Left

ఫొటో జవాబు

http://srikaaram.wordpress.com/feed - Thu, 09/02/2010 - 03:06

కార్లా బ్రునీ సార్కోజీ (ఎడమ)-ఫ్రాన్స్ మొదటి మహిళ.
ఈవిడ ఇరాన్ లో ఒక మహిళ ను రాళ్లతో కొట్టి చంపే ఒక తీర్పు మీద తీవ్రం గా  మానవ హక్కుల విషయంలో ఒక లేఖ వ్రాసారు. ఆ దేశం లోని కొన్ని వర్గాలు ఈమె మీద తిరిగి అక్రమ సంబంధాల ఆరోపణలు చేసారు.

ఇరాన్ లో నేరము శిక్ష విషయం ఎవరూ చర్చించకూడదా?


Categories: Left

నిజంగా ఈ పాపం ఎవరిది? పాక్ ఆటగాళ్ళదేనా? – 01

మొన్నటి [30 ఆగస్టు, 2010] ఈనాడు దినపత్రిక ప్రధాన సంచికలో చివరి పేజీ(14) లో పెద్దచ్చరాలలో చోటుచేసుకున్న ‘ఈ పాపం ఎవరిది?’ చదివితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

‘82 మ్యాచ్ లు ఫిక్స్’ ‘బెయిల్ పై మజర్ (బుకీ) విడుదల’ ‘అవును.... ఆసిఫ్ అలాంటి వాడే’ ‘మెరుపులు... అంతలోనే మరకలు’ ‘బుకీల సంపాదన 145 కోట్ల రూపాయలు’ ‘ఇక్కడ ‘ఫిక్సింగ్’ చేయబడును’ - అనే ఉపశీర్షికలతో... దాదాపు పూర్తి పేజీలో కవర్ చేయబడిన ఆ వార్తాంశంలో, ఆసక్తికరమైన విషయాలున్నాయి.

>>> క్రికెట్ ఆడే దేశాలెన్ని ఉన్నా... మ్యాచ్ ఫిక్సింగ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు పాకిస్థాన్. ఎక్కడ ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూసినా బయటికొచ్చే పేర్లు పాక్ క్రికెటర్లవే. సహజ సిద్ద క్రికెట్ ప్రతిభకు నెలవైన ఆ దేశంలో ఫిక్సింగ్ జాడ్యం ఇంతలా విస్తరించడానికి కారణమేంటి? మిగిలిన దేశాల క్రికెటర్లు ఆటను నమ్ముకుంటుంటే... పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్ పైనే ఎందుకు మోజు పడుతున్నారు? అక్కడి క్రికెటర్లను ఆట కంటే ఆకర్షిస్తున్నదేంటి? పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నా... నిషేధాలు ఎదుర్కొంటున్నా, వారిలో ఎందుకు మార్పు రావట్లేదు? అసలీ పాపం మొత్తం ఆటగాళ్లదేనా? అందులో బోర్డు పాత్ర ఏమీ లేదా?

>>> ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో ‘మ్యాచ్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికైనందుకు మహ్మద్ అమిర్ అందుకున్న మొత్తం దాదాపుగా రూ.3 లక్షలు. అతనికి జీతం కింద పాక్ బోర్డు ఇచ్చేది దాదాపు రూ.లక్ష. 2008 ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఏడాదికి రూ.3.8 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న ఇషాంత్ శర్మ... తొలి సీజన్ లో వేసిన ఒక్కో బంతికి అందుకున్న మొత్తం రూ.2 లక్షలు. పాక్ ఆటగాళ్ళు మిగిలిన క్రికెటర్లకు భిన్నమైన ఆదాయ మార్గాలు ఎందుకు ఎంచుకుంటున్నారో అర్ధం చేసుకోవడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. గత రెండు మూడు దశాబ్దాలుగా పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ళలో ఎక్కువ మంది నేపధ్యం పేదరికమే.

>>>కేవలం సహజ సిద్దమైన ప్రతిభతో జాతీయ జట్టుకు ఎంపికవుతున్న అక్కడి ఆటగాళ్ళకు చదువు, తెలివితేటలు, లౌక్యం... మిగిలిన దేశాల క్రికెటర్లతో పోలిస్తే తక్కువే. పేదరికం నుంచి వచ్చిన వారందరికీ తొలి లక్ష్యం డబ్బు సంపాదించడం. దేశంలో క్రికెట్ మ్యాచ్ లు లేక నష్టాల్లో కూరుకుపోయిన పీసీబీ, మ్యాచ్ ఫీజులు మినహా మరేం చెల్లించే స్థితిలో లేదు. ఇక స్పాన్సర్ షిప్ఫుల సంగతి సరేసరి. ఈ స్థితిలో ఒక్క నోబాల్ వేస్తే 10 లక్షలిస్తాం. ఒక్క క్యాచ్ వదిలేస్తే 50 లక్షలిస్తాం. ఈ మ్యాచ్ లో త్వరగా ఔటైతే కోట్లిస్తాం అంటూ బూకీలు పాక్ క్రికెటర్లకు తేలిగ్గా లొంగదీసుకుంటున్నారు. బాగా ఆడి మ్యాచ్ గెలిస్తే వచ్చే ఆదాయానికి ఎన్నో రేట్లు బుకీలు ఇస్తుండటంతో ఆటగాళ్ళు ఫిక్సింగ్ కు తలూపుతున్నారు.

>>>మరోవైపు ఎంత అద్భుతంగా ఆడినా జట్టులో చోటు గ్యారంటీ అన్న ధీమా లేకపోవడం కూడా పాక్ క్రికెటర్లు ఆత్యాశకు పోవడానికి ఓ కారణమే. ఉన్న కొద్ది రోజుల్లో వీలైనంత సంపాదించుకుందామన్న ఉద్దేశంలో వారు ప్రక్క దారి పడుతున్నారు. ఈ దారులు నచ్చని ఆటగాళ్ళు జట్టులో ఇమడలేక కౌంటీలకో, వేరే ప్రైవేట్ లీగ్ లకో వెళ్ళిపోతున్నారు.
~~~~~~

ఎంతో గొప్పగా ఈనాడు క్రీడా విభాగం వ్రాసిన ఈ వార్తాంశంలో......

పాక్ ఆటగాళ్ళు మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారని తేల్చి పారేశారు! అందుకు పేదరికమే కారణమని నిర్ధారించేసారు!!
పాక్ బోర్డు చూస్తూ ఊరుకుంటోందన్న మాట.

ఆట ఆడటం కంటే అలవోకగా ఔటైతే కోటిస్తాం అని బుకీలు ఆటగాళ్ళకి బేరం పెడితే...
సర్లెమ్మని ఆటగాళ్ళు అలాగే చేసి, ఒక్క దెబ్బతో కోట్లు సంపాదించుకుంటుంటే.........
పాక్ క్రికెట్ బోర్డు సభ్యులు నోరు తెరుచుకుని చూస్తూ, చేతులు ముడుచుకుని కూర్చుంటారా?
కోచ్ లూ, మేనేజర్లూ కూడా మేచ్ ఫీక్సింగులకీ, బాల్ టాంపరింగ్ కీ [పెట్రోలియం జెల్లీలు పూసి] పాల్పడుతున్నారట.

ఇదంతా సరే గానీ, ప్రపంచ వ్యాప్తంగా పాక్ ఆటగాళ్ళు, పాక్ జట్టు కోచ్ లూ, మేనేజర్లూ మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారా? వీళ్ళు మాత్రమే బుకీలకి లొంగి పోతున్నారా?

క్రికెట్ బెట్టింగ్ వ్యాపారపు విస్తారత గురించి వెల్లడైన నేపధ్యంలో చూస్తే... క్రికెట్ ఎంత లాభసాటి వ్యాపారమో! అందుకే కదా మీడియా ఎలుగెత్తి, "క్రికెట్ ఒక మతం. సచిన్ క్రికెట్ దేవుడు. ధోనీ ఇంద్రుడు. మరో xyz ప్రవక్త!" గట్రా ప్రఖ్యాతి ప్రచారిస్తుంటుంది![దాదాపు రెండు నెలల క్రితం అమ్మఒడి టపా:
క్రికెట్ ఒక మతం - ఒక మెగా మోజు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 12]


అలాంటి చోట... ఒక ఆట గెలవాలన్నా, ఓడాలన్నా కేవలం పాక్ జట్టు మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడితే సరిపోతుందా? ఒక్క చేత్తో చప్పట్లు సాధ్యమైనట్లు.... కేవలం పాక్ క్రికెటర్లు మాత్రమే... పేదరికం కొద్దీ, కేవలం ఒక ఆటకి మూడు లక్షల రూపాయల వంటి తక్కువ ఆదాయం ఉండటంతో ఫిక్సింగ్ కి పాల్పడి, గెలుపు ఓటములను నియంత్రించగలుగుతున్నారా? అంత ప్రతిభావంతులా? ఎదుటి జట్టు ప్రమేయమేమీ లేకుండానే, తమ ఆటని తమ ఫిక్సింగ్ ప్రకారం.... గెలిపించటమో లేక ఓడించటమో చేయగలిగేంత ప్రతిభావంతులా?

పాక్ ఆటగాళ్ళు... నోబాల్ కో, బంతి క్యాచ్ పట్టకుండా జార విడవటానికో, సిక్సర్లు ఫోర్లూ ఎదుటి బ్యాట్స్ మన్ కొట్టే విధంగా బంతులు విసరటానికో ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం!

లేక

పాక్ ఆటగాళ్ళు... విరగ సిక్సర్లూ, ఫోర్లూ కొట్టడానికి, నాటవుట్ గా నిలబడటానికీ ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం. లేదా డక్ అవుట్ కావటానికో, నామ మాత్రపు పరుగుల తర్వాత తేలిగ్గా అవుట్ అయిపోవడానికో ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం.

మరి ప్రత్యర్ది జట్టు ఏం చేస్తుంది? నోట్లో వేలేసుకుని కూర్చుంటుందా? రెండు జట్లు ఆడే ఆటలో, ఒక జట్టు మాత్రమే అ ఆట మొత్తాన్నీ ఎలా నియంత్రించగలదు?

అలాంటి చోట... పాకిస్తాన్ ఆటగాళ్ళు, కోచ్ లూ, మేనేజర్లూ తప్ప, ప్రపంచంలో మిగిలిన దేశాలలో క్రికెట్ ఆడే జట్లన్నీ పరమనీతి పరులన్నట్లు.... మీడియా భలే స్టంట్ చేస్తోందేం!?

అందునా భారతీయ బుకీలు బయటపడ్డాక కూడా!

ఇటీవలే ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ దుర్గంధం ముక్కుపుటాలు ఆదర గొట్టాక కూడా....!

ప్రక్కనున్న పాకిస్తాన్ ఆటగాళ్ళు అడ్డదారిలో కోట్లు సంపాదిస్తుంటే... భారతీయ క్రికెటర్లు మాత్రం మడిగట్టుకు కూర్చున్నట్లున్నారు. మొత్తానికీ ఆవులు చేలో మేస్తుంటే దూడలు మాత్రం బుద్దిగా గట్టునే మేస్తున్నాయన్న మాట?

మరి భారతీయ బుకీలు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగులు చేస్తున్నట్లు? మీడియా... మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ లుగా, డైనమెట్లుగా నిలబెట్టిన క్రికెట్ దేవుళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఇంకేమైనా ఉందా? [ముంబై ముట్టడితో సహా పాకిస్తాన్ తీవ్రవాదులు భారత్ మీద దాడి చేసినప్పుడు పన్నెత్తి ఒక్క మాట కూడా మాట్లాడని క్రికెట్ దేవుళ్ళు ఈ ఆటగాళ్ళు!]

మీడియా వీర భక్తులకి అగ్రహావేశాలు ఏ స్థాయిలో వస్తాయంటే... అలాగన్న వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేటంత! ఏం చేస్తాం? వాళ్ళ విజ్ఞతకీ జాలిపడి, వాళ్ళకి దండేసి దండం పెట్టాల్సిందే మరి!

ఇకపోతే... ఇందులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే - అదేదో పాక్ క్రికెటర్లు కి డబ్బులు తక్కువై [వాళ్ళ బోర్డు ఆటకి లక్ష మాత్రమే ఇస్తుందట వాళ్ళకి!] ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారట.

మరి దేశంలో... రాజకీయ నాయకుల మొదలు, బోలెడు మంది ఉన్నతాధికారుల వరకూ, అందరికీ జీతాలు/ఆదాయాలు తక్కువై అవకతవకలకు పాల్పడుతున్నారా?

ఇవాళా రేపూ ఒక్క చిన్న స్థాయి అవినీతి ప్రభుత్యోద్యోగి మీద ఏసీబీ దాడి జరిగినా కోట్లలో అక్రమాస్థులు బయటపడు తున్నాయి. అలాంటి చోట, పాపం భారతీయ క్రికెటర్లు ‘తమకు సంతృప్తిగా రెమ్యూనరేషన్లు వస్తున్నాయి కదా’ అని ఫిక్సింగ్ కి పాల్పడటం లేదు కాబోలు!

మరి ఐపీఎల్ ఎలా బయటికి పొక్కినట్లు? బుకీలు ఎవరితో బేరాలు కుదుర్చుకుంటున్నట్లు? ఆటగాళ్ళు వాళ్ళకి సహకరించకపోతే అసలు బుకీలు ఎలా తయారౌతారు? దీన్నంతటినీ ‘తిమ్మిని బమ్మిని’ చేసి... మీడియా, క్రికెట్ సంస్థలూ, రాజకీయ నాయకులూ ఐపీఎల్ ఫిక్సింగ్ రచ్చని చల్లార్చే సారు. దాంతో అంతా నిశ్శబ్ధమే!

అసలు అన్నిటి కంటే అత్యంత ఆసక్తి కరమైన విషయం మరి కొన్ని ఉన్నాయి. టపా దిగువన గల వార్తాంశాలు పరిశీలించండి.

సవివరంగా, పార్లమెంట్ సాక్షిగా, ప్రముఖ రాజకీయ నాయకుల వ్యాఖ్యానాల సహితంగా రచ్చకెక్కిన ఈ బెట్టింగ్, ఫిక్సింగ్ ల విషయంలో ఎంత డబ్బు ఏ విధంగా ప్రయాణిస్తుందో కూడా వివరంగా వెల్లడయిన తరువాత కూడా..... అదంతా మామూలుగా ప్రక్కన పెట్టేసి, అదేదో ఇప్పుడే కొత్తగా కనుక్కున్నట్లు అంతా పాక్ క్రికెటర్లే చేసారు అనేస్తే ఓ పనైపోతుంది. గతంలో ఐపీఎల్ పాపం విషయంలో కూడా లలిత్ మోడీ, శశీధరూర్ అనబడే రెండు బలి గొర్రెలు తాత్కాలికంగా తెరమరుగైనాయి.

ఈ మొత్తం వ్యవహారాలని పరిశీలిస్తే తెలియటం లేదా... మీడియా, మాఫియా, దేశాల ప్రభుత్వాలు (క్రికెట్ ఉదాహరణలో అయితే ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, దుబాయ్ గట్రాలు) కలిసికట్టుగా, ఒకే లక్ష్యంతో, ఒకే గొడుగు క్రింద పనిచేస్తున్నాయని?

కలిసి కట్టుగా... ఐపీఎల్ ఫిక్సింగూ, బెట్టింగ్ రచ్చని చల్లార్చారు. ఇప్పుడు తాజాగా, పరమ కొత్తగా, పాకిస్తాన్ ఆటగాళ్ళే అంతా చేసారంటూ కొత్త రచ్చ మొదలెట్టారు. నాలుగు రోజులు పోతే ఇదీ చల్లారుస్తారు?

ఆ చల్లార్చడంలోనే... మీడియా, మాఫియా, దేశాల ప్రభుత్వాలు... ఒకే శృతిలో పనిచేస్తున్నాయన్నది తిరుగులేకుండా నిరూపితమౌతోంది.

కాకపోతే... సత్యాన్ని చూడగల కన్ను, నిజాన్ని ఒప్పుకోగల దన్ను ఉండాలి. అంతే!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~~~~~~
వార్తాంశాలు:

24/4/10
>>>
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: నెల రోజులుగా జేబులు ఖాళీ చేసుకుని, చదువులు గాలికొదిలి, కళ్లింతింత చేసుకుని మనం చూసిన హోరాహోరీ పోరాటాలన్నీ ఉత్తుత్తి లాలూచీ పోటీలేనని తేలిపోయింది. ఏ మ్యాచ్‌లోనూ రెండు ప్రత్యర్థి టీములు బరిలోకి దిగిందే లేదని, ఆడింది ఒక్క టీమేనని తేలిపోయింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ బెట్టింగ్‌ మాఫియా కోట్లాది క్రికెట్‌ ప్రేమికులతో ఆడిన దొంగాటే నని, ప్రతి మ్యాచ్‌ ముందుగానే ఫిక్సయిపోయిందని ఐటీ అధికారుల దర్యాప్తులో తేలిపోయింది. ‘ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కుంభకోణం తారస్థాయికి చేరింది అంటూ అది ఓ నివేదికను తయారు చేసింది.


ఆ నివేదిక, మనం విని తట్టుకోలేని మరో నిజాన్ని బట్టబయలు చేసింది. మనం ఆరాధించే క్రికెట్‌ ఇలవేలుపులే మనల్ని వంచించారని ఆ నివేదిక తేల్చేసింది. క్రికెట్‌ అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపార వేత్తలు, మాఫియా గ్యాంగులేకాదు, మన క్రికెట్‌ వీరులే కోట్లాది క్రికెట్‌ ప్రేమికులను చిత్తుచిత్తుగా ఓడించేశారని తేలిపోయింది.

ఇంతటి విషాదంలోనూ మిగిలిన ఒకే ఒక్క ఊరట....సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రావిడ్‌లు మాత్రం మనల్ని మోసగించ లేదు. ఐపీఎల్‌ పాపపంకిలం ఏ మాత్రం అంటని వారుగా ఆ ముగ్గురికీ ఐటీ నివేదిక క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ పంకిలాన్ని 'సాక్షి మొట్టమొదట బైటపెట్టిన సంగతి తెల్సిందే. ఇపుడు ఐటీ నివేదిక 'సాక్షి వరుస కథనాలను నిజం చేసింది.

క్రికెట్‌ వీరులు ఆడిన దొంగాట: మ్యాచ్‌ఫిక్సింగ్‌ల క్రీడలో ప్రముఖ భారత వీరులతో పాటు ఒక టీంకు కెప్టెన్సీ వహించిన విదేశీ యోధుడూ ఉన్నాడని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ దొంగాటలో సీనియర్లే ముందుండి జూనియర్‌లకు మార్గదర్శకత్వం వహించారు. కాదంటే బెదిరించి భయపెట్టి మరీ దారికి తెచ్చారు. అటూ ఇటూ రెండు జట్లలోనూ కాసులకు కక్కుర్తిపడి ఫిక్స్‌ అయిపోయిన క్రీడాకారులే. ఇక అడ్డేముంది. ముందస్తు పథకం ప్రకారం ఒక బౌలర్‌ ఇటు నుంచి చెత్త ఓవర్లు వేస్తాడు. అటు నుంచి మరో ఫిక్స్‌ అయిన బ్యాట్స్‌మెన్‌ ఉతికి ఆరేస్తాడు.

మరో ఆటగాడు స్కూలు పిల్లలు పట్టుకోగల క్యాచ్‌లు జార విడుస్తాడు. ఈ దొంగాటతో మ్యాచ్‌ 'అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. గెలుస్తుందనుకుంటున్న టీం ఓడిపోతుంది. ఓడిపోతుందనుకున్న టీం గెలుస్తుంది. మాఫియా యోధులకు ఏ మ్యాచ్‌ ఎప్పుడు ఎలాటి మలుపు తిరుగుతుందో ముందే తెలుసు కాబట్టి కోట్లకు కోట్లు గడించేస్తారు.

అందరూ దొంగలే: ఐపీఎల్‌ దర్యాప్తులో పాల్గొంటున్న అధికారులు మహా ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కటొక్కటిగా ఐపీఎల్‌ మహా పాప పంకిలంలోని లింకులు బయటపడి పోతున్నాయి. వాటి మూలా లు ఎక్కడెక్కడో తేలుతున్నాయి. ఐపీఎల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడీ చీకటి సామ్రాజ్యపు ప్రధాన కార్యాలయంగా బయటపడ్డ మారిషస్‌లోని వరల్డ్‌ స్పోర్ట్స్‌ గ్రూప్‌ (డబ్ల్యూఎస్‌జీ) అధిపతి వేణూనాయర్‌... అవిశ్రాం తంగా పనిచేస్తున్నఐటీ-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలముందు మహా సంతోషకరమైన నిజాన్ని వెలిగక్కాడు. సోనీ కంపెనీకి చెందిన మల్టీ స్క్రీన్‌ మీడియాకు (ఎమ్‌ఎస్‌ఎమ్‌), ఐపీఎల్‌కు ప్రసారహక్కుల ఒప్పం దం కుదిర్చినందుకుగాను... తమకు రూ.125 కోట్లు లంచంగా (కాదు కాదు, సహాయక ఫీజు అనాలి) అందిందన్న నిజాన్ని వెలిగక్కాడు.

అధికారులు ఆ తీగ పట్టుకుని సాగితే, అది బ్రిటన్‌కు చెందిన వర్జిన్‌ ఐలాం డ్స్‌కు చేర్చింది. ఐపీఎల్‌ పాపపు డబ్బు తమకు చేరే మార్గాలెన్నో ఉన్నాయని, వాటిలో రాజకీయ సంబంధాలూ భాగమేనని వేణూనాయర్‌ బయటపెట్టాడు.

పాపిష్టి డబ్బు ప్రవహించే మార్గం: మారిషస్‌లోని డబ్ల్యూఎస్‌జీకి, ఎమ్‌ఎస్‌జీ సమర్పించుకున్న రూ.125 కోట్లు... పన్ను ఎగవేత దారుల స్వర్గధామం వర్జిన్‌ ఐల్యాండ్స్‌కు చేరాయి. అదీ కూడా డబ్ల్యూఎస్‌జీ వ్యవస్థాపకుడుగా చెబుతున్న సీమస్‌ ఓ బ్రయన్‌ వ్యక్తిగత ఖాతాలోకి చేరాయి. అదీ సూటిగా జరిగింది కాదు. పలు దొంతర్ల లావాదేవీలతో సింగపూర్‌ మీదుగా, చివరికి 'పార్క్‌ హౌస్‌ హోల్డింగ్‌అనే సంస్థ పేరిట బ్రయన్‌ వ్యక్తిగత ఖాతాలోకి చేరాయి. ఇది ఐపీఎల్‌ ఛాంపియన్‌కోసమే ఏర్పాటు చేసిన ఓ పకడ్బందీ మార్గం.

ఐపీఎల్‌కు సంబంధించిన రకరకాల హక్కుల ఒప్పందాల ద్వారా ఆర్జించిన పాపపు సొమ్మునంతటినీ విదేశాలకు తరలించి....అక్కడి నుంచి తిరిగి భారత్‌లోకే తెచ్చి, వివిధ వ్యాపార సంస్థల ద్వారా దర్జాగా ఐపీఎల్‌ నిర్వహణలో పెట్టుబడులు పెట్టుకునే మార్గమిది. ఎమ్‌ఎస్‌మ్‌, మోడీ సంస్థకు లంచాలు చెల్లించి 2017 వరకు అధికారిక ప్రసార హక్కులను సంపాదించింది. దీనికోసం అది ఐపీఎల్‌కు దాదాపు రూ 8,200 కోట్లు చెల్లిస్తుంది. డబ్ల్యూఎస్‌జీ వేసిన ఈ దొంగదారిలో సోనీ భారతదేశానికి చెందిన హక్కులను, భారత్‌లోనే కొని చిల్లిగవ్వ కూడా పన్నులుగా చెల్లించ లేదు. సోనీ, ఇలా రూ.240 కోట్లు పన్ను ఎగ్గొట్టిందని అంచ నా. టీవీ ప్రసార హక్కుల డిస్కౌంట్‌ విలువలో మరో 7.5 శాతం (480కోట్లు) కూడా అది డబ్ల్యూస్‌జీకి చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.

Pasted from: http: uni.medhas.org="" unicode.php5?file="http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=486929%26Categoryid=1%26subCatId=32"

మోడి అల్లుడి సైట్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగులు కట్టాలని తహతహలాడిపోతూ, దారి తెలియక సతమతమయ్యే వారికో శుభవార్త. అలాంటి వాళ్ల కోసం ఆన్‌లైన్‌ సౌకర్యం ఉంది. 'కాయ్‌ రాజా కాయ్‌' అంటూ క్రికె ట్‌.కాం అనే వెబ్‌సైట్‌ ఆహ్వానం పలుకుతోంది. ఆ సైట్లో ఏ చీకూ చింతా లేకుండా ఐపీఎల్‌ జూదం....అదే బెట్టింగ్‌ ఆన్‌లైన్లో ఆడేసుకోవచ్చు.

ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించింది మరెవరో కాదు.... గ్లోబల్‌ క్రికెట్‌ వెంచర్స్‌(జీసీవీ). ఐపీఎల్‌కు ఈ సంస్థ అధికారిక డిజిటల్‌ మీడియా పార్ట్‌నర్‌! ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సెట్‌ను అదే నడుపుతుంది, ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నమెంట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌, డిజిటల్‌ ఇమేజింగ్‌ హక్కులన్నీ దానివే. జీసీవీ ఎవరిదనుకున్నారు? ఐపీల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడీ సవతి అల్లుడు గౌరవ్‌ బర్మన్‌ది! బర్మన్‌ ప్రమోట్‌ చేసిన ఎలిఫెంట్‌ క్యాపిటల్‌ అనే సంస్థ గత నవంబర్‌లో జీసీవీలో కోటి డాలర్లు (రూ. 45కోట్లు) షేర్‌లుగా పెట్టుబడి పెట్టింది.

కాయ్‌రాజా కాయ్‌: క్రికెట్‌.కాం, మొదటి సెమీఫైనల్‌లో ముంబై గెలుస్తుందని పందెం కాస్తే 8 కి 11 ఇస్తానని చెప్పింది (8 రూపాయలు కాస్తే 11 రూపాయలు ఇస్తారు). బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌కు విజయావకాశాలు ఎక్కువని దాని అంచనా. అందుకే 11కు 10 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇక గురువారం జరగనున్న మరో సెమీ ఫైనల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌కు 1 - 1, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 8-11 ఇవ్వజూపుతున్నారు.

ఐపీఎల్‌ను రద్దు చేయండి: ఠాక్రే
ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను రద్దుచేసి క్రికెట్‌ను కాపాడాలని శివసేన అధినేత బాల్‌ ఠాక్రే డిమాండ్‌ చే శారు. క్రికెట్‌లాంటి మంచి ఆటను ఐపీఎల్‌ పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఐపీఎల్‌ అవకతవకలపై ఆదాయం పన్ను శాఖ ఆరు నెలల కిందటే నివేదిక ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ అన్నారు.


Pasted from:
18/4
మాఫియా కనుసన్నల్లో ఐపీఎల్‌!
రియల్‌ ఎస్టేట్‌, బాలీవుడ్‌లను శాసిస్తున్న అంతర్జాతీయ మాఫియా ముఠాల తాజా టార్గెట్‌..భారత ఉపఖండాన్ని ఏటా ఓ సునామీలా చుట్టేసే ఐపీఎల్‌...
ఈ సీజన్‌లో 'చీకట్లో' చేతులు మారుతున్న మొత్తం రూ.లక్ష కోట్లు
విజయవాడలాంటి నగరాలకు పాకిన
క్రికెట్‌ బెట్టింగ్‌.... ఆస్తులు ఒడ్డేస్తున్న కోస్తా
ముంబైపై రూపాయికి 70 పైసలు,
పంజాబ్‌పై రూపాయకి రూ.25

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి:

రియల్‌ ఎస్టేట్‌, బాలీవుడ్‌లను శాసిస్తున్న అంతర్జాతీయ మాఫియా ముఠాల తాజా టార్గెట్‌.. ఐపీఎల్‌! కొచ్చి ఐపీఎల్‌ టీమ్‌కు దూరంగా ఉండాలంటూ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు వచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌ బెదిరింపు అంతర్జాతీయ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరులు పంపిందా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ... దావూద్‌ ముఠా ఐపీఎల్‌పై 'ప్రత్యేక ఆసక్తి'ని కనబరుస్తున్నదనడంలో మాత్రం సందేహం లేదు. భారత ఉపఖండాన్ని ఏ టా ఓ సునామీలా చుట్టేసే ఐపీఎల్‌... బాలీవుడ్‌ తార లు, మోడల్స్‌, నేతలు, బిజినెస్‌ టైకూన్లతో కళకళలాడిపోయే, నరాలు తెగేంత ఉత్కంఠను రేపే క్రీడా వేడుక. నిర్వాహకులకు, ఆటగాళ్లకు కూడా కనకవర్షం కురిపించే ఈ భారీ వే డుక సందర్భంగా సాగే 'తెరచాటు వ్యాపారం' విలువ దా దాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరి దావూద్‌భాయ్‌కి 'ప్రత్యేక ఆసక్తి' కలగక మానుతుందా?

బెట్టింగ్‌ పడగ నీడలో క్రికెట్‌

ఒకరోజు పరిమిత ఓవర్ల క్రికెట్‌తో అంతర్జాతీయ బెట్టింగ్‌(పందేలు కాసే జూదం)లో భారత ఉపఖండం ప్రముఖ స్థానంలోకి వచ్చింది. యాభై ఓవర్లలో ఫలితం తేలిపోయే పొట్టిక్రికెట్‌, కోట్ల రూపాయల జూదానికి వేదికగా మారింది. మాఫియా జోక్యంతో అది, మ్యాచ్‌ ఫిక్సింగ్‌లుగా వికృత రూపం ధరించింది. ఒకప్పుడు, 50 ఓవర్ల చాంపియన్‌ షిప్‌లో 400 కోట్ల రూపాయల బెట్టింగ్‌ జరిగేదని అంచనా. ప్రతి ఓవర్‌కీ, ఆ మాటకొస్తే బంతి బంతికీ ఆట తీరు మారిపోయే 20 ఓవర్ల క్రికెట్‌తో బెట్టింగ్‌ తారస్థాయికి చేరింది. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఐపీఎల్‌ బెట్టింగ్‌ మార్కెట్లో.... ఈ సీజన్‌లో 60 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల 'వ్యాపారం' జరగవచ్చని ఒక మాజీ బుకీ (పందేలు స్వీకరించే ఏజెంటు) 'సాక్షి'తో చెప్పాడు. సాక్షాత్తు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటే ఈ భారీ నిధుల గురించి ఆరా తీస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో మాఫియాగ్యాంగులు, ప్రముఖ రాజకీయవేత్తలు, బడా వ్యాపారవేత్తలు, సెలిబ్రిటీల ప్రమేయం ఉందని తెలుస్తోంది.

ఒకప్పుడు దుబాయ్‌, కరాచీ, ముంబై, ఢిల్లీల వంటి ప్రధాన నగరాలలోనే బెట్టింగ్‌ సాగేది. ఇప్పుడది నాగపూర్‌, భోపాల్‌, లాహోర్‌, కౌలాలంపూర్‌ల మీదుగా విజయవాడ వంటి చిన్న నగరాలకు కూడా విస్తరించింది. విజయవాడలో ని బెట్టింగ్‌ ముఠాలకు రాజస్థాన్‌ సిండికేట్లతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఆస్తులను ఒడ్డడం కోస్తా బెట్టింగ్‌ ప్రత్యేకత .

ఎవరు, ఎలా, ఎక్కడ ఆడతారు?

'పెద్దపెద్ద నగరాలలోని సిండికేట్లు తమ తమ బెట్టింగ్‌ ఏజెం ట్లద్వారా, పంటర్లద్వారా ఉపఖండం అంతటా వేలాది ప్రాం తాల్లో ఈ 'వ్యాపారం' సాగిస్తాయి. చట్టవిరుద్ధంగా సాగే ఈ రహస్య జూద క్రీడలో మోసానికి తావులేదని ఒక ప్రము ఖ బుకీ చెప్పాడు. 'అనుక్షణం 'భాయ్‌' కన్నేసి ఉంచుతాడు. మోసాన్ని సహించడు. ఎవరైనా మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటే వెంటనే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. మేం మాట్లాడేది కోట్ల గురించి, ఆషామాషీ కాదు. 24 గ ంటల్లోగానే, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలలోగానే గెలుచుకున్నవారికి డబ్బు ముడుతుంది' అని చెప్పాడు.

'టాస్‌ నుంచే బెట్టింగ్‌ మొదలుపెడ్తాం. టాస్‌ మీద బెట్టింగ్‌ రూ. 1. అంటే, రూపాయికి రెండు రూపాయల చొప్పున చెల్లిస్తారు. బంతి బంతికీ, ప్రతి బౌండరీకి, సిక్సర్‌కీ, మొత్తం బౌండరీలు, సిక్సర్లకూ కూడా బెట్టింగ్‌ ఉంటుం ది. మొత్తం స్కోర్‌ల మీద ఆడడానికి పెద్దగా ఆసక్తి చూపరు' అని చెప్పాడు ముంబైకి చెందిన ఒక బుకీ. 'ప్రస్తుతం ముంబై, ఆటలో ముందుంది. 20 రోజుల క్రితం దానిపై రూపాయికి రూ. 2.30 ఇచ్చారు. ఇప్పుడది 70పైసలకు పడిపోయింది. ప్రస్తుతం బెంగళూరుపై రూ 2.20, చెన్నైపై రూ. 1.30, ఢిల్లీపై రూ 3.00 పంజాబ్‌పై రూ.25 ఇవ్వజూపుతున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు హైదరాబాద్‌కు చెందిన శ్యామ్‌భాయ్‌ (పేరు మార్చాం). రోజుకు దాదాపు రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువ చేతులు మారుతుందని ముంబై-పుణె-అహ్మదాబాద్‌ బెల్ట్‌లోని పంటర్ల అంచనా. క్రితంసారి డెక్కన్‌ చార్జర్స్‌ గెలుపొందినప్పుడు దాదాపు రూ. 2,000 కోట్లు చేతులు మారాయని ముంబైకి చెందిన ఒక పంటర్‌ చెప్పాడు.

డిపాజిట్‌ సెషన్‌: 'డిపాజిట్‌ సెషన్‌' బెట్టింగ్‌లో కొత్త ఆవిష్కరణ. రూ. 20 లక్షలు పంటర్‌ దగ్గర డిపాజిట్‌ చేసి, తొమ్మిది ఓవర్లపాటు ఒ క్కో బంతికీ జూదమాడవచ్చు. అ డబ్బంతా ఒక్కరిదే కానక్కర్లేదు. 'సంపన్న కుటుంబాల యువతీయువకులు చిన్న బృందాలుగా ఇలా ఆడడానికి ఇష్టపడుతున్నారు. తమ గదుల్లోనే కూచుని పంటర్ల ద్వారానూ ఆడతారు, తమలో తాము కూడా పందేలు కాసుకుంటారు. ఈ డిపాజిట్‌ సెషన్‌ యువతలో బాగా పాప్యులర్‌' అన్నాడా పంటర్‌. ఒకప్పుడు ఈ బెట్టింగ్‌ అంతా ఫోన్ల మీద సాగేది. క్షణ క్షణానికి నంబర్లు మారుస్తూ పంటర్లు బెట్టింగ్‌లు స్వీకరించేవారు.

ఇప్పుడు ఉపగ్రహ సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక సదుపాయాలు అందులోకి రావడంతో, ఈ ముఠాలను పట్టుకోవడం ఆధికారులకు మరింత కష్టంగా మారింది. 'మాఫియా ప్రపంచం ఇప్పుడు ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతోందనడంలో సందేహం లేదు. ఒక టీంను చేజిక్కించుకోవ డం అనేది ఏమంత ముఖ్యం కాదు. తెరచాటున జరిగే బె ట్టింగ్‌ వ్యాపారమే ప్రధానం. సినిమా రంగంలో జరిగిందే ఇక్కడా జరుగుతోంది. మాఫియా ఇక్క డా జోక్యం చేసుకుంటోంది' అన్నాడు ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు సాగించిన ఒక మాజీ బుకీ.
Pasted from: http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=481680%26Categoryid=1%26subCatId=32
~~~~~~~~~~~~~~~

Categories: Left

ఈ రోజు కూడా జరుపుకుంటున్నాము గోకులాష్టమి పర్వదినాన్ని



సర్వజనులకూ,శ్రేయోభిలాషులకు గోకులాష్టమి శుభాకాంక్షలు
Categories: Left

ఫలించిన వ్యాయామం, ఆహార నియంత్రణ

నేనేమీ ఆరడుగుల అందగాడినేమీ కాదు గానీ వున్నంతలో నేను ఈ సారి చక్కగా వున్నానంటూ ఇండియాలో చాలామంది బంధు మిత్రులు కితాబులిచ్చారు. బక్కగా అయినప్పటికీ బొజ్జ గట్రా తగ్గించి ఫిట్టుగా, చక్కగా తయారయ్యాననీ చాలామంది వ్యాఖ్యానించారు. అసలు వయస్సుకన్నా పదేళ్ళు చిన్నగా కనిపిస్తున్నానన్నారు. నలభైల్లో వాడిని ముప్పయిలోవాడిగా అనిపిస్తున్నానని మెచ్చుకున్నారు. ఇంకొంతమంది ఎప్పుడు చూసినా మీరలాగే వుంటారు - మీకు వయస్సు పెరగదా, మేమేమో ముసలివారం అయిపోతున్నామని వాపోయారు.
మా అనిత ఆదేశం మీద హడావిడిగా వచ్చాను కానీ ఇంకో రెండు నెలలు ఆలస్యంగా వచ్చి వుంటే బెల్లీ ఇంకాస్త తగ్గించీ, కండలు గట్రా పెరిగించీ ఇరవై ఏళ్ళ నవయువకుడిలా కనిపించేవాడిననీ వారందరి దగ్గరా వాపోయాను.  మా ఆవిడ అందగత్తె కావడంతో పాటుగా శరీరాన్ని అదుపులో వుంచుకుంటూ వయస్సు బాగా తక్కువగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఏమి తింటారో, ఏమి చేస్తారో కానీ కుర్రతనంతో కనిపిస్తారంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు.
నాకు వచ్చిన ప్రశంసలే ఇంధనంగా ఇహపై ఇంకా జిమ్ము పై పడతాను. బెల్లీ బాగానే తగ్గింది కానీ ఇహపై కండలు పెంచి నాగ, పవన్, తార, నాగార్జున లాంటి కుర్రాళ్లను భయపెట్టాల్సి వుంది. ఏదేమయినా మన కృషికి తగిన గుర్తింపు వస్తే బాగా ఉత్సాహంగా అనిపిస్తుంది కదా. ఆ ఉత్సాహాన్ని నీరుకారిపోనివ్వకుండా జిమ్ములో చూపిస్తా ఇహ నుండీ.
ఒక్క వ్యాయామమే కాకుండా ఆహార నియంత్రణే కాకుండా ఆహారంలో  చాలా మార్పులు చేసాను. కొన్ని సార్లయితే రోజుల కొద్దీ అన్నం తినలేదు. పళ్ళు, కూరగాయలు, ఓట్స్ మీదనే బ్రతికేవాడిని. సో, ఆ ప్రయత్నాలన్నీ ఫలించాయన్నమాట. సంతోషం.
Categories: Left

బ్లా.శరత్ ఎల్ జి బీ టీ

డాక్టర్లు డా. అని పేరుకు ముందు తగిలించుకుంటారు కదా. అలాగే ప్రొఫెసర్లు గట్రానూ. అలాగే మనం కూడా మన పేరుకి ముందు బ్లాగర్ అని తగిలించుకుంటే మన వ్యక్తిత్వం లోని ఈ విశేషణం అందరికీ సులభంగా తెలుస్తుంది కదా అని ఇండియాలో వున్నప్పుడు ఆలోచన వచ్చింది. అందుకే ఇక నుండీ మనం నేం ప్లేట్లు గట్రా వ్రాయించుకునేటప్పుడు బ్లా. అని మన పేరు ముందు తగిలిద్దాం. ఇంగీషులోనయితే Br. అని పెట్టడం బావుంటుందేమో. అలాగే పనిలో పనిగా నేనయితే నా పేరు చివరన MBBS డిగ్రీ లాగా ఎల్ జీ బి టీ అని పెట్టేసుకుంటా. అదంటే ఏమిటో తెలియని వారు నేను రష్యాలోనో, ఉజ్బెకిస్తానులోనో చదివిన ఏ మహత్తర మెడిసిన్ కోర్సో అనుకొని గౌరవిస్తారు.
ఇండియాలో తిరిగినప్పుడు నా విజిటింగ్ కార్డ్ కొంతమందికి పంచాను. అందులో నా పేరు క్రింద ఎల్ జి బీ టీ ఏక్టివిస్ట్ అని వుంటుంది కానీ చాలామంది అది పట్టించుకోలేదు. కొద్దిమంది మాత్రం ఇదేమిటని అడిగారు. చెప్పతగ్గ వారికి చెప్పాను. మిగతావారికి ఓ నవ్వు నవ్వేసి నా కార్డులో వున్న నా బ్లాగులు చదవండి అర్ధమవుతుంది అని సెలవిచ్చాను. నా కార్డ్ మీద ఇంద్రధనస్సు రంగులుండటంతో చలామంది భలేగా రంగులు పెట్టేసారే అని వ్యాఖ్యానించారు. ఆ రంగులకో అర్ధం వుందీ అని ఆర్ధోక్తిలో చెప్పాను.
ఈ సారి నా విజిటింగ్ కార్డులు కొట్టించేటప్పుడు Br. Sarath LGBT అని అచ్చేయిస్తాను. బావుంటుంది కదూ. Br. అంటే వేరే అర్ధం ఏమయినా వుందా? మొత్తానికి ఈ సారి నా రక్త బంధువులకి తప్ప మిగతా వారందరికీ నేనంటే ఏమిటో చెప్పడానికి ప్రయత్నించాను. రక్త బంధువులకి మరొక రవుండులో చెప్పాల్సివుంది. అయితే చాలామందికి నా కార్డ్ మాత్రం ఇచ్చి నా గురించి చదవండి - నాలో మీకు తెలియని వ్యక్తిత్వం చూస్తారు అని సూచించాను. మరి ఎవరయినా నా బ్లాగులు చదివారో లేదో, ఏమనుకున్నారో ఏమో నాకు ఇంకా సమాచారం లేదు. పెద్ద మనస్సు వుందనుకున్న కొద్ది మందికి అసలు విషయం సూటిగా చెప్పాను. ఆశ్చర్యపడినా కూడా అర్ధం చేసుకోగలిగారు. సంతోషం.
Categories: Left

కాంప్లాన్ బేబీతో ఓ చక్కటి రోజు - 1

ఇండియా నుండి తిరిగివచ్చాను. ఇలా నెమ్మదిగా అక్కడి కబుర్లు తెలియజేస్తుంటాను.

ముందు ఇవి చదవండి:
మామాజీ - 1
మామాజీ - 2

సంజనకి నేను పెట్టిన నిక్ నేం కాంప్లాన్ బేబీ.
సంజనకి ప్రామిస్ చేసినట్లుగానే ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఉదయం సంజనని తన క్లాస్ దగ్గర పికప్ చేసుకొని తన స్వంత ఊరికి వెళుతుంటే చాలా చక్కగా అనిపించింది. దాదాపు మూడు గంటల కారు ప్రయాణం. చక్కటి నవ్వుతో, తియ్యటి మాట్లతో హుశారుగా సంజన చెప్పే కబుర్లు వింటూ వుంటే కాలం ఎలా తెలుస్తుందీ. పచ్చటి పొలాలూ, పచ్చని చెట్లూ చూస్తూ వెళుతుంటే మనస్సంతా అహ్లాదభరితం అయ్యింది. కారులో వెళుతుంటే తన చిన్నప్పటి ఫోటోలు చూపించింది. చిన్నప్పుడు తెల్లగా వున్న అమ్మాయి ఎందుకోగానీ పదవ తరగతి నుండీ ఛామనఛాయలోకి మారిపోయింది. చిన్నప్పటి లాగే తెల్లగా వుండి వుంటే ఇంకా బావుండేది కదా అని అనుకున్నాం. నాకు నచ్చిన ఫోటోలు కొన్నింటి కాపీలు కావాలని అడిగాను. తను చీర కట్టుకున్న ఒక ఫోటో బావుంది. అది కూడా అడిగాను.
తీరికగా సంజనని గమనించే అవకాశం వచ్చింది కనుక శ్రద్ధగా పరిశీలించాను. హుశారుగా, ఉత్సాహంగా, ఆత్మీయంగా, గలగలా మాట్లాడుతుంది. ఆమె నవ్వు బావుంటుంది. ఆ నవ్వు స్వఛ్ఛంగా వుంటూ మనకు ప్రశాంతతని ఇస్తుంది. ఆమెకు ఒక దగ్గర పలువరుస బావుండదు కానీ అదే ఆ అమ్మాయి నవ్వుకి ఇంకా అందాన్నిచ్చింది. ఆమె నవ్వు, స్వఛ్ఛంగా, స్వేఛ్ఛగా విచ్చుకునే ఆ పెదవులూ ఆమెకి ఎస్సెట్. ఆ చక్కటి నవ్వుతో బోలెడన్ని కబుర్లు చెబుతూ వుంటే మనం అలా వింటూపోతాము. ముఖం గుండ్రంగా వుంటుంది. ఆమె గొంతు చాలా శ్రావ్యంగ వుంటుందని మీకు ఆల్రెడీ చెప్పేననుకుంటా. చక్కటి ఇంగ్లీషుతో స్టయిలిషుగా మాట్లాడుతుంది. బ్లాక్ పంజాబీ డ్రస్ వేసుకువచ్చింది. ఆ డ్రెస్సులో చాలా బావుంది. తనకి నల్లరంగు అంటే చాలా ఇష్టమని చెప్పుకువచ్చింది.  మా ఫ్యామిలీ ఫంక్షనుకి వచ్చిన బ్లాగర్లు జ్యోతి, నాగ ప్రసాదులకి ఈ అమ్మాయిని పరిచయం చేసాను. మేము సంజన ఊరికి వెళుతూ అల్పాహారం కోసం ఆగినప్పుడు తెలుగుకై నడకకు ఆహ్వానిస్తూ సుజాత గారి నుండి ఫోను వచ్చింది. అప్పుడు సుజాత గారికి ఫోనులో పరిచయం చేసాను.
వారి ఇంటిముందుకు చేరగానే సంజన వారి అమ్మ ఇంటిలోనికి ఆహ్వానించింది. వారికి చిన్న కిరాణా కొట్టు వుంది. దానిమీద వచ్చే కొద్ది ఆదాయంతోనే వీరి ఖర్చులన్నీ జరిగిపోవాలి. పాత ఇల్లు అది. నాకు ఆ ఇల్లు అసౌకర్యంగా వుంటుందేమోనని ఆ అక్కయ్య (సంజన నాకు కోడలి వరుస కదా) బెంగ పడింది. నాకు పల్లెటూరులు, ఇలాంటి పాత ఇళ్ళే ఇష్టమని తెలియజేయడంతో ఆమె బెంగ తీరింది. ఆమె కూడా చక్కగా మాట్లాడి నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మర్యాదగా చూస్తూ వచ్చింది.
అలాంటి ప్రశాంతమయిన పల్లెటూరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నగర వాతావరణంలో వుంటూ వచ్చిన అలసటను ఆ రోజు అలా గడిపి దూరం చేసుకోవాలనుకున్నాను. అక్కడి ఇళ్ళనూ, చెట్లనూ, అలా పల్లెలోని, ఆ ఇల్లులోని ప్రతి ఒక్క దానినీ పరిశీలిస్తూ ప్రకృతిలో తాద్మాత్యం చెందసాగాను. నాకు ఎప్పుడో గానీ ఇలా గ్రామల్లో వుండే అవకాశం రాదు. నాకు నగరాలకన్నా పచ్చటి పల్లెటూరులు, అక్కడి అమాయకత్వం, ఆప్యాయతలే బాగా ఇష్టం.
ఆ ఇంట్లో కొంత భాగం పెంకుటిల్లు, కొంత భాగం రేకుటిల్లు. ఆ రేకులు చూస్తుంటే అప్పుడు బాగా వర్షం పడితే బావుండుననిపించింది. వర్షం రేకుల మీద పడుతుంటే వచ్చే శబ్దం వినడానికి ఎంతో బావుంటుంది. మీ కోరిక ప్రకారం ఈ రోజు వర్షం పడుతుంది లెండి అని అక్కయ్య అంది. పైకి ఆకాశంలోకి మరో సారి చూసానప్పుడు - దట్టంగా మేఘాలు అలుముకుంటున్నాయి.
ముందుగా భోజనాలు చేద్దామనుకున్నాం. నాకు ఏయే కూరలు ఇష్టమో ముందే తెలుసుకొని అవన్నీ అప్పటికే సిద్ధం చేసారు ఆ అక్కయ్య. ముందుగా నా ఒక్కడికే భోజనం వడ్డించారు. నా ముందే స్టూలు వేసుకొని కూర్చుంది సంజన. మరి నువ్వో అని అడిగాను. ఇప్పుడు మీ అవసరాలు చూస్తూ మమ్మీతో కలిసి తరువాత తింటానంది. మరి నాకు కంపెనీ ఇవ్వవా అన్నాను. సరె అని తనుకూడా భోజనం తెచ్చుకొని నా ఎదురుగ్గా కూర్చుంది. కబుర్లు చెప్పుకుంటూ భోజనానికి ఉపక్రమించాము. అప్పుడు మొదలయ్యాయి నా అవస్థలు. సంజన కబుర్లు మాత్రమే బాగా చెబుతుంది అనుకున్నాను కానీ అది అవాస్తవమని అప్పుడు బాగా అర్ధమయ్యింది! నా అవస్థలేంటో మరో టపాలో చూద్దాం.
Categories: Left

అంకెల మాంత్రికుడు శ్రీనివాస రామానుజన్



తమిళనాడు లోని ఈరోడ్ నగరంలో 1887 లో జన్మించాడు రామానుజన్. తన తండ్రి ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. ఆయన చాలీచాలని జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది.

పదో ఏటి నుంచే రామానుజన్ లోని ప్రత్యేకతని ఇరుగు పొరుగు వాళ్లు గుర్తించారు. పెద్ద పెద్ద లెక్కలని కూడా కాగితం, పెన్సిలు వాడకుండా మనసులోనే చెయ్యగల అసామాన్య నైపుణ్యం ఉండేది. ఇంచు మించు ఆ వయసులోనే ప్రఖ్యాత ఆయిలర్ సూత్రాన్ని (exp(ix) = cos(x) + i sin(x) ) రామానుజన్ ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా కనుక్కున్నాడు.

చాలా మంది శాస్త్రవేత్తల జివితాల్లో చిన్న తనంలో వారి మీద బలమైన ముద్ర వేసిన ఏదో సంఘటన జరగడము, దాంతో వారి జీవితం ఓ మలుపు తిరగడం చూస్తూ ఉంటాం. ఐనిస్టయిన్ విషయంలో చిన్నప్పుడు తన మామయ్య ఇచ్చిన ఓ దిక్సూచి (compass) తన మనసు మీద బలమైన ముద్ర వేసిందట. దుక్సూచి లోని ముల్లు ఎప్పుడూ ఉత్తర, దక్షిణాలనే చూపించడం చూసి, అలా ఎలా జరుగుతుంది? అని అడిగాడట చిన్నవాడైన ఐనిస్టయిన్. అందుకు సమాధానంగా, భూమి చుట్టూ కంటికి కనిపించకుండా ఓ అయస్కాంత క్షేత్రం ఉంటుందని, ఆ క్షేత్రమే దిక్సూచిని కదిలిస్తోందని తన మామయ్య చెప్పగా, ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడట. కంటికి కనిపించని శక్తి అలా వస్తువులని ఎలా కదిలించడం ఆ పిల్లవాడిలో చెప్పలేని సంభ్రమాన్ని కలిగించింది.

మహా గణితవేత్త రీమన్ (Riemann) జీవితంలో కూడా ఇలాంటి కథే ఒకటి ఉంది. రీమన్ కి పదహారేళ్ల వయసులో గణితవేత్త లజాంద్రె (Legendre) ’సంఖ్యా శాస్త్రం’ మీద రాసిన పుస్తకాన్ని తమ కాలేజి ప్రిన్సిపాలు చదవమని తెచ్చి ఇచ్చాట్ట. ఆ 900 పేజీల పుస్తకాన్ని ఆరు రోజుల్లో చదివాడట ఆ కుర్రవాడు.

రామానుజన్ జీవితంలో అలాంటి సంఘటన 1903 లో జరిగింది. జార్జ్ కార్ అనే వ్యక్తి రాసిన ఓ అవిశేషమైన గణిత పుస్తకం (A Synopsis of Elementary Results in Pure and Applied Mathematics) రామానుజన్ కి ఆధునిక గణితానికి మొట్టమొదటి పరిచయ గ్రంథం అయ్యింది. అంత వరకు బడి చదువుల్లో తిప్పలు పడుతూ, కాలేజిలో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో డింకీలు కొట్టిన రామానుజన్, ఈ పుస్తకాన్ని సునాయాసంగా అవపోసన పట్టాడు. అక్కడితో ఆగక పుస్తకంలో లేని కొత్త సుత్రాలని కనిపెట్టసాగాడు. జార్జ్ కార్ పుస్తకం రామానుజన్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిందో వర్ణిస్తూ రామానుజన్ సోదరి ఇలా అంటుంది: “తనలోని మేధావిని తట్టి లేపింది ఈ పుస్తకం. ముందుగా అందులో ఇవ్వబడ్డ సిద్ధాంతాలని నిరూపించడానికి ఉపక్రమించాడు. ఈ ప్రయత్నంలో తనకి ఇతర పుస్తకాల ఆసరా లేదు కనుక ఒక్కొక్క సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఎంతో లోతైన పరిశోధన చేసేవాడు... నమక్కళ్ దేవత తనకి కలలో కనిపించి పరిష్కారాలు చెప్పేదనేవాడు.”

తన అసమాన ప్రతిభాపాటవాలు రామానుజన్ కి హై స్కూలు స్థాయిలో ప్రత్యేక పారితోషకాన్ని తెచ్చిపెట్టాయి. బడిలో రోజూవారి క్లాసులు తనకి రుచించేవి కాదు. తన ధ్యాస అంతా తన మనోవేదిక మీద నాట్యాలాడే అంకెల ఆటవెలదుల మీదే ఉండేది. దాంతో హైస్కూలు పరీక్షల్లో తప్పాడు. పారితోషకం రద్దయ్యింది. ఆ పరిణామానికి తట్టుకోలేక ఇంటి నుండి పారిపోయాడు రామానుజన్. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహం మీదట మళ్లీ తిరిగొచ్చి, బళ్లో చేరాడు. ఈ సారి సుస్తీ చేసి మళ్లీ పరీక్ష తప్పాడు.

కొందరు శ్రేయోభిలాషుల అండదండలతో రామానుజన్ మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ లో ఓ చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. తెలివితేటలతో బొత్తిగా పని లేని ఓ సాధారణమైన ఉద్యోగం అది. జీతం కూడా తక్కువే. ఐనిస్టయిన్ కి స్విస్ పేటెంట్ ఆఫీసులో దొరికిన గుమాస్తా ఉద్యోగం లాంటిదే ఇదీను. జీతం తక్కువైనా ఈ ఉద్యోగం వల్ల తనకి అత్యంత ప్రియమైన గణితంలో మునిగిపోవడానికి బోలెడంత తీరిక దొరికేది. తన “కలల”ని సాకారం చేసుకోవడానికి వీలు దొరికేది.

ఈ దశలోనే రామానుజన్ తను కొత్తగా కనుక్కొన్న కొన్ని గణిత ఫలితాలని ముగ్గురు ప్రఖ్యాత బ్రిటిష్ గణితవేత్తలకి పంపాడు. పెద్దగా చదువుకోని ఎవరో అనామక భారతీయ గుమాస్తా రాసిన ఆ ఉత్తరాన్ని, వారిలో ఇద్దరు గణితవేత్తలు చూసీచూడకుండానే చెత్త బుట్టలో పారేశారు. మూడవ గణితవేత్త మాత్రం ఆ పొరబాటు చెయ్యలేదు.

(సశేషం...)
Categories: Left

సెప్టెంబర్ 2010 రాశిఫలాలు

http://srikaaram.wordpress.com/feed - Wed, 09/01/2010 - 11:33

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

మేష రాశి: మంచి లాభదాయకమైన మాసం.నూతన పరిచయాల వలన కొన్ని సొకర్యాలు ఏర్పడగలవు.ఒక దూరప్రయాణం ఉండగలదు.చమత్కారం గా మాట్లాడి అందరినీ ఆకర్షిస్తారు. ఇంటి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు.ధార్మిక పరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.నీరు వలన కలిగే జబ్బుల విషయంలో జాగ్రత్త వహించాలి.

వృషభ రాశి: పదోన్నతి ఉండగలదు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉండగలవు.స్థిరాస్తి కలసిరాగలదు.బంధువులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన మాసం. మాసం పూర్వార్థంలో పిల్లలు మంచి వార్తలు వినిపించగలరు.మీరు సాధించారని అనుకున్న విషయాలను తొందర పడి అందరికీ చెప్పకూడని మాసం.

మిథున రాశి: కుటుంబ, ఆరోగ్య సౌఖ్యం బాగుంటుంది.పెట్టుబడులకు మంచి మాసం.సోదరీ మణుల నుంచి వార్తలు వింటారు.నేర పరిశోధనలో ఉన్నవారికి కొత్త అంశాలు బయట పడగలవు.వ్యాపారులకు మొదటి రెండు వారాలు బాగుండగలవు.కళాకారులకు అవకాశాలు బాగుండగలవు. మాటలో చాంచల్యం తగ్గించుకోగలిగితే మంచి లాభం పొందగలరు.

కర్కాటక రాశి: మీలోని ప్రతిభను ఒక ఉద్యమంలా ప్రదర్శిస్తారు.ఆరోగ్యం మెరుగవగలదు.చిన్న వారితో కొన్ని రహస్యాలను పంచుకుంటారు.ఆదాయం బాగుంటుంది.నిరుద్యోగులకు ప్రభుత్వం వైపు నుంచి పిలుపు రాగలదు.చిత్రకారులకు సదవకాశాలుండగలవు.మిత్రులతో కొన్ని అభిప్రాయభేదాలుండగలవు.వాద్వివాదాలు ఈ మాసం మంచిది కాదు.నూతన వస్తువు కొనే ముందు ఆలోచన చేయగలరు.

సింహ రాశి: కళ్లు, కాళ్ల  విషయంలో జాగ్రత్తలు వహించాలి.స్త్రీలు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.బదిలీలు ఉండగలవు.సమయానికి డబ్బు అందగలదు.విదేశీ వ్యవహారాలున్నవారికి మంచి మాసం.రోగనిర్ధారణలో ఆలస్యం వలన కొన్ని సమస్యలు రాగలవు.జీవిత భాగస్వామి మానసిక పరిస్థితి పై శ్రధ్ధ చూపటం అవసరం. వ్యాపారస్తులకు మంచి మాసం.జీవిత భీమా రంగం లోని వారు లాభించగలరు.శివాలయ సందర్శనం  మంచిది.

కన్య రాశి: అదుపు లేని ఆలోచనల వలన కొంత చికాకు ఉండగలదు. మాసం మధ్యలో ప్రయాణం ఉండగలదు.కొన్ని నిర్ణయాలను కాలానికి వదిలేయటం మంచిది.అనుకోని సంఘటనలకు సిధ్ధంగా ఉండండి.పాత మిత్రులు కలుస్తారు.మీ ప్రతిభ వెలుగులోకి రాగలదు.మీ సత్ప్రవర్తన మిమ్మల్ని కాపాడుతుంది.వ్యాపారంలో భాగస్వాముల అలోచనలు భిన్నంగా ఉండగలవు.చిన్న పిల్లలతో కాలం గడుపుతారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

తుల రాశి: భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోగలవు.ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి.డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి.రాజకీయం లో ఉన్న వారు మనసులోని మాట చెప్పవలసిన అవసరం ఉన్నది.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.ప్రేమికులు కొంత ఉత్సాహం పొందగలిగే మాసం. దూరాన ఉన్న వారు ఇంటికి తిరిగి రాగలరు.

వృశ్చిక రాశి: మిత్రుల సహాయంతో ఒక కార్యాన్ని నెరవేరుస్తారు.పరిశ్రమలలో ఉన్న వారికి కొన్ని మంచి వార్తలుండగలవు.వృత్తులలో రాణించగలరు.ఖర్చులు ఎక్కువగా ఉండగలవు.ఆర్థిక లావాదేవీలకు మరొక మాసం ఆగటం మంచిది.చిన్న వ్యాపారస్తులు లాభించగలరు.విద్యార్థులు కృషి పెంచాలి.దృష్టి దోషం వలన కొంత సమస్య ఉండగలదు.సింహ వాహిని అయిన దుర్గ పటం ముందు ధ్యానం చేయగలరు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

ధను రాశి: కార్యాలయంలో అన్నీ మార్పులతో సతమతమవగలరు.వైద్య రంగం వారికి, పరిశోధనా రంగం వారికి మంచి మాసం. వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి వార్తలుండగలవు.మీ ఇంటిలోని ఒక సభ్యునికి మంచి పేరు వచ్చే సూచన ఉన్నది.పెద్దల సలహాలను గౌరవిస్తారు. ఒక సమూహానికి నాయకత్వం వహిస్తారు.ఒక ప్రణాలికను ఏర్పాటు చేసి అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారు.హనుమాన్ చాలీసా చదవగలరు.

మకర రాశి: ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.మాట మార్చే వారి వలన ఇబ్బందులు ఎదురవ్వగలవు.వాహనానికి మరమ్మత్తు అవసరం కాగలదు.మానసిక పరమైన అంశాల మీద అధ్యయనానికి సమయం వెచ్చిస్తారు.క్షేత్ర దర్శనం చేస్తారు. ఆడపడుచులకు కొన్ని హామీలు ఇస్తారు.ఆటలలో కొంత అసౌకర్యం ఉన్నా ఆటగాళ్లు రాణిస్తారు.మీడియా వర్గం వారి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన మాసం. శ్రీసూక్తం చదవండి.

కుంభ రాశి: బాధ్యతల నడుమన అంతర్మథనానికి గురి అవుతున్నట్లు తెలుస్తున్నది. చేయగలిగినంతే కానీ ఏ విషయంలోనూ సంతృప్తి  కలుగని కాలం ఇది. మానసిక సంతోషం  అన్ని విషయాలకూ మూలమని తెలుసుకుంటారు.మంచి రోజులు ముందున్నాయి.కొందరికి విదేశీ యానం ఉండగలదు.మందులు,నూనెల వ్యాపారస్తులకు మంచి మాసం.స్త్రీలకు పరస్పరం  వైరం ఏర్పడగలదు. ధ్యాన మార్గం అవలంబించండి.

మీన రాశి: విలాసానికి బాగానే ఖర్చు చేస్తారు.కొత్త మనుషులతో పని చేయాల్సి రావచ్చు.ఇంటిలో కొంత మరమ్మత్తు చేస్తారు. భాగస్వాములు కాగితాల మీద సంతకాలు చేసే ముందు జాగ్రత్త వహించాలి.కాంట్రాక్టర్లకు మంచి మాసం.సంతానం లేని వారికి మంచి వార్తలుండగలవు.ఉద్యోగం మారుదామనుకునే వారు మాసం చివర ప్రయత్నించటం మంచిది.ట్రావెల్ ఏజెంట్లకు, మార్కెటింగ్ రంగం వారికి మంచి అవకాశాలు ఉండగలవు.

శ్లో: వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం,దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~


Categories: Left

Govinda aaalaa re aaalaaa....

Wish you a very Happy Krishna Janmashtami wishes....

Krishna Janmashtami, also known as "Krishnashtami", "Gokulashtami", "Srikrishna Jayanti" or sometimes merely as "Janmashtami", is a Hindu festival celebrating the birth of Lord Krishna, an incarnation/avatar of God Vishnu. Janmashtami is observed on the eighth day, Ashtami tithi, of the dark half or Krishna Paksha of the month of Bhaadrapada (the sixth month) in the Hindu calendar, when the Rohini Nakshatra (western star name: Aldebaran) is ascendant.

The festival falls between August mid and September mid months of the Gregorian calendar. The ritual performed on this occasion is to fast the previous day (Saptami, seventh day), which is followed by a night-long vigil commemorating the birth of Krishna at midnight. At midnight, the deity of the infant Krishna is bathed, placed in a cradle and worshipped. The fast is completed after Aarti, a special prayer. In the early morning, women draw patterns of little children's feet outside the house with rice-flour paste, walking towards the house. This symbolizes the entry of the infant Krishna into his foster-home. This is performed to recreate incidents from the life of Krishna and commemorate his love for people.

Sometimes, Janmashtami is celebrated for over two days as “Rohini” nakshatra and Ashtami may not fall on the same day. The first day known as Krishnashtami, as the birth of Bhagawan/Lord Krishna falls on the eighth day after Raksha Bandhan, and the second day is known as Kalashtami.

Special programs and events are conducted in regions of Mathura and Vrindavan on this day. Mathura is reputed to be the birthplace of Krishna. While the Rasa Lila or dramatic enactments of the life of Krishna, recreates the youthful Krishna's day; Govinda, an event in which teams of young men form human pyramids to reach a pot, that is positioned at a convenient height, and break it. The topmost person on the human pyramid reaches and breaks the Dahi Handi (a clay pot filled with buttermilk) and when that happens, the buttermilk is spilled over the entire group, symbolizing their achievement through unity. The festival is thus celebrated with great joy and communal togetherness by one and all.

Many many happy returns of the day.

Categories: Left

మన్ను వెన్న రెండూ ఒకటే కన్నయ్యకి! - శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


"వెన్న తినే కన్నయ్య
మన్ను తిన్నాడు చూడమ్మా"
అని అన్న రామన్న చెబితే
"హమ్మా!" అని యశోదమ్మ
కృష్ణయ్య చెవులు మెలేసి
నోరు చూపించ మందట!
చిన్ని పాపడి నోటిలో
సకల లోకలూ చూసి సొమ్మసిల్లి
"యశోదనే కానో"
అనుకుందిట!

అంతలోనే మాయ గమ్మగా
అన్నీ మరిచిపోయి....
చిన్నారి కిట్టయ్యని పట్టుకుందామని,
తాడు తెచ్చి రోటికి కడదామని,
వెంటబడితే...
కొప్పుముడి ఊడింది
పూలు రాలి పడ్డాయి
కుంకుమ చెరిగి పోయింది గానీ,
కృష్ణుడు చిక్కలేదు.
"ఇక పరుగెత్తలేనురా నాన్నా!
ఒరే కన్నయ్య!
చిక్కరా చిట్టి తండ్రీ!"
అని చేతులు జోడిస్తే...
జాలి చూపులు చూస్తూ
బేలగా చిక్కిపోయి
రోటికి కట్టించుకొని
మోకుల కూల్చాడట.

ఇది మూల భాగవతంలో ఉందో లేదో కానీ,
బాపూ బొమ్మల్తో, రమణ రమణీయంగా
చిత్రిస్తే...
చదివినప్పుడు అన్పించింది.
"నిజంగా....
పరిశోధించి పట్టుకుందామంటే
దేవుణ్ణి దొరక పుచ్చుకోలేం,
ప్రేమతో ప్రార్ధిస్తే మాత్రమే పొందగలం!"
అని!
Categories: Left
Syndicate content