Middle

మిషిగన్‌లో సమ్మరైపోయింది, ప్చ్!

కనీసం దసరాల దాకానైనా నా సరదా తీరుస్తుందనుకున్నాను.
వినాయకచవితైనా రాకుండానే అమాయకంగా వీడ్కోలు తీసేస్కుంది మా మిషిగన్ వేసవి.
కానీ, నా సావి రంగా, అది రాజ్యమేలినన్నాళ్ళూ ఏంఇ వైభవం, ఎన్నెన్ని హొయలు!
ఇహ ప్రకృతంతా నాదే కదా అన్నట్టు ఏకఛ్ఛత్రాధిపత్యం చెలాయించిందిగా!!
అచ్చం చక్రవర్తిణిలాగానే, మరీ ఒకే రకం పూలు సీజనంతా ఉంటే బోరని చెప్పి, రెండేసి వారాలకి ఒక కొత్త గుబాళింపు, ఇంకో కొత్త వెరైటీ పూల సోయగం, మార్పు మార్పు మార్పు, ఎడతెగని మార్పు, నిరంతర మార్పు.
వాహ్ వాహ్ మిషిగన్ వేసవి!
నీ రాజసం ముందు, నీ సోయగం ముందు దాసోహమ్మని తలవంచుతున్నాను.
ఈ రంగులూ రూపాలూ సువాసనలూ నాకోసమే విరిసి విసిరి మురిశావని అనుకోడానికి నేనెంతవాణ్ణి?
ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు.
నువ్వే సకల సృష్టిని శాసించే జగన్మోహినివి.
నేనల్లా నీ మాయలో పడి ఓలలాడుతున్న పిచ్చివాడిని.
వాహ్ వాహ్ మిషిగన్ వేసవి!
నీ రాజసం ముందు, నీ సోయగం ముందు దాసోహమ్మని తలవంచుతున్నాను.


తెలుగు బ్లాగువనంలో ఒక విచిత్రమైన పూల తీగె వెన్నెల పూలు పూస్తోంది చూడండి.
Categories: Middle

బ్రహ్మోస్ క్షిపణి (Brahmos Missile)

  • బ్రహ్మోస్-2 క్షిపణిని ఇటీవల ఎక్కడినుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు--చాందీపూర్ (ఒరిస్సా).
  • బ్రహ్మోస్ ఏ తరహా క్షిపణి--క్రూయిజ్ క్షిపణి.
  • బ్రహ్మోస్ పేరును ఏయే నదులపేర్ల మీదుగా పెట్టబడినది--బ్రహ్మపుత్ర (భారత్) మరియు మస్కొవ (రష్యా).
  • బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఏ దేశ సహకారంతో రూపొందించినది--రష్యా.
  • బ్రహ్మోస్ క్షిపణి వేగం--2.8 నుంచి 3.0 మాక్‌లు (ఒక మాక్ ధ్వనివేగంతో సమానం).
  • బ్రహ్మోస్ క్షిపణి ఎంత బరువు కలిగిబ వార్‌హెడ్లను మోసుకొనివెళుతుంది--300 కిగ్రా.
  • బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారిగా ఎప్పుడు పరీక్షించారు--2004.
  • తొలితరం బ్రహ్మోస్ క్షిపణిని భారత నౌకాదళంలో ఎప్పుడు ప్రవేశపెట్టినారు--2005.
  • బ్రహ్మోస్ క్షిపణి బరువు--3000 కిగ్రా.
  • బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత--ప్రపంచంలో వేగవంతమైన క్షిపణి.

Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఈ నెలలో రైళ్ళలో ప్రయాణాలు–2

http://harephala.wordpress.com/feed/ - Mon, 09/06/2010 - 12:47

    క్రిందటి టపాలో ఏ.సి 2 లో నేను చూసినవాటిగురించి వ్రాశాను. చెన్నై నుండి పూణె తిరుగు ప్రయాణం ఏ.సి.3 లో చేశాను. మరీ ఎక్కువ ఖరీదు కాదు కాబట్టి, చాలామంది దీంట్లో ప్రయాణం చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతారు.అందుకనే ఎప్పుడు చూసినా waiting list కొల్లేటి చేంతాడంత ఉంటుంది!దానితో, పాపం చాలామంది తత్కాల్ లో చేసేసికుంటూంటారు.
ఇదో దోపిడీ! లాలూ ప్రసాద్, తన దారిన తను తింటూ, ప్రభుత్వానికి కూడా అదనపు రాబడి ఏర్పాటు చేశాడు! ఏ concession నూ ఉండదు.అప్పుడప్పుడు మాత్రం అదృష్టాన్ని బట్టి టికెట్టుని upgrade చేస్తూంటారు! ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ ఎందుకీ గోలంతా అనకండి.

    ఏ.సీ 3 లో ప్రయాణం చేసేవారిలో ఒక విషయం మాత్రం చూస్తూంటాము.ఎలాగూ అంత డబ్బెట్టి టికెట్టు తీసికున్నాము కదా, పూర్తి వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో,మిడిల్ బెర్త్ వచ్చినవారు
వేళా పాళా లేకుండా, బెర్తుని క్రిందకు దింపేసి, attendant ఇచ్చిన ‘దీక్షావస్త్రాలు’ కప్పేసికుని, నిద్రరాకపోయినా కళ్ళు మూసేసికుని, కాళ్ళు జాపేసికుని, ఏదో తన్మయత్వంలో మునిగిపోతూంటారు!
దీంతోటి ఏమౌతుందంటే, క్రింద బెర్తు వాడి పని ఇరకాటంలో పడుతుంది! తన బెర్తు మీద, మెడ వంచుకుని కూర్చోనూ లేడూ, పోనీ ఏ సైడు బెర్తు వాళ్ళో కూర్చోనిస్తారా అనుకుంటే, వాళ్ళుకూడా సీట్లు విడతీసి,పైవాడూ, క్రిందివాడూ సెటిల్ అయిపోతారు! ఇంక అక్కడ ఉండేది భార్యాభర్తలైతే, ఒకళ్ళు పడుక్కునీ, ఇంకోళ్ళు వాళ్ళ కాళ్ళదగ్గరా సెటిల్ అవుతారు!
ఆతావేతా తేలేదేమిటంటే, మనకిచ్చిన క్రింది బెర్తులోనే, మెణ్ణరం (stiff neck) పట్టేసినా సరే నోరుమూసుకుని కూర్చోడమే!

    అన్నిటిలోనూ ఆ కోచ్ attendant ఇచ్చే కంబళీలు- వాటంత దరిద్రపువి ఇంకెక్కడా ఉండవు!తెల్లదుప్పట్లూ,నాప్ కిన్నూ ఏదో ఒకసారైనా ఉతికి ఇస్త్రీ చేసినట్లనిపిస్తాయి. ఆ కంబళ్ళు మాత్రం
అసలు వాటిని క్లీన్ చేసి ఎన్ని యుగాలయిందో అనేట్లుంటాయి! తలక్రింద పెట్టుకోడానికి మాత్రం బాగా ఉంటాయి!అడిగితేనే కానీ, ఆ attendant నాప్ కిన్ ఇవ్వడు.
ఇందులో ప్రయాణం చేసే మనుష్యులు మాత్రం, ఏ.సీ 2 లో వారికంటె, కలివిడిగా ఉంటారు.ప్రక్కవాడితో మాట్లాడడం వగైరా.. మరీ హైఫై కాదు.స్టేషనొచ్చినప్పుడు, platform మీదికెళ్ళి ఏదో ఒకటి తినేది కొనుక్కోవడమో లాటివి చేస్తూంటారు, ఎందుకంటే చాలా మంది పిల్లలతో ప్రయాణం చేస్తూంటారు. ఏ.సీ లో ప్రయాణం చేసినట్లూ ఉంటుంది, మరీ ఖరీదెక్కువా కాదు.suffocation ఒకటే భరించలేము. ఏ.సీ.2 కంటే ఎక్కువ బెర్తులేమో, దీంతోటి ఊపిరాడదు.

    మరీ ట్రైనుకి ముందరో ఆఖర్నో ఉండడంచేత స్టేషన్లలో ఆగినప్పుడు, పుస్తకాల షాప్పులికీ వాటికీ వెళ్ళడం కొంచెం రిస్కు తో కూడిన పని! చాలా మంది ఓ పోర్టబుల్ డి.వీ.డీ ప్లేయరు పెట్టుకుని, అందరి ప్రాణాలూ తీస్తూంటారు! పోనీ దాంట్లోకైనా తొంగి చూద్దామా అంటే, అబ్బే, వాళ్ళూ వాళ్ళ కుటుంబంతప్ప ఇంకోళ్ళు చూసేటట్లుగా పెట్టరు! పిల్లలతో ప్రయాణం ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూపించుకోవద్దూ!

    ఈమధ్యన ప్రయాణంలో మాపు ఆగుతుంది కదా అని, ఓ చిన్న చిన్న గళ్ళున్న షర్టువేసికున్నాను. నాకేం తెలుసూ, IRCTC Pantry Car వాడి యూనిఫారం అలాగే ఉంటుందని. మా కోచ్ లో Toilet ఖాళీ లేదని పక్కదాంట్లోకి వెళ్తూంటే, चाय है क्या? అని అడిగాడు ఓ ప్రాణి! మళ్ళీ జీవితంలో అలాటి గళ్ళున్న షర్టు ఛస్తే వేసికోను!ఇలాటి ‘కష్టాలు’ ఉన్నా, నాకు మాత్రం కాలక్షేపం బాగానే అయింది. ఎందుకంటే, సైడు బెర్తు రైల్వే ఎంప్లాయీస్ దిట. నా అదృష్టంకొద్దీ, రేణిగుంటనుండి, గుంతకల్ దాకా ప్రయాణం చేశారు. రైల్వే లో ఆడిటరుట, ఎన్నెన్నో విషయాలు చెప్పారు.తిరుమలలో ఓ రైల్వే రిజర్వేషను కౌంటరుందికదా, దాని ఆడిట్ కి వెళ్తూండడంవలన, అక్కడ చాలా పలుకుబడి కూడా ఉంది.నా కబుర్లన్నీ విని, ఎప్పుడైనా తిరుమల వేళ్ళేమాటైతే, ఆయనకి ఫోను చేయమని ఓ ఆఫరు కూడా ఇచ్చారు.ఇదిగో ఇలాటి ఉపయోగాలుంటాయి, ఇంకోరితో కబుర్లు మొదలెడితే!

    స్టేషనులో దిగినతరువాత ఆ చివర్నించి సామాన్లు మోసుకుంటూ రావడానికి పడే తిప్పలు ప్రక్కకి పెడితే, మొత్తంమీద ప్రయాణం బాగానే సాగింది! ఈసారి మన ‘జనతా జనార్ధన్’ స్లీపరు క్లాసు గురించి!


Categories: Middle

Komaram Puli Posters / Stills at Theaters




[[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]] megafanz.blogspot.com
Categories: Middle

కామిక్ ఆర్ట్ ఎఫెక్ట్

ఇలా ప్రతి ఒక్కరూ తమతమ ఫొటోలను ACTION MAGIC ద్వారా రకరకాలుగా మార్చుకుంటూ ఎంజాయ్ చేసేవిధంగా కొత్త ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నాను.....త్వరలో ఆ వివరాలను తెలియజేస్తాను...!
Categories: Middle

Chiru at Rajinikanth's Daughter Marriage ~ Photos




[[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]] megafanz.blogspot.com
Categories: Middle

‘చందమామ’ వైద్యం…

http://blaagu.com/chandamamalu/feed/ - Mon, 09/06/2010 - 07:27

ఆయన వృత్తిరీత్యా వైద్యులు. గత 30 సంవత్సరాలుగా తిరుపతి కేంద్రంగా రాష్ట్ట వ్యాప్తంగా ఆక్యుపంక్చర్ వైద్య నిపుణుడిగా సుప్రసిద్ధులైన వైద్యుడీయన. చైనా సాంప్రదాయవైద్యం ఆక్యుపంక్చర్‌ని దేశంలో పరిచయం చేసిన చేసిన కొద్దిమంది వైద్యులలో ఒకరైన గురుకుల మిత్రా -మిత్రా- గారి శిష్యుడు. పేరు డాక్టర్ బాలాజీ. తిరుపతిలో అతి సాదా సీదాగా, నిరాకర్షణీయంగా కనిపించే సమతా హాస్పిటల్‌ని పాతికేళ్లుగా తిరుపతి పట్టణంలో పాత మెటర్నిటీ ఆసుపత్రి ఎదురుగా నిర్వహిస్తూ వస్తున్నారు.

మూడు దశాబ్దాలుగా ఆయన వ్యక్తిగతంగా, భావాల పరంగా కూడా నా వంటి ఎందరికో సహృదయుడైన, సన్నిహిత మిత్రుడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యంతో పాటు సమాజ పరిస్థితులను విశ్లేషించి చెప్పడంలోనే ఎక్కువ కాలం గడుపుతాడనే ‘మాచెడ్డ’ పేరు గల వైద్యుడు. ఆ రకంగా ఈయన వైద్యుడే కాదని చెబితే కూడా ఆశ్చర్య పడవలసిన పనిలేదు.

రోగుల చేయి పట్టుకుని, నాడి చూసి, తర్వాత ఒంటిపై సూదివేసి మాత్రలిచ్చి తగ్గకుంటే మళ్లీ రమ్మంటూ పంపించివేసే సాధారణ వైద్యుల కిందికి ఈయన రారు. కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు, నడుం నొప్పులు అంటూ తనవద్దకు వచ్చే రోగులకు చైనా సూదులు గుచ్చి వైద్యం చేయడం, మర్దనం చేయడం, నొప్పులు తగ్గించడంతోటే ఈయన సరిపెట్టుకుంటే ఈయనా సాధారణ వైద్యుడిలాగే ఉండేవారు.

“జీవితమంతా ఒళ్లొంచి కాళ్లు చేతులు, నడుము అరగ దీస్తేనే మీకు ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. మీరు ఈ వయసులో అయినా మాటిమాటికి వంగటం, బరువులెత్తడం వంటి పనులు చేయకుండా కాస్త విశ్రాంతి తీసుకుంటే ప్రాణానికి నిమ్మళంగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కాస్త నొప్పులు తగ్గగానే వెళ్లిపోయి మళ్లీ మీపాటికి మీరు, బతకడం కోసం పనులు చేసుకుంటూ ఉంటే మూణ్ణెళ్లు కాకముందే మీరు నా దగ్గరకో మరే వైద్యుడి దగ్గరకో రాక తప్పదు. ఒంటి నొప్పులు తగ్గించుకోవడం, తగ్గించుకోకపోవడం మీ చేతుల్లో ఉంది” అంటూ వైద్యంతోపాటు సుద్దులు కూడా చెప్పే ఈ వింత వైద్యుడిని, రోగులు అలా చూసి నవ్వుతారు.

వంగి పని చేయకుండా, కాళ్లు, చేతులకు పని పెట్టకుండా బతకడం ఎలా? ఇల్లు గడవడం ఎలా? అనే జీవితాంతపు తాత్విక సమస్య  వారి నవ్వులో కనబడి ఈయనా నవ్వుతారు. ఆ నవ్వులో మన సమాజ జీవితానికి సంబంధించిన ప్రశ్నా, జవాబు రెండూ  ఇమిడి ఉన్నాయి కాబట్టే రోగీ, డాక్టరూ కూడా అంతగా నవ్వడం.

పాతికేళ్లుగా ఆయన తాను నమ్మిన విశ్వాసాలను సడలించుకుందీ లేదు. వైద్యం చేయడంలో రోగులతో ఎంత సున్నితంగా వ్యవహరిస్తారో, వారికి సామాజిక విషయాలను కూడా వివరించి చెప్పడంలో చక్కటి వ్యక్తీకరణ సామర్థ్యం ఉన్న భిన్న వైద్యుడీయన. వైద్య సమస్య సమాజ సమస్యలో ఎలా భాగమవుతోందో ఈయన వివరిస్తుంటే మళ్లీ విందాం అనిపిస్తూంటుంది.

ఇంత వ్యక్తీకరణ సామర్థ్యం ఉన్న మీరు ఆక్యుపంక్చర్ వైద్యుడిగా మీ అనుభవానికి సామాజిక విశ్లేషణ జతపర్చి వ్రాయకూడదా అంటే నవ్వేసి ఊరకుండిపోతారు. స్వంతంగా రాయాలంటే కుదరకపోవడం.. చెబుతూంటే ఎవరైనా రాసే వారుంటే చెప్పి రాయించడం సులభమని తనకు అనిపిస్తూంటుంది కాని మళ్లీ  వందల ఏళ్ల క్రితం నాటి ఆశుకవి, వ్రాయస కాడు సంప్రదాయం పునరావృతమయ్యే పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి అది జరగదు.

కాలమిలా పాతికేళ్లుగా సాగిపోతూనే ఉంది. కాని ఆయన వైద్యంతో పాటు మాటల వైద్యం కూడా చేసే ప్రయత్నాలు ఆపుకోలేదు. చికిత్స సంబంధంతో తన వద్దకు వచ్చే వారికి పుస్తకాలను అంటగట్టి చదివించడమనే వ్యసనం నుంచి తను బయటపడలేదు. ఆయన వద్దకు వచ్చే రోగులూ బయటపడలేదు.

గత కొంత కాలంగా తన వద్దకు వచ్చే రోగులకు ‘చందమామ’ వైద్యం కూడా చేసే ప్రయత్నానికి తానే నాంది పలికారు. గత సంవత్సరం చివర్లో తనను తిరుపతిలో కలిసినప్పుడు మా డాక్టర్లకు మీ చందమామ పత్రిక యాజమాన్యం నెలవారీగా చందమామలను కాంప్లిమెంటరీ కాపీలుగా ఇస్తే మా వద్దకు వచ్చే ప్రతి రోగీ చందమామ పత్రిక చూసి కాస్సేపయినా తిరగేస్తారు కదా. అలా అలవాటయ్యాక వారిలో కొందరయినా ఆసక్తి చంపుకోలేక రెగ్యులర్‌గా చందమామను కొని చదవవచ్చు, లేదా చందా కూడా తీసుకోవచ్చు. ఒక ఆరునెలలు ఇలా చేసి చూడండి. ఫలితం లేకుంటే తర్వాత చందమామను ఆపివేద్దురు గాని అని ఆయన సలహా ఇచ్చారు.

అయినా ఆసుపత్రిలో చందమామను ఎదురుగా పెడితే చూడని, చదవని రోగి ఎవరుంటారు అని ముక్తాయింపు కూడా ఇచ్చారాయన. (ఇక్కడ సందర్భోచితం కాకపోవచ్చు కాని, టీ ముఖం ఎరుగని భారతీయులకు బ్రిటిష్ వాడు ఎలా మొదట్లో టీ తాగడం అలవాటు చేయించాడనే విషయంపై ఎప్పుడో చదివిన కథ మళ్లీ గుర్తుకొచ్చింది నాకు.)

‘చందమామను ఫ్రీగా, అదీ ఆసుపత్రులకు ఇచ్చే సంప్రదాయం మాకు లేదు. కానీ మీరు కోరారు కాబట్టి మీకు ఒక కాంప్లిమెంటరీ కాపీ నేను పంపిస్తాను’ అని చెప్పి ఆయన పేరుతో నేను డబ్బు కట్టి గత 8 నెలలుగా చందమామ పత్రికను తన ఆసుపత్రికి పంపిస్తున్నాను. ఈ మధ్యలో నేను తిరుపతికి పోయింది లేదు. ఈ ఆదివారం పని పడి తిరుపతికి వెళ్లి ఆయనను కలిస్తే గురువుగారూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొడవటిగంటి కుటుంబరావు గారి సమగ్ర రచనలలో 5,6,7 సంకలనాల సెట్‌ను ఇచ్చారు – ఆయన ద్వారానే 1,2,3,4 భాగాలను కూడా గత సంవత్సరం తీసుకున్నాను -.

ఈలోపలే తన వద్ద వైద్యానికి వచ్చిన ఇద్దరు విద్యావంతులకు నన్ను పరిచయం చేశారు. నేను తీసుకువచ్చిన రచన ప్రత్యేక సంచిక -చందమామ సీరియల్ రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారిపై సంచిక-ను ఆగస్టు చందమామను వారికి చూపిస్తే వెంటనే వారు డబ్బు చెల్లించి మరీ తీసుకున్నారు. వారు చందమామ రెగ్యులర్ పాఠకులట. ప్రత్యేక సంచిక అని చెప్పడంతో వెంటనే తీసుకున్నారు. ఇంటర్నెట్ పరిచయం ఉందని వారు చెప్పడంతో చందమామ వెబ్‌సైట్, బ్లాగు గురించి చెప్పాను.

తర్వాత ఎక్కువ సేపు తనతో ఉండలేదు మా మరో మిత్రుడి నాన్నగారి సాంవత్సరీకం కోసం నాతో పాటు వచ్చి అరగంట తర్వాత వెళ్లిపోయారు. సాయంత్రం కలుస్తానని చెప్పాను లేటయింది. రాత్రి అక్కడి నుంచి వచ్చేస్తూ కొకు పుస్తకాలు తీసుకుపోవడానికి ఆసుపత్రికి వస్తే అక్కడ నర్సులు, సార్ బయటకు వెళ్లారని చెప్పి పుస్తకాలు ఇచ్చారు.

వారిని యధాలాపంగా ‘ఆసుపత్రికి చందమామ రెగ్యులర్‌గా వస్తోందామ్మా’ అని అడిగితే ‘వస్తోందని, ఆగస్టు సంచిక కూడా వచ్చింద’ని సంతోషంగా చెప్పారు. చందమామను వారు -ముగ్గురు నర్సులు- కూడా చదువుతున్నారట. పైగా ఇన్ పేషెంట్లుగా చేరి ఆసుపత్రిలో బస చేస్తున్న రోగులు కూడా చందమామను చదువుతున్నారని చెప్పారు. ఆయనకు ఫోన్ చేస్తే కాల్ పోని ప్రాంతంలో ఉన్నట్లుంది. దీంతో అక్కడినుంచి వచ్చేశాను.

రోగుల అభిరుచిని పసిగట్టి ప్రగతిశీల సాహిత్యాన్ని తన వద్దకు వచ్చే వారికి పరిచయం చేసి అభిరుచికి తగ్గ పుస్తకాలను ఆయా రోగులకు అందిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు చందమామ పత్రికను కూడా తన రోగులకు ఒక వ్యసనంగా మార్చేశారన్నమాట. దీంతో చందమామ సర్క్యులేషన్ కాస్త పెరిగిందో లేదో, అమ్మకాలు పెరిగాయో లేదో తెలియదు కాని ఒక ఆసుపత్రి కేంద్రంలోని రోగులలో చాలామంది, చందమామను చూస్తున్నారు.. చదువుతున్నారు..

రేపు కొనగలిగిన శక్తి ఉన్నప్పుడు, అవకాశమున్నప్పుడు వీరే తమ పిల్లలకు కూడా చందమామను పరిచయం చేస్తారని ఎందుకు ఆశించకూడదు? అసలు మొదటినుంచీ తెలుగునేలపై చందమామ వేలాది కుటుంబాలకు పరిచయం అయింది కూడా ఈ రీతినే కదా! మా మిత్రుడైన డాక్టర్ గారి ప్రతిపాదన అలా ఒక నాటి చందమామ ఉజ్వల గతాన్ని మళ్లీ గుర్తు చేసింది. ఫోన్‌కు అందుబాటులో లేని మా మిత్రుడికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుతూ తిరుపతినుంచి వచ్చేశాను.

కొసమెరుపుగా ఒక విషయం తప్పక మీతో పంచుకోవాలి. తిరుపతి బస్టాండులో బయలు దేరుతూ అక్కడున్న బుక్‌స్టాల్స్ లోని పుస్తకాల కేసి చూశాను. అన్ని పత్రికలు సెప్టెంబర్ సంచికలతో వెలిగిపోతున్నాయి. ఒక ‘చందమామ,’ ‘కంప్యూటర్ విజ్ఞానం’ పత్రికలు మాత్రం జూలై సంచికలే కనబడ్డాయి. మనసు చేదైపోయింది.

RTS Perm Link

Categories: Middle

... ఇందుకేనేమో మనోళ్లకు తమిళ దర్శకులంటే యమా మోజు

గ్రూప్ వన్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నరసింహన్ నిర్వహించినట్లు ఆంధ్రభూమిలో కథనం. మొత్తం పర్యవేక్షణంతా గవర్నర్ దేనని.. రోశయ్యది ఇందులో కేవలం డమ్మీ పాత్ర అనేది ఆ కథనం సారాంశం.  చిత్రమేంటంటే ఇంతటి కీలకపాత్ర పోషించిన గవర్నర్ సింహాన్ని తెరాస సహా ఏ పార్టీ నాయకుడు కూడా పల్లెత్తు మాట అనకపోవడం. కాంగ్రెస్ నాయకులైతే గవర్నర్ ఊసే తేవడాని ఇష్టపడడం లేదు. ఎంతసేపూ రోశయ్య, డీజిపీ చుట్టూనే తిప్పుతున్నారు ఆరోపణల చక్రాన్ని.  ఎందుకు వేడి రగిలిస్తారంటూ  రాజ్ భవన్లో  సింహం నిలదీసినపుడు  తెరాస ప్రతినిధులునీళ్లు నమిలారే తప్పా... నోరు తెరవలేదు? ఎందుకు? చీటికి మాటికి రోశయ్యనో.. లేకుంటే డీజీపీనో నోటికొచ్చిన బండబూతులు తిట్టే  ఈ నాయకులు అసలు సూత్రధారిని ఎందుకు వదిలేస్తున్నట్లో?

ఏరికోరి కాంగ్రెస్ అధిష్టానమే నరసింహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో కూర్చోబెట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. కూర్చోబెట్టింది  రాజ్ భవన్లో నైనా సింహం సచివాలయంలోనే తిష్టవేసింది.  రాష్ట్ర పరిస్థితులపై.. చివరకు జగన్ పర్యటనలపై కూడా ఎప్పటికప్పడు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికే కాదు..., సోనియాకూ  సమర్పిస్తోంది. సో.. అధిష్ఠానం ఆదేశాలు లేకుండా, అమ్మ అనుమతి లేకుండా, తంబి చిదంబరం కనుసైగ లేకుండా... ఈ తమిళ సింహం... గ్రూప్ వన్ సినిమాకు  దర్శకత్వం చేసే అవకాశముందా?. మెడమీద తలకాయున్నోడు ఎవడైనా లేదనే చెబుతాడు. సో తెరాస నాయకులకు, కాంగ్రెస్ ఎంపీలకు మెడ మీదే తలకాయ ఉంది కాబట్టి ఈ చిన్ని విషయం తెలియదనుకోవడానికి వీల్లేదు. అయినా ఆడేశారు నాటకాలు సిగ్గులేకుండా. పొన్నం అరెస్టైపో్యాడు. కేకే బాధపడిపోయాడు. జైపాలైతే  తన మౌనానికి అర్థం తెలుసుకోవాలంటూ ప్రజలనే దీనంగా అభ్యర్థించాడు. ఇదంతా చూసి అబ్బో మనకోసం,.. మన భావితరాల కోసం ఎంత  త్యాగాలు చేసేత్తన్నరో.. అంటూ ఫీలైపోతాం. నెత్తిన పెట్టుకుంటాం. వాళ్లేమో శఠగోపం తయారీలో ఉంటారు.
Categories: Middle

పైన కోపం – లోన ప్రేమ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 22]

పదవకొండవ రోజున, పేదరాశి పెద్దమ్మకి మరిన్ని విలువైన కానుకలిచ్చి రకరకాలుగా ధైర్యం చెప్పి, పద్మావతికి సందేశం పంపారు. భయం భయంగానే అయినా, పేద రాశి పెద్దమ్మ పద్మావతి దగ్గరికి పోయి, పూల దండలిచ్చి, ఎవరూ లేకుండా చూసి గుసగుసగా దేవపురం యువరాజు వజ్రకూటుని గురించి చెప్పింది. అడవిలో సరస్సు దగ్గరి సంగతులు కూడా గుర్తు చేసింది.

ఈ సారీ పద్మావతి కోపమే చూపించింది. కుడిచేతి మూడువేళ్ళు ఎర్రని కుంకుమలో ముంచి, ముసలిదాని గుండెల మీద, పమిటపైన మూడు గుర్తులు పడేలా ఓ పోటు పొడిచింది. సుతారంగా తిడుతూ, తన మందిరపు దొడ్డివాకిలి ద్వారా పూటకూళ్ళ ముసలమ్మని వెళ్ళగొట్టింది.

పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ పోయి, యువరాజుకూ, మంత్రి కుమారుడికీ జరిగిందంతా చెప్పింది. ఆమెకు మరిన్ని కానుకలిచ్చి సంతోషపరిచాడు మంత్రి కుమారుడు. పద్మావతి ఇలా కోపం చూపించటం, రెండోసారి కూడా జరిగే సరికి, యువరాజుకి నిరాశ తోచింది. చింత పడ్డాడు.

మంత్రి కుమారుడు యువరాజుని ఓదార్చి, ఉత్సాహపరిచాడు "నా ప్రియమైన మిత్రుడా, యువరాజా! దిగులుపడకు! యువరాణి నిన్ను తన అంతఃపురపు వెనక గుమ్మం ద్వారా రమ్మనీ, అదీ మూడురోజుల తర్వాత రమ్మనీ కబురు పంపింది. ఆమె ఇప్పుడు ఋతు క్రమంలో ఉన్నందున, నిన్ను మూడు రోజుల గడువు కోరింది. అది నీకు సంకేతంగా ఉండేందుకే, ఎర్రని కుంకుమ గుర్తులు పడే విధంగా ముసలమ్మ పమిట మీద కొట్టి, వెనుక గుమ్మం ద్వారా పంపింది" అని విడమరిచాడు.

[పైకి చూడటానికి యువరాణి కోపం చూపించినట్లే ఉంటుంది. అందులో నుండే యువరాజుకు సందేశం పంపింది. ఈ ముసలి దానికి మాత్రం అదేమీ తెలియదు. జీవిత కాలం పాటు యువరాణి కోపమే గుర్తుండి పోతుంది. అదీ సంకేత భాషలో సౌలభ్యం!]

యువరాజుకి ఎంతో సంతోషం కలిగింది. మూడు రోజులు ఎలాగో ఓపిక పట్టాడు. నాలుగో రోజు చీకటి పడినాక దేవపురం యువరాజు వజ్రకూటుడు... అభ్యంగన స్నానమాచరించి, పట్టు పీతంబరాలు రత్నాభరణాలు ధరించి, పద్మావతి మందిరానికి, వెనుక గుమ్మం ద్వారా వెళ్లాడు. రహస్యంగా ఆమె అతణ్ణి కలుసుకుంది.

ఆనాటి నుండి ఆమెతో యువరాజు 10 రోజుల పాటు ఆనందంగా గడిపాడు. ఎవరికీ తెలియకుండా, తన అంతరంగిక మందిరంలో అతణ్ణి రహస్యంగా దాచి ఉంచింది పద్మావతి. ఆమె ఆటపాటలతో, సాన్నిహిత్యంతో... యువరాజుకు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి.

అందమైన పద్మావతి... పలుకనేర్చిన చిన్నారి, పలు కళలు నేర్చిన వయ్యారి కావటంతో, ఆమె ప్రేమలో బడి యువరాజు, తన ప్రాణస్నేహితుడైన మంత్రి కుమారుణ్ణి కూడా మరిచిపోయాడు. ఇలా పది రోజులు గడిచేసరికి, ఓ రోజు రాజకుమారుడికి తన మిత్రుడు గుర్తుకొచ్చి బెంగ తోచింది.

"ఎంత చెడ్డవాడిని నేను? చిన్న నాటి నుండీ... నేనూ, మంత్రి కుమారుడూ, కన్నూ కనురెప్ప వలె కలిసి యుంటిమి కదా? కలిసి విద్యలు నేర్చి, కలిసి తిరిగి, కలిసి బ్రతికినాము. ఇప్పటి వరకు అతడినొక్క దినమైననూ విడిచి యుండలేదు. నేటికి, ఈ సుందర నారితో వలపు రీత్యా, నా ప్రియమిత్రుణ్ణి మరచినాను గదా?" అని ఆలోచిస్తూ యువరాజు చింతా క్రాంతుడయ్యాడు.

దాంతో నిరుత్సాహంగా ఒక మూల కూర్చొండి పోయాడు. యువరాణి పద్మావతి ఇదంతా గమనించింది. అతడి దరిచేరి, "ఓ ప్రియా! యువరాజా! నీవీ రోజు మునుపటి లా లేవు. ఏదో దిగులుతో, నిరుత్సాహంతో ఉన్నావు. నీకు నా సాన్నిహిత్యము విసుగు కలిగించి నదా? నా ప్రేమ నీకు చేదైనదా?" అని అడిగింది.

యువరాజు; "లేదు ప్రేయసీ! అలా అనుకోకు. నాకు నీవనిన ఎంతో ప్రేమ! నాకు చిన్ననాటి నెచ్చెలి యెకడు కలడు. అతడు మా మంత్రి కుమారుడు. బాల్యము నుండీ మేమిరువురమూ ఒకే కంచం, ఒకే మంచము మాదిరి కలిసిమెలిసి యుంటిమి. అతడి సాయముతోనే, నేను నిన్ను కలుసుకోగలిగితిని. మీ నగరమునకునూ ఇద్దరం కలిసే వచ్చి యున్నాము. ఇప్పుడు పది రోజులుగా అతడి ఊసైననూ ఎత్తక, నీ సాంగత్యమున బడి అతనిని వదిలి ఉంటిని. ఇది తలంచి నాకు తప్పు చేసినట్లని పించుచున్నది. లజ్జా భావము కలుగుచున్నది. అంతే! అందుకే దిగులుగా నుంటిని" అన్నాడు.

అది వినగానే పద్మావతి మనస్సులో అసంతృప్తి, అసూయ కలిగాయి. తన ప్రియునికి తనకంటే అతని బాల్య మిత్రుడే ఎక్కువ కావటం ఆమెకి క్రోధం కలిగించింది. అయితే ఇవేవీ ఆమె బయట పెట్టలేదు. కొన్ని క్షణాల తర్వాత, తనకు అత్యంత నమ్మకస్తురాలైన చెలికత్తెను పిలిచి, పాయసము చేసి తెమ్మన్నది. చెలికత్తె తెచ్చిన పాయసంలో విషం కలిపి, యువరాజు దగ్గరికి వచ్చింది.

"ఓ యువరాజా! నా ప్రియ సఖా! నీవు దిగులు చెందకు. మీ స్నేహితుడు నాకునూ ఆదర పాత్రుడే! నా కానుకగా ఈ పాయసమును తీసికెళ్ళి నీ మిత్రుని కిమ్ము. అతడీ పాయసమును ఆరగించిన పిదప, అతనితో కొంత సమయము సంతోషముగా గడిపి రమ్ము" అంటూ పాయసము గిన్నెను యువరాజు కిచ్చింది.

దాంతో యువరాజుకి ఆమె మీద మరింత ప్రేమ కలిగింది. ఆమెతో కొన్ని క్షణాలు మురిపాలాడి, పాయసం గిన్నె తీసుకొని, స్నేహితుడి దగ్గరికి బయలు దేరాడు. పద్మావతి మీద గల అనురాగం కొద్దీ, అతడేదీ శంకించలేదు.

స్నేహితుణ్ణి చూడగానే సంతోషంగా పలకరించి, పాయసం గిన్నె ఇచ్చాడు. ఎంతో ప్రేమతో కబుర్లు చెబుతూ, పాయసం తాగ మన్నాడు. మంత్రి కుమారుడు గిన్నెలోకి తీక్షణంగా చూసి "యువరాజా! నీ బాల్య మిత్రుణ్ణయిన నన్ను చంపటానికి, పాయసంలో విషం కలిపి తెచ్చావా?" అన్నాడు.

అది విని యువరాజు బిత్తర పోయాడు. ‘ఎందుకిలా అంటున్నాడతడు? ఎంతో ప్రేమతో నేను పాయసం తీసుకు వస్తే..., నేనెంతో ప్రేమతో తెచ్చానో, తానంత ప్రేమతో దాన్ని ఆరగించక, ఇలా సందేహిస్తున్నాడేమిటి? ఇతడికి నా మీద స్నేహం తగ్గి పోయిందా?’... అనుకుంటూ అలాగే చూడసాగాడు.

మంత్రి కుమారుడిదంతా గమనిస్తూనే ఉన్నాడు. పాయసపు పాత్రతో వీధిలోనికి వచ్చి, ఊరకుక్కని పిలిచి, పాత్ర దాని ముందుంచాడు. పాయసం తిన్న కుక్క మరుక్షణం క్రిందపడి, గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది.


~~~~~~~~~~~
Categories: Middle

శ్రీరామదాసు

గాత్రం: బాలు
సాహిత్యం: రామదాసు



పల్లవి:

రామా శ్రీరామా కోదండ రామా
ఎంతో రుచిరా
ఎంతో రుచిరా
శ్రీరామ ఓ రామ శ్రీరామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

చరణం1:

కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవసర పరమాన్న నవనీతముల కన్న
అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ అహ శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

చరణం2:

సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా

~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~
Categories: Middle

.. ఈటీసీ.. ఈటీసీ..

నేడో రేపో జగన్ కు ఉద్వాసన
సోనియా గరగరం
జగన్ మెగాస్టార్ తో చెక్
వేటు ఖాయం. అదిష్ఠానం సంకేతాలు
ప్రణబ్ ముఖర్జీకి కోపమొచ్చింది
జగన్ ఎవ్వడు
ఓదార్పు యాత్ర కాదు ధిక్కార యాత్ర
ఇక అయిపోయాడు
జ గన్ పై సోనియా ఫైర్
..... ఈటీసీ... ఈటీసీ.. .

ఎల్లో రాతలు
తోక పత్రిక
రాజగురువు
విషం చుక్కలు 
బాబు క్షుద్రరాజకీయం
మహానేత
 ... ఈటీసీ... ఈటీసీ...
Categories: Middle

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro Rail Project)

  • హైదరాబాదు మెట్రో రైల్వే నిర్మాణ కాంట్రాక్టును పొందిన కంపెనీ--ఎల్ అండ్ టి.
  • హైదరాబాదు మెట్రో ప్రాజెక్టు వ్యయం--రూ. 12,132 కోట్లు.
  • హైదరాబాదు మెట్రో రైలుమార్గం ప్రతిపాదిత పొడవు--71 కిమీ.
  • మెట్రో ప్రాజెక్టు కింద ఎన్ని రైల్వే లైన్లు నిర్మిస్తున్నారు--3.
  • మెట్రో ప్రాజెక్టు కింద నిర్మించే లైన్లలో పెద్దది--ఎల్బీనగర్ నుండి మియాపూర్ లైను.
  • హైదరాబాదు మెట్రో ప్రాజెక్టులో ప్రతిపాదిత రైల్వేస్టేషన్ల సంఖ్య--66.
  • 2008లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ బిడ్డింగ్ పొందిన సంస్థ--మేటాస్.
  • మెట్రో ప్రాజెక్టు నిర్వహణ కాలపరిమితి--35 సం.
  • మెట్రో ప్రాజెక్టును ఏ చట్టం కింద నిర్మిస్తున్నారు--ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ట్రామ్‌వేస్ యాక్ట్-2008.
  • మెట్రోప్రాజెక్టు నిర్మాణ కాలపరిమితి--5 సం.లు.

విభాగాలు: హైదరాబాదు, భారతీయ రైల్వేలు,

Categories: Middle

అసంకల్పిత గానం { గీతాంజలి ~ 16 }

నేను ఇక్కడ నీ పాటలు పాడటానికే ఉన్నాను. నీ ఈ కొలువులో నా ఆసనం ఒక మూలన

నీ సమక్షంలో నాకు చేయ పనే లేదు; నా కొరగాని జీవితం వ్యర్థ రాగాలుగా మాత్రమే ప్రేలగలుగుతుంది

నిశి రాతిరిలో చీకటి మందిరాన నీ మౌన ఆరాధనకి ఘడియ మ్రోగినపుడు, నా ప్రభూ నన్ను ఆజ్ఞాపించు, నీ ముందు నిలబడి పాడటానికి.

వేకువ గాలులలో దివ్య తంత్రులు శృతి చేయబడుతున్నపుడు, నీ సన్నిధికి ఆజ్ఞాపించి నన్ను అనుగ్రహించు



చావా కిరణ్ అనువాదం ఇక్కడ



I am here to sing thee songs. In this hall of thine I have a corner seat.

In thy world I have no work to do; my useless life can only break out in tunes without a purpose.

When the hour strikes for thy silent worship at the dark temple of midnight, command me, my master, to stand before thee to sing.

When in the morning air the golden harp is tuned, honour me, commanding my presence.
Categories: Middle

మారాణాయుధాలతో కళా ఖండాలు సృష్టిస్తున్న జాహిమ్ జెహాద్

ఇరాక్ లో ఎక్కడ చూసిన తుపాకులు, పేలని గ్రనేడ్లు, మిస్సైల్ షెల్సూ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ఏం చేయాలో జాహిమ్ జెహాద్ కి ఒక ఆలోచన వచ్చింది. సాధారణంగా అందరూ శిల్పాలు సృష్టించాలంటే మట్టినో, రాతినో,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నో ఎంచుకొంటారు. జెహాద్ మాత్రం తన దేశంలో దండిగా దొరికే మారణాయుధాలని, వాడినవి, వాడనివి ఎంచుకొన్నాడు. AK-47 తూటాలు, కత్తులూ, పేలిన గ్రెనేడ్లూ, మిస్సైల్ షెల్సూ సేకరించి వాటితో బొమ్మలు చేస్తాడు. తనకి కావలసిన ముడి సరుకుల కోసం చిత్తు సామాను అమ్మే దుకాణాలలో, అమెరికన్లు దాడులు జరిపిన స్థలాలలో వెతికి పట్టుకొంటాడు జెహాద్.
విధ్వంసం సృష్టించే ఆయుధాలతో కళాఖండాలు తయారు చేస్తాడు జాహిమ్ జెహాద్.
Categories: Middle

కాషాయం అంటే తీవ్రవాదం, హరితం అంటే శాంతివాదం, అంతేనా చిదంబరం?

అసలు తీవ్రవాదం అంటేనే ఇస్లాం అని ఒకప్పుడు అందరూ భావించేవాళ్ళు. ఇస్లాంకీ తివ్రవాదానికీ అంతగా అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది అది కాశ్మీర్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా అమెరికా అయినా. అయితే ఉగ్రవాదానికి మతం ఉండదని ఇస్లాం తీవ్రవాదం అని పిలవడం సరి కాదని అందరూ భావించారు. అందులో తప్పు లేదు.తీవ్రవాదులు ఒక మతానికి ప్రాంతానికీ సంబంధించిన వారు కాదు. వాళ్ళు పెర్వర్టెడ్ మనుషులు. వాళ్ళకి మానవత్వం ఉండదు కాబట్టి వారిని మనుషులుగా లెక్క పెట్టకూడదు. అంచేత వాళ్ళని ఒక మతానికి ముడి వేయకూడదు. అయితే ఈ మధ్య ఒకట్రెండు సంఘటనల్లో హిందూ వాదులకి సంబంధం ఉందని తెలియగానే తీవ్రవాదానికీ హిందూ మతానికీ ముడిపెట్టి, కాషాయ తీవ్రవాదం అని నిందిచడం చేశారు మన హోం మంత్రి చిదంబరం. ఎన్నో సంవత్సరాలుగా తీవ్రవాదంతో ముడిపడ్డ ఇస్లాంని హరిత తీవ్రవాదం అనే సాహసం చేయగలరా మన అమాత్యవర్యులు? కాషాయానికి ఉత్కృష్ట స్థానం కల్పించి మన జాతీయ పతాకంలో స్థానం కల్పించారు జాతీయ పతక రూపకర్తలు. అలాంటి కాషాయాన్ని ఇంత తేలిగ్గా నిందించడం తమకు తగదు అమాత్యవర్యా. దీని వల్ల మీ ఓటు బ్యాంకు కొంచెం పెరగవచ్చు గానీ దేశ ప్రజల దృష్టిలో మీ ఇమేజ్ తగ్గిపోతుంది సార్.
Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైం పాస్

http://harephala.wordpress.com/feed/ - Sun, 09/05/2010 - 13:29

    ఇంటినిండా ఉపాధ్యాయులతోనే జీవించడం ధర్మమా అని, వారంటే ఓ భక్తీ, ఆరాధనా ఉన్నాయి నాకు.చెప్పానుగా, మా ఇంటావిడ కూడా ఒకానొకప్పుడు, ఈ ఉద్యోగమే చేసింది, దానికి సాయం వీలున్నప్పుడల్లా, క్లాసులు తీసికుంటూంటుంది, ‘అలా మాట్లాడేరెందుకూ, ఇలా అంటే బాగుండును కదా, మరీ అంతలా మాట్లాడితే అవతలివాళ్ళేమనుకుంటారూ…’ వగైరా వగైరా…

   మన టి.వీ.. చానెల్స్ వాళ్ళు, ప్రతీ సంవత్సరం, ‘ఉపాధ్యాయ దినం’ సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చూపించేవారు. పోన్లే ఈవేళకూడా చూడొచ్చూ అనుకుని, టి.వీ. పెడితే ఏముందీ? ప్రొద్దుటనుండి, అన్ని చానెల్స్ లోనూ ఒకే విషయం. అది రెండు మూడు రోజులనుండే ప్రారంభం అయిందనుకోండి. అర్ధం అయిందనుకుంటాను మీకందరికీ. ఆ వివాదం లోని మంచిచెడ్డలగురించి, ఇప్పటికే రెండు పక్షాలవారూ, హోరెత్తించేశారు. పైగా ఎవరైనా మిస్ అయిపోతారేమో అని అవే విజుఅల్స్ రోజంతా చూపించేశారు.ప్రతీ ఆదివారం ఉదయం 11.30 కి ఈ.టీవీ-2 వారు, ‘తెలుగు వెలుగు’ అనే ఓ మంచికార్యక్రమం చూపిస్తూంటారు. అది చూడొచ్చుకదా అని టి.వీ.ముందర కూర్చుంటే, అదేదో ప్రత్యక్ష ప్రసారం పెట్టేసికున్నారు. ప్రత్యక్ష ప్రసారం అంటూనే, ఒకే విజుఅల్ మాటిమాటికీ చూపించడం. అదేదో Action replay లాగ! ఒక్కో చానెల్ తీసిందీ రెండో మూడో విజుఅల్స్. కొంపలంటుకుపోయినట్లుగా అవే అస్తమానూ చూపించడంలో వారి ఉద్దేశ్యమేమిటో తెలియలేదు.

    క్రిందటాదివారం మన ఈబాట కార్యక్రమానికి ఒక్కళ్ళకీ రావడానికి తీరికలేకపోయింది, మన చానెల్స్ వారికీ ఏదో OBV లంటే తెచ్చుకున్నారు కానీ, ఇంత హడావిడి చేయలేదు.దీన్నిబట్టి తేలిందేమయ్యా అంటే, మన టి.వి. వాళ్ళకి రోజంతా సరిపోయే కాలక్షేపం కావాలంటే, ఎవో బస్సులు తగలేయడం, ఏదో ఒక టవర్ మీదో, ఇంకెక్కడో ఎక్కి కూర్చోవడం, రాళ్ళు విసరడం- ఇలాటివుంటే చాలు! మన నాయకులకైతే ఇంక అడగక్కర్లేదు.కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో తమాషాగా అనిపిస్తుంది- ఏదో ఒక విషయం తీసికోవడం, దాన్ని గురించి ఆ ఇంటర్వ్యూ కి వచ్చిన
so called expert పేట్రేగిపోవడం.ఏదైనా మర్చిపోయాడేమో అని మన యాంకరు కూడా, అవతలివాడు ఏదో ఒకటి చెప్పేదాకా దాన్నే రిపీట్ చేయడం-even to the extent of putting words in his mouth ! ఇంకెక్కడో లైన్లో ఇంకోడుంటాడు, వాడిని provoke చేయడం. దీనిమీద అవతలివాడు ఇంకోటేదో పేలడం!

    ఈవేళ్టి విషయానికొస్తే, వాళ్ళెవరో చెప్పినట్లు,ఇవి ప్రిలిమ్సే కదా, ఇంకా మెయిన్స్ కి సమయం ఉందీ, ఆలోపులో కోటాల వ్యవహారం సెటిల్ చేసికోవచ్చుగా!ఈలోపులో వయస్సైపోయిందని పాపం ఎంతమందికి ఈ పరీక్షలు వ్రాయడం వీలుండకపోవచ్చునో, ఎవరైనా ఆలోచించారా? ఆ తరువాత అలా disqualify అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వీళ్ళు ఈ రాజకీయనాయకులు చూపిస్తారా? లేక ఈ రాళ్ళు రువ్వి, బస్సులు తగలేసినవారు చూపిస్తారా? ఇంట్లో వాళ్ళే మొహం చాటేస్తున్న ఈ రోజుల్లో, అంతంత ‘త్యాగాలు’ ఎవరికి పడతాయి? లేక అప్పుడు మళ్ళీ, వయోపరిమితి పెంచాలని మళ్ళీ ఉద్యమాలు చేస్తారా? ఏది ఏమైనా నష్టపోయేది, పాపం ఇలాటి పరీక్షలు వ్రాసి ఏదో పెద్ద ఉద్యోగంలో చేరాలని కష్టపడే,అభ్యర్ధులదే! రాజకీయ నాయకులకి ఉద్యోగం సద్యోగం అక్కరలేదు, ఏదో ఒక controversy ఉంటే చాలు, లేకపోయినా సృష్టించకల సత్తా వారిలో ఉంది,వాళ్ళ రోజులెళ్ళిపోయినట్లే.

    మన చానెల్స్ లో చూపించే అత్యద్బుత సీరియల్సూ, మెగా సీరియల్సూ వాటికి పెట్టే పేర్లనుబట్టి చూడ్డం మొదలెట్టామంటే గోవిందాయే! ఏం పేర్లండీ-’సుందరకాండ’ ‘అనుబంధాలు’, ‘ గోరింటాకు’ ‘ బంధాలూ అనుబంధాలూ’ ఏ సిరియల్ చూసినా ఒకటే గోల.కుటుంబాల్లో ఇప్పటివరకూ తెలియనీ, ఊహించనీ కొత్త కొత్త ఆలోచన్లు పుట్టించేస్తాయి! An Idea can change your life ! లాగ ఒక్క సీరియల్ చూస్తే చాలు, మర్నాటి పేపర్లో చూస్తాము-ఫలానా ఊళ్ళో వాడెవడో అత్తని చంపాడూ, లేక ఇంకో ఊళ్ళో ఎవడో ఇంకోటేదో చేశాడూ అని.

    These serials are so inspiring, giving new ideas to the virgin brains !! ఈ స్క్రిప్టులు వ్రాసే వాళ్ళింట్లో ఎలా ఉంటుందో తెలిసికోవాలనుంది! వాళ్ళకి ఓ బాధ్యత అనేది లేదా? ఏమైనా అంటే ప్రేక్షకులు ఇలాటివే కావలంటున్నారూ అని ఓ ఉవాచా! ఎవడడిగారో చెప్తారా?

    ఈ మధ్యన ‘ఈనాడు’ లో వేసిన కార్టూన్లగురించి వివిధ అభిప్రాయాలూ వెలిబుచ్చారు.80 సంవత్సరాల వయస్సొచ్చేదాకా,కుర్చీ పట్టుకుని వేళ్ళాడే నాయకులున్నప్పుడు ఇలాగే ఉంటాయి కార్టూన్లు! ఆమధ్యన తమిళనాడులో ఒకతను కార్టూన్ వేశాడుట- ఏదో సినిమా గురించి వ్రాస్తూ, Produced by, Directed by, Script by,Acted by, Music by,Distributed by, etc… karunaanidhi & family అని చెప్పేటప్పటికి కరుణానిధి గారికి కోపం వచ్చేసిందిట! ఉన్నమాటంటే ఉలుకెందుకో? అలాగే,మన ముఖ్యమంత్రిగారికి కూడా, selective ఆరోగ్య సమస్యలున్నాయి.వాటివల్లే,సెక్యూరిటీ కంటె, డాక్టర్ల అవసరమే ఎక్కువా అని చూపించారు. అందులో వయోవృధ్ధుల గురించి అవహేళనేదో ఉందనుకోవడంలేదు!
,p>    ఉండడమైతే ఇంకా చాలాచాలా విషయాలున్నాయి వ్రాయడానికి కానీ, టపా మరీ పెద్దదయిపోతే మీరే తిడతారు.ఇంకో రోజు….


Categories: Middle

Chiru fulfills blind girl's wish - Video


MEGA STAR CHIRANJEEVI VISITS NARAYANA NETRALAYA...

[[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]] megafanz.blogspot.com
Categories: Middle

మంచు పల్లకీ గారికి జన్మదిన శుభాకాంక్షలు





మంచు పల్లకీ గారు తన పుట్టిన రోజు ( సెప్టెంబర్ 6 ) సందర్భంగా జీవనికి 13000/- విరాళం అందించారు. జీవని పిల్లల తరఫున మంచు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు కృతఙ్ఞతలు తెలుపుతున్నాం.




SEPTEMBER 2010 - DAILY BALANCE SHEET
BALANCE AS ON 31.08.2010 18,615 /-

01- 09-10 - 500/- Alla Bakash, Umadevi, Krishna murthy, Suguna ( 19,115 /- )
02- 09-10 - expenditure 1000/- ofice asst. salary ( 18,115 /- )
03- 09-10 - expenditure medical satish,akanksha 670 /- ( 17,445 /- )04- 09-10 - 3320/- RESIDENTS SANTOSH NAGAR, KURNOOL ( 20,765 /- )05- 09-10 - 500/- V. RAJU (21,265 /- )06- 09-10 - NIL07- 09-10 -

SCHOOL FEES DEATAILS
TOTAL FEES TO BE PAID 2,66,000/-
PAYMENT DEAILS
40,000/- 20.06.201020,000/-20,000/- 02.08.201040,000/- 23.08.2010


Categories: Middle

రష్యన్ల భారతీయ మూలాలు

ఈనాడు రష్యన్లు సుమారు 14 కోట్లమంది ఉంటారు. వారు భాషాపరంగా భారతదేశానికి మిహతా అందఱు ఐరోపేయుల కంటే నేదిష్ఠులు (nearest) అనే సత్యం చాలా మందికి తెలియదు. ఎక్కువమంది జర్మన్ భాషే సంస్కృతానికి అన్నిటి కంటే దగ్గఱ అనుకుంటారు. అలాంటివారు ఇహ రష్యన్ తెలిస్తే ఏమంటారో ? రష్యన్ తెలిసిన భారతీయులకు సంస్కృతం రాకపోవడం, అసలు ఇతర ఐరోపేయ భాషలతో పోలిస్తే రష్యన్ భాష నేర్చుకునేవారి సంఖ్య భారతదేశంలో అల్పాత్యల్పం కావడం - బహుశా ఈ వాస్తవం ఇంతవఱకు బయటపడకపోవడానికి కారణాలనుకుంటా.

రష్యన్ భాష ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందినదనే సత్యం గత 140 సంవత్సరాలుగా భాషాశాస్త్రవేత్తలకు తెలుసు. ఇది బృహత్తరమైన Indo-European Family of Languages లో శ్లావిక్ అనే ఉపకుటుంబానికి చెందినదిగా వారు పరిగణిస్తూ వచ్చారు. కానీ ఇండో-యూరోపియన్ కుటుంబం అనే కాన్సెప్టు బ్రిటీషువారి కల్పన అనీ, సంస్కృతం ఒక్కటే ఆ కుటుంబంలోని 130 భాషల్నీ సమన్వయం చేసి, వాటన్నింటికీ మూలాల్ని చూపగల ఏకైక భాష కనుక ఆ భాషలన్నింటినీ Sanskrit Family అనే అనాలని మన భారతీయ పండితుల అభిప్రాయం. రష్యన్ కీ సంస్కృతానికీ ఉన్న పోలికల్ని ఒకసారి గమనించండి.

ఇంగ్లీషులో ఉన్నట్లు రష్యన్ లో is, are లూ ఆర్టికిల్సూ లేవు. కానీ సంస్కృతంలో మాదిరి ద్వివచనం ఉన్నది. కానీ ఆధునిక రష్యన్ లో దీన్నెవఱూ వాడరు.

ఉదా :- ఏతొ మొయి సుయిన్ - He is my son - వీడు నా కొడుకు
సంస్కృతం = ఏష మమ సూనుః

తుయ్ స్తొయీష్ - You are standing = నువ్వు నిలబడుతున్నావు.
సంస్కృతం = త్వం స్థాస్యసి

తత్ - అది (సంస్కృతంలో కూడా తత్ అంటే అది)

ఏతా - ఇది (సంస్కృతంలో ఏతత్ -ఇది)

యా = నేను
అన్ - అతడు (అనేన మొ|| అసౌ రూపాల నుంచి కావచ్చు)
వామ్ - మీకు (సంస్కృతంలో కూడా వామ్ అంటే మీకు)
నష్ - మా యొక్క (సంస్కృతంలో నస్- మా యొక్క)
త్వయీ - నీది (సంస్కృతంలో త్వయి అంటే నీయందు)
వుయ్ - మీరు (సంస్కృతంలో యూయమ్)
దోమ్ - ఇల్లు (సం. ధామ)
వొదా - నీరు (సం.ఉదన్)
యా జ్నాయే - I know (సం. అహమ్ జానే)
తుయ్ జ్నాయేష్ - నీకు తెలుసు
అన్ జ్నాయేత్ - అతనికి తెలుసు
ముయ్ జ్నాయేమ్ - మాకు తెలుసు
కూదా - ఎక్కడ (సం. కుతః)
జన్యా - తల్లి (సంస్కృతంలో కూడా జన్యా - తల్లి)
యాత్రోవ్ - తోడికోడలు ( సంస్కృతంలో యాతృ/ యాతా - తోడికోడలు)

కానీ కొన్ని అత్యంత ప్రాథమిక పదాలకు సంస్కృతంతో సంబంధం ఉన్నట్లు
అనిపించదు. ఉదాహరణకు -

జొవ్యూత్ - పేరు
యాయిత్సో - గుడ్డు
కోష్కా - పిల్లి

మిహతా ఐరోపేయుల మాదిరే రష్యన్లు కూడా గోడసున్నం తెలుపైనప్పటికీ వారి ముఖకవళికలు యూరోపియన్ల లాగా లేకపోవడాన్ని గమనించండి. వారు ఎక్కువగా ఉత్తర భారతీయుల్ని పోలి ఉంటారు. నా అభిప్రాయంలో - మహాభారత యుద్ధం తరువాత - అంటే నాలుగైదు వేల సంవత్సరాల క్రితం రష్యాకు వలసపోయిన భారతీయులే రష్యన్లు అయ్యుండొచ్చు. మనకది ఐతిహాసిక కాలమే గానీ ఇతర దేశాలకు మాత్రం చరిత్రపూర్వయుగం కిందనే జమ. కనుక ఇందులోని సత్యాసత్యాలకు సంబంధించి ఆ దేశాల్లో రికార్డులు లభించవు. లేకపోతే అన్ని సంస్కృతపదాలు రూపు చెడకుండా ఆ భాషలో ఇప్పటికీ వ్యవహారంలో ఉండడం సాధ్యం కాదు. రష్యాని మహాభారతంలో ఉత్తరకురుభూములని వ్యవహరించారు. సంస్కృతంలోని విసర్గ ఐరోపేయ భాషల్లో సకార పొల్లు (స్) గా మారుతుంది గనుక-

(ఉత్తర) కురుః - కురుస్ - రూస్ - రూస్సియా - రష్యా అయిందా ?

Categories: Middle
Syndicate content