాంలో బ్యాంకులని జాతీయం చేయక ముందు అన్ని బ్యాంకులూ ప్రైవేటు రంగంలోనే ఉండేవి. అవన్నీ ధనికులకీ ప్రయోజనకరంగా ఉండేవి తప్ప సామాన్య ప్రజలకి కాదు. అందులో మాజీ సంస్థానాధీశులూ, మాజీ జమీందారులూ, రాజ వంశీయులూ ఎక్కువగా బ్యాంకు యజమాన్యాలలో భాగస్వామ్యులై ఉండేవాళ్ళు. ప్రభుత్వం నుండి వచ్చే భరణంగా వచ్చే ధనాన్నీ, వారసత్వంగా వచ్చిన ఆస్థులని నగదుగా మార్చుకున్న ధనాన్ని బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టారు.

ఈ నేపధ్యంలో బ్యాంకుల్ని జాతీయం చేసినప్పుడు సామాన్య ప్రజలే కాదు, పీవీతో సహా నిజాయితీ పరులైన నాటి రాజకీయ నాయకులందరూ కూడా, ఇక మెరుగైన సేవలు.... సామాన్యులకీ, పేద ప్రజానీకానికీ అందుతాయని ఆశించారు, ఆకాంక్షించారు. [పీవీజీ ‘లోపలి మనిషి’లో దీని గురించి విపులంగా ప్రస్తావించారు.]

అయితే వాస్తవంలో.... కనీసం బ్యాంకు సిబ్బందిలో[చాలామందిలో] కూడా సేవాదృక్పధం కనపడకుండా పోయింది. ఇప్పుడెలా ఉన్నారో నాకు తెలియదు. 1992 లో బ్యాటరీ తయారీ సంస్థని నష్టపోయాక, నాకంతగా బ్యాంకుల గురించి ప్రత్యక్ష అనుభవాలు లేవు. కానీ చిన్న తరహా పరిశ్రమలూ, కుటీర వస్తు తయారీ సంస్థలూ అదృశ్యమవ్వడాన్ని బట్టి చూస్తే, బ్యాంకుల పనితీరులో మార్పేమీ లేదని చెప్పవచ్చు. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న మాట.

1988లో APSFC లో, నా ఫ్యాక్టరీ పైలూ, ఆంధ్రప్రదేశ్ లో తొలి పబ్బు ఫైలూ ఒకేసారి టేబుళ్ళ ప్రయాణం ప్రారంభించాయి. నా ఫ్యాక్టరీ వంటి వస్తు తయారీ సంస్థలు మూతపడితే, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా విస్తరించడంలో తెలియటం లేదా, బ్యాంకుల ఋణ సహకారంలోనూ, ప్రభుత్వ పనితీరులోనూ, మిశ్రితమైన కుట్ర తీరు! ఇండియన్ బ్యాంకులోనూ నాది ఇదే అనుభవం!

ఈ అంశాలు వివరంగా చెప్పదగినవి!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~
Categories: Left

సహకార సంఘాలూ – ఉపాధి హామీలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 17]

Mon, 07/05/2010 - 22:59
గత టపాలలో వివరించిన నేపధ్యంలో... 1960-90 లలో మిశ్రమ ఆర్దికవ్యవస్థ వైఫల్యం సిద్దాంతంలో లేదనీ, అమలు తీరులోనే ఉందనీ నిశ్చయంగా చెప్పవచ్చు.

ఇలాంటిదే మరో ఉదాహరణ గమనించండి. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కలల్లో మరొకటి సహకార రంగం. భారత దేశపు గ్రామాలని, సహకార సంస్థలతో, అభివృద్ది బాటలో పరుగులెత్తించాలన్నది అతడి మరో కల!

గ్రామీణులు సహకార సంఘాలుగా ఏర్పడి, కొద్ది మొత్తాలని పొదుపు చేసో, మదుపు చేసో, మరికొంత మొత్తాలని బ్యాంకుల నుండి ఋణాలుగా పొంది, చిన్న వ్యాపారాలనీ, పాడి వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలని, పశుపోషణ వంటి వృత్తులనీ చేపట్టి, జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలన్నది సహకార వ్యవస్థ ఆశయం!

సహకార సంఘాలూ, బ్యాంకులూ ఇందుకు సహకరించాలి. ఆ విధంగా ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ పేదలు, తమ కాళ్ళ మీద తాము నిలబడి, ఆర్దికంగా నిలదొక్కుకోగలుగుతారు.

ఇదీ సహకార సంస్థల స్థాపన వెనక ఉన్న సిద్దాంతపు పునాది! అయితే ఇది కూడా 1960-90 లలో వాస్తవ రంగంలో దాదాపు పూర్తిగా విఫలమైంది. అదే సిద్దాంతం ఇప్పుడు ‘డ్వాక్రా’ సంఘాల పేరిట విజయవంతమైంది.

గ్రామీణ మహిళలు,పొదుపు సంఘాలుగా ఏర్పడి, రోజుకో రూపాయి దాచుకుని, ఆ నిష్పత్తిలో బ్యాంకు ఋణాలు తీసుకుని పాడి పశువుల్ని పెంచటమే కాదు, పచ్చళ్ళు, కారం మసాలా పొడులూ, అప్పడాలు వడియాలు, జంతికల వంటి తినుబండారాలూ తయారు చేసి అమ్ముతున్నారు.

కార్పోరేట్ కంపెనీల లేస్, అంకుల్ చిప్స్, గట్రాల కంటే తక్కువ ధరలో, రంగు రుచీ వాసనల కోసం వాడే రసాయనాల భయం లేకుండా, డ్వాక్రా ఉత్పత్తులని ఆనందిస్తున్నాము. [మా నంద్యాల ప్రక్కనే ఉన్న ఆదర్శ గ్రామం పాండురంగాపురం డ్వాక్రా సంఘాలైతే చాలా రకాల చిరుతిళ్ళనీ, కారం, పచ్చళ్ళనీ తయారు చేస్తారు.]

అదే సహకార సంఘాల సిద్దాంతమూ, పనితీరూ ఇప్పుడెలా సఫలమైంది? అప్పుడెందుకు విఫలమైంది?

ఇలాంటి ఎన్నో అంశాలు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తుల తాలూకూ కుట్ర కోణాన్ని సుస్పష్టంగా బహిర్గతం చేస్తున్నాయి.

కుట్రకోణాన్ని మరింత స్పష్టంగా, మరోసారి పరిశీలించేందుకు మరో ఉదాహరణ చెబుతాను. భారతదేశంలోకి ప్రైవేటు టీవీ ఛానెళ్లు ప్రవేశించక ముందు, 1990 వరకూ కూడా కేవలం ప్రభుత్వ రంగ టీవీ ఛానెల్ దూరదర్శన్ మాత్రమే ఉండేది. 1985-89 లలో దాన్ని రాజీవ్ దర్శన్ అని కూడా పిలిచేవాళ్ళు.

[ఈ పేరుతో ఎక్కువగా ఈనాడు రామోజీరావు మహా వెటకారం చేసేవాడు. 1995 నుండి 2008 వరకూ రామోజీరావు చిన్న కొడుకు సుమన్ ఈటీవీని ఏలి పారేయటాన్ని ఏ వెటకారం చేసుకున్నాడో మరి!? ఇంకా డీడీ ఒక యాంటీనా పెట్టుకుంటే వస్తుంది. ఈ టీవీకి నెలనెలా రుసుము కూడా చెల్లించాలి! రాజీవ్ దర్శన్ అంటూ వెటకారం చేసినందుకు, ఈ టీవీ ని ‘సుమన్ దర్శన్’ గా తయారు చేసి, ఆత్మహత్య సదృశ్య అసైన్ మెంట్ల ద్వారా, ఆ సువర్ణముఖిని అనుభవించాడు.]

ఇక దూరదర్శన్ కు మరో పేరు కూడా ఉంది. ‘ప్రభుత్వ బాకా’ అని! ఎందుకంటే - ఎప్పుడూ ప్రభుత్వానికి అనుకూలమైన వార్తల్ని, అంశాల్నీ ప్రచారం చేస్తుందని. [ఇప్పుడు కదా ప్రైవేటు పత్రికలూ టీవీలూ కూడా, తమకు అనుకూలమైన వార్తల్నీ, అంశాల్నీ ప్రచారం చేస్తాయనీ, మీడియా అచ్చంగా అధిపతుల స్వార్ద ప్రయోజనాల కోసమే పని చేస్తుందనీ బహిర్గతమైంది!?]

దానికి తగ్గట్లు డీడీ కార్యక్రమాలన్నీ చాలా నాసిగా ఉండేవి. [ఇప్పుడూ కొన్ని కార్యక్రమాలు అంతే నాసిగా ఉన్నాయనుకొండి!] అప్పట్లో డీడీలో, కేవలం పందుల పెంపకం వంటి చెత్త ప్రోగ్రాంలే వస్తాయనే పేరుండేది. ప్రైవేటు పత్రికలు, వాటి మీద, వేసిన కార్టూన్లూ జోకులూ వెయ్యకుండా వేస్తుండేవి!

అప్పట్లో డీడీ లో చాలా కార్యక్రమాలు నిజంగానే చెత్తగా, నాసిగా ఉండటమే కాదు, చివరికి వార్తలూ సమీక్షలూ కూడా సరిగా ప్రసారమయ్యేవి కాదు.

అధికారుల, రాజకీయుల ఆశ్రితులతో కళాకారుల బృందాలు క్రిక్కిరిసి పోయేవి. దాంతో నటన రాని వారు నటించటం, రచన రాని వారు రచించటం, అవన్నీ ప్రేక్షకులు భరించటం అతిగా ఉండేది. [అందులోంచే తెలంగాణా శకుంతల, కోట బ్రదర్స్, సుబ్బరాయశర్మ, ధర్మవరపు సుబ్రమణ్యం వంటి నటులూ, ఇతర కళాకారులూ దొరకటం ప్రేక్షకుల అదృష్టమన్న మాట!]

ఇక డీడీలోని ఇలాంటి నాసి కార్యక్రమాలని విమర్శిస్తూ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, పత్రికలూ, మేధావుల పేరిట, కేంద్ర ప్రభుత్వం మీద.... ప్రైవేటు టీవీ ఛానెళ్లకూ, ప్రసార సంస్థలకూ అనుమతి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసేవి. నాటి ప్రజాహిత ప్రభుత్వాలని విమర్శించేందుకూ, ఇబ్బంది పెట్టేటందుకు, ప్రైవేటు టీవీ ఛానెళ్ళుంటే ఎంతో అవకాశం ఉంటుంది.

ఇక ‘ప్రైవేటు టీవీ ఛానెళ్ళని ప్రభుత్వం అడ్డుకొని, తమ ఆనందానికి గండి కొడుతుందని’ ఆనాటి మీడియా ప్రచారానికి ప్రజలంతా ‘ఔను’ అంటూ తలలూపారు, గొంతుకలిపి అరిచారు. అయితే ప్రైవేటు టీవీ ఛానెళ్ళు వచ్చి ఏం ఒరగ బెడతాయో, ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వచ్చింది కదా? ‘చిన్న పిల్లలతో గోచీ డాన్సు లేమిటి బాబోయ్!’ అని కోర్టుల్నీ, మానవహక్కుల సంఘాలనీ ఆశ్రయించాల్సి వస్తోంది.

నిజానికి ప్రైవేటు టీవీ ఛానెల్సూ, ప్రభుత్వ ఛానెల్సూ మంచి కార్యక్రమాలు చేపట్టడంలో పోటీపడితే, విజ్ఞాన వినోదాలకి ఇవ్వాల్సినంత నిష్పత్తిలో ప్రాధాన్యతలిస్తే... ఈ స్థితి వచ్చేది కాదు. ఎందులో నుండి అయినా Disadvantage ని వెలికి తీయటమే నకిలీ కణికుల గూఢచర్య స్ట్రాటజీ అయిన చోట, పరిస్థితి ఇలాగ్గాక ఇంకేలా ఉంటుంది?

ప్రైవేటు టీవీ ఛానెళ్ళు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే... టీవీల ద్వారా పెరిగిన మోజులూ, పబ్బుల్లో చిందులూ, మద్యంలో మునకలూ, రకరకాల ఉన్మాదాలూ, ఉన్మత్తతలూ ఎందరు యువతీ యువకుల్ని, ఎండమావుల వెంట ఉరుగులెత్తిస్తోందో చూస్తూనే ఉన్నాం కదా!

అలాంటిది గతంలో, అంటే ఇందిరాగాంధీ హయాంలో సైతం, ప్రచార సంస్థల స్వేచ్చకై గొంతెత్తి అరుస్తూ, ప్రైవేటు టీవీ ఛానెళ్ళ కోసం ఎలుగెత్తి డిమాండ్లు చేసిన నాడు, ప్రైవేటు ఛానెళ్ళను అనుమతించినా, ఇదే జరిగేది కదా?

నిజానికి ఇప్పుడే కాదు, అప్పటి రోజులకే, విదేశాలలో ప్రైవేటు టీవీ ఛానెళ్ళ నిర్వాకం ఏమిటో, సామాన్యులకి తెలియకపోయినా, భారత్ లోని ఆనాటి మీడియాకి, ప్రతిపక్ష నేతలకీ తెలుసు. ఎందుకంటే - ఆయా దేశాలు, భారత్ కి భవిష్యత్తులో ఉన్నాయి మరి! మన వర్తమానం వాటికి గతమైన నేపధ్యంలో, సదరు దేశాలలో ప్రైవేటు మీడియా సంస్థల, టీవీ ఛానెళ్ళ ప్రసార ఫలితాలు అనుభవంలోకి వచ్చినవే!

అయినప్పటికీ... ప్రైవేటు టీవీ ఛానెళ్ళని అనుమతిస్తే, ప్రభుత్వం గుట్టు రట్టవుతుందని, నిజాలు బయటికొస్తాయని భయపడి, ప్రభుత్వం అందుకు అనుమతివ్వటం లేదని ఆనాటి ‘మేధావులు’ ఎందుకంత బిగ్గరగా గోలపెట్టారో, వాళ్లకీ, వాళ్ళనాడించిన వాళ్ళకీ తెలియాలి!

నిజానికి, నకిలీ కణిక వ్యవస్థా.... బ్యూరాక్రాట్లు, రాజకీయ నాయకులూ, కార్పోరేటు సంస్థలతో కూడిన వాళ్ల అనుచర వర్గమూ, ఏ సిద్దాంతం నుండైనా, ఏ వ్యూహం నుండైనా Disadvantage నే వెలికి తీస్తాయి.

మరో తాజా ఉదాహరణ గమనించండి. మా నంద్యాలలో రెండేళ్ళ క్రితం, అంటే 2008లో, కొందరు కూలీలు రోడ్డు పొడవునా కాలువల కోసం గోతులు తవ్వారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద పని చేశారని, వాళ్ళతో మాటలు కలపటంతో తెలిసింది. మా వీధిలోనూ మూడు నాలుగు రోజులు పనిచేసిన వాళ్ళని విచారిస్తే, ఇంకా చాలా వివరాలే చెప్పారు.

పోస్టాఫీసు ఖాతాల ద్వారా వాళ్ళకి రోజు కూలీ ముట్ట చెప్పాలి. సంవత్సరంలో కనీసం వందరోజులు పని కల్పించాలి. ఈ విధంగా చేస్తున్నారనీ, ‘సరైన కూలీ దొరక్కపోతే గ్రామసభల్లో ప్రశ్నించమనీ, భారత్ వేగంగా వృద్ది చెందుతోందనీ’ టీవీల్లో కోట్ల రూపాయలు గుమ్మరించి ప్రచారం ఓ ప్రక్క నడుస్తోంటే... వాస్తవంలో జరుగుతోంది పూర్తిగా తద్విరుద్దమే!

కూలీలకు ఇస్తోంది 40-50 రూపాయలే! అదీ 50-60 రోజులపాటే! కాగితాల మీద దినసరి కూలీ, పని దినాలు 100 అని ఉంటుంది. ఎందరు కూలీలు పనిచేస్తే అంత అదనపు సొమ్ము మిగులుతుందన్న మాట! అసలు కూలీలూ కాగితాల మీదే ఉంటే మరింత మిగులు! ఆ ఆదనపు సొమ్మంతా.... పైనుండి క్రింది దాకా [అధికారులూ, రాజకీయ నాయకులూ, వ్యవహారం బయటికి పొక్కనీయనందుకు వార్తా పత్రికల కంట్రిబ్యూటర్లూ... ఇలా ] అందరికీ, ఎవరి వాటా వాళ్ళకి పంపిణీ అవుతుంది. ఇందులో కూలీల వాటా కూలీలకు ముడుతుంది. ఆశ్చర్యంగా ఉందా?

ఖచ్చితంగా ముడుతోంది. ఎలాగంటే - రోజూ ఉదయాన్నే, ఎండ పొద్దెక్కక ముందే, మూడు నాలుగు గంటల పాటు సుతారంగా, చిన్న గొయ్యలు తవ్వేసి వెళ్ళిపోవచ్చు. 40-50 రూపాయలు వస్తున్నాయి. ఇలా ‘తిలా పాపం తలా పిడికెడు’ పుచ్చుకున్నందుకు, సదరు అధికారుల కరుణా దృష్టి ఉంటుంది.

అప్పుడు ఆరోగ్యశ్రీలు, రేషన్ కార్డులు, బోగస్ కార్డుల దగ్గరి నుండి ఇతరత్రా ప్రభుత్వ పధకాలలో కూడా తమనే లబ్దిదారులుగా వ్రాస్తారు - ఇదీ కూలీల సహకారానికి కారణం. మూడేళ్ళ నుండి మా వీధిలో అదే కాలవలని, ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పధకం క్రింద తవ్వుతున్నారు. నెల రోజులకే అవి పూడిపోతున్నాయి.

వెరసి ఆ డబ్బంతా కూలీలతో సహా, ప్రజలదే! భారమూ, తిరిగి అందరి మీదా పడేదే! సంక్షేమ పధకాలు భారమై పెట్రో, గ్యాస్ లూ, విద్యుత్ ఛార్జీలు పెరిగితే కుయ్యో మనేదీ ప్రజలే!

ఇంతటితో అయిపోలేదు - ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం [ఇది సోనియా గారాల పుత్రుడు రాహుల్ కు మానస పుత్రిక అట.] ఎక్కువగా రైతులకు పొలాల్లో కూలీలు అవసరం ఉన్న రోజుల్లో నిర్వహింప బడటం!

‘తక్కువ శ్రమతో కూడిన పనికి, ఎక్కువ కూలీ వస్తోందంటూ’, ఈ పధకాన్ని కారణంగా చూపించి, కూలీలు రైతులకు పొలాల్లో పనిచేయటానికి తిరస్కరించటం జరిగింది. పొలాల్లో, ఎండల్లో పడి ఎనిమిది గంటల పాటు, ఒళ్ళొంచి, చెమట కార్చి పనిచెయ్యాలి. అదే ఇలాంటి ప్రభుత్వ పధకంలో అయితే.... ఉదయాన్నే, సూర్యుడింకా పైకెక్కక ముందే మూడు లేదా నాలుగు గంటలు పనిచేస్తే చాలు!

దీని గురించి కూలీల పనిని తనిఖీ చేసే సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులూ ఎవరూ మాట్లాడరు. అదంతా కూలీలతో సహా అందరి సహకారంతో జరిగిపోతున్న పనయ్యె!

అంతిమంగా రైతులు అల్లాడారు. మా ఇంటి యజమానులూ రైతులే! మా పొరుగు వాళ్ళు [రెండేళ్ళ క్రితం] రైతులే! ఇద్దరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, కూలీలు దొరకలేదని మొత్తుకున్నారు. అసలు తమలాంటి రైతులని దెబ్బ కొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రధకాలని, వ్యవసాయ పనుల సీజనులో అమలు చేస్తోన్నట్లుందని వాపోయారు కూడా!

లేనట్లయితే వ్యవసాయపు పనులు ఉండని రోజులలో ఇలాంటి పధకాలు చేపట్టవచ్చు కదా? అప్పుడు కూలీల కొరత తమకు ఏర్పడదు కదా అని తర్కించారు. మిగతా రోజుల్లో పని లేక, గ్రామాలలో కూలీలు, వలసల బాట పడతారు. ఇది ప్రతీ సంవత్సరం జరిగే తంతే!

నిజంగా ప్రభుత్వమే గనక, పేద కూలీలకి మేలు చెయ్యాలని నిబద్దత కలిగి ఉంటే.... తప్పకుండా, అలాంటి పధకాలని, వ్యవసాయ పనులు లేని రోజుల్లో అమలు చేసి ఉండేది.

నిజంగా ప్రభుత్వమే గనక, ప్రజలకి మేలు చెయ్యాలనే నిబద్దత కలిగి ఉంటే.... తప్పకుండా, అలాంటి పధకాల క్రింద చెరువుల పూడిక తీయించటం, బావులూ, చెక్ డ్యాములూ, వ్యవసాయపు నీటి కాల్వల నిర్మాణం, నాలాలు శుభ్రపరచటం వంటి రైతులకు ఉపయోగపడే పనులని చేపట్టి ఉండేది.

అంతే కానీ, పనికి మాలిన పనులు చేసేది కాదు. రోడ్డుప్రక్కన రోడ్డు బారునా చిన్న కాలువలు తవ్వటం ఖచ్చితంగా పనికి మాలిన పనే! చిన్నవర్షానికే అవి పూడుకు పోయాయి. పంచాయితీకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాలలో ఏ సంబంధమూ, సమన్వయమూ లేకపోవటం వల్ల, ఈ కాల్వలకి సిమెంటుతో లైనింగ్ చేయటం గానీ, డ్రైనేజీ గొట్టాలు అమర్చటం కానీ... పంచాయితీ చేయలేదు.

దాంతో తీసిన కాలవలు తీసినట్లే పూడుకుపోయాయి. అందునా అడుగున్నర లోతూ, అడుగు వెడల్పూగల ఆ గోతుల లోంచి తీసిన మట్టి, ఆ గోతుల ప్రక్కనే పోసారు మరి!

ఇందులో కొసమెరుపు ఏమిటంటే - రెండేళ్ళక్రితం తీసిన కాలవల్నే మళ్ళీ ఇప్పుడు 2010లో వాళ్ళు తీయటం!

ఈ విధంగా కోట్ల కొద్దీ ప్రజాధనం ఖర్చువుతోంది. అందులో 60% కుట్రదారులకు మద్దతుదారులైన అధికారులకీ, పైస్థాయి వ్యక్తులకీ పోతుంది. 40% దాకా కూలీలకు దక్కిందనుకున్నా అదీ నిష్ప్రయోజనమే! ఆ సొమ్ము వాళ్ళకి తేలికగా వచ్చినట్లే అన్పిస్తోంది. దాంతో కష్టపడడం పట్ల విముఖతనే తెస్తోంది.

ఆ విధంగా చూసినా, అలాంటి బూటకపు పధకాలు, ప్రజల దారిద్ర్యాన్ని వదల గొట్టవనే ఋజువవుతోంది.

అయితే, ఇలాంటి పధకాల కోసం అయ్యే ఖర్చు, నూటికి నూరు శాతం మాత్రం, ప్రజల నెత్తినే పడుతుంది. అందులో నయాపైసా ఉపయోగమూ పొందకుండానే! పరోక్షపు దెబ్బ రైతు తింటున్నాడు.

బదులుగా.... రోజుకి నూరు రూపాయల కూలీ ఇచ్చి, నూరురోజుల పాటు నికార్సుగా పనిచేయించుకొంటే, అటు కూలీలకీ ఉపయోగం! అదే విధంగా శాశ్వత నిర్మాణాలు, చెరువులూ, కాలువలూ బాగు చేయటం, పూడికలు తియ్యటం, చెక్ డ్యాంల వంటి రైతులకు ఉపయోగపడే పనులు చేస్తే, దేశానికీ ఉపయోగం!

ఈ నేపధ్యంలో.... ఇలాంటి పధకాల అమలులో లోపం ఉందా? లేక ఆ కాన్సెప్టులో లోపం ఉందా?

ఏ పధకం నుంచైనా దుష్ప్రయోజనాన్నీ, అప్రయోజనాన్నీ వెలికి తీయటమే నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యం చేసే పని! అచ్చంగా మర్యాద రామన్న కథ ‘కోడి గుడ్డంత బంగారం’ లో లాగా! ఆ కథ ఏమిటంటే....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

నాడు రోడ్డుప్రక్క రత్నాల రాశులు – నేడు ఫోన్లు, బైకులు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 16]

Mon, 07/05/2010 - 00:07
ప్రభుత్వ సంస్థలు తయారు చేసిన వస్తువులు.... నాణ్యమైనవి, సరసమైన ధరలకు లభించినప్పుడు, సహజంగానే ప్రజలు వాటిని కొనేందుకే ఇష్టపడతారు. [కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వారి మైసూర్ శాండిల్ సబ్బు, ఒకప్పుడు దాదాపు ఇంటింటా ఉపయోగింపబడటమే దీనికి సజీవ ఉదాహరణ.] అప్పుడు అనివార్యమై అయినా, ప్రైవేటు సంస్థలు.... అంతే నాణ్యమైన వస్తువులను, అంతకంటే [కనీసం అంతే] సరసమైన ధరకు అమ్మక తప్పదు.

ఆవిధంగా, ప్రైవేటు సంస్థలు వినియోగదారులని వ్యాపార దోపిడి చేయకుండా, ప్రజల నుండి అధిక లాభాలు గుంజకుండా నియంత్రింపవచ్చు. ఆ విధంగా ప్రజలు, సరసమైన ధరకు, నాణ్యమైన వస్తువులని ఆనందించగలుగుతారు. శ్రామికులు గానూ, వినియోగదారులు గానూ కూడా, ప్రజలు దోపిడికి గురికాకుండా నిరోధించవచ్చు.

ఈ ఆశయ సాధన కోసమే... ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు, హెచ్.ఎం.టీ. వాచీల వంటి వస్తు తయారీ సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్థాపింపబడ్డాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ప్రభుత్వ పరంగానే స్థాపించబడినాయి. APIIDC, (Andhra Pradesh Industrial Infrastructure Development Corporation) వంటి సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు సహకరించి చిన్న పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాల్సి ఉంది. పనితీరులో APIIDC, APSFC వంటి సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. [ఈ విషయమై, బ్యాటరీ తయారీ సంస్థను నడిపినందున, నేను స్వానుభవ పూర్వకంగా చెప్పగలను.]

ఆల్విన్ వంటి సంస్థలు మూతపడ్డాయి. ఇక మన్మోహన్ సింగ్ అనబడే ఈ గొప్ప ఆర్దికవేత్త, లాభాల బాటలో ఉన్న ప్రభుత్వసంస్థల్ని కూడా తెగ నమ్మిపారేసాడు. సిద్దాంతపరంగా అయితే.... ఆల్విన్, హెచ్.ఎమ్.టీ. వంటి సంస్థలు విజయవంతం కావాలి. మిశ్రమ ఆర్దిక వ్యవస్థా విజయవంతం కావాలి. అయితే వాస్తవంలో అవి విఫలమైనాయి. ఎందుకంటే - అమలు తీరులో గూఢచర్యం ‘రెడ్ టేపిజం, అవినీతి’ పేరుతో ప్రవేశించింది గనుక! ఆ వైఫల్యం వెనుక నకిలీ కణిక వ్యవస్థ ఉంది గనుక! పై ముసుగులో విదేశీ నిఘా సంస్థల్నో, కార్మిక సంఘాలనో, రాజకీయాలనో చూపింది గనక!

వివరంగా చెప్పాలంటే -

ప్రభుత్వ రంగ సంస్థల వైఫల్యానికి మీడియా, రాజకీయ నాయకులూ కలిసి, రకరకాల భాష్యాలు చెప్పారు. రోజుల మారిపోయాయన్నారు. రాజకీయుల అవినీతి, అధికారుల్లోకీ ప్రవేశించిందన్నారు. సమన్వయ లోపం అన్నారు. ఇక ఒకో సంస్థ వైఫల్యానికీ ఒకో భాష్యాన్ని, సోకాల్డ్ మేధావులూ, నిపుణులూ, పత్రికల్లో వ్యాసాలుగా వ్రాసారు. నిజానికి ఈ మేధావులూ, నిపుణులూ కూడా, మీడియా నిలబెట్టిన బొమ్మలే! మీడియా కవరేజిలో వెలిగిన సెలబ్రిటీలే!

ఇలా మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వైఫల్యానికి, సైద్ధాంతికపరమైన పైకారణాలని[over leaf reason] చూపిస్తూ.... వాస్తవంలో ఇటు కార్మిక సంఘాల నాయకులని, అటు అధికార వర్గాలనీ కూడా.... అవినీతి, రెడ్ టేపిజం, శ్రమ కిష్టపడక ప్రక్కదారులు తొక్కే మనస్తత్వం వంటి ప్రభావాలలో ముంచెత్తారు. ఇందుకోసం పన్నిన వ్యూహాలతో[ఎక్కువగా కార్మిక సంఘాల సమ్మెల దెబ్బ] సహజంగానే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్పత్తి తగ్గింది. వ్యయం పెరిగింది.

[ఇదే ఇప్పుడు ప్రభుత్వ ప్రాజెక్టులలోనూ, పధకాలలోనూ నడుస్తున్న తీరు! వ్యయం పెరుగుతుంది, ప్రయోజనాలు శూన్యమౌతాయి. వ్యూహాలు బహిర్గతమౌతున్న తీరిది.] అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రతీదశలోనూ.... అవకతవకలు, అధికారులకీ కార్మిక నాయకులకీ మధ్య వైషమ్యాలూ, వివాదాలు!

అప్పటి కార్మిక సంఘ నాయకులలో చాలామంది, క్రమంగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎదిగారు కూడా! దాన్ని బట్టే చెప్పవచ్చు, సదరు కార్మిక సంఘ నేతలకి తెరవెనుక అండదండలందాయని! ఇలాంటి నాయకులు కార్మిక నాయకులవటం చేత, 70-80 దశకాలలో, ఎప్పుడు చూసినా, యాజమాన్యపు అధికార వర్గాలతో, కార్మికుల వివాదాల వార్తలే వినబడుతుండేవి. సమ్మెలూ, లాకవుట్లూ, కోర్టుకేసులూ నడుస్తుండేవి. వెరసి ఉత్పత్తి మాత్రం దారుణంగా పడిపోయేది. ఇప్పాటిలా అప్పటికి, కోర్టుల ‘కుట్ర భాగస్వామ్యం’ ఇంతగా బహిర్గత పడలేదు.

నిండా చిల్లులున్న కుండని నింపటం ఎవరికీ సాధ్యంకానట్లే... ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఉండేది. ఫలితంగా ఆల్విన్ లు మూతపడ్డాయి.

దీనికి గట్టి ఉదాహరణ చెప్పాలంటే సింగరేణి కాలరీసే! అక్కడ ఎప్పుడు చూసినా కార్మికుల సమ్మెలే నడిచేవి. నెలలో సగం రోజులు అవే! 1992 వరకూ సింగరేణి వంటి సంస్థల తీరు ఇదే! తర్వాత మాత్రమే, సదరు సంస్థ వాటి నుండి బయటపడి, ‘లాభాలు’ ’ఉత్పత్తి పెరిగింది’ గట్రా మాటలు వినబడ్డాయి.

ఈ స్థితికి సింగరేణి కంటే పెద్ద ఉదాహరణ ఏపీఎస్ ఆర్టీసీ! 1992 వరకూ కూడా ‘ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణీకులకి సరైన తీరులో సేవ చేయరన్నది’ జగమెరిగిన సత్యం! అప్పట్లో ఆర్టీసీ డ్రైవర్లు, బస్ స్టాపుకు పదిమీటర్లు ముందో వెనుకో ఆపుతారు, తప్ప స్టాపులో ఆపనే ఆపరనే... జోకులూ, విమర్శలూ ఉండేవి. ఖాళీగానైనా బస్సులు తిప్పుతారు గానీ, ప్రయాణీకులున్నా కూడా, స్టాపుల్లో ఆపి ఎక్కించుకోరనీ విమర్శలుండేవి. కండక్టర్లు చిల్లర మింగేస్తారని కార్టూన్లు, జోకులూ ఉండేవి.

ఇప్పుడు? ముఖ్యంగా పల్లెరూట్లలో, పట్టణానికి దగ్గర ఉన్న ఊళ్ళకీ, సెవన్ సీటర్ ఆటోలు, టాక్సీ కాబ్ లూ వచ్చేసరికి... లాభాలు రాకుంటే ఆర్టీసీ ప్రైవేటైజ్ అవుతుంది అన్న ప్రమాదం కనబడేసరికి.... ఒకటిన్నర దశాబ్దాంగా, ఆర్టీసీ నుండి అంతకు క్రితం కంటే కొన్నిరెట్లు మెరుగైన సేవలు అందుతున్నాయి.

ముఖ్యంగా... చెయ్యేత్తితే బస్సు ఆపబడటం గురించి 1990 కు ముందర ప్రయాణీకులు ఊహించనైనా లేదు. ప్రైవేటు టాక్సీవాలా ఆరిచినట్లు, ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణీకులని ఆకర్షిస్తూ, బస్సు ప్రయాణ మార్గంలోని ప్రాంతాల పేర్లు అరుస్తూ, ప్రయాణీకులని పిలుస్తారని, కండక్టర్లు కూడా ఊహించి ఉండరు. ఒకప్పుడు వాళ్ళకి ఆక్యుపెన్సీరేటు గురించి బాదరబందీనే ఉండేది కాదు.

ఎందుకీ మార్పు వచ్చినట్లు? రేట్లు పెరిగితే, ప్రయాణీకులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రైవేటు ఆపరేటర్లు కనబడుతున్నారు. ‘నష్టాల బాటలో ఉంటే ఆర్టీసీ ని ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేస్తుందేమో!’ అన్న భయం, ఉద్యోగుల్లో తెచ్చిన అప్రమత్తతే ఇందుకు కారణం! అంటే అది మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వలన వచ్చే ప్రయోజనం అన్నమాటే కదా! [అసలుకే లాభాలున్నా ‘ఏకమొత్తంగా భారీ సొమ్ము వ్యక్తిగత ఖాతాలకు జమపడుతుంది కదాని’ ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేసేస్తున్నారయ్యె!]

అలాంటప్పుడు మిశ్రమ ఆర్దిక వ్యవస్థ సిద్దాంతంలో లోపం ఉందా? అమలులో లోపం ఉందా? దాని వైఫల్యం యాదృచ్ఛికమా?, లేక వ్యూహాత్మకమా?

మరో ఉదాహరణ చూడండి! భారతదేశంలో టెలిఫోన్ సేవలకు సంబంధించినది ఇది! ప్రైవేటు సెల్లులు, ఫోన్ల కంపెనీలు రంగంలోకి ప్రవేశించక ముందు, భారత్ లో మొత్తం టెలిఫోన్ల రంగం కేంద్ర ప్రభుత్వానిదే! [అప్పట్లో పోస్టల్ & టెలిఫోన్ శాఖలు కలిసి ఉండేవి. తర్వాతే విడిపోయి BSNL గా టెలిఫోన్ సంస్థ ఏర్పడింది.] అప్పట్లో, అంటే 1992 కు ముందర, టెలిఫోన్ సర్వీసులు అధ్వాన్నంగా ఉండేవి.

[మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు అసలే అంతంత మాత్రంగా సేవలందించే టెలిఫోన్ ఎక్చేంజ్ ల మీద, నక్సలైట్లు దాడి చేసి ధ్వంసం చేసేవాళ్ళు. దాంతో నెలల పాటు టెలిఫోన్లు మూగపోవటం అప్పట్లో సర్వ సాధారణం.] అప్పట్లో టెలిఫోన్ సర్వీసుల మీద, ఆపరేటర్ల మీద, ఎన్నో జోకులూ, కార్టూన్లూ ఉండేవి.

ఒక్క ఫోన్ కనెక్షన్ కోసం సంవత్సరాల పాటు వెయిటింగ్ లిస్ట్ ఉండేది. కనెక్షన్ ఇచ్చినా అంతంతమాత్రపు నాణ్యత, సేవ! ఇతర దేశాలలో మనదేశపు టెలిఫోన్ సేవల గురించి, ఫోన్ కోసం వేచి ఉండాల్సి రావటం గురించీ జోకులుండేవని, అప్పటి నా ఎన్.ఆర్.ఐ. స్నేహితులు చెప్పేవాళ్ళు. అలాంటివి విన్నప్పుడు అవమానంగా, రోషంగా అన్పించేది. భారతదేశపు రోడ్ల గురించీ ఇదే గతి ఉండేది.

బజాజ్ స్కూటర్సు గట్రాల కోసం కూడా, సంవత్సరాల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. స్కూటర్ అలాట్ అయిన వాళ్ళు పార్టీలు ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇవన్నీ దేశపు హోదాకు గుర్తులుగా చెలామణి అయ్యేవి. ఒక దేశపు ఆర్దిక హోదాని, పరువుని, ఇలాంటి ‘ప్రమాణాల’తో అనధికారికంగా కొలిచేవాళ్ళు. అది తలచుకొని.... ఇప్పుడు రోడ్ల ప్రక్కన టెంట్లు వేసుకొని, ప్రైవేటు ఫోన్ల కంపెనీల వాళ్ళు, మోటార్ బైకుల వాళ్ళు, తక్షణం సెల్ ఫోన్లు/బైకులు ఇస్తామంటూ కాంపెయిన్ లు నిర్వహించటం చూసి మేము చాలా నవ్వుకుంటూ ఉంటాము.

మారిన రోజులని, పరిస్థితులని తలుచుకొని "రాయల వారి కాలంలో రోడ్డుప్రక్కన రత్నాలు పోసి సోలలతో అమ్మేవాళ్ళట. అది మనం చూడలేదు గానీ, ఒకప్పుడు అపురూపం అయిన ద్విచక్ర వాహనాలనీ, ఫోన్లనీ, ఇప్పుడు రోడ్డుప్రక్కన కూర్చొని ‘రండి బాబూ! రండి. తక్షణమే అందజేస్తాం!’ అంటూండటం మాత్రం చూడగలుగుతున్నాము" అనుకొని చమత్కారించుకుంటూ ఉంటాం నేనూ, మా వారు!

సరే! అంత డిమాండు ఉండి, అప్పట్లో అంత నాసిరకపు సేవలందించిన BSNL, గత దశాబ్ధంలో ప్రైవేటు ఫోన్ల పోటీ కారణంగా, అనివార్యంగా పోటీ పడుతోంది. దరఖాస్తు చేసిన వెంటనే [గతంతో పోలిస్తే] కనక్షన్ ఇస్తోంది. ధరల్లో పోటీ పడుతుంది. బ్రాండ్ బ్యాండు గట్రా సేవలన్నిటినీ, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ జెట్ స్ఫీడుతో అందిస్తూన్నానంటోంది. [అందులో కొంతమాత్రమే నిజముంది.] జెట్ స్పీడుతోనే కాదు, బోటు ప్రయాణమంత సరసమైన ధరకీ అందిస్తున్నానంటోంది. [ఇందులోనూ కొంత నిజముంది.] ఏతా వాతా ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల పరస్పర పోటీతో, ఈనాడు మేకలూ, గొర్రెలూ కాచేవాళ్ళ దగ్గర సైతం సెల్ ఫోన్లుండటం, మన కళ్ళెదుట ఉన్నదే!

ఈ నేపధ్యంలో, 1960-90ల దాకా మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వైఫల్యాన్ని పరిశీలిస్తే.... అది యాదృచ్ఛికమా[దానంతట అదే సంభవించిందా?] లేక వ్యూహాత్మకమా?[కావాలని జరిపించబడిందా?]

ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల వల్లా, గూఢచర్య కారణాల వల్లా, నకిలీ కణిక వ్యవస్థ... ‘సరళీకృత ఆర్దిక విధానాల వల్లే ఈ ఆభివృద్ది అంతా సంభవించింది’ అనటం కోసం ప్రైవేటు ఫోన్ కంపెనీలని తెర వెనక ప్రోత్సహించింది. ‘తానొకందుకు చేస్తే... ఫలితం మరొకటైంది’ అన్నట్లుగా, నకిలీ కణిక వ్యవస్థ ఒకందుకు చేస్తే.... తీరా అంతా అయ్యాక చూస్తే, అది కాస్తా మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వైఫల్యం.... సిద్దాంతంలో లేదని, అమలులోనే ఉందని, అమలు వెనక అదృశ్య హస్తాలున్నాయనీ ఇలా నిరూపితమైంది.

గూఢచర్య యుద్దం పదునెక్కే కొద్దీ, సరళీకృత ఆర్దిక విధానాలు కూడా, కొత్త కోణాలు తెరుచుకుంటున్నాయి. పీవీజీ చేత ప్రారంభంచబడిన ఈ లిబరలైజేషన్ లో మన్మోహన్ సింగ్ లూ, మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాలు, చిదంబరాలతో సహా అందరూ, ఎవరి సువర్ణముఖిని వాళ్ళు అందుకుంటున్నారు, అందుకోనున్నారు. వాటిల్లో కొన్ని ఇప్పటికే బహిర్గతమయ్యాయి. మరికొన్ని తెరచాటున మరుగుతున్నాయి.

ఏదైనా.... నిజం ఎప్పుడైనా బయల్పడక తప్పదు కదా!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~
Categories: Left

మిశ్రమ ఆర్దిక వ్యవస్థతో అభివృద్ది ఆకాంక్షలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 15]

Fri, 07/02/2010 - 21:46
తరాల తరబడి, శతాబ్దాలుగా, నకిలీ కణిక అనువంశీయులూ, వాళ్ళ అనుచరులూ సహచరులూ.... తమ గూఢచర్య వ్యూహాలతో, మంచి కోసం ప్రయత్నించే వారి జీవితాలని విఫలం చేసి మరీ, తమ ప్రచారాన్ని మరింత పెంచి, పదే పదే అదే ప్రచారంతో ‘నల్లమేక నలుగురు దొంగలు’ కథలో లాగా.... ప్రజల్ని ‘భావవాదం చేతగాని వాళ్ళు చెప్పే మాటలు. అవి వినటానికే బాగుంటాయి. ఆచరించటానికి కాదు’ అంటూ నమ్మించారు, నమ్మించ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మంచితనం అంటేనే మానసిక రుగ్మత మరి!


దీనికి దృష్టాంతాన్ని పరిశీలించండి. భారత దేశానికి తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రు, దేశ శ్రేయస్సు గురించి, అభివృద్ది గురించి కలలు కన్నాడని అందరూ అంటారు. స్వాప్నికుడిగా అతడి పేరు ప్రస్తావిస్తారు. ఆసియా ఖండంలో శాంతిని కాంక్షించాడనీ, స్వప్నించాడనీ అంటారు. ఇక్కడ నేను అతడి వైఫల్యాల గురించి గానీ, బలహీనతల గురించి గానీ చర్చించటం లేదు.

కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తిని సమర్దించడాన్ని గురించీ గానీ, లేడీ బాటన్ తో స్నేహం గురించి గానీ.... మీడియా విమర్శలని, ప్రతిపక్ష నేతల విమర్శలని ప్రస్తావించటం లేదు.

ఈ టపాలో నేను, కేవలం, నెహ్రులోని ‘భారత దేశాభివృద్దిని కాంక్షించిన, స్వప్నించిన నేత’ కోణాన్ని మాత్రమే ఉటంకిస్తున్నాను. బహుళార్ద సార్దక ప్రాజెక్టులతో, పంచవర్ష ప్రణాళికలతో అతడు తన కలలని సాకారం చెయ్యటానికి చేసిన కృషిని ఉటంకిస్తున్నాను.

దేశాభివృద్దికై తొలితరం నాయకుడిగా నెహ్రు కష్టపడి పనిచేశాడు, ఇతరుల చేత చేయించాడు. ఆనాటి తొలితరం నేతలు.... నెహ్రు, శాస్త్రీజీ, పటేల్ ల దగ్గరి నుండి ఇందిరాగాంధీ, పీవీజీల దాకా.... నిబద్దతో, నిజాయితీతో పనిచెయ్యకుండా.... ఈనాటి రాజకీయ నాయకుల మాదిరిగా [ఏ పార్టీ అయినా ఒకటే] ప్రజాధనం దోచుకు తిని ఉంటే.... ఈపాటికి ఇండియా, ప్రపంచపటంలో నుండి ఎప్పుడో అదృశ్యమై ఉండేది.

కాబట్టి ఏ విధంగా చూసినా... ఆనాటి రాజకీయ నేతలతో, ఈనాటి రాజకీయుల్ని పోల్చలేం. కాబట్టి నిశ్చయంగా జవహర్ లాల్ దేశాభివృద్దికి కృషి చేశారని చెప్పవచ్చు.

ఎంత నిశ్చయంగా అంటే... ఆనాటి నాయకులు, ఈనాటి నాయకుల లాగా, ప్రభుత్వ పధకాల అమలుని, తమ దగ్గరి నుండి ప్రారంభించి మరీ తూట్లు కొట్టలేదు. ప్రాజెక్టుల పేరుతో మొత్తం సొమ్ము అడ్డగోలుగా మింగెయ్యలేదు. [అదే జరిగి ఉంటే ఇప్పటికీ నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రా నంగల్ గట్రా ప్రాజెక్టులు పేపర్ల మీదే ఉండేవి.]

అంతేకాదు, ఆనాటి నాయకులు, ఈనాటి నాయకులూ నాయకురాళ్ళలా, తమ ఆశ్రిత జనాలకి, బంధుమిత్రులకీ కాంట్రాక్టులు కట్టబెట్టి కాసుల కట్టలు తాము తీసుకోలేదు. ఎకరా రూపాయికి, వేల ఎకరాలని, సెజ్ ల పేరుతో బడాబాబులకి కట్టబెట్టి, తమ వాటాలు బొక్కలేదు.

ఆనాటి నాయకులు, ఈనాటి నాయకులూ నాయకురాళ్ళలా, చిన్న, కుటీర పరిశ్రమలని, తమ రెడ్ టేపిజం, అవినీతిలతో చంపి పాతర వెయ్యలేదు. [అప్పట్లో జిల్లా పరిశ్రమ కేంద్రాలూ, పారిశ్రామిక వాడలూ కొంత చైతన్యంతో ఉండేవి. ఇప్పట్లా, ఖాయిలా పడ్డ సంస్థలతో జీవరాహిత్యంతో కునారిల్లుతూ ఉండేవి కావు.]

ఇందిరాగాంధీ హయాంలో మనదేశం అధిక ఆహారోత్పత్తినీ, పాల ఉత్పత్తినీ సాధించింది. ఇప్పట్లా ఆహార కొరత భయం లేనంతగా! అదీ ఆనాటి ప్రభుత్వాలకు ప్రజల పట్ల ఉన్న నిబద్దతా, బాధ్యతా! అదీ నాటి ప్రభుత్వాలకీ [జవహర్ లాల్ నుండి ఇందిరాగాంధీ దాకా] నేటి ప్రభుత్వాలకీ [ఎన్డీయే నుండి యూపీఏ ల దాకా] మధ్య నున్న వ్యత్యాసం! నేతల సంకల్పాలని బట్టి వారి ప్రభుత్వాల పనితీరు ఉంటుంది. ఇక పీవీజీ హయాం గురించి నేను వివరించను. పైన చెప్పిన ప్రామాణికాలతో పీవీజీ సంకల్పాన్ని మీరే బేరీజు వేసుకోవచ్చు.

2008 లో, మార్చి 31వ తేదీన, ప్రముఖ కాలమిస్టు నీరజా చౌదరి వ్రాసిన వ్యాసం ఒకటి, ఈనాడు లో చదివాను. తార్కికంగా, దృష్టాంత పూరిత నిరూపణలతో, ఆమె.... భారత దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు, కేవలం దేశ జనాభాలో 3% ఉన్న ధనికుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ, జనాభాలో 97% ఉన్న సామాన్య ప్రజల ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నాయని విశ్లేషించింది.

ఇది నిజమా కాదా అని సంకోచించాల్సిన అవసరం లేనంతగా.... దాదాపు రాజకీయ నేతలందరూ, అధికసంఖ్యలో, కార్పోరేట్ విద్యాసంస్థలు [ఇంజనీరింగ్ కళాశాలతో సహా] పరిశ్రమలు, హోటళ్ళు, గనుల కాంట్రాక్టులు, ఇతర వ్యాపారాలు కలిగి ఉన్నారు. చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ సంస్థలుంటే, వై.యస్.కుమారుడు జగన్ కి మీడియా సంస్థలూ, పవర్ ప్రాజెక్టులూ ఉన్నాయి. హోంమంత్రితో సహా చాలామందికి విద్యావ్యాపారాలున్నాయి.

సోనియా కుమారుడు రాహుల్ కూడా ముంబైలో ఏదో వ్యాపార సంస్థ నెలకొల్పి కొన్నాళ్ళు నడిపాడని చదివాను. ప్రస్తుత స్థితి గురించి ఏ వార్తాలేదు. గాలి సోదరుల గనుల గురించి అందరికీ తెలిసిందే! సుబ్బిరామి రెడ్డి వంటి రాజ్యసభ సభ్యులూ ఇందుకు మంచి ఉదాహరణలే! వాళ్ళూ వీళ్ళూ అనేదేముంది? దాదాపు అన్నిపార్టీలలోనూ, రాజకీయ నాయకులందరికీ ఇతరత్రా వ్యాపార సంస్థలున్నాయి.

కొందరు లోకసభ సభ్యులూ, రాజ్యసభ సభ్యులూ కొన్ని కార్పోరేట్ సంస్థలకు ప్రతినిధుల్లా పనిచేయటం గురించీ విని ఉన్నాము, చూస్తున్నాము. అంబానీ సోదరులతో సహా ఈ రకపు వ్యక్తులు, కేవలం ప్రజలకు సేవ చేయటానికే ఎంపీలయ్యారా? లేక, తమ సేవ తాము, తమ వ్యాపారాభివృద్ది తామూ చేసుకునేందుకు ఎంపీలయ్యారా?

ఇక ఇలాంటి చట్ట సభల్లో.... కేవలం 3% మంది ధనికుల ప్రయోజనాలని కాపాడెందుకే చట్టాలు చేయబడటంలో విడ్డూరం ఏముంది? 97% మంది సామాన్య ప్రజల ప్రయోజనాలని తుంగలో తొక్కడంలో వింతేముంది?

ఈ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.... ఒకనాటి పార్లమెంట్ హౌజ్ నీ, అందులోని సభ్యుల్నీ, నాటి నేతలైన నెహ్రు, అతడి మంత్రివర్గాన్ని పరిశీలిస్తే.... వాళ్ళు ప్రజలకేదో మేలు చేయాలని ప్రయత్నంచటంలో నిజాయితీ ఉందన్నది అర్దమౌతుంది.

ప్రపంచ రాజకీయ అవనిక మీద కూడా, జవహర్ లాల్ నెహ్రు తన స్వంత కీర్తి పెంపొందించుకునే ప్రయత్నం చేసాడని, మీడియా ప్రచార హోరు ఓ ప్రక్క ఉన్నా, మరోప్రక్క... పంచశీల, అలీన విధానం గట్రాలతో భారతదేశానికి ఒక హోదాని, వ్యక్తిత్వాన్ని తెచ్చాడు. తెచ్చేందుకు కలలు కన్నాడు.

అయితే ఆ కలలన్నీ 1964 లో చైనా దురాక్రమణకు దిగినప్పుడు, ఒక్కసారిగా చెల్లా చెదురవ్వటమే కాదు, నెహ్రుని నేల మీదికి తెచ్చాయి కూడా! తాము గురిపెట్టుకున్న వ్యక్తుల మీద నకిలీ కణిక వ్యవస్థ ఎంతగా మాయ జలతారు తెరని [Iron curtain] ని కప్పుతుందో, ఎంతగా పరోక్ష సామదాన భేద దండాలని ప్రయోగిస్తుందో ఆనాటికి ఎవరికీ తెలియదు. తాము ప్రభావపరచదలుచుకున్న వారిపై ‘ఆడది-ఆకలి’తో సహా, అహం రెచ్చగొట్టటం, ఆహాన్ని దెబ్బకొట్టటం వంటి తంత్రాలు ప్రయోగిస్తుందనీ తెలీదు. సిఐఏ, కెజిబీల గూఢచర్య కార్యకలాపాల గురించి బాహాటంగా కొన్ని, లోతట్టులో మరికొన్ని తెలిసినా... అవీ ప్రణాళికా బద్దంగా నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించినవే!

అందుచేత, ఆనాటికి బాగానే బలపడిన నకిలీ కణిక వ్యవస్థ, చైనా దురాక్రమణ పైకారణంగా[over leaf reason]గా, చాలా స్ట్రాటజీలనే ప్రయోగించింది. చైనా యుద్దపు నేపధ్యంలో, సైనికులకి పంపిన చలి దుస్తులూ, బూట్లూ ఆహార పదార్దాలూ కలకత్తా మార్కెట్లలో ప్రత్యక్షం కావడం గురించిన ప్రచారం, పెద్ద ఎత్తున బయటికొచ్చింది. ఆ అపజయం తొలిసారిగా భారత్ నీ, నాటి భారత ప్రధానిని హెచ్చరించింది. కలలని కరిగించింది.

అలాగే జవహర్ లాల్ మరో కల, మిశ్రమ ఆర్దిక వ్యవస్థ! మిశ్రమ ఆర్దిక వ్యవస్థతో నెహ్రు.... ప్రభుత్వ పరిశ్రమలూ, ప్రైవేటు పరిశ్రమలూ పోటాపోటిగా అభివృద్ది చెందుతాయనీ, చెందాలనీ, ఆ విధంగా సమతుల్యతతో సమగ్రాభివృద్ది దిశలో దేశం ముందుకెళ్ళగలదని కలలు కన్నాడు.

వాస్తవానికి మిశ్రమ ఆర్దిక వ్యవస్థలో అమలు లోపమే గానీ, విధానంలో అది సమర్దవంతమైనదీ, ఫలవంతమైనది కూడా!

వివరంగా చెబుతాను. ఒక xyz ఉత్పత్తిని తీసుకుందాం. కేవలం ప్రభుత్వ రంగంలో మాత్రమే, ఆ వస్తువు ఉత్పత్తి చేయబడిందనుకొండి. దేశప్రజల అవసరాలని అది తీర్చలేదు. అదీగాక, కేవలం ప్రభుత్వం మాత్రమే అన్ని వస్తూత్పత్తులనూ చేపడితే, అది మిశ్రమ ఆర్దిక వ్యవస్థ కాబోదు. అప్పడది ఒకప్పటి USSR లో అమలైన సోషలిజం అవుతుంది. [అందులో ఉన్న కష్టనష్టాలేమిటో, USSR ముక్కచెక్కలై రష్యా ఏర్పడ్డాక అందరికీ తెలిసిందే కదా! ఆ విధంగా సామ్యవాదపు వైఫల్యం ప్రకటింపబడింది. నిజానికి ‘ఇజాలలో నిజాలే’ ఉన్నప్పటికీ అమలులో, అమలు పరిచేవారిలో సకల వైరుధ్యాలూ, వైఫల్యాలూ ఉన్నాయి.]

అలాగే కేవలం ప్రైవేటు సంస్థలే అన్ని వస్తూత్పత్తులూ చేస్తే, చేయనిస్తే, కృత్రిమ కొరతలు సృష్టించటం దగ్గరి నుండి, మోనోపలీలు సృష్టించటం, వినియోగదారులని పూర్తిగా వ్యాపారపరంగా దోచుకోవటం వంటి పరిస్థితులు ఏర్పడతాయి.

అదీగాక, అన్ని వస్తువుల ఉత్పత్తీ కేవలం ప్రైవేటు రంగంలోనే ఉంటే, అది మిశ్రమ ఆర్దిక వ్యవస్థ కాబోదు. అప్పుడది అమెరికాలో లాగా స్వేచ్ఛాయుత వాణిజ్యశైలి అవుతుంది.

2008, సెప్టెంబరులో బాహాటంగా వినబడి, లేమాన్ బ్రదర్స్ దివాళాతో ప్రకటింపబడి, నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్దిక మాంద్యం నేపధ్యంలో.... 2009మార్చిలలో వినబడిన మాట ‘USSR సోషలిజం ఫెయిల్ అయినట్లే, అమెరికా ఫ్రీ ఎకానమీ ఫెయిలయ్యింది’ అని! ఈ మాట కొంచెం ఊపందుకోగానే... ‘సిద్దాంత వైఫల్యం ప్రకటింపబడటం’ అనే అపాయం అర్దమై, నకిలీ కణిక వ్యవస్థ జాగ్రత్త పడింది. [ఇండియా మాంద్యం బారిన పడకపోవటానికి కారణం, మిశ్రమ ఆర్దిక వ్యవస్థే అన్నమాట అందరూ ఘంటాపదంగా అంగీకరించారు. తరువాత ఆ విషయం పెద్దగా ఫోకస్ చేయబడలేదు.]

అప్పటి దాకా "లేదు. లేదు. ఆర్దిక మాంద్యం అయిపోయింది" అనీ...

"ఇదిగో! రేపో ఎల్లుండో ఆర్దిక మాంద్యం తొలిగిపోనుంది. తొలగిపోతోంది. తొలిగిపోయిందీ" అనీ,

‘రానున్న x ఏళ్ళల్లో, y లక్షల ఉద్యోగాలు. ఆర్దిక మాంద్యం ముగిసిందనటానికి ఇదే నిదర్శనం’ అనీ నకిలీ కణిక వ్యవస్థ తెగ గింజుకుని ప్రచారిస్తోంది.

నిజానికి ఈ ఆర్దిక మాంద్యం ఇప్పుడంటే కీలక దశకి చేరి, మరింత తీవ్రదశకు ప్రయాణిస్తోంది కానీ, ఇది ప్రారంభమై దాదాపు తొమ్మిదేళ్ళు కావస్తోంది. కాకపోతే "అలాంటిదేమీ లేదని, ఇది మామూలు ఒడిదుడుకు మాత్రమేననీ" తిమ్మిని బమ్మి చేయ ప్రయత్నించారు. 2008వరకూ ప్రచార వ్యవస్థ, ప్రభుత్వాలు ప్రపంచాన్ని నమ్మించాయి. ఈ అసత్య ప్రచారానికి, ఆర్దిక మాంద్యానికి, ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ల ఉత్ధాన పతనాలకీ మధ్య ఉన్న ముప్పేట బంధం గురించీ, కార్యకారణ సంబంధాల గురించీ, తర్వాత ముచ్చటిద్దాం. ప్రస్తుతానికి మిశ్రమ ఆర్దిక వ్యవస్థ దగ్గరికి తిరిగి వద్దాం.

స్వేచ్ఛా వాణిజ్యం, సామ్యవాదం... రెండింటిలోని సాఫల్యాలని, వైరుధ్యాలనీ అధ్యయనం చేసి, రెండింటిలోని మంచి అంశాలనీ, ప్రయోజనాలని గ్రహించి, రెండింటిలోని వైఫల్యాలని అంచనా వేసి... వివిధ దేశాల గతాలని, వర్తమానాలని, భవిష్యత్తులని పరిశీలించి, ఊహించి, అన్నిటి మేలు కలయికగా, ఆధునిక కాలానికి పరిస్థితులకి తగినదిగా భావించి, మిశ్రమ ఆర్దిక వ్యవస్థని అమలు చేయ తలపెట్టారు.

కేవలం ప్రభుత్వ వస్తు తయారీ సంస్థలే ఉండటం[socialism] గాకుండా, అదే విధంగా కేవలం ప్రైవేటు వస్తు తయారీ సంస్థలే ఉండటం [capitalism] గాకుండా, మార్కెట్టులో ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండూ ఉండటం, ఒక దానితో ఒకటి పోటీ పడటం... అనే ప్రక్రియ ఏ విధంగా చూసినా ‘దేశాభివృద్దికి తగిన సోపానం’ అనటంలో సందేహం లేదు. అది ఇప్పటికే దృష్టాంతపూరితంగా రష్యా అమెరికాల చరిత్ర సాక్షిగా నిరూపితమైనదే!

ఎలాగో పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

ప్రజల్ని గోతిలో పడెయ్యటం ఎలా? – ఎంసెట్ లెక్క!

Wed, 06/30/2010 - 21:10
ఎంసెట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్దులకు, ఫిజిక్సులో మా గురువు గారు ఆర్.చలపతిరావు గారి పుస్తకం ఎంతో ఉపయుక్తమైనది. అందులోంచి ఒక ప్రశ్న- జవాబుని వివరించి, దాని అనువర్తనతో నా విశ్లేషణని కొనసాగిస్తాను.

ముందుగా ప్రశ్న:

ఒక త్రాగుబోతు రోడ్డుమీద ముక్కుసూటిగా నడుస్తున్నాడనుకొండి. అతడికి 18 మీటర్ల దూరంలో ఒక గొయ్యి ఉంది. మన వాడు తాగి ఊగుతూ నడుస్తున్నాడు. కానీ సరళ రేఖా మార్గంలోనే నడుస్తున్నాడు. ఎనిమిది అంగలు ముందుకేస్తే, ఆరు అంగలు వెనక్కి వేస్తున్నాడు. ఒకో అంగ ముందుకో వెనక్కో వెయ్యటానికి ఒకో సెకను పడుతుందను కొండి. అలాగే, ఒకో అంగ ఒక మీటరు అనుకొండి. ఎంత సమయంలో ఈ త్రాగుబోతు ఆ గొయ్యిలో పడతాడు?

జవాబు:
త్రాగుబోతు ముందుగా ఎనిమిది అడుగులు వెయ్యటానికి [మీటర్లు] 8 సెకనులు పడుతుంది. మళ్ళీ వెనక్కి ఆరు[మీటర్లు] అంగలు వెయ్యటానికి 6 సెకనులు పడుతుంది. వెరసి 14 సెకనులలో 2 మీటర్లు ప్రయాణిస్తాడు. అలాగే 10 మీటర్లు ప్రయాణించటానికి, 5x2=10m, గనుక 5 సార్లు ఇదే విధమైన విన్యాసాలు చేస్తాడు. కాబట్టి 5x14=70 సెకనులలో 10 మీటర్లు ప్రయాణిస్తాడు. ఆరోసారి, 8 మీటర్లు ముందుకు అంగలు వేస్తే, 18 మీటర్ల దూరంలోని గోతిలో నేరుగా పడిపోతాడు గనక, మరి వెనక్కి రాలేడు. అందుకు పట్టే 8 సెకనులని కలుపుకుంటే మొత్తంగా, 70+8=78 సెకనులలో, త్రాగుబోతు తూగుతూ పోయి, నేరుగా గోతిలో పడతాడు.

ఇక దీని అనువర్తన ఏమిటంటారా?

అధికారంలో నున్న ప్రభుత్వం[ఏదైనా సరే] ప్రజల మీదికి.... మద్యం, జూదం, రెడ్ టేపిజం వంటివి ప్రయోగించి.... ఉన్నత్తుల్ని, నిస్తేజితుల్నీ చేస్తోంది. ఆ విధంగా దుర్బలంగా ఉన్నా గానీ...

ప్రభుత్వం పెట్రో వడ్డనలు చేసినప్పుడూ
ధరలతో దవడలు వాచినప్పుడూ
మార్కుల అవకతవకలతో పిల్లల చదువులు చతికిలపడ్డప్పుడూ
ఆర్.ఆర్.బి., ఎపిపిఎస్సీ వంటి అవకతవకలు బయటపడినప్పుడూ
భోపాల్ గ్యాస్ ల వంటి కోర్టు తీర్పులు వెలువడ్డప్పుడూ
అవినీతి స్కాంలు బయటపడ్డప్పుడూ

లేచి, ఊగుతూనే అయినా, ఉద్రేకంగా, ప్రభుత్వం మీద ఖస్సుమంటున్నారు.

సరిగ్గా అప్పుడు... మీడియా, ప్రతిపక్షాలూ రంగంలోకి దిగుతున్నాయి. ప్రజల తరుపున తాము పోరాడుతున్నామంటూ సా....గ తీసి, ప్రజల ఖస్సుని కాస్తా తుస్సుమనిపిస్తున్నాయి.

దాంతో ఎనిమిదడుగులు ముందుకేసిన ప్రజలు ఆరడుగులు వెనక్కి వెయ్యక తప్పటం లేదు. మెల్లిగా ప్రజల ఆవేశం చల్లబడ్డాక.... పత్రికలూ, ప్రచారసాధనాలు, ప్రతిపక్షాలూ కూడా, మెల్లిగా సమస్యల్ని అటకెక్కించి, మళ్ళీ తమ స్వప్రయోజనాలు, తమ రాజకీయాలు చూసుకుంటున్నాయి.

ఆ విధంగా.... నేర్పుగా, అంచెలంచెలుగా, ప్రజల్ని వ్యూహాత్మకంగా తీసికెళ్ళి ‘అప్రతిఘటన’ అనే గోతిలో పడెయ్యాలన్నదే వీరందరి ఉమ్మడి లక్ష్యమన్నమాట. అప్రతిఘటన అనే గొయ్యి అంటే - అందులో పడిన వాళ్ళు ఇక దేన్నీ ప్రతిఘటించలేరు. అన్నిటినీ భరిస్తారు. ‘అదే ఆనందం’ అని మీడియా అంటే ‘అవును కామోసు’ అనుకుంటారు. పైపెచ్చు ‘అదే అభివృద్ది’ అంటూ వాదిస్తారు, నమ్ముతారు. ఎదురుతిరగటం అన్న ఊహే భరించలేరు.

ప్రతిఘటన అన్న స్థితిని మరిచి పోవటమే పెద్ద గొయ్యి! అందులో పడిన వాళ్ళు బ్రతుకుతున్నామనుకుంటారు కానీ, ఏనాడో జీవచ్ఛవాలు! అచ్చంగా జపాన్ వాళ్ళలాగా!

"ప్రజలంతట ప్రజలే ముందుకే పోతూన్నప్పుడు, అలా వదిలేస్తే మరింత ముందుగా గోతిలో పడతారు గదా? వాళ్ళకి కావలసింది అదే అయినప్పుడు, ఇక వెనక్కి లాగటం ఎందుకూ?" అని కొందరనుకుంటారు.

అలాగనుకుంటే అది ఖచ్చితంగా వారి అమాయత్వమే! ఎందుకంటే.... ప్రజలని యధేచ్ఛగా వదిలేస్తే, ప్రమాదాన్ని పసిగట్టి వెనక్కిపోవచ్చు. లేదా ముందుకెళ్ళనిస్తే.... గోతిలో పడవచ్చు, పడకపోవచ్చు. పడినా అమిత వేగంతో పోయి పడతారు. అంతేగాక ఆ వేగంలో తమనీ లాగేస్తారు. ఇంకేం మిగలదు. [అదీగాక, అంతిమంగా ఎవరయితే ప్రజలని అక్కడికి డ్రైవ్ చేస్తారో వారు దానికి బాధ్యులు కావలసి ఉంటుంది. ఆ నిందా మోయవలసి ఉంటుంది.]

ఇది ఊహాజనితం కాదు. అతిశయోక్తి కూడా కాదు. చారిత్రాత్మక దృష్టాంతం! కావాలంటే పరిశీలించండి.

1947 లో, మత ప్రాదిపదికన, అఖండ భారతదేశం.... పాకిస్తాన్, ఇండియాలుగా విడిపోయింది. ఆనాడు ముస్లిం ప్రజలు, అధికసంఖ్యలో, పాకిస్తాన్ కావాలనుకున్నారు. దేశంగా ఏర్పడ్డారు. ఆదే మతాభిమానం.... క్రమంగా మతోన్మాదంగా మారితే... ప్రజలూ, ప్రభుత్వాలూ కూడా పోయి ‘తాలిబానిజం’ అనే గొయ్యిలో పడ్డారు. మతం మత్తులో వేసిన అంగలు, ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఆ గోతిలోకి లాక్కెళ్ళి పడవేసాయి.

ఇప్పుడు రోజూ పేలే కారు బాంబుల్ని, ఆత్మహుతి దాడుల్ని లెక్కపెట్టుకుంటూ, మృతుల సంఖ్యలతో నివేదికలు తయారు చేసుకుంటున్నారు.

ఈ సూత్రం మతానికే కాదు, మానవ మనస్తత్త్వంతో సహా, ఆర్దికాది అన్నిరంగాలకీ వర్తిస్తుంది.

అందుకే, అంత జాగ్రత్తగా.... మద్యం, జూదం, రెడ్ టేపిజం వంటివి ప్రయోగించేది!

అందుకే, అంత జాగ్రత్తగా.... పైకి ముందుకు నడుపుతున్నట్లే కనిపిస్తూ, ప్రజాగ్రహాన్ని చల్లార్చి వెనక్కి నడిపించేది!

పత్రికల ఉద్దేశం ప్రజల్ని ముందుకు నడపటమే అయితే, అది 1992 లో జరిగిన దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమంలా ఉంటుంది.

ప్రతిపక్షాల ఉద్దేశం ప్రజల్ని ముందుకు నడపటమే అయితే, అది 1992లో కూల్చిన బాబ్రీ మసీదులా ఉంటుంది.

కాబట్టే... డేల్ కార్నీకి తాత మాదిరిగా, లేదా వందమంది డేల్ కార్నీలంతగా.... ప్రభుత్వం.... పత్రికలూ, ప్రచార సాధనాలు, ప్రతిపక్షాలు, సంపూర్ణ మద్దతుతో ‘ప్రజల్ని గోతిలో పడెయ్యటం ఎలా?’ అన్న వ్యూహాన్ని పరమ జాగరూకతతో అమలు చేస్తోంది.

మొత్తంగా.... ప్రజాస్వామ్య పరంగా, చట్టబద్దంగా, ఉన్న చట్టాలకు మార్పులు చేర్పులు చేసుకుని, కొత్త చట్టాలు తెచ్చుకుని.... అధికారికంగా కొనసాగిస్తున్న దోపిడి! ఆద్యంతం చట్టబద్దమే! కోర్టుల కెక్కినా వాళ్ళే గెలుస్తారు. కోర్టులూ అందులో భాగమే కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

బుజ్జిగాడి కలలు![ఉపనిషత్తులూ Vs ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం – 01]

Fri, 06/25/2010 - 23:53
సాయంత్రం అయిదు గంటలయ్యింది. బుజ్జిగాడు బడి నుండి పరుగెత్తుకు వచ్చాడు. రాగానే పుస్తకాల సంచి ప్రక్కన పడేసి, అమ్మని చుట్టేసాడు.

తల్లి మెడ చుట్టూ చేతులేసి వేలాడుతూ "అమ్మా! ఆకలేస్తోందే!" అన్నాడు.

అమ్మ నవ్వుతూ "టిఫిన్ చేసే ఉంచాను లేరా? వెళ్ళి పుస్తకాల సంచి గూట్లో పెట్టి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకు రా!" అంది.

బుజ్జిగాడు రివ్వున పరుగెత్తాడు. వాడు సిద్దమై వచ్చేసరికి అమ్మ పేట్లులో ఉప్మా తెచ్చి పెట్టింది. హుషారుగా వచ్చిన బుజ్జిగాడికి, ఉప్మా చూడగానే ఉసూరు మనిపించింది. "ఇదేమిటి? స్వీటు చెయ్యలేదా?" అన్నాడు.

"ఈ రోజు తీరిక దొరకలేదురా? రేపు చేస్తానులే!" అంది అమ్మ అనునయంగా.

"నిన్నా ఇదే చెప్పావు?" బుంగమూతి పెట్టాడు బుజ్జిగాడు.

"కుదర లేదు నాన్నా! రేపు తప్పకుండా చేస్తాను" అమ్మ నచ్చ చెప్పుతున్నట్లుగా అంది.

"నాకేం వద్దు పో! రోజూ ఇలాగే చెపుతున్నావు" అలిగి అవతలికి వెళ్ళిపోయాడు బుజ్జిగాడు.

అమ్మకీ విసుగేసింది. "రేపు చేస్తానంటే వినవేం? తింటే తిను! లేకపోతే పో!" అంది కోపంగా.

బుజ్జిగాడికి ఏడుపొచ్చేసింది. వెళ్ళి మంచమ్మీద బోర్లాపడుకున్నాడు. కాస్సేపు వెక్కివెక్కి ఏడ్చాడు. అలాగే నిద్రపోయాడు.

కాస్సేపటికి బుజ్జిగాడి నేస్తాలొచ్చారు. ఆడుకుందాం రమ్మన్నారు. ‘సర్లే ’ అనుకొని బుజ్జిగాడు వాళ్ళతో కలిసి బయలుదేరాడు. అంతా కలిసి ఊరి బయట తోటవైపు వెళ్ళారు. అంతా చెట్ల క్రింద ఆడుకుంటున్నారు. బుజ్జిగాడు ఒక్కడే తోటలో, ఓ వైపు మెట్లదారి వెంట వెళ్ళాడు.

ఆశ్చర్యం! వాడికో ఇల్లు కనబడింది.

ఇంటి ముందు ప్రహరీ అంతా బిస్కట్లతో కట్టారు. గోడలన్నీ మైసూర్ పాక్ లతో కట్టారు. కిటికీలు చూస్తే జాంగ్రీలు! నీటి గొట్టాల్లాగా జిలేబీలున్నాయి! పంపు తిప్పుతే పాయసం పడుతోంది! ఇంటి పైకప్పు గా ఖాజాలు పేర్చి ఉన్నాయి. తెల్లటి పాలకోవాలతో ఎంచక్కని మంచం పేర్చి ఉంది! కజ్జి కాయలు దిండ్లయి పోయాయి. పెద్ద అరిసె క్రింద జంతికల పుల్లలతో డైనింగ్ టేబుల్ అమర్చి ఉంది. బర్ఫీలతో టేబుల్ చుట్టూ కుర్చీలున్నాయి.

బుజ్జిగాడికి సంతోషంతో కేకలు వెయ్యాలనిపించింది. గుండెల్నిండా మిఠాయిల తీపి వాసన పీల్చుకున్నాడు. స్నేహితులందర్నీ పిలిచి ఆనందంగా మిఠాయిలు తిందామని, గొంతెత్తి పిలవబోయాడు.

"బుజ్జీ! నాన్నా బుజ్జీ! లేవరా?" ఎవరో భుజం పట్టుకుని ఊపుతుంటే కళ్ళు తెరిచాడు బుజ్జిగాడు.

ఎదురుగా అమ్మ నవ్వుతూ ఉంది. అమ్మ చేతిలో రవ్వాకేసరి ప్లేటు! నెయ్యి, జీడిపప్పులూ వేసి తియ్యటి వాసన వేస్తోంది.

"అమ్మా!" బుజ్జిగాడు ఒక్క ఉదుటున లేచి అమ్మను కౌగిలించుకున్నాడు.

అమ్మ బుజ్జిగాడి జుట్టు నిమిరి "తిను నాన్నా" అంది!

తియ్యటి రవ్వాకేసరి తింటూ బుజ్జిగాడు, తన కలనంతా వివరించి చెప్పాడు.

అప్పటికే ఇంటి కొచ్చిన నాన్న కూడా, బుజ్జిగాడి కల విని పకపకా నవ్వాడు.

గతంలో బుజ్జాయిలోనో, బొమ్మరిల్లులోనో చదివిన కథ ఇది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ కలల సిద్దాంతాలూ, ప్రశ్నోపనిషత్తులో కలల మీద చర్చలూ బుజ్జిగాడికి తెలియవు. అంతఃశ్చేతనకీ, కలలకీ మధ్య ఉన్న సంబంధం గురించి.... ఫ్రాయిడ్ కన్నా పిప్పిలాద మహర్షి చర్చ, నాకు మరింత అర్ధవంతంగా కన్పించింది. కలల గురించిన చర్చ మన వేదవేదాంగ వాంజ్ఞ్మయంలో చాలానే ఉంది.

సందిగ్ధ అసందిగ్ధాల మధ్య స్థితి ‘పొరపాటు’ అంటాడు ఫ్రాయిడ్. ఒక విషయం గురించి నిర్దిష్టంగా ఓ అభిప్రాయానికి లేదా నిర్ణయానికి రానప్పుడు, అలవోకగా.... మన మాటల్లో, చేతల్లో పొరబాట్లు దొర్లుతాయట. ఉదాహరణకి.... ఒక ప్రదేశానికి లేదా కార్యక్రమానికి వెళ్ళాలో వద్దో, ఇంకా నిర్దిష్టంగా నిర్ణయించుకోలేదనుకొండి. అలాంటి సమయంలో సదరు ప్రదేశానికి/కార్యక్రమానికి వస్తావా? అని ఎవరైనా మనల్ని అడిగారనుకొండి. తడబాటుతో కూడిన సమాధానమో లేదా పొరబాటు సమాధానమో చెబుతామట!

అలాగే అంతఃశ్చేతన లో అప్పటికే ముద్రవేసుకున్న విషయాలు కలలో ప్రతిఫలిస్తాయట. అయితే ఒకే కల పదేపదే రావటం, ఒకే కల నిద్ర మేల్కొన్నప్పుడు అంతరాయం పొంది, మళ్ళీ నిద్రించినప్పుడు కొనసాగటం [అంటే కల సీరియల్ అన్నమాట]... ఇలాంటి విన్యాసాల గురించి, ఎంతో ఆసక్తికరమైన చర్చలు.... ఇటు మన వేదాంగాలు అంటే ఉపనిషత్తులలోనూ, అటు పాశ్చాత్యుల రచనలలోనూ ఉన్నాయి.

‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అన్న మాటను ప్రక్కన బెడితే, ఎన్నో ఆధునిక శాస్త్ర సిద్దాంతాలకు, శాస్త్రీయ ఆవిష్కరణలకు.... మూలాలు, ఆలోచనా బీజాలు [Thought Provoking] మాత్రం, మన సంస్కృత వాంజ్ఞ్మయంలోనూ, వేద వేదాంగాల్లోనూ, పంచమ వేదమైన గీతలోనూ ఉన్నాయి. ఒకవేళ వాటికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానం సంస్కృతంలో ఉన్నదేమో తెలీదు.

ఎందుకంటే మన భారతదేశం ఎన్నో వేలసార్లు దోపిడికి గురయ్యింది. చాలా పుస్తకాలు జర్మనీ వంటి దేశాలకు చేరాయి. వాటి ఊసు కూడా ఎక్కడ చెప్పబడలేదు. చరిత్ర వక్రీకరించబడింది. జర్మనీలో సంస్కృత యూనివర్సీటీ కూడా ఉన్నది. చాలామంది జర్మన్లు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఉన్నదాన్ని మరుగు పరచి, నాశనం చేసి కొత్తగా దాన్నే శాస్త్రీయంగా [సైంటిఫిక్] ఆవిష్కరించటం ఎన్నోసార్లు, ఎన్నో రంగాలలో జరిగింది.

ఈ నేపధ్యంలో... సాధనతొ అందుకోవలసిన వాటిని కన్నెతైనా చూడకుండానే స్టేట్ మెంట్లిచ్చే వాళ్ళకి, దండేసి దండం పెట్టటం తప్ప, మరేం చెయ్యలేం.

వాళ్ళ ప్రచార బానిసత్వానికి వాళ్ళని వదిలేస్తే.... మన పిప్పిలాద మహర్షి, శ్వేతాశ్వతర మహర్షి వంటి వారు, మనకిచ్చిన విజ్ఞాన సంపద కంటే, పాశ్చాత్యుల ఆధునిక సిద్దాంతాలకు ఎక్కువ ప్రచారం రావటం మాత్రం, భారతీయత మీద సుదీర్ఘ కాలంగా జరుగుతున్న కుట్రలో భాగమే. ప్రశ్నోపనిషత్తులో ‘కల’ గురించిన చర్చ మరోటపాలో కొనసాగిద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

వర్తకుల నిజాయితీ – ముత్యపు చిప్పల కలలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 14]

Thu, 06/24/2010 - 22:43
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పోరేటిజంని, మరింత స్పష్టంగా అర్ధం చేసుకునేందుకు మరో పోలిక చెబుతాను. గతంలో ఒక టపాలో చెప్పిన పోలికకు దగ్గరగా అన్పించినా, మరింత స్పష్టమైన పోలిక! ఎలాగంటే -

భావవాదం మానవజాతికి తల్లివంటిది. కుటుంబంలో తల్లి, అందరి గురించీ శ్రద్ద తీసుకుంటుంది. అందరూ సంతోషంగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి ఆహారం, ఆహార్యం, ఆరోగ్యం గురించి ప్రత్యేకించి శ్రద్ద తీసుకుంటుంది. అందరికీ, వారి అభిరుచులూ, ఇష్టాఇష్టాలని దృష్టిలో ఉంచుకొని, ఆయా అవసరాలు సమకూరుస్తుంది. వండి వార్చి వడ్డిస్తుంది. పిల్లలు... అన్ని విషయాలూ నేర్చుకుంటూ పెరిగి పెద్దయ్యేలా కృషి చేస్తుంది.

అలాగే పదార్ధ వాదం మానవజాతికి తండ్రి వంటిది. తండ్రి, కుటుంబ భద్రత గురించి, పరువు మర్యాదల గురించి శ్రద్ద తీసుకుంటాడు. కుటుంబం శక్తివంతంగా, ధృడంగా ఉండేటట్లూ, ఆర్దికంగా బలంగా ఉండేటట్లు పాటుపడతాడు. ఆహారాది అవసరాలు తీరేందుకు కావలసిన వనరులన్నీ సమకూరుస్తాడు. పిల్లలు పెరిగి పెద్దయ్యేసరికి, సమాజంలో ఒక స్థాయికి చేరేలా కృషి చేస్తాడు.

అయితే కార్పోరేటిజం మానవ జాతి పట్ల వేశ్యాగృహ నిర్వాహకుల వంటిది. సమాజంలో కుటుంబం పట్ల తల్లిదండ్రులిద్దరూ బాధ్యత, బంధమూ కలిగి ఉంటారు. కుటుంబ శ్రేయస్సు, వృద్దీ కోసం పాటుపడతారు. కానీ వేశ్యాగృహ నిర్వాహకులకు మాత్రం, తమ చెప్పుచేతల్లో ఉన్న వేశ్యల పట్ల గానీ, తమ గృహనికొచ్చే విటుల[కష్టమర్ల] పట్ల గానీ, ఏ concern ఉండదు. వాళ్ళ శ్రేయస్సూ పట్టదు, ఆరోగ్యమూ పట్టదు. కేవలం తమ రాబడి మాత్రమే వాళ్ళకి ముఖ్యం! వాళ్ళకి ఏ నీతి నియమాలూ ఉండవు, దయా దాక్షిణ్యాలూ ఉండవు. తమ వ్యాపారమే తమకు ముఖ్యం. సరిగ్గా కార్పోరేటిజం ఇలాంటిదే!

ప్రాచీన భారత దేశంలో కూడా వర్తకులు ఉండేవాళ్ళు. ‘వర్తక శ్రేష్ఠి’, శెట్టిగార్లుగా పిలవబడే ఈ వర్గం, వాణిజ్యానికి సంబంధించి, కొన్ని నీతినియమాలతో వ్యవహారించేవాళ్ళు. వితరణశీలురుగా పేరెన్నిక గలవాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ప్రాచీన భారతం అంటే నా అర్ధం, ఈ గడ్డ మీదకి గజనీ మహమ్మదూ, ఘోరీ మహమ్మదూ, అల్లా ఉద్దీన్ వంటి ఎడారి దొంగలు ప్రవేశించి దోపిడులు చేయకముందు. ఆ దోపిడి సంపద పరంగానే కాదు, భావపరంగా కూడా!

ఇక రామాయణంలోనూ, భారతంలో నారద నీతి ప్రస్తావన లోనూ, వర్తక వర్గం గురించి స్పష్టమైన వివరణలున్నాయి. భట్టి విక్రమార్కుల కథల వంటి జానపద, చారిత్రకా, సంస్కృత సాహిత్యంలోనూ, వర్తక శ్రేష్ఠుల నిజాయితీ, నిబద్దతల గురించిన ప్రస్తావనలున్నాయి. గుప్తుల కాలంలో వర్తకులు, సముద్ర వ్యాపారం చేయటమే గాక, రాజుకి సైతం అప్పులూ, సలహాలూ ఇవ్వగల స్థితిలో ఉన్నారనడానికి ఆధారాలున్నాయి.

రైతులు పొలంలో పంట పండించటానికి పెట్టుబడి పెడతారు. పంటలు పండించేందుకు శారీరకంగా శ్రమిస్తారు. దానికనుగుణంగా వాళ్ళు లాభాలు పొంది తీరాలి. అది ధర్మం! ఏ రంగంలోనైనా కూలీలు శరీరశ్రమ పెట్టుబడిగా కష్టపడతారు. అందుకనుగుణంగా వాళ్ళు భత్యాలు పొందాలి. అది ధర్మమే! వైద్యులూ, ఉపాధ్యాయులూ, న్యాయవాదులూ, ఉద్యోగులూ.... శారీరకంగా, మేధోపరంగా శ్రమిస్తారు. వారి సేవలకనుగుణంగా వాళ్ళు రాబడి పొందాలి. ఇదీ ధర్మమే!

అదే విధంగా.... వాణిజ్య సంస్థలు కూడా, వస్తు ఉత్పత్తికీ, విక్రయాలకీ, సేవల రంగంలో పెట్టుబడి పెడతారు. శారీరకంగా, మేధోపరంగా శ్రమిస్తారు. దానికి తగినంతగా వాళ్ళు లాభాలు పొందితే అది ధర్మం. అంతేగానీ 100% లాభాలు పొందాలనుకోవటం, పెట్టుబడికి పదింతలు లాభాలు పొందేందుకు వ్యూహాలు పన్నటం, దగాలు చేయటం అధర్మం. పరమ నీచం!

ప్రాచీన కాలంలో వర్తకులు సమాజానికి కట్టుబడి, లోబడి ప్రవర్తించేవాళ్ళు. నలుగురూ తమ గురించి చెడుగా అనుకోకూడదన్న భయమూ, దైవం శిక్షిస్తాడనే భయమూ భక్తీ ఉండేవి. [ఇప్పటి కార్పోరేట్ల వంటి నాస్తిక ప్రబుద్దులూ కొందరుండేవాళ్ళనుకొండి. ధనబలంతో దైవాన్నే ధిక్కరించిన అలాంటి వాళ్ళనే మనం రాక్షసులనే వాళ్ళం. ఇంకొందరిది కుహనా భక్తివాదం.]

రాజ శాసనాల కంటే.... సంస్కృతి, మతం ఏర్పరచిన నీతి నియామలే.... ఎక్కువగా వర్తక వర్గాలనీ, ప్రజలనీ కూడా నియంత్రించేవి. స్వయం సిద్దంగానే వర్తకులు, తమ లాభాలలో కొంత భాగాన్ని సమజ శ్రేయస్సుకీ, వితరణలకీ వెచ్చించే వాళ్ళు. పేదలకు దానధర్మాలు చేయటం ‘పుణ్యసంపాదన’ అనుకొని చేసేవాళ్ళు. ‘తమ రాబడిలో ఇంత వాటా కేటాయించి, పుణ్యాకార్యాలు చేయాలన్నట్లుగా’ వ్యవహరించటం కద్దు!

కాబట్టే ఎడారి దొంగలూ, సముద్రపు దొంగలూ ఈ గడ్డ మీదికి రాకముందు, ఎంతో కొంత మెరుగైన ప్రశాంతతో, సమన్వయ సామరస్యాలతో, నాటి ప్రజలు బ్రతికారు. ఇది చరిత్ర కారులు సైతం ఉల్లేఖించిన సత్యం!

ఈ నేపధ్యంలో ఆహ్లాదకరమైన కథ ఒకటి ఇప్పుడు చదవండి. ఇది నేను, చాలా సంవత్సరాల క్రితం ‘చందమామ’ లో చదివాను.

అనగా అనగా....

ఒక రేవు పట్టణంలో, మాణిక్య శెట్టి అనే పేరొందిన వర్తకుడుండేవాడు. అతడు ఎంతో ధనవంతుడో అంత దయగలవాడు.

ఒకనాడతని దగ్గరికి, పదిహేనేళ్ళ కుర్రవాడొకడు వచ్చాడు. మాణిక్య శెట్టికి నమస్కరించి ఆ కుర్రాడు "అయ్యా! నా పేరు కరుణాకర శెట్టి. నా తండ్రి నా చిన్నతనంలోనే గతించాడు. నా తల్లి వృద్దురాలు. ఇప్పటికే నా కోసం శ్రమపడుతూ ఉంది. ఆమెకా శ్రమ తగ్గించాలని నా కోరిక. నా దగ్గర రెండు వెండి నాణాలున్నాయి.

మిమ్మల్ని అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది. అయినా పరిస్థితుల ప్రాబల్యం వల్ల మిమ్మల్ని అడిగేందుకు సాహసిస్తున్నాను. ఈ సారి మీరు, వర్తకం రీత్యా ఇతర సీమలకు వెళ్ళినప్పుడు, ఈ రెండు వెండి నాణాలతో నా కోసం ఏదైనా ఆకర్షణీయమైన, పనికి వచ్చే వస్తువుని కొనితెండి. దానితో నేను ఏదైనా పని కానీ, వ్యాపారం కానీ చేసి, నా తల్లిని పోషించుకుంటాను. దయ చేసి నాకీ సహాయం చెయ్యండి" అన్నాడు.

మాణిక్య శెట్టికి కరుణాకరుడి పట్ల చాలా కరుణ కలిగింది. అతడి వంక దయగా చూస్తూ "అబ్బాయి! నీకు పని ఇస్తాను. నాతో పాటు వర్తక పర్యటనకు వచ్చి , నా పనుల్లో సహకరించు. నీవు కోరినంత జీతం ఇస్తాను" అన్నాడు.

కరుణాకరుడు వినయంగా "అయ్యా! మీ దయకు కృతజ్ఞుణ్ణి. అయితే నన్ను క్షమించండి. నా తల్లి వృద్దురాలు. పైగా జబ్బుతో ఉన్నది. నేనామెకు దగ్గరుండి పరిచర్యలు చేయాలి. ఆమెని ఒంటరిగా వదిలి రాలేను. అందుకే నా కోసం ఏదైనా కొనితెమ్మని, మిమ్మల్ని అర్ధించవలసి వచ్చింది" అన్నాడు.

అతడి మాట తీరుకు మాణిక్య శెట్టి ముగ్దుడైనాడు. అతడి అర్దింపుని మన్నించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే, మాణిక్య శెట్టి వర్తక పర్యటనకై ఓడ మీద బయలుదేరాడు. వాణిజ్యానికి సంబంధించిన హడావుడిలో మునిగిపోయాడు. తిరుగుప్రయాణ సమయంలో, అతడికి కరుణాకరుడి అర్దింపు గుర్తుకు వచ్చింది.

అతడు వస్తు విక్రయ బజారులలో, కరుణాకరుడిచ్చిన రెండు వెండి నాణాలతో ఏదైనా కొందామని చూశాడు. రెండు వెండినాణాలకు కొనదగిన ఆకర్షణీయమైన వస్తువులేవీ అతడికి కనిపించలేదు. అతడికి కరుణాకరుడిని తలుచుకొని జాలి అన్పించింది. అంతలో అతడికి కొన్ని కోతులు అమ్మకానికి కనిపించాయి. కరుణాకరుడికి ఇవ్వడానికి కోతి తగినదని మాణిక్య శెట్టి కి తోచింది. కోతికి కరుణాకరుడు కొన్ని విచిత్ర విన్యాసాలు గానీ, చెట్టెక్కి కొబ్బరికాయలు కోయటం వంటి విద్యలు గానీ నేర్పి, డబ్బు సంపాదించు కోగలడని భావించి, అతడు కోతిని కొందామనుకున్నాడు.

అయితే కోతులమ్మేవాడు, ఎంత బేరం చేసినప్పటికీ, రెండువెండి నాణాలకి, నిద్రకి జోగుతున్న ఓ ముసలి కోతిని తప్ప, చురుకుగా ఉన్న కోతులని ఇవ్వనే ఇవ్వనన్నాడు. చేసేదేం లేక, మాణిక్య శెట్టి ఆ ముసలి కోతినే కొని, ఓడలో ఓ మూలన కట్టేసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఎప్పుడు చూసినా, ఆ కోతి గమ్మున కునికిపాట్లు పడుతూ ఉండింది. పెట్టింది తిని మూలన పడుకునేది. ఇక దాన్ని కట్టేయటం కూడా అనవసరం అని, పనివాళ్ళు దాన్ని కట్టేయటం మానేసారు.

మాణిక్య శెట్టి ఆ కోతిని చూసి కొంత నిరుత్సాహ పడ్డాడు. ఇలా ఉండగా ఆ ప్రయాణంలో, వాళ్ళ ఓడ ముత్యాల దీవిని చేరింది. అక్కడ తీరంలో మంచి ముత్యాలు దొరుకుతాయని ప్రసిద్ది.

దేశదేశాల నుండి వచ్చిన వ్యాపారులు, అక్కడి జాలర్లకు, ఈతగాళ్ళకు డబ్బిచ్చి, ముత్యపు చిప్పలు ఏరుకురమ్మని సముద్రంలోకి పంపటంలో తలమునకలయ్యారు. ముత్యాల దీవిని ఓడ చేరిన క్షణంలో, అప్పటి దాకా నిద్రకు జోగుతున్నట్లు మూలన పడుకున్న కోతిలో చెప్పలేనంత చలనం వచ్చింది. ఒక్కసారిగా సముద్రంలోకి దూకి, క్షణాల్లో లోతులకి వెళ్ళి, చేతుల నిండా ముత్యపు చిప్పలతో తిరిగి వచ్చింది. వాటిని ఓడలో ఓ మూలన ఉంచి, తిరిగి ఉత్సాహంగా సముద్రంలోకి దూకింది.

అలా కొద్దిసమయంలోనే ఆ కోతి, చాలా ముత్యపు చిప్పల్నే ఏరుకొచ్చింది. బాడుగకు వచ్చిన గజ ఈతగాళ్ళ కంటే చాలానే పోగేసింది. అది చూసి మాణిక్య శెట్టి, ఆ కోతికి ముత్యపు చిప్పలని ఏరటంలో శిక్షణ ఇవ్వబడిందని అర్దం చేసుకున్నాడు. ‘అది ఎలాగో కోతులమ్మే వాణ్ణి చేరి ఉంటుంది. అందుకే అదెప్పుడూ నిరుత్సాహంగా, ఓ మూలన కూర్చునేది. ఎప్పుడైతే తనకు అలవాటైన, తర్ఫీదు ఇచ్చిన పని కనబడిందో, అప్పుడు ఉత్సాహంగా పనిలోకి ఉరికింది’ అనుకున్నాడు.

మాణిక్య శెట్టికి సంతోషం కలిగింది. అయితే అతడు ఆకోతిని గానీ, అది పోగేసిన ముత్యపు చిప్పల్ని గానీ, తన స్వంతం చేసుకోవాలనుకోలేదు. అప్పటికే కోతి చాలా ముత్యపు చిప్పల్ని తెచ్చి కుప్పబోసింది.

తర్వాత వాళ్ళు తమ పట్టణానికి తిరిగి వచ్చారు. వాళ్ళ రాక గురించి తెలుసుకున్న కరుణాకరుడు, మాణిక్య శెట్టిని కలుసుకున్నాడు. మాణిక్యశెట్టి "అబ్బాయి! నువ్వు అదృష్టవంతుడివి. నువ్విచ్చిన రెండు వెండి నాణాలతో ఏ వస్తువూ లభించలేదు. దాంతో నేను నీ కోసం ఓ కోతిని కొన్నాను. అయితే అది నీ అదృష్టం కొద్దీ, ముత్యపు చిప్పల్ని సేకరించటంలో శిక్షణ నివ్వబడ్డ కోతి అయ్యింది. మేము తిరుగు మార్గంలో ముత్యాల దీవిని చేరాము. నీ కోతి, చాలా ముత్యపు చిప్పల్ని ఏరుకొచ్చింది. ఇదిగో నీ కోతి, అది వెదికి తెచ్చిన ముత్యపు చిప్పలు! వీటిని తీసుకుని వ్యాపారం చేసుకో!" అంటూ కోతినీ, ముత్యపు చిప్పల్నీ అప్ప చెప్పాడు.

కరుణాకరుడు ఇది విని ఎంతో సంతోషించాడు. కోతినీ, ముత్యపు చిప్పల కుప్పనీ చూసి, ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత "అయ్యా! మీరు నాపట్ల ఎంతో దయ చూపించారు. మీరీ కోతిని నా డబ్బుతోనే కొని ఉండవచ్చుగాక! కానీ దానిని కొనాలని నిర్ణయించింది మీరే! కాబట్టి ఇది మీ అదృష్టం కూడా అయి ఉండవచ్చు. ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ దాచి, కోతినీ, అది తెచ్చిన ముత్యాలనీ మీ దగ్గరే ఉంచుకొని, నాకు మరేదైనా ఇచ్చినా, మిమ్మల్ని అభ్యంతరం పెట్టే వారెవ్వరూ లేరు. కేవలం మీ నిజాయితీ వల్లనే నా కిదంతా దక్కింది. కాబట్టి ఈ ముత్యాలలో సగం మీరు తీసుకొండి. మిగిలిన వాటితో నేను వ్యాపారం చేసుకుంటాను" అన్నాడు.

మాణిక్య శెట్టికి కరుణాకరుని చూస్తే ఎంతో ముచ్చట కలిగింది. చిన్నవాడే అయినా... అతడి విశ్లేషణా, ఆలోచనా ధోరణి, నిజాయితీ ఎంతగానో నచ్చాయి. మాణిక్య శెట్టి బాగా ఆలోచించాడు. అతడికి ఒక్కగానొక్క కుమార్తె. కరుణాకరుడిని, అతడి తల్లిని చేరదీసి, తన ఇంట్లోనే ఉంచుకొని, కరుణాకరుడికి విద్యాబుద్దులు నేర్పించాడు. దాంతో పాటు వ్యాపార మెళకువలు కూడా! కరుణాకరుడిని ఆ విధంగా ప్రోత్సాహించి పెంచి, తన ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేశాడు.

తదుపరి కాలంలో కరుణాకరుడు మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. మాణిక్య శెట్టి మనుమలతో అడుకుంటూ విశ్రాంత జీవితాన్ని హాయిగా గడిపాడు.

ఇదీ కథ!

ఈ కథ రచయిత లేదా రచయిత్రి పేరు నాకు గుర్తులేదు. ఎవరైతేనేం? ఈ కథ ఒక భారతీయుడిది. ఒక ఆశావాదిది. ఒక భావవాదిది. ఈ కథలో రచయిత/రచయిత్రి, వర్తకులలో మంచితనం, కరుణ, నిజాయితీ ఉండాలని కాంక్షించారు. అదీ భారతీయ తత్త్వం! అనాదిగా భారతీయులు.... మంచి గురించి ఆలోచించారు, మంచి గురించి కలలు కన్నారు, మంచి గురించి కాంక్షించారు. ఎవరూ కలుషితం చేయకపోతే, ప్రాధమికంగా మనిషి మంచివాడే. ఏ దేశీయులైనా మంచినే కోరతారు. మంచిగానే ఉండాలనుకుంటారు.

అయితే, తరాల తరబడి, శతాబ్దాలుగా, నకిలీ కణిక అనువంశీయులూ, వాళ్ళ అనుచరులూ సహచరులూ.... ప్రచారిస్తూ ‘మంచి గురించి ఆలోచించటం, కలలు కనటం, ఆశించటం’ వంటి భావవాదం.... అవాస్తవిక దృక్పధం అని ప్రజలకి నూరి పోసారు. దాంతో మరింతగా మానవసంబంధాలు దెబ్బతిన్నాయి, దెబ్బతింటున్నాయి. మానవీయ విలువలదీ అదే స్థితి!

తమ గూఢచర్య వ్యూహాలతో, మంచి కోసం ప్రయత్నించే వారి జీవితాలని విఫలం చేసి మరీ, తమ ప్రచారాన్ని మరింత పెంచి, పదే పదే అదే ప్రచారంతో ‘నల్లమేక నలుగురు దొంగలు’ కథలో లాగా.... ప్రజల్ని ‘భావవాదం చేతగాని వాళ్ళు చెప్పే మాటలు. అవి వినటానికే బాగుంటాయి. ఆచరించటానికి కాదు’ అంటూ నమ్మించారు, నమ్మించ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మంచితనం అంటేనే మానసిక రుగ్మత మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

పుకార్లతో చీరల వ్యాపారం - వీరప్పన్ వ్యవహారం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 13]

Thu, 06/24/2010 - 00:11
తమ వ్యాపారాభివృద్ది కోసం కార్ఫోరేట్ సంస్థలు, దేశభక్తి వంటి ప్రజల మనోభావాల మీదే కాదు, మానసిక బంధాల మీద, ఇతర భావోద్రేకాల మీద కూడా స్ట్రాటజీలు, పుకార్లు ప్రయోగిస్తారు.

ఉండీ ఉండీ హఠాత్తుగా ఓ ప్రచారం ఊపందుకుంటుంది. ‘అందరూ ఇలా అనుకుంటున్నారు’ అని ఎవరికి వాళ్ళే అంటారు. అలాగే మీడియా కూడా ప్రచారిస్తుంది. ఆ ‘అనుకోవడాలు’ ఎలాంటి వంటే... ఫలానా బొమ్మ లేదా ఫలానా వస్తువు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తోందని - ఇలాగన్న మాట. మనీ ప్లాంట్ పెంచితే, ఆ మొక్క పెరిగినట్లుగా సంపాదన పెరుగుతుందని, ఓ అర్ధ శతాబ్దం క్రితం వచ్చిన ప్రచారంతో, ఆకుపచ్చని పెద్ద ఆకులతో కూడిన ‘లత’ ఇంటింటా ప్రాకింది. ఇలాంటి వాటిలో అప్పుడెంత వ్యాపారం జరిగిందో తెలీదు గానీ, ఇంటి ముంగిట పచ్చదనం కాబట్టి నష్టం లేదు.

అయితే ఇలాంటిదే.... ఫలానా బొమ్మ లేదా xyz వస్తువు - అంటే, ఇక ఆ బొమ్మ లేదా వస్తు విక్రయాలు ఎంత ఊపందుకుంటాయో ఊహించండి. పోనీ, అలాగని ఆ బొమ్మ ఏదో, మన కొండపల్లి బొమ్మో, నిర్మల్ బొమ్మో ఉండదు. పక్కాగా ప్లాస్టిక్ బొమ్మో లేదా కార్పోరేట్ కంపెనీ ఉత్పత్తి చేసే బొమ్మో అయి ఉంటుంది. ఫిష్ ఎక్వేరియంలో గోల్డ్ ఫిష కూడా అలాంటిదే! vada ఫోన్ వాణిజ్యప్రకటనలో ఉన్న కుక్క జాతికి అమాంతం డిమాండ్ పెరగలేదూ, అలాగన్న మాట.

అలాంటి చోట, సదరు బొమ్మ లేదా వస్తువు ఉత్పత్తి తక్కువ చేసారనుకొండి. ఇక లభ్యత తక్కువైనప్పుడు సంభవించే డిమాండు ఎంతగా ఉంటుందో? అమ్మకాలు నల్ల బజారుకి వెళ్ళినా ఆశ్చర్యం ఉండదు.

మరో విషయం... చిన్నప్పుడు గుడ్డ ముక్కలతో మేం బొమ్మలు కుట్టుకుని, నల్లదారాలతో జుట్టుకుట్టేవాళ్ళం. అలాంటిదే అందంగా ఉన్న ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ గురించి. దాని కుటుంబసభ్యులూ, బాయ్ ఫ్రెండ్సూ, ఇల్లూ ఫర్నిచర్! పిల్లల్లో ఎంత ప్రచారమో, ఎంత మోజో! ఏటా ఇన్ని మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందనీ, ప్రపంచవ్యాప్తంగా సెకనుకి ఇన్ని బార్బీబొమ్మలు అమ్ముడౌతున్నాయనీ మీడియా చేసే ప్రచారాలు... ఇలాంటివే!

క్రమం తప్పకుండా, ఎవరూ గమనించని నిర్ణీత కాల వ్యవధులలో... వివాహిత అన్నా చెల్లెళ్ళు, లేదా అక్కా తమ్ముళ్ళ గురించి ఒక పుకారు/ప్రచారం వస్తుంటుంది. అదేమిటంటే - పెళ్ళయిన అక్కలు తమ తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళు తమ అన్నల్ని పిలిచి భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టాలనీ, బదులుగా అన్నలూ చెల్లెళ్ళకు, శక్తి కొద్దీ బహుమతులతో పాటు కొత్త చీర పెట్టాలనీ, లేకపోతే ఇరువురుకీ అరిష్టం అనీ! ఎందుకలాగా అంటే - "ఏమో ఈసారి నక్షత్రాలు అలా వచ్చాయట" అనే అరగొర సమాధానం వస్తుంది. ఎవరికీ ఏదీ ఇదమిద్దంగా తెలియని స్థితి!

"సరే! పోనీలే! పెట్టేది మన తోడబుట్టిన వాళ్ళకే గదా! ఈ పేరుతో నన్నా బంధాలు గట్టిపడతాయి" అనుకుంటాము మనం. ఖర్చు నిభాయించుకోగలిగిన వాళ్ళకి బాధ లేదు. అప్పటికే ఆర్దికంగా అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళకి, తప్పని సరి కావటంతో, ఇది ఆర్దిక భారమే!

అలాంటి చోట బంధాలు గట్టిపడటం కన్నా.... అసంతృప్తితో మాటల ఈటెలు రేగటం కూడా, అక్కడక్కడా జరగటం పరిపాటే! ఇదంతా ప్రక్కన బెడితే... ఈ పుకార్లతో, చందన బొమ్మన వంటి కార్పోరేట్ వస్త్రదుకాణాలకి పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తుంది. చిన్న దుకాణాల వారికి అమ్మకాలు పెరిగాయన్నా కూడా, అంతిమంగా ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం నడిచేది, కార్పోరేట్ టెక్స్ టైల్స్ సంస్థలు రిలయల్స్ లూ గట్రాలకే గదా?

ఇలాంటి ఉదాహరణలు కొకొల్లలు. ఎవరి కన్నూ పడకుండానే, అందరి మీదా అనవసర భారాలు పెంచుతూ, చాపక్రింద నీరులా ఆక్రమించి, జీవితాలు తడిచి మోపెడవుతాయి.

ఇక తమ వ్యాపారాభివృద్ది కోసం ప్రజలలో పెంచే వ్యసనాలకు తక్కువేం లేదు.

వెనకటికి మహాకవి శ్రీశ్రీ ‘కాదేదీ కవిత్వానికనర్హం’ అన్నాడు. కార్పోరేట్ కంపెనీలు ‘కాదేదీ వ్యాపారానికనర్హం’ అంటారు. అలాంటి వాటిల్లో జూదం, మద్యం వంటి వ్యసనాలది పెద్ద వాటా!

అసలు ప్రజలు వ్యసన పూరితులౌతున్నారంటేనే, సమాజం పతన దిశలో ఉందని అర్దం! మద్యపు అమ్మకాలు ఎక్కువైనాయంటే - ప్రజలపై వత్తిడి ఎక్కువ ఉందని సామాజిక శాస్త్రవేత్తలంటారు.

ఈ నేపధ్యంలో ... బెట్టింగ్ వ్యాపారం గురించి పరిశీలిద్దాం. క్రికెట్ లో ఈ వ్యాపారం మరింత పరిమాణంలో నడుస్తుంది. ఇటీవల సునంద పుష్కర్, శశిధరూర్ Vs లలిత్ మోడి వివాదాలతో మరోసారి హోరెత్తిన క్రికెట్ బెట్టింగ్ వ్యాపారంలో.... పాకిస్తాన్, ఐఎస్.ఐ.లు నిలబెట్టిన బొమ్మ దావూద్ ఇబ్రహీం, చేయితిరిగిన వాడన్న దుర్గంధం వెల్లువెత్తింది. అసలా ఐఎస్ ఐ, పాకిస్తాన్ లే.... నకిలీ కణిక అనువంశీయ గూఢచర్య వ్యవస్థ నిలబెట్టగా, సీన్ ఇవ్వగా, నిలబడిన బొమ్మలు!

పోతే... క్రికెట్ ఆటలో ఏ జట్టు గెలుస్తుందో ముందుగా ఊహించి పందేలు కట్టటమే బెట్టింగ్ వ్యాపారం. ఫలానా జట్టు గెలుపు లేదా ఓటమి అవకాశాలు ఇలా ఉన్నాయంటూ.... పుకార్లూ, ప్రచారాలూ, మీడియాలో సొల్లు విశ్లేషణలతో, బ్రహ్మడంగా జరిపించుకోగల వ్యాపారం బెట్టింగ్! ప్రజల్లో పందాలు కట్టే ఆసక్తినీ, ఉత్కంఠనీ రేపే విధంగా, మ్యాచ్ ఫిక్సింగ్ లతో రసకందాయంగా క్రికెట్ నాటకాన్ని నడిపించవచ్చు. వ్యక్తిగత స్కోర్ల మీద సైతం ఇదే దర్శకత్వం, మరింత వైవిధ్యభరితంగా సంఘటనలని జరిపించగలదు. ‘ఈ మ్యాచ్ లో లేదా సీరిస్ లో, ఫలానా ఆటగాడు ఫలానా రికార్డు చేరగలడా? లేదా?’ అన్న ఉత్కంఠ లేపితే చాలు, ఎంత వ్యాపారమో!

ఇక చిట్టచివర ఏ జట్టు గెలిస్తే.... అప్పటి వరకూ కట్టబడిన పందాలలో తమకి లాభమో, ఆ ప్రకారం గెలుపోటములు, క్రీడా మైదానంలో గాక, కంప్యూటర్ ముందు నిర్ణయించుకుంటారు.

ఈ బెట్టింగ్ వ్యాపారం క్రికెట్టు వంటి ఆటలతోనే గాకుండా, సెలబ్రిటీల జీవిత సంఘటనల మీద కూడా నడుస్తోందంటే - వ్యాపారంలోని అమానుషత్వం అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకి ‘సానియా మీర్జా వివాహం జరుగుతుందా? లేదా?’ వంటివి.

ఆ బెట్టింగ్ నిర్వాహకుల లాభనష్టాలని బట్టి, సదరు సెలబ్రిటీల జీవన పరిణామాలున్నా ఆశ్చర్యపోవలసింది లేదు. అదృష్టవశాత్తూ అంతటి స్థితి ఇప్పటికి వచ్చి ఉండకపోవచ్చు.

వ్యసనాలలో, ఈ బెట్టింగు వ్యసనం లాంటివి మరికొన్ని ఉన్నాయి. పాన్ పరాగ్, సిగరెట్, శీతల పానీయాలు, మత్తు పానీయాలు. చివరికి సెల్ మోడల్స్ ని మార్చడం కూడా! అశ్లీల చిత్రాల్ని చూడటం, మాదక ద్రవ్యాల వాడటం మరింత తీవ్రమైనవి. మీడియా వాటికిచ్చే కవరేజ్, వాటిని మరింత పాపులర్ చేయటానికే తప్ప, నిర్మూలించటానికి అన్నట్లు ఉండదు.

శీర్షికలు మాత్రం, సమాజంలో నెలకొన్న ఈ స్థితి పట్ల మీడియా విచారం వెలిబుచ్చుతున్నట్లే ఉంటుంది. 1992 కు ముందరైతే చాలా సినిమాలలో... స్కూళ్ళలో, కాలేజీలలో విద్యార్ధులంతా, బ్రౌన్ షుగర్ వంటి మాదకద్రవ్యాలు వాడుతున్నారన్నట్లే చూపబడేవి. అవి ఎలా దొరుకుతాయో, ఎలాంటి నెట్ వర్క్ వాటి అమ్మకాల వెనక ఉంటుందో, అందులో లాభాలెలా ఉంటాయో, ఆ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించవచ్చో.... ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, వివాదాలు.... సదరు సినిమాలలో, మీడియా ప్రచారంలో ఉండేవి.

సినిమా అంతా ‘హింస, శృంగారాలు’ చూపించి, చివరలో ముక్తసరిగా, మొక్కుబడిగా ‘ఇదంతా తప్పు’ అంటూ ఓ నీతి వాక్యం జోడించినట్లుగా ఇదంతా ఉండేది. ‘ఆయా మాదక ద్రవ్యాలు వాడితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఓ సారి ప్రయత్నం చేద్దామా’ అని కుతుహలం రేపేటట్లుగానే ఉండేది చిత్రీకరణ!

1992లో, ఢిల్లీలో రోడ్డు ప్రక్కన కూర్చున్న యువకుడు, కాగితం మీద వేసుకున్న మాదకద్రవ్యాన్ని, మరో కాగితపు గొట్టంతో పీల్చడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాను. దాన్ని ‘హంటింగ్’ అంటారని అప్పటికే సినిమాలలో చూసి ఉన్నాను.

ఇదంతా ఎంతో చక్కగా ప్రొజెక్ట్ చేసే మీడియా, అలాంటి మాదకద్రవ్య స్మగ్లింగ్ నీ, వినిమయాన్నీ నిరోధించటానికి ప్రభుత్వం ఏం చేస్తోందో, ఏం చెయ్యాలో చెప్పేది కాదు. ప్రజలు ఆ దుష్టపరిణామాలకి ఎలా స్పందించాలో చెప్పేది కాదు. పిల్లలు వాటి బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి అన్న దానిమీద, అప్పుడప్పుడూ మాత్రం, నిపుణుల కౌన్సిలింగ్ లు వేసేది.

ఇంకా ఇప్పుడు ఆ విషయమై మీడియా దూకుడు కొంత తగ్గింది. అప్పట్లో అయితే.... ఒక దశలో, ఆనాటి పెద్దలు, యుక్తవయస్సులో ఉన్న తమ పిల్లల్ని విద్యాసంస్థలకి[ఢిల్లీ, ముంబై లాంటి చోట], యూనివర్సీటీలకి పంపటానికి కూడా సందేహించారు. ఎంతో ఆశ్చర్యం గొలుపుతూ మీడియా ఈ విషయంలో పాజిటివ్ ముఖం పెట్టుకుని నెగిటివ్ రోల్ పోషించింది.

అచ్చంగా ఇప్పుడు.... నేరాలు-ఘోరాలు, క్రైం రిపోర్ట్, క్రైం స్టోరీ గట్రా శీర్షకలతో, సమాజంలో జరిగిన నిజ జీవిత నేరాలని, ఉద్రేకభరితంగా ప్రజెంట్ చేస్తుంది చూడండి. సరిగ్గా అదే స్ట్రాటజీ అప్పుడూ ప్రయోగించింది.

ఇదే స్ట్రాటజీ.... చందనం, కలప స్మగ్లర్ వీరప్పన్ విషయంలోనూ పాటించారు. విషయాంతరమే అయినా, ఆ స్ట్రాటజీ ఇక్కడ ప్రసావనార్హమే! కలప దొంగ వీరప్పన్ కౄరుడు, నీచుడు! ఎందరో అమాయకుల్ని, పోలీసుల్ని చంపాడు. దేశ ద్రోహి, నేరగాడు!

అలాంటి వాడి గురించి మీడియా ఎన్ని విశేషాలు వ్రాసేదో! అతడికి కోతి రక్తమంటే ఇష్టమనీ, పచ్చినెత్తురు తాగుతాడనీ! చిత్తం వచ్చినట్లు ప్రవర్తించే మూడీ ఫెలో అనీ, మొండి వాడనీ! ఎవరికీ చిక్కని చాకచక్యం అతడి సొంతమనీ! నిజానికి, అడవి నుండి అతడు పంపే సరకు, బయట కొనే నాగరిక నేరగాడెవడో ఉండి ఉండాలి కదా!?

వీరప్పన్ అడవిలో ఉండే రాక్షసుడైతే, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్న రాక్షసులు. అలాంతి రాక్షసులెవరి సహాయసహకారాలో లేకుండా వీరప్పన్, తన దొంగ వ్యాపారం ఎలా చేసేవాడు? సంపాదించిన సొమ్ముతో జీవితాన్ని ఎలా ఆనందించే వాడు? అడవిలో పచ్చినెత్తురు తాగేవాడికి అంత డబ్బు సంపాదించినా ఒకటే, సంపాదించక పోయినా ఒకటే కదా!

స్టార్ హోటల్ లో చైనీస్ దగ్గరి నుండి అన్నిదేశాల వంటకాలు రుచి చూస్తూ జీవితాన్ని ఆనందించనపుడు, ఊరికే ఎందుకు డబ్బు సంపాదిస్తాడు? అందునా నేరాలు చేసి మరీ? అలాంటప్పుడు బయట నుండి వ్యాపార, అధికార, రాజకీయ వర్గాల నుండి వీరప్పన్ లాంటి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు ఉండి ఉండాలి.

నిజానికి వీరప్పన్ లే కాదు, చాలామంది అటువంటి అజ్ఞాత జీవితం గడిపే నేరగాళ్ళు, టెర్రరిస్టులూ.... ప్రచ్ఛన్న నామాలతో, ప్రచ్ఛన్న వేషాలతో, సీమాంతరాల్లో పంచతారల అతిధిగృహ సత్కారంలో ఆనందిస్తారని, తర్వాతి రోజుల్లో [1992 తర్వాత] వెల్లడి అయ్యింది. అలాంటి నేరగాడే కత్తుల సమ్మయ్య అనేవాడు, విమానం ఎక్కబోతూ, బాంబు హెచ్చరికతో జరిగిన తోపులాటలో మరణించటంతో ఈ విషయం దృష్టాంతపూరితం అయ్యింది. చందానగర్ హోటల్ గదిలో బాంబు పేలి గాయపడ్డ మొద్దు శీను వ్యవహారంతో అలాంటివి మామూలైపోయాయి.

ఇలాంటి నేపధ్యం వెనక నుంచుకొని కూడా, మీడియా, అడవి దొంగ వీరప్పన్ గురించి ఎంతో ఉద్వేగ పూరితంగా వ్రాసేది. సదరు వీరప్పన్ ని, నక్కీరన్ పత్రిక గోపాలన్ తప్ప మరెవ్వరూ కలుసుకోలేక పోయేవాళ్ళు. అతడి ఉనికి తెలిసినా, గోపాలన్, వీరప్పన్ పట్లే నిబద్దతతో ఉండేవాడు తప్పితే, ఆ నేరగాడి చిరునామా ప్రభుత్వానికి చెప్పేవాడు కాదు.

‘చెబితే ఈసారి వీరప్పన్ తనకి కూడా ఇంటర్యూ ఇవ్వడట. దాంతో అసలే సమాచారమూ తెలియకుండా పోయే ప్రమాదం ఉందట!’ ఎంత చక్కని పైకారణమో![over leaf reason]

ఇలాంటి సొల్లు కారణాలు చెబుతూ మీడియా, ఎంతో చక్కగా తన బాధ్యతలు విస్మరించింది. హక్కుల్ని మాత్రం ఎలుగెత్తి అరిచి సాధించుకునేది. ఎటూ వేదకాలంలో మునుల్ని గౌరవించినట్లు, ప్రజలు మీడియాని గౌరవిస్తారు, నమ్ముతారు. స్వాతంత్ర సమర సమయంలో కూడా, మీడియా ఒక పవిత్ర బాధ్యతని ఎంతో బలంగా, నిజాయితీగా నెరవేర్చింది. అందుకే ప్రజలు మీడియాని నిస్సందేహంగా నమ్ముతారు. అందుకే నకిలీ కణిక వ్యవస్థ, మీడియా ముసుగు వేసుకున్నది!

ఇక వీరప్పన్ వ్యవహారాన్ని ఇంతటితో ఆపి, తమ వ్యాపారం కోసం వ్యసనాలు పెంచే కుట్ర దగ్గరికి తిరిగి వస్తే.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ప్రపంచవ్యాప్తంగా ఈ మాదకద్రవ్య వ్యాపారం నిర్వహిస్తుంది. ఆఫ్ఘన్, పాకిస్తాన్ లలోని పేదరైతులకి, ఒకప్పుడు, దాదాపు 100% పంట పాపీ పంటే! ప్రపంచవ్యాప్తంగా దాన్ని మార్కెట్ చేసిపెట్టిన మాఫియా, నకిలీ కణిక వ్యవస్థకి అనుబంధ అనుచర వ్యవస్థే!

మాదక ద్రవ్య వ్యసనంతో మనిషి జీవితం, ఎంత దుఃఖ భాజనమౌతుందో వాళ్ళకి అనవసరం. సమాజం ఎంత భ్రష్టమౌతుందో అంతకంటే అనవసరం! ఇందులో వ్యాపార మొక్కటే విషయం కాదు. తత్ఫలితంగా ప్రజలు వ్యసన పూరితులే కాదు, తమో గుణపూరితులూ అవుతారు. అదే అసలు లక్ష్యం నకిలీ కణిక వ్యవస్థకి!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలని తమోగుణంతో నిస్తేజ పరిస్తే.... ప్రస్తుతం కింగ్ మేకర్స్ గా ఉన్న నకిలీ కణిక అనువంశీయులు, భవిష్యత్తులో కింగ్ లు కాగలరు. ప్రస్తుతానికి కింగ్ కన్నా కింగ్ మేకర్ గొప్ప. ఎందుకంటే కింగ్ లు, అంటే - దేశాధ్యక్షులూ, ప్రధానమంత్రులూ గట్రా పదవులు, తాత్కాలికమైనవి, తక్కువ కాలవ్యవధి గలవి.

కాబట్టే - పరిస్థితులన్నీ సమకూడాక, తామే శాశ్వత కింగ్ లైతే.... క్రీస్తు పూర్వం నుండి అలెగ్జాండర్ ది గ్రేట్[?] లు కలలు కనీ, సార్ధకం చేసుకోలేక పోయిన దాన్ని, తాము సాక్షాత్కారింప చేసుకోగలరు. బ్రిటీషు వాడు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఆ కలను సాక్షాత్కారింపచేసుకున్నాడు.

ఇక్కడో గమ్మత్తు ఏమిటంటే - అలెగ్జాండర్, అతడి తండ్రికి ఉంపుడు గత్తె కొడుకే. నకిలీ కణిక అనువంశీయులకు తొలితరం వ్యక్తీ వేశ్యాపుత్రుడే! అందుకేనేమో, నకిలీ కణికులకి, అలెగ్జాండర్ పట్ల విపరీత ప్రచారం ఇచ్చేంత అమిత ప్రేమ!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

క్రికెట్ ఒక మతం - ఒక మెగా మోజు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 12]

Wed, 06/23/2010 - 00:04
మరో మెగా మోజు - క్రికెట్!

క్రికెట్ మోజులో నడిపించే వ్యాపారానికి అంతనేదే లేదు. ఆటగాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లై, కాలి బూట్ల దగ్గరి నుండి నెత్తి మీద టోపీల దాకా అమ్మి పెడతారు. బట్టలూ, వాచీలూ, కూల్ డ్రింక్ లూ, హెల్త్ డ్రింకులూ, జాం లూ, చెత్తలూ చెదారాలు!

అమ్మానాన్న చెప్పినా, గురువు చెప్పినా వినని పిల్లలు, టీవీలో క్రికెటర్లు చెప్పారంటే వేదవాక్కులా పాటించేటంతటి ‘కిక్కు’ క్రికెట్ ది! "మా వాడు, ఫలానా ఆటగాడంటే పడి చచ్చిపోతాడు" అంటూ తల్లిదండ్రులే గొప్పగా, కళ్ళార్పుతూ చెప్పేచోట పిల్లల మోజులు మరింత పెరగవా మరి!?

మోడళ్ళుగా క్రికెటర్ల వాణిజ్య ప్రకటనలతో జరిగే వస్తు విక్రయాలు తెర మీద వ్యాపారమైతే, మ్యాచ్ ఫిక్సింగులూ బెట్టింగులూ తెర వెనక వ్యాపారం!

క్రికెట్ పండగ, క్రికెట్ సంరంభం, క్రికెట్ సందడి, క్రికెట్ సంగ్రామం, క్రికెట్ యుద్దం.. క్రికెట్ xyz... నిరంతరాయంగా హోరుమనిపించే ప్రచారం! రెండు సంవత్సరాల పిల్లాడి దగ్గరి నుండి, పండుముసలి దాకా, అధికుల్లో కనబడే మోహం ఇది!

క్రికెట్ ఆట, ఆటగా ఉంటే పర్లేదు. వ్యసనంగా మారి.... ఎన్ని పనిగంటలూ, ఎంత మానవశక్తి వృధా అవుతోందో ఊహకందదు. మా వెనక వీధిలో పిల్లవాణ్ణి, క్రికెట్ ఆడకుండా నిరోధించలేక, సంవత్సరానికి 50 వేల రూపాయలు కట్టుకొని హాస్టలులో చేర్చి చదివించుకుంటున్నారు, ఆ పిల్లాడి తల్లిదండ్రులు. తమకు భారమైనా సరే!

బెట్టింగులూ, మ్యాచ్ ఫిక్సింగులతోనే గాక, క్రికెట్ మోజులతో.... ఆహార పదార్ధాల దగ్గర నుండీ, ఆహార్య విహారాల దాకా, ఎన్నివేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో? కాబట్టే.... రాజకీయ నాయకుల బంధు మిత్ర సపరివార సమేతంగా క్రికెట్ ఫ్రాంఛైసీల వేలం పాటలలో సన్నాయి రాగాలు పాడారు. సినీ తారలూ, కార్పోరేట్ అధినేతలూ పోటీలు పడి మరీ [వేలం] పాటలు పాడారు.

ఒకప్పుడు సంతలో బానిసల్ని , పశువుల మాదిరిగా వేలం వేసేవారట. అది అనాగరికం అన్నారు. అవే నోళ్ళు ఇప్పుడు, క్రికెట్ తారల వేలాన్ని , వేలం వెర్రిగా మరీ ప్రచారించారు. ఇది నవనాగరికం కాబోలు! బహుశః నాటి బానిసలు బండచాకిరి చేసేవాళ్లు. నేటి క్రికెట్ తారలు అలాంటివేం చేయరు గనక ఇవే వేలంపాటలు గాకుండా పోయాయోమో!

[నాకో పెద్ద అనుమానం. తరచి చూస్తే ప్రచార పటాటోపమే తప్పితే, క్రికెట్ తారల బ్రతుకులు కూడా, నాటి బానిస బ్రతుకులకీ, పంజరంలో చిలకల బ్రతుకులకీ తీసిపోవేమో! ఖచ్చితంగా తెలియదనుకొండి, అనుమానం మాత్రమే! కాకపోతే బానిసలకి స్వంత సంపదలుండవు, వీళ్ళకి సంపదలుంటాయి. అంతే తేడా!]

ఇక క్రికెట్ మ్యాచ్ లున్న రోజుల్లో, అవి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న రోజులలో.... పాఠశాలలో, కళాశాలల్లో, కార్యాలయాలలో హాజరు చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్టు ప్రాంతాలలో కూడా, జనం గుంపులూ దుకాణాలలో టీవీల దగ్గర చేరి, క్రికెట్ చూస్తూ, స్కోరు గురించి చర్చస్తూ ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగులూ చేసుకుని, ఆటని ఆడటం గాకుండా, నటిస్తారని తెలిసినా కూడా! అదీ మీడియా రేపగల మోజుల బలం!

అందరూ అంతగా తన్మయం చెంది, టీవీలో క్రికెట్ చూసే వేళ, దొంగలు పడి సర్వమూ దోచుకుపోయినా దిక్కుండదేమో నన్పిస్తుంది. 2002 లో, హైదరాబాద్ నగర కార్పోరేషన్ ఎన్నికల వేళ, జూబ్లీ హిల్స్ వంటి ధనిక కాలనీలో, పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉండింది. కారణం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం!

ఈ విషయమై ఓ టీవీ ఛానెల్ వారు, ఓ విద్యావంతురాలైన ధనిక మహిళని ఇంటర్యూ చేస్తే, ఆవిడ అతిశయంగా "ఈ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందండి. ఏం చేయమంటారు? ఓటూ, క్రికెట్టూ రెండూ ముఖ్యమే! అయినా మ్యాచ్ వదులుకొని, పోలింగ్ బూత్ కి వెళ్ళలేక పోయాం" అంది. [ఇలాంటి వాళ్ళ ఓట్లకీ, ఓటు అమ్ముకునే దిగువస్థాయి వాళ్ల ఓట్లకీ విలువేం ఉందిలే అనుకొని, సోనియా ఈవిఎం లని Tamper చేసేసుకోవటం మొదలెట్టేసినట్లుంది.]

నిజానికి ఇతర ఆటలకి గానీ, ఆటగాళ్ళకి గానీ, ఇంత మోజు సృష్టింపబడలేదు. నిజానికి క్రికెట్టు ఆటలో, జుట్టు సభ్యుల మధ్య కో ఆర్డినేషన్ గానీ, నైపుణ్యాల స్థాయి గానీ, మరికొన్ని ఆటలతో పోలిస్తే తక్కువ. ఉదాహరణకి, దేశవాళీ ఆట అయిన ‘కబడ్డీ’ని తీసుకుంటే.... క్రికెట్ కి లాగా బ్యాటు, బంతి, పాడ్స్, హెల్మెట్టూ గట్రా సామాగ్రి అవసరం లేదు. పిచ్ గట్రాలూ అక్కర్లేదు. పదిమంది కలిస్తే ఎక్కడైనా ఆడుకోవచ్చు. పైగా, జట్టుగా ఎదుటి ఆటగాణ్ణి ఓడించటం, పట్టుకోవటం... ఒక జీవశక్తిలా అన్పిస్తుంది. ఎంత సేపు దమ్ముపట్టగలరో అన్నదే ఈ ఆటలో ఆటగాడికి బలం!

పెద్దలు ‘ధైర్యం’కి పర్యాయపదంగా ‘దమ్ములుండటం’ అనే పదాన్ని వాడతారు. గుండెల్లో దమ్ము అంటే - ఎక్కువ గాలిని పీల్చి, ఎక్కువ సేపు మళ్ళీ గాలి పీల్చకుండా నిబ్బరించుకోగలగటం! దమ్మెక్కువ సేపు పట్టగల వాళ్ళు, పెద్దయ్యాక మరింత ధైర్యవంతులుగా, అలసట లేకుండా పనిచేయగల పనిమంతులుగా ఉంటారట.

[ఇందులో నిజమెంతో నాకు తెలియదు గానీ..చిన్నప్పుడు మా స్కూలు కబడ్డీ టీం కు నేనే కెప్టెన్ ని. ఎక్కువ సేపు కూత పెట్టగలననీ, ఎదుటి జుట్టు సభ్యులు మన బరిలోకి వచ్చినప్పుడు నేర్పుగా పట్టుకొని ‘ఔట్’ చేయగలననీ, మా పీఈటీ పంతులమ్మ నాకు జట్టు నాయకత్వం కట్టబెట్టింది. అర్బన్ వాళ్లతో బాగానే ఆడేం గానీ, రూరల్ పిల్లలతో ఓడిపోయాం!]

కబడ్డీ ఒక్కటే కాదు, పుట్ బాల్, త్రోబాల్ వంటి ఆటలకు కూడా, పెద్దగా వస్తుసామాగ్రి అవసరం లేదు. రెండు జట్లలోని ఆటగాళ్ళందరికీ, ఆడే అవకాశం, వ్యాయామం లభిస్తాయి.

క్రికెట్లో బ్యాటింగ్ చేసే జట్టులో ఆ క్షణం ఆడుతున్న వాళ్ళు తప్ప, మిగిలిన వాళ్ళు డ్రెస్సింగ్ రూంలో కూర్చొ గలరు. చాలాసార్లు.... ఫిల్డింగ్ చేయాల్సిన ఆటగాళ్ళు, బంతి మీద గాక ప్రేక్షకులకి ఆటోగ్రాఫులూ, అభివాదాలు చేయటం మీదే శ్రద్ద కనబరచారనే విమర్శలు, ఇటీవల బాగానే వినబడ్డాయి.

కబడ్డీ, ఫుట్ బాల్ గట్రా ఆటల్లో అలాంటివేం కుదరవు. అందరూ, ఆట ఆడుతున్నంత సేపూ చెమటోడ్ఛాల్సిందే! క్రికెటేతర ఆటలలో కూడా ‘మజా’ ‘కిక్కు’ ఉన్నా కూడా, కేవలం క్రికెట్టు ఆటకే అంత మోజు ఎందుకొచ్చిందీ అంటే - క్రికెట్ లో వ్యక్తిగత రికార్డులు సృష్టించటం తేలిక. ఆ వ్యక్తిగతం ద్వారా చాలా వ్యాపారం చేయెచ్చు. మిగతా ఆటలలో వ్యక్తిగత రికార్డులను క్రికెట్ లో ఉన్నన్ని రకాలుగా సృష్టించలేరు. మిగతా ఆటలలో టీమ్ గా పనిచేయాలి. ఫలితం కూడా దాదాపుగా మొత్తం టీమ్ కే దక్కుతుంది. అదే క్రికెట్ లో అయితే వ్యక్తిగత రికార్డు సంపాదిస్తే చాలు, మ్యాచ్ ఓడినా, గెలిచినా ఒకటే!

అంతేగాక.... అన్ని ఆటలకి మోజులు సృష్టిస్తే, నియంత్రించటం శ్రమతో కూడుకున్న విషయం! అదే ఒకే ఆటకి మోజులు సృష్టిస్తే, అంతా మోనోపలే! అప్పుడు బెట్టింగూ, మ్యాచ్ ఫిక్సింగూ, కప్పం వసూళ్ళు లేదా కమీషన్లు... అన్నీ సులభం! అందుకే, ఆటలలోనూ కొన్నిటికే మోజులు! ఆటగాళ్ళల్లోనూ కొందరే సెలబ్రిటీలు! ఇప్పుడు మీడియా ఏకంగా క్రికెట్ భారత్ లో ఒక మతం అని, సచిన్ క్రికెట్ దేవుడని కూడా కీర్తిస్తోంది.

[మనిషికి విచక్షణని నేర్పేది, మంచి చెడు తెలియజెప్పేది మతం. ఏ మతం అయినా సరే! అలాంటి చోట క్రికెట్ ఏ విధంగా మతం అయ్యిందో ప్రచారించే మీడియాకే తెలియాలి.]

సెలబ్రిటీలు కదిలినా మెదిలినా దగ్గినా తుమ్మినా వార్తే! మిగిలిన ఆటగాళ్ళు చెమటోడ్చి గెలిచినా, కనీస గుర్తింపు కూడా లేనట్లు, వేస్తే ఓ మూల అప్రాధాన్య వార్త లేస్తారు, లేకపోతే అదీ లేదు! అదే సెలబ్రీటిలకైతే, చెప్పుకోదగిన విజయాలేం లేకపోతే... వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నా ప్రచురించి, ప్రజల మెమరీలో లైవ్ గా ఉంచుతారు.

ఫలానా సెలబ్రిటీకి ఫలానా కూరంటే ఇష్టమనో, ఫలానా నగలు కొన్నదనో, ఫలానా బ్రాండ్ బైకో, కారో కొన్నారంటూ....!

ఇక ఇలాంటి మోజుల్ని కొనసాగించటానికి, మరికొన్ని వైవిధ్యభరితమైన ఉపాయలున్నాయి. ఫలానా క్రికెట్ తారకీ, ఫలానా సినిమా తారకీ మధ్య ప్రేమాయణమో, శృంగారమో నడుస్తోందనీ, ఫలానా రెస్టారెంట్లో కనబడ్డారనీ మీడియా వ్రాస్తుంది, కోడై కూస్తుంది. ఆపైన విమర్శలూ, ప్రతివిమర్శలూ కూడా వేడి వార్తలౌతాయి లెండి!

ఇలాంటివే వాళ్ళ ముద్దుపేర్లు కూడా! ఉదాహరణకి మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్, దాదా గంగూలీ, ధనాధన్ ధోనీ లేదా జార్ఖండ్ డైనమైట్ ధోనీ, ముషారఫ్ మెచ్చిన క్రాఫ్ ధోనీ... ఇలా! అదేదో యూనివర్శిటీలు ప్రదానం చేసిన డాక్టరేట్లో, ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీలో అన్నట్లుగా! యూనివర్శిటీ డాక్టరేట్లూ గట్రా కూడా పైరవీలతో వచ్చేస్తాయి లెండి, సానియా మీర్జాకి డాక్టరేట్ ఇచ్చినట్లు.

ఇంతకీ... 2007-08 ల్లో ‘పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ మెచ్చిన జులపాల జుట్టు ధోని’ అంటూ ప్రచారం జరిగింది! అంతలో ఏమయ్యిందో, హఠాత్తుగా ధోనీ, పొడుగాటి జులపాల జుట్టుని కాస్తా పొట్టిగా కత్తిరించేసుకున్నాడు. ఇలా.... ఎప్పుడు ఆయా క్రీడాతారల గురించి ప్రస్తావించినా, ముందుగా ఈ మీడియా ప్రసాదిత బిరుదులని తప్పకుండా తగిలిస్తారన్నమాట. ‘టెన్నిస్ సంచలనం సానియా మీర్జా’ లాగా!

ఇవి చాలక, సంచలనాల కోసం తారలతో, క్రీడా తారల ప్రేమాయణ ముచ్చట్లు ఉండనే ఉన్నాయి. మీడియాలో వ్రాయబడే ఈ సొల్లుతో.... పత్రికలూ టీవీలూ, ఏ విధంగా ప్రజా సేవ చేస్తున్నట్లో మీడియా నవాబులకే తెలియాలి. డీడీ సహితం, రాష్ట్ర జాతీయ వార్తలు కూడా ఎత్తేసి, క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

పైపెచ్చు ప్రైవేటు క్రికెట్ వ్యాపార సంస్థ అయిన బిసిసిఐ ని, అదేదో ప్రభుత్వ సంస్థ అన్నట్లుగా ఉంటుంది మీడియా కవరేజి! టీం ఇండియా అంటూ , అక్కడికి ఆ క్రికెట్ ఆటగాళ్ళ జట్టు.... ప్రభుత్వం తరుపునా, అధికారిక ప్రాతినిధ్యంతో ఆడుతున్నట్లుగా పిక్చర్ ఇవ్వబడుతుంది. ఒలింపిక్స్ లోనో, ఏషియాడ్ లోనో భారత క్రీడాకారులు ఆడినట్లుగా!

నిజానికి.... క్రికెట్ మ్యాచ్ లన్నీ బిసిసిఐ, ఐసిసి, ఐపిఎల్ వంటి ప్రైవేటు నిర్వాహకుల సంస్థలు నిర్వహించేవే! ఇప్పుడంటే సునంద పుష్కర్, శశిధరూర్, లలిత్ మోడీల పాపమా అని, వివాదాలు రచ్చకెక్కి, అవన్నీ ప్రైవేటు వ్యవహారాలని బయటపడింది గానీ, అంతకు క్రితం చాలామందికి, బిసిసిఐ అంటే ప్రభుత్వ పరమైనదే అనుకునేవాళ్ళు ఇప్పటికీ ఈ విషయమై ఎంతమందికి స్పష్టత ఉందో అనుమానమే!

బిసిసిఐ, ఐపిఎల్ గట్రాలు.... ప్రైవేటువైతే నేమిటీ, ప్రభుత్వపరమైనవైతే ఏమిటి అంటారేమో? రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వ పరమైనవైతే లాభాలు ప్రజలవౌతాయి. ప్రైవేటువైతే.... భావోద్వేగాలు ప్రజలవి, లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులవీ అవుతాయి. ఆటగాళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటారు గానీ, వ్యక్తిగత ఆస్తులే సమకూర్చుకుంటారు.

అయితే భారత జట్టు అంటూ, ప్రభుత్వపరంగా అధికారికంగా ప్రాతినిధ్యం ఉన్నట్లుగా, మీడియా ప్రచారించడం వల్ల కూడా, దాదాపు ప్రజలందరూ పిల్లా పాపా, యువకులూ, వ్యక్తులతో సహా, భావోద్వేగాలకు గురి అవుతారు. మరో మాటలో చెప్పాలంటే వ్యాపారాభివృద్ది కోసం, తాము సృష్టించిన మోజులకు.... దేశాభిమానం, దేశభక్తిని అదనపు మద్దతుగా, ఆకర్షణగా అద్దుతున్నారు.

దేశాభిమానపు పరిమళం అద్దకపోయినా, క్రికెట్ క్రేజ్ ఉండవచ్చుగాక! అయితే ఇంత పరిమాణంలో ఉండదు. ప్రజలకు సహజంగా తమ మాతృభూమి మీద ఉండే ప్రేమని, వ్యాపార వనరుగా మార్చుకోవటమే ఇది.

మీడియా చేయదలుచుకుంటే... ఇదే విధంగా, ప్రజలకి తమ మాతృదేశం మీద ఉండే ప్రేమని, దేశాభివృద్దికి తోడ్పడే విధంగా కూడా, యువతలో ట్రెండ్ సృష్టించగలదు. కానీ చేయదు. తమ వ్యాపారం కోసం మాత్రం, ప్రజల మనోభావాలని ప్రభావితం చేస్తుంది. దేశభక్తి మాత్రమే కాదు, మానవ బాంధవ్యాలను కూడా!

అదెలాగంటే......

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left