Mani Sharma a magical name which seems little faded in recent times. He is at his all time career low last year. appude edo oka review lo raasaanu He must take a long break now and come with flying colors ani. And he did the same. click on read more for the review
1.Saare Jahaa.. Premaa Yahaa
Singer(s): Benny
Slow ga saagipothu untundi song. Beat baavundi. benny voice baavundi, telugu pronoun-cation meeda kaastha sradha petti unte baavundedi. Lyrics are too good. On screen presentation meeda depend ayyi song range untundi. repeat ehairng lo nache chances unnaayi.
2.Aidhurojula Pelli
Singer(s): Jamuna Rani, Hema Chandra, Malavika, Vijayalakshmi, Sunandha, Ranjith
Song starting lo vache beat and hema chandra voice baavundi. All female voice chorus is awesome. Music is too good and fresh. Lyrics ki veturi gaariki paadaabhi vandam cheyyali.telugu tho haayi ga aadukune athi koddi lyricist lo aayana pradhamudu. First impression lo nachuthundi. on screen presentation baavunte life time song ga nilichipothundi,Murai lo song la.
3.Kalalu Kaavule
Singer(s): Hema Chandra, Malavika (Humming)
Its again a smooth melody. First hearing lo nachuthundi. Lyrics sounds like a tragedy song. first hearing lo nachuthundi.lyrics are damn good.
4.Thalambraalatho
Singer(s): Hema Chandra, Malavika
Its a neat song. Lyrics are top rate. Its a neat song.
5.Bahusha Vo Chanchalaa
Singer(s): Sonu Nigam, Shreya Ghoshal
Singer selection is dman good. Song starting lo vache beat baavundi. Song chaala pleasant ga saagipothundi. Too slow too good melody.I am excited to see how this song is presented on the screen.
6.Aidhurojula Pelli
Singer(s): Hema Chandra, Malavika
2 song ki kaastha trimmed version. first song lo unna grandeur ee song lo undadu because this song lacks chorus. But this is a good song too.
7.Relaare Relaare
Singer(s): Karthik, Geetha Madhuri
Ee album lo unna too fast beat song anukondi, mass song anukondi. yedi aina idi okate. migatha anni mass masala lo saagipothe this gives scope for allu arjun to expose his majro skill, dancing. Regular mass number. mass ki ee labum lo unna only song.
Overall ga Allu Arjun laanti dancing cyclone chesina too class song. dance ki ekkuva scope ledu. Smooth album with not so much noise. All the songs depends on screen presentation, if that is good this album would end up as a classical. Repeat heairng lo slow ga ekkuthaayi.
చిడతల కామెడీ స్వాముల వారు దేవతల నగ్న విగ్రహాల ఫొటోలను తమ బ్లాగులో ప్రదర్శనకు పెట్టారు. స్వామివారి ఉద్దేశ్యం "దేవతలను నగ్నంగా చిత్రించడం హిందు సాంప్రదాయం కాదంటున్న మూఢులకు జ్ఞానబోధ కాకపోయినా, మరికొందరు మూఢులుగా తయారు కాకుండ ఉండటానికి" ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు.
నిజానికి అయ్యవారి అసలు ఉద్దేశ్యం వేరు. హుస్సేన్ గాడు చేసింది తప్పు అనేవారు, హిందు సాంప్రదాయాన్ని కూడా తప్పు అనాలి. లేదా, అది హిందు సాంప్రదాయమే అనేట్లయితే, హుస్సేన్ గాడిని అక్కున చేర్చుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి. మానసిక పరిపక్వత లేని పరిస్థితుల్లో ఇటువంటి "చీప్ ట్రిక్సు"కు పాల్పడతారు ఈ దొంగ స్వాములు.
ఏతావాతా, కామెడీ స్వామి వారు తీర్మానించిన విషయం దేవతలని నగ్నంగా చిత్రించటం హిందు సాంప్రదాయం అని. అయ్యా, ఏ ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహాలను, దేవాలయాల గోడలపై బొమ్మలను నగ్నంగా చిత్రించాలని ఉందో చెబితే సంతోషిస్తాం.
నాకు తెలిసీ, ఆయా కాలాలలోని సామాజిక పరిస్థితుల కనుగుణంగాను, ఆయా రాజుల, శిల్పకళాకారుల, ఆగమశాస్త్ర నిపుణుల ఆధ్యాత్మిక పరిణతికి అనుగుణంగాను, ఆయా దేవాలయాలను నిర్మించాలనుకున్న "థీం"కు అనుగుణంగాను అవి నిర్మించబడ్డాయి. నగ్న విగ్రహాలే ఉండి తీరలన్న సాంప్రదాయమనేది ఉండి ఉంటే, దేశంలోని అన్ని దేవాలయాలలోనూ ఇదే పరిస్థితి ఉండాలే!
అయోధ్యలోని రామ మందిరమే కాదు, దేశంలోని ఏ రాములవారి గుడి అయినా, హనుమంతులవారి గుడిలోనైనా, సీతారాముల, హనుమంతులవారి విగ్రహాలు నగ్నంగా ఉండవు. మరి హుస్సేన్ గాడు చిత్రించిన సీత, హనుమంతులవారి నగ్న చిత్రాలకు ఆధారం ఏమిటి? ఇక "లజ్జ గౌరి" లాంటి తీవ్ర దేవతలకు, మన ప్రాంతాలలోని గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు వేరు. అవి అర్ధం కావాలంటే, కొద్దిగానైనా మంత్ర, తంత్ర పరిజ్ఞానం అవసరం.
చెప్పొచ్చేదేమిటంటే, ఈ హుస్సేన్ గాడికి అంత సృజనశీలత ఏమీ లేదు. కేవలం హిందువుల మనోభావాలు గాయపరచటానికి, విదేశాలలో భారత పురాణేతిహాసాల దేవతల చిత్రాలు అమ్ముకోటానికి మాత్రమే నగ్నత్వం కావల్సి వచ్చింది. వాడి అమ్మనో, అయ్యనో, పెళ్ళాం పిల్లలనో నగ్నంగా చిత్రిస్తే కొనేవాడు ఎవడు?
ప్రజల మధ్య అగాధాలు సృష్టించే హుస్సేన్ గాడిలాంటివాళ్ళను అడ్డుకోకపోతే, అహంకారం తప్పించి అణుమాత్రమైనా ఆలోచన లేని కామెడీ మూఢ స్వాముల ఆసరాతో, రేపు మరో దావూద్ ఇబ్రహిం బయలుదేరతాడు. సుప్రభాతాలు, సహస్రనామాలు బూతు మయం, నేను వ్రాసే బూతు పాటలతో పూజలు చేసుకొమ్మంటాడు. అటువంటి ఉపద్రవాలు రాకుండా, ప్రజల మధ్య విద్వేషాలు పొడచూపకుండా ఉండాలంటే, దేశద్రోహులైన కేతిగాళ్ళకు ప్రభుత్వం పగ్గాలు వేయాలి.
మరో సంఘటనాత్మక అంశం: వై.యస్. బ్రతికి ఉన్నరోజుల్లో ప్రరాపా నేత చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్, 2009 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో ’పంచెలూడతాయి’ ’పంచెలూడదీసి కొడతాం!’ అంటూ పదే పదే అన్నాడు. అప్పుట్లో "ఎంత మాస్ హీరో అయినా కూడా ఇంత భయంకరమైన నాలుకేమిటి? ఏం తిట్లు అవి?" అనుకున్నాము. తర్వాత నారా చంద్రబాబు నాయుడు, గోనే ప్రకాశ రావులు కూడా తమతమ ప్రత్యర్ధులని బట్ట లూడదీసి కొడతామని అన్నారు. చిత్రంగా.... సెప్టెంబరు 2, 2009 న హెలికాప్టర్ ప్రమాదంలో వై.యస్. మరణించి నప్పుడు, అతడి శరీరం ఛిద్రమవ్వటమే కాదు, పంచె కూడా ఊడిపోయి, శకలాలై పోయింది.
నిజానికి "బట్టలూడదీసి కొడతాం" అన్న తిట్లు, ఎవరు ఎవరిని ఉద్దేశించి ప్రయోగించినా, తగిలింది మాత్రం నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ! ఎలాగంటే - వీరి ఏజంట్లు కొందరు జన్మతఃముస్లింలై, గోప్యంగా ముస్లిం జీవనమే సాగిస్తూ, పైముఖంగా మాత్రం, హిందువులు గానూ, హిందూ ప్రముఖులు గానూ, హిందూ రాజకీయ నాయకులుగానూ, తమ తమ స్థానాల్లో ఉండి పనులు నిర్వహిస్తూన్నారు. ఆ జాబితాలో కీలక నేతలూ, వ్యక్తులూ ఉన్నారు.
ఏ మతస్థులైనా పరమత చిహ్నాలు ధరించటానికి ఇష్టపడరు. అది ఆయా వ్యక్తులకి తమ మతం పట్లా, మత విశ్వాసాల పట్లా ఉన్న నిజాయితీ, నిబద్దతలని బట్టి ఉంటుంది. అయితే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కొందరు కీలక ఏజంట్లకు దమ్మీడీల పట్ల,అధికారం పట్ల ప్రేమ తప్పితే మత విశ్వాసాలు కూడా వాళ్ళకు పట్టవు. అందుచేత హిందువుగా నటిస్తూ, హిందూ మత చిహ్నాలు ధరిస్తూ ముస్లింలూ ఉండగలరు. ముస్లిం మత చిహ్నాలు ధరిస్తూ హిందువులూ, ముస్లిమేతరులు కూడా ముస్లింల లాగా కొనసాగగలరు.
అయితే మొలతాడు, సున్తీ వంటి కొన్ని అంశాల్లో చాలామంది రాజీపడరు. "మొలతాడు కట్టిన మగాడివైతే, మూతి మీద మీసం ఉంటే... ఫలానా విషయంలో పందేనికి రా" అంటూ సవాళ్ళు విసురు కోవటం హిందూ యువకుల్లో’ పరిపాటి. అలాగే, హిందువులు ఏ కారణం రీత్యానైనా [ఆరోగ్యాది ఇతర విషయాలై] సున్తీ చేయించుకోవచ్చునేమో గానీ, ముస్లింలు సున్తీ చేయించుకోకుండా ఉండరు. ఈ సున్తీ కార్యక్రమాలు చిన్నతనంలోనే చేయించబడతాయి.
ఎవరైనా ప్రముఖులు, మతపరమైన సాంప్రదాయంగా కాక, ఆరోగ్యాది ఇతర కారణాల రీత్యా, శస్త్ర చికిత్సగా భావించి సున్తీ చేయించుకుంటే, ఆసుపత్రి రికార్డు ఉంటుంది. ఇటీవల కాలంలో వైద్యులు దీన్ని సిఫార్సు చేయటం, పత్రికల్లో ఇంటర్యూలూ, వ్యాసాలు రావటం జరిగింది.
ఈ నేపధ్యంలో "బట్టలూడదీసి కొడతాం" అన్న సవాళ్ళకు ప్రత్యేక అర్ధం ఉంది. పైకారణంగా[over leaf reason గా] ఎవరు ఎవరిని ఉద్దేశించి అననివ్వండి. చంద్రబాబు, గోనె ప్రకాశ రావు, పవన్ కళ్యాణ్ గట్రాలు.... ఎవరిని ఎవరు తిట్టినా సరే... అది ఉద్దేశించబడింది రామోజీ రావుకీ, అతడికి అత్యంత ఆప్త, కీలక ఏజంట్లకే! ప్రయోగించింది నెం.5 వర్గమే!
వై.యస్. మరణం తర్వాత ఇలాంటి తిట్లు కొంత తగ్గిపోయాయి. నాగం జనార్ధన రెడ్డిని ఓయూలో విద్యార్ధుల వేషంలోని గుండాలు సొమ్మసిల్లి పడిపోయే దాకా కొట్టినా, చేష్టలుడిగిన చంద్రబాబు, ఎవరిని మాత్రం దిగంబరులని చేసి కొట్టగలడు? మరెలా అనగలిగాడు? తనకి ఇవ్వబడిన అసైన్ మెంట్ ప్రకారం తిట్టడం తప్పితే, ఇది మరొకటి కాదు. తామే పంపిణీ చేసిన అసైన్ మెంట్లు, తమకే హెచ్చరికలు కావటం - తమ నెట్ వర్క్ లోంచి తమకే ఆత్మహత్యాసదృశ్య అసైన్ మెంట్లు రావటం - తమ కాలు తమ మెడ మీద వేసుకొని తామే తొక్కుకోవటం!
తప్పించుకోగలిగింది ఏముంది? దీనికి దృష్టాంతమా అన్నట్లు, అమెరికా వంటి కొన్ని దేశాల అంతర్జాతీయ విమానాశ్రయాలలో, ప్రయాణికులని, వారెంత ప్రముఖులైన సరే... స్కానింగ్ యంత్రం ద్వారా ప్రవేశించవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాంటివి పాటించబడటంలో అంతర్జాతీయంగా ఉన్న తంత్రంలో ఇది ఒక కోణం!
ఈ సందర్భంలో షారుఖ్ ఖాన్ వంటి సినిమా నటుల చిత్రాలు, బయటికి విడుదల అయ్యాయని నిందారోపణలూ వచ్చాయి. [నిజానికి ఈ స్కానింగ్ యంత్రంలో ఆ ఫోటోలు కొద్ది సేపటిలోనే వాటంతట ఆవే స్కాప్ చేయబడతాయి.] ఎల్ కే అద్వానీ వంటి ప్రముఖ, హిందూ మతతత్వ పార్టీల నాయకులు, విదేశీ పర్యటనలకి వెళ్ళిన సందర్భంలో ఇలాంటి సన్నివేశాలకి గురి అయ్యారనీ, లేదనీ, మీమాంసలూ, అనుమానాలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం అల్జీమర్స్ తో బాధపడుతున్న మాజీ రక్షణమంత్రి జార్జి ఫెర్నాండేజ్, ఇలాంటి సందర్భంలో, నగ్నంగా శల్యపరీక్ష చేయబడ్డానని స్వయంగా ఒప్పుకున్నాడు కూడాను.
ఈ వ్యవహారాల వెనుక నడిచిన భాష, సవాలు ఏమిటంటే - "మీ కుట్రల తాలూకూ నగ్నస్వరూపాలు, ద్వంద్వాల మాటున దాచిన నిజస్వరూపాలు అన్నీ బహిర్గతం చేయబడతాయి సుమా! సున్తీలతో కూడిన భౌతిక దేహాలతో సహా!" అనీ!
ఇలాంటి సవాళ్ళు - ప్రతిసవాళ్ళలో మరో అంశం - సినిమాలకూ, స్టార్ డమ్ లకు సంబంధించినది. 1992 కు ముందర అన్ని భాషల సినిమా రంగాలలో కొందరే హీరోలు - అదీ ఇద్దరు ముగ్గురే అన్నంతగా రాజ్యమేలేసారు. సినిమా పాటలన్నీ ఎస్.పీ. బాలసుబ్రమణ్యమే పాడేసినట్లన్న మాట! ఇందులో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ ఉన్న సౌలభ్యం ఏమిటంటే మోనోపలి అయితే డబ్బు వసూళ్ళ, గ్రిప్ కేంద్రీకరణా, నియంత్రణా సులభం. కణిక నీతిలోని తొలివాక్యం - శతృవుని బలహీన పరచాలనుకున్నప్పుడు ముందుగా వారి ఉత్సాహ ధైర్య మంత్రాంగాలు నాశనం చెయ్యాలి. అది కళల ద్వారా చేయటం సులభం. అందుచేత తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని కుటుంబాలు, తమిళంలో శివాజీ, జెమినీ గణేశ్ ల కుటుంబాలు, హిందీలో బచ్చన్ లూ, ఖాన్ లూ... ఇలా!
కొన్ని దశాబ్దాలపాటు ఆయా నటులని వట వృక్షాలుగా పెంచి పోషించారు నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ. ఇంకా ఘోరం ఏమిటంటే కళాత్మక విలువలేమో ఆముదం వృక్షాలైపోగా, మీడియా ఇమేజ్ కవరేజితో వాటినే వట వృక్షాలుగా చూపటం! వివరంగా చెబుతాను. మిగిలిన నటీ నటులకు చక్కని పాటలూ, సంగీతమూ, డాన్సు కంపోజింగ్, కథలూ, మంచి బ్యానర్ నిర్మాతలూ రాకుండా నియంత్రిస్తూ, తమ ఆశీస్సులూ అండదండలూ ఉన్న నటీనటులకి మాత్రమే సాంకేతికత, కళాత్మక విలువలున్న పాటలూ, సంగీతం గట్రా సౌకర్యాలు అందించటం! ఆ విధంగా మొత్తం పరిశ్రమనే నియంత్రించటం! అప్పుడు సినిమాలు నాసిగా ఉండటమే కాదు, తమ చెప్పుచేతల్లో ఉంటాయి.
అలాగ్గాక స్వేచ్ఛ, పోటీ ఉంటే, ఒకరిని మించి మరొకరు సృజనాత్మకత చూపిస్తారు. అలా ఉంటే జాతి జాగృతి, ప్రజా చైతన్యం బాగా ఉంటాయి కదా! అలా ప్రజలలో చైతన్యమూ, తార్కికతా, సృజనాత్మకత పెరగటాన్ని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అనుమతించదు కదా! అందుచేత తమ ఆశీస్సులూ, అండదండలూ ఉన్న వారికి మాత్రమే, అదీ తాము అనుమతించిన మోతాదు మేరకే సృజనాత్మకత ఉన్న సినిమా హంగులు లభిస్తాయి. ఆ సృజనాత్మకతని అంతకంతకూ తగ్గిస్తే.... ఇదే ఆముదం వృక్షాలని చేయటం! తమ మీడియా బాకాలతో ఆ అముదపు వృక్షాల వంటి చిత్రాలని, నటనా కళాత్మక విలువలని తెగ పొగిడి పారేస్తే.... వట వృక్షాలుగా ముద్రవేయగలరు కదా! ఈ స్ట్రాటజీతో కొన్ని దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ నియంత్రించారు.
అందుకే, ఆయా నటులకి, ఎన్టీఆర్ చిరంజీవి గట్రాలకి, స్లోమోషన్ లూ, సాపేక్షంగా మిగిలిన వారికంటే మంచి పాటలూ, డాన్సుల వంటి హంగులూ దక్కేవి. ఆ స్టార్ డమ్ తో, తదుపరి ఆయా హీరోలని రాజకీయ నాయకులుగా కూడా, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ మలిచింది. అది మన రాష్ట్రంలోనే కాదు, తమిళనాడులో ఎంజీఆర్, అమెరికా లో రోనాల్డ్ రీగన్ లూ ఉన్నారు.
"మాకు తెలియని రోజుల్లో ఇదంతా మీకు సాధ్యపడింది. ఏదీ ఇప్పుడు నిర్వహించు చూద్దాం?" - అనే సవాలు, నెం.5 వర్గం నుండి, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10వర్గానికీ 1992 తర్వాత ఇవ్వబడింది. గమనించి చూడండి - ఇటీవల సంవత్సరాలలో సినిమా అగ్రహీరోలకి ఇవ్వబడిన ప్రతీ సంచలనానికీ.... అదే స్టైల్, అదే డైలాగ్, అదే స్లోమోషన్, అదే నేపధ్య సంగీతంలో కమేడియన్లతో పేరడీలు రావటం జరిగింది. కమేడియన్లతో అది చూసి ఫక్కున నవ్వుతాం. ఆ నవ్వుల్లో హీరోలకి సృజించిన స్టార్ డమ్ పటాపంచలయ్యింది.
1992 కు ముందర తమిళ డబ్బింగ్ చిత్రం ’ఘర్షణ’ శివాజీ గణేశన్ కుమారుడు ప్రభూ, జెమినీ గణేశన్ మేనల్లుడు కార్తీక్ లతో సూపర్ డూపర్ హిట్టయ్యింది. దాని పేరడీ, మరో సినిమాలో సమాంతర హస్యంగా సుధాకర్, బాబూ మోహన్ లతో వచ్చింది. బోలెడు సినిమాలకు అలాంటి పేరడీలని వేణుమాధవ్, ఆలీ, సునిల్ వంటి నటులు చేశారు. వెంకటేష్ చిత్రం ’ఘర్షణ’ ని అనుకరిస్తూ బొమ్మనా బ్రదర్స్ - చందనా సిస్టర్స్ లో కృష్ణ భగవాన్ నవ్వించాడు.
ఇవన్నీ సామాన్య ప్రేక్షకులకి స్పృహ లేకుండానే, వాళ్ళ మీదే నడిచిన మానసిక తంత్రాలు. ఒకప్పుడు స్టార్ డమ్ ల సంకెళ్ళని నెం.10 వర్గం విధిస్తే... ఇప్పుడు నెం.5 వర్గం వాటిని తుత్తునియలు చేయటం! రెండింటిలోనూ అత్యధిక శాతం సామాన్య ప్రేక్షకులు, తమ ప్రమేయమూ, స్పృహ లేకుండానే అందులోంచి ప్రయాణిం చేసారు.
ఈ స్ట్రాటజీ అర్ధమైనందునే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో, 1992 కు ముందర, ఇందుకోసమే జాగ్రత్తగా బిల్డప్ చేసుకొచ్చిన ఇమేజ్ పనికొస్తుందో రాదో అన్న సందిగ్థంలో ’బాబా’ సినిమా తర్వాత రాజకీయ రంగంలోకి వస్తాడట, అప్పుడొస్తాడట, ఇప్పుడొస్తాడట గట్రా వార్తలతో, పుకార్లతో వెనుక ముందులాడారు. తర్వాత రజనీ కాంత్ మెల్లిగా డ్రాప్ అయిపోయాడు. విజయ్ కాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి నష్టపోయాడు. చిరంజీవి ముందుకు దూకి ఇబ్బందుల్లో పడ్డాడు. వీరందరి వెనుకా ఉన్నది సినీరంగ గాడ్ ఫాదర్ లూ, ఆ వెనుక ఉన్నది నెం.10 వర్గమే! ’నటులు సినిమాలలో వేషాలు మాత్రమే వేసుకోండి, మీరు నిజజీవితంలో హీరోలు కాదు సుమా’ అన్న హెచ్చరికల వెనుక ఉన్నది నెం.5 వర్గమే! తెరమీద హీరోయిజం కృత్రిమం. నిజ జీవితంలో హీరోలు కావాలంటే ఆయా ఉదాత్త లక్షణాలు ఉండాలి కదా!
నిజానికి సినిమా హీరోలని రాజకీయాల్లోకి తెచ్చి, ముఖ్యమంత్రులని చేసింది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమే. అయితే అది వారి ఉనికి తెలియని రోజుల్లో. అంటే off record లో నన్నమాట.అదే మరోసారి on record లో జరిపించబడింది. తొలి దానికి ఎన్టీఆర్ తెదేపా ఉదాహరణలయితే రెండో దానికి చిరంజీవి ప్రరాపాలు ఉదాహరణలు!
ఇలా అప్పట్లో off record లో జరిగిన సంఘటనలూ, కేసులూ, తర్వాత on record లో జరగటం ఇస్కాన్ గురించిన టపాలలో కూడా వివరించాను.
ఇది సినిమా రంగానికి సంబంధించి నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గానికీ మధ్యనడిచిన సవాళ్ళు ప్రతి సవాళ్ళల్లోనూ, భాషలోనూ ఒక అంశమైతే... మరి కొన్ని అంశాలు, కొన్ని ప్రత్యేక సినిమాలు ముఖతః నడిచాయి.
1992 కు ముందర భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల గొప్పదనం తెలిపే శంకరాభరణం వంటి సినిమాలని మచ్చుకి అనుమతించటం ద్వారా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ... ఇంకా ప్రజలలో తమ సంస్కృతి పట్ల ఎంతగా గౌరవమూ, ఇష్టమూ ఉన్నాయో, తాము ఎంత ధ్వంసం చేయగలిగారో... ఇంకా ఎంత ధ్వంసం చేయాల్సి ఉందో అంచనా వేసుకునేవాళ్ళు.
అలాగే ఇప్పుడూ కొన్ని సినిమాలు నడిచాయి. ఉదాహరణకి ’భారతీయుడు’ ’ఠాగూర్’ గట్రాలు. ఇలాంటి సినిమాలని స్వేచ్ఛగా వదిలి, ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి గూఢచార సంస్థలు. భారతీయుడు సినిమా, లంచానికి వ్యతిరేకంగా.... అలనాటి స్వాతంత్ర సమరంతో సమానంగా.... అవినీతిపై పోరాటానికి తలపడిన ఓ వృద్దుడి కథ! ఈ కథతో సినిమా తీయటం అన్న అసైన్ మెంట్ తోనే, నెం.10 వర్గానికి, తమ అనుమానాలు తమకి వచ్చాయి. ఆ విధంగా నెం.5 వర్గం ప్రజలని మోటివేట్ చేయాలనుకుంటుందేమో ననే అనుమానం అది!
అందుకే, దాన్ని అపహాస్యం చేస్తూ.... తర్వాత రోజుల్లో, లంచానికి వ్యతిరేకులనీ, లంచం తీసుకోని వాళ్ళనీ ’ఓహ్! భారతీయుడివా?’ అంటూ [ఉదా: ఐతే సినిమా] వ్యంగ్యం పోవటం వంటివి చూపుతూ.... "చూశారా? ప్రజలంతా అవినీతికి అలవోకగా అలవాటుపడి ఉన్నారు. ఎవరికీ ఏమీ పట్టటం లేదు" అనే జవాబుని నెం.10 వర్గం, నెం.5 వర్గానికి ఇచ్చింది.
అలాంటిదే ఠాగూర్ సినిమా గురించి కూడా! అవినీతిని అంతం చేయాలనే సందేశాత్మక సినిమాని బ్లాకులో టిక్కెట్టు కొని సినిమా చూసే రకాలం మనం, జనం’ అంటూ వ్యంగ్యాస్త్రాలూ వదలబడ్డాయి. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అప్పట్లో పీవీజీ పలికిన ’చట్టం తన పని తను చేసుకుపోతుంది’ అనే మాట, తర్వాత సినిమాలలొ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ’ఠాగూర్’ లోని "తెలుగు భాష లో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం" అనే డైలాగు కూడా! చివరికి ’తెలుగుభాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బండోడు!’ అనే చెణుకులు కూడా!
ఆ డైలాగు ప్రత్యేకత ఏమిటంటే - సాక్షాత్తూ భగవత్ సాక్షాత్కారం పొందినా కూడా, కర్మఫలం అనుభవించాకే కైవల్యం అంటుంది హిందూధర్మం. అలాంటి చోట... పురాణ సినిమాలలో కూడా [దక్షయజ్ఞం వంటి పాత సినిమాలలో సైతం] ’పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు’ అంటూ మిధ్యాభావనలని ప్రవేశ పెట్టింది నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ. నిజానికి "ఎన్ని తప్పలన్నా చెయ్యి. పాప పరిహార పన్ను కడితే సరి! స్వర్గద్వారాలు నీ కోసం తెరిచి ఉంటాయి" లాగే, ఇది కూడా ప్రజలని ప్రక్కదోవ పట్టించే వాదమే! "ఎన్ని తప్పులు చేసినా మారు మనస్సు పొందితే సరి! పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కనుక శిక్ష అవసరం లేదు" అనే భావాలని, వాదనలని సమాజంలోని పంపిణీ చేయటమే ఇది.
నక్సల్స్ కూడా నానా తప్పులు చేసి "కామ్రేడ్! నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను" అంటే చాలు, నాయకత్వం క్షమించేస్తుంది. "ఇలాంటి పశ్చాత్తాపపు టెక్నికులు, మైండ్ సెట్ లు మార్చుకోవడాలు, మా దగ్గర పనిచేయవు. చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు. సువర్ణముఖి నుండి ఎవరూ తప్పించుకోలేరు" ఈ సంకేతాన్ని నెం.5 వర్గం, నెం.10 వర్గానికి ఢంకా భజాయించి మరీ ఇచ్చింది.
ఇలా ప్రత్యేక సినిమాలతోనూ, సినిమా రంగంలోనూ రెండు గూఢచార వర్గాలూ మాట్లాడుకున్న నేపధ్యాలు చాలా ఉన్నాయి. అలాంటి మరో అంశమే ఆనాటి నీనా గుప్తా Vs ఈనాటి పద్మాలక్ష్మి వ్యవహారం; వాటిల్లో మీడియా ప్రమేయం! వివరంగా చెప్పాలంటే……
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
హిందీ సినిమాలు మనకు ఈ (పోనీ ఇలాంటివి!) రసవత్తర సన్నివేశాన్ని పదే పదే చూపిస్తుంటాయి. హీరో ఊబిలో పడిపోతాడు. అల్లంత దూరం నుండి హీరోయిన్ పరుగెత్తుకుంటూ వచ్చి, కెవ్వున అరచి, చివ్వున చీర చింపి, హీరోకి విసిరి బయటికి లాగుతుంది. పోనీ హీరోయిన్ కాకపోతే హీరో గుర్రమో, కుక్కో, మరోటో వచ్చి బయటికి ఈడ్చుతుంది. లేకపోతే హీరోని ఊబిలోకి నెట్టబోయిన విలన్ తానే ఊబిలో కూరుకుపోయి ... పోతాడు.
వీటిలో ఎంత వరకు సత్యం ఉంది? మన సినిమాలకి, సత్యానికి చుక్కెదురు కనుక ’ఆ ఒక్కటీ అడక్కు’ అంటారేమో. కాని ఎలాగూ అడిగేశాం కనుక దానికి సమాధానం ఏంటో చూద్దాం.
ఊబిలో పడగోరే వాళ్లు, వాళ్లకి తాళ్లు, మొలతాళ్లు విసిరి బయటికి లాగగోరే వాళ్లు తప్పకుండా గుర్తించాల్సిన కొన్ని శాస్త్రవిషయాలు ఉన్నాయి.
సరదాగా సెలవలకని ఇరాన్ లో కోమ్ ప్రాంతంలో విహారానికి వెళ్లిన డేనియెల్ బాన్ అనే డచ్ శాస్త్రవేత్త ఈ ఊబికి సంబంధించిన విషయాలలో పూర్తిగా కూరుకుపోయాడు. అక్కడ ఒక చోట “అపాయం - ఊబి” అనే హెచ్చరిక చూశాడు. ఆ ఊబిలో పడి చెట్టంత మనుషులు, లొట్టిపిట్టలు కూడా పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయని అక్కడి గొర్రెల కాపర్లు కూడా హెచ్చరించారు. దీని తడాఖా ఏంటో తేల్చుకుందామని ఆ ఊబి నుండి కొంచెం మట్టిని డబ్బాలో పెట్టుకుని తనతో ఇంటికి తీసుకుపోయాడు.
దాన్ని విశ్లేషించగా అందులో ముఖ్యంగా కొన్ని అంశాలు ఉన్నాయని తేలింది. అవి – ఇసుక, నీరు, బంకమట్టి (clay), ఉప్పు. ఇసుక రేణువుల మధ్య ఖాళీలని నీరు పూరిస్తూ ఉంటే, వాటిని కొంచెం వొదులుగా బంకమట్టి కలిపి ఉంచుతోంది.
ఈ విడ్డూరమైన మిశ్రమాన్ని ఊరికే దాని మానాన దాన్ని వొదిలేస్తే ఏ ఇబ్బంది ఉండదు. పూనుకుని కెలికెతేనే చిక్కు! ఉదాహరణకి దాని మీద పాదం మోపి దాని స్థాయితని భంగపరిచితే మామూలుగా చూర్ణం లాగా ఉండే బంకమట్టి, ద్రవరూపంలోకి మారుతుంది. పెరుగుని చిలికితే ఏం జరుగుతుందో అలాంటిది అన్నమాట. ఇసుక, నీరు వేరై ఇసుక కిందకి దిగి, నీరు పైకి తేలుతుంది. ఇక ఆ మిశ్రమంలో ఉప్పు పాలు కూడా తగినంతగా ఉంటే, ఉప్పు లో ఉండే అయాన్ల విద్యుదావేశం వల్ల ఇసుక రేణువులు ఒకదాన్నొకటి అతుక్కుని, పెద్ద పెద్ద రేణువులుగా మారుతాయి. ఈ విధంగా బాగా చిక్కగా, దట్టంగా ఉండే ఇసుక/బంక పొర అడుగున ఏర్పడుతుంది. ’కెలకక’ ముందు ఉన్న ఊబి పదార్థం యొక్క సాంద్రత కన్నా ఇప్పుడు అడుగున చేరిన పదార్థపు సాంద్రత రెండు రెట్లు ఎక్కువ. అందుకే మహా మహా హీరోల పాదాలు కూడా అందులో పాపం దిగబడితూ ఉంటాయి. హీరోలో మిగతా అంశాలన్ని బయట ఉండిపోతాయి.
అలాంటి పరిస్థితుల్లో మరి హీరోయిన్ కాని, గుర్రం కాని, కుక్క గాని, ఏం చెయ్యాలి?
దుడుకుగా చీరలు, తాళ్లు విసిరి హీరోని పైకి లాగే ప్రయత్నం చేస్తే మాత్రం హీరో వచ్చేస్తాడు కాని, పాదం ఉండిపోతుందని బాగా గుర్తుంచుకోవాలి. అడుగున ఏర్పడ్డ కఠిన పదార్థంలో కూరుకుపోయిన పాదాన్ని బయటికి లాగడానికి రమారమి పది వేల న్యూటన్ల బలం కావాలట. అంటే ఓ మారుతీ కారుని పైకెత్తడానికి కావలసినంత అన్నమాట! అంత బలంగా మరి కాలిని లాగితే అందులోని అస్థికల అస్తిత్వానికే ముప్పు!
కనుక ఇలాంటి సమయంలోనే నిబ్బరంగా ఉండాలి. (చెయ్యి ఖాళీగా ఉంటే, గుండె మీద నెమ్మదిగా తట్టుకుంటూ “ఆల్ ఈజ్ వెల్” అంటుండాలి.) నెమ్మదిగా పాదాన్ని కదిలిస్తూ పాదానికి చుట్టూ ఉన్న కఠిన పదార్థానికి, పాదానికి మధ్య కొద్దిగా నీరు చేరేలా చేసుకోవాలి. అప్పుడు పరివారాన్ని పురమాయించి తాళ్లకి, చీరలకి పని పెట్టమనాలి.
ఇక విలన్ ఊబిలో కూరుకుపోయి పోవడం సంగతి. విలన్ కి ఎప్పుడూ గట్టిగా శిచ్చ పడాలను అనుకోవడం సహజమే గాని, అతగాడు మరీ ఇలాంటి అభౌతిక, అసంభవ విధానంలో పోవాలనుకోవడం తప్పు. ఎందుకంటే సగటు మనిషి శరీరం కన్నా ఊబి సాంద్రత రెండు రెట్లు ఎక్కువ. కనుక రాబర్ట్ అందులో ఇరుక్కుపోతాడేమోగాని మునిగిపోవడం అనేది వాడి కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, జరగదు, జరగదు!!!
Reference:
http://www.thenakedscientists.com/HTML/articles/article/whatisquicksand-1/Original Reference:Khaldoun, Bonn et al., Nature 437; pp 635